22, ఫిబ్రవరి 2012, బుధవారం

వాక్ శుద్ధి

వాక్  శుద్ధి . 


భావనా పటిమ కలవాడే వాక్ శుద్ధి కలవాడు. భావానికి ప్రేరణ మనస్సు . త్రికరణ శుద్దులలో మనసు మొదటిది .  రెండవది వాక్కు  ,మూడవది కాయము . స్వచ్చమైన ఆలోచన సరళి , అంతే స్వచ్ఛతతో అలోచిన్చినదే 
వాక్కు రూపంలో వెలువరించడం , ఏ రెండిటికి సమాన   స్థాయిలో శరీరంతో పని చేయించడం . ఈ మూడింటి సమన్వయమే త్రికరణ శుద్ధి అనవచ్చును . త్రికరణ శుద్ధి కలిగి ఉండటమే దైవత్వము. సత్యవచనాన్ని పన్నెండు సంవత్సరాలు  విధి గ పాటిస్తే దైవత్వం వస్తుందని ఆర్యోక్తి . మరి నిరంతరం సత్య వాక్ పాలనా నియమం ఉంటె వారు దైవమే. దైవం అంటే ఆనంద నిలయం . అలాంటప్పుడు త్రికరణ శుద్ధితో ఆనంద నిలయ ప్రవేశ అర్హత సాధించటానికి ఎందుకు కృషి చేయ కూడదు ? అందరికి ఆనందం కావాలి . ప్రవేశ అర్హత కావాలి . అందుకే అందరం ప్రయత్నిద్దాం. రండి .

శోభారాజ్. అన్నమయ్య పురం , పరాభవ ఉగాది .దశావధానం

డా . శోభరాజ్ గారి ప్రస్తుతి పద్యం   వేంకటేశుని పాదాలు వినయగరిమ  అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ   వాని ఫణుతులు విస్తృత పఱచినట్టి  జ్ఞాన శోభాంచి...