నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
18, జనవరి 2023, బుధవారం
16, జనవరి 2023, సోమవారం
ధూళిపూడి. అమ్మవారి చెట్టు, ఆంజనేయ స్తుతి.13.07.22, హనుమజ్జయంతి.
అమ్మవారి చెట్టు శతజయంతి.
నూరువత్సరాలు నూత్నశోభలుపండ
నింబవృక్షమొకటి నెమ్మి"ధూళి
పూడి"మధ్య మందపూర్వ లక్ష్మి యనగ
వెలసి జనుల గాచె వివిధగతుల.
రండు నిండు మనసు రాగంబు రంజిల్ల
వేపచెట్టు కీర్తి విస్తరింప
పూజచేసి మనము ముక్తిత్రోవను బోవ
నూతి వంశభవులు పాతిరిచట.
పున్నెమబ్బునంచు ముత్తైదువులు జేరి
పసుపు కుంకుమలను భక్తితోడ
వేపచెట్టు మొదలు విస్తృతంబుగబూసి
పట్టుచీరగట్టి పరవశింత్రు.
అనుచు భక్తిభావ హ్లాదానుపూర్ణులౌ
ధౌతపురపు జనుల తలపుసాగ
అమ్మవారి కరుణ అద్వితీయత నిండ
దీవనాళి విరిసె దివ్యశోభ!
చదివెడు బాలురు స్మరియింపగలశక్తి
నిమ్మని కోరెద రమ్మనెపుడు
రైతులు తమపంట రత్నరాసులబోలి
ఇమ్మని కోరెద రమ్మనెపుడు
తరతమ భావాలు మరచిపోయెడు శక్తి
నిమ్మని కోరెద రమ్మనెపుడు
భక్తిహీనముగాని భవ్యమనంబుల
నిమ్మని కోరెద రమ్మనెపుడు
అట్టి అమ్మయె మాలక్ష్మి అమ్మవారు
ధౌతపురమున నెలకొన్న తల్లియామె
కరుణమూర్తీభవించిన కల్పవల్లి
అనుగు బిడ్డలగాచు ప్రహర్షవల్లి.
ధూళిపూడి లోని వఝవారి ఆంజనేయస్వామి స్తుతి.
వఝసద్వంశ శ్రీ వైభవోపేతులై
హనుమసేవలలోన నలరినారు
పూర్వదేవళ శోభ పుష్ఠియు గూర్పగా
చిన్మయ భావాలు చేర్చినారు
అందరిహృదయాల నాముష్మికంబును
ధౌతపురమ్మునన్ దనిపినారు
తాతలనాటిదౌ ధార్మికాలయమున
నిత్య దీపంబుల నిల్పినారు
వహ్వ!వఝవంశ వారసశ్రేష్ఠులార!
మీకు భక్తులకిడు మించుకరుణ
సూర్యశిష్యుడైన సుందరతేజుండు
రామప్రేరితమయి రమ్యగరిమ.
(17.05.2020)శ్రీ హనుమజ్జయంతి సందర్భముగా
శ్రీరామపాదపద్మము
నారామముసుంతలేక నర్చించుటనీ
ధారాళభక్తి తత్త్వము
పారావారంపు జేత పవనకుమారా!
సీతను గాంచినవీరా!
భూతలవిజ్ఞానవేత్త పూతచరిత్రా!
నేతగుసుగ్రీవుమదిని
ప్రాతస్మరణీయతేజ పవనకుమారా!
రామునికౌగిలి పొందిన
శ్రీమంతుడవీవెసుమ్ము చిన్మయరూపా!
భామంతులెందరున్నను
ప్రేమాదరరీతులందు పెన్నిధినీవే.
శోభారాజ్. అన్నమయ్య పురం , పరాభవ ఉగాది .దశావధానం
డా . శోభరాజ్ గారి ప్రస్తుతి పద్యం వేంకటేశుని పాదాలు వినయగరిమ అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ వాని ఫణుతులు విస్తృత పఱచినట్టి జ్ఞాన శోభాంచి...
-
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా. ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మ...
-
ది. 2. 11. 14 నుండి 9. 11. 2014 వరకు . అవధాన రాజధానీ . ఈ కార్యక్రమం మహోన్నతంగ భారత దేశ రాజధాని అయిన డిల్లి మహానగర...
-
1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...