విశ్లేషణలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విశ్లేషణలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, డిసెంబర్ 2018, సోమవారం

ఊహలు నిజాలైతే.

ఊహలు నిజాలైతే....

   మానవుని మస్తిష్కం నిరంతరం గత మధురక్షణాలను, చేదు జ్ఞాపకాలను నెమరువేసికొనుటే కాక, ప్రస్తుత పరిస్థితుల్లో మంచిచెడుల విశ్లేషణ చేస్తు ఉంటుంది. ఇంతేకాక మానవునకు భగవంతుడిచ్చిన గొప్పవరం ఊహాశక్తి. భావి జీవితాన్ని గురించి ఆలోచిస్తు ఉంటుంది. ఇది అందరికి సమానంగా ఉండదు. కారణం సత్త్వ,రజస్తమోగుణాలకు అనుగుణంగా హెచ్చుతగ్గులుంటాయని నా భావన. సత్త్వగుణం సాధారణంగా భక్తి, సేవాసక్తి, సాత్త్వికలక్షణాల వలన ఊహలకన్న యథార్థాలకే పెద్దపీట వేస్తుంది. వారూహించే విషయాలే నిజాలౌతాయి. రజోగుణం కొంచెం ఆవేశపూరితంగా ఉంటుంది కనుక ఊహలస్థాయి ఎక్కువగా ఉంటుందని భావించవచ్చు. నిజాల స్థాయి తక్కువే. రజోగుణంలో నిజాలస్థాయి ఉండకపోవచ్చు.
   ఊహలు మహాత్ముల పట్ల నిజమౌతాయనుటకు చాలా నిదర్శనాలున్నాయి. ఉదాహరణకు : 1.కాళిదాసకృత అభిజ్ఞాన శాకున్తలమ్ లో,  శకుంతలను జూచిన దుష్యంతుడు శకుంతలను ప్రేమించి, ఆమె చెలికత్తెలను ఈమె తలిదండ్రుల వివరాలడుగగా , ఈమె కణ్వమహర్షి కుమార్తెయని వారు చెప్పగా దానినంగీకరించక , ఆమె బ్రాహ్మణేతర  కన్యయని తెలిపి వివరాలు  సంపూర్ణంగా సేకరించగా  కణ్వుని పెంపుడు కూతురని, తలిదండ్రులు మేనకా విశ్వామిత్రు లని తెలుస్తుంది. 2. నానృషిః కురుతే కావ్యం, ఋషికానివాడు కవి కాలేడని అంటారు.  వాల్మీకి మహర్షి ఊహాజనిత కథే శ్రీమద్రామాయణం. మహర్షి ఊహే నిజం అయినది. 3. ఊహలు నిజాలయే విషయంలో నేను నా తండ్రిని  ఆదర్శంగా తీసికొంటాను. వ్యక్తి, కుటిల స్వచ్ఛతల విశ్లేషణానుభవం లో ఎన్నో విషయాలు నాకు ఋజువైనాయి. ఆయన ఋషి తుల్యుడు.
    సంఘంలో మానవ రక్త సంబంధాలనేకములున్నాయి. భార్యాభర్తలు, తల్లీ పిల్లలు, అక్కాచెల్లెండ్రు, అన్నదమ్ములు. మానసిక సంబంధబంధితులు  ప్రేయసీ ప్రియులు. కూతురు,కోడలు, కొడుకు, అల్లుడు.
  కూతురి ని కోడలులా, కోడలిని కూతురిగా , కొడుకును అల్లుడు గా, అల్లుని కొడుకుగా ఊహిస్తే....అలా ఊహించలేము. ఎందుకంటే ఎవరి స్థానం వారిదే.
కూతురి,కొడుకు పట్ల రక్తసంబంధపు చనువు జన్మతః ఉంటుంది. అది కోడలిపట్ల, అల్లుని పట్ల మనం ఏర్పాటు చేసుకోవాలి. అల్లుని సంబోధించునపుడు , ఏమండీ అంటాం కాని, ఏరా!అనము. కొడుకును ఏమండీ అనకూడదు. కూతురిని ఏమే అమ్మా!అంటాం. కోడలిని ఏమే అనే స్వతంత్రత ఉంటుందా ?
ఏనాటికి ఉండదుగాక ఉండదు. వేలమందిలో ఏఒకరో  ఉంటారేమే అలా అంగీకరించేవారు. మనమనసులలో పాతుకుబోయిన నిజాలు. ఇక పల్లెటూరి సామెతలకొస్తే....అవి జీవనయాత్రా సత్యాలు. : కూతురి వంటింట్లోకి నిబంధనలు లేకుండా చనువుగా వెళ్ళేవాడు తండ్రి. కోడలి ఇంట హాల్లో బిక్కముఖం వేసుకొని కూర్చునేవాడు మామగారు. (ఇలా అందరి విషయాలలో ఉండటం, ఉండకపోవటం వారివారి అదృష్టాలనుబట్టి ఉంటుంది.) కూతురు వచ్చి నాన్నా! అంటూ తండ్రి ప్రక్కన కూర్చుటుంది..మేనకోడలు కూడ మామయ్యా!అంటు దగ్గర జేరుతుంది.  మరి కోడలు మామయ్యగారూ !అని దూరంగా ఉండి మాట్లాడుతుంది ఎంతో అవసరమైతేనే.  వీలైనంత వరకు విషయాలన్నీ భర్త ద్వారానే చెప్పిస్తుంది.   ఊహల విషయానికి వస్తే .....మామగారిని తండ్రిగా, అత్తగారిని తల్లిగా ఊహించటంలో ఒక ఇబ్బంది ఉంటే అమలు పరచటంలో మరొక ఇబ్బంది ఉంది. నిష్కల్మషత్వ ప్రేమానురాగాలు, మమకారాలు, నిస్వార్ధం మానవకుటుంబ సభ్యులందరిలో  ఉంటే ఎలా ఊహించుకొన్నా ఏ ఇబ్బందులు, ఆటంకాలు రావు.
   మనం ద్విపాద పశువులస్థాయి దాటిన విజ్ఞాన ధనులం.  విజ్ఞాన హీన పశువులు సంఘటితంగా, ప్రేమానురాగాలతో  ఉండి ఎంతో పరాక్రమశాలియైన సింహాన్ని సైతం చంపుతున్నాయి. మన జీవనపరిస్థితులు, పరదేశ  సంస్కృతులు, స్వాతంత్ర్యాలు సంఘటితంగా ఉండనీయటంలేదు కుటుంబాలను. అందువలననే ఉమ్మడి కుటుంబాల ఊహే పగటికల అవుతున్నది.
    మానవ జీవనయానంలో ఒకరిపై మరొకరికి బంధంవేసేది నిర్మల ప్రేమ, అనురాగం, నిస్స్వార్థం. ఇవి పెరిగితే అన్నీ చక్కబడతాయి. అలా చక్కబడాలని తెల్లవారుజామున ఊహిద్దాం. ఆసమయంలోనైతేనే తథాస్తుదేవతలు దీవిస్తారు! శుభంభూయాత్! 

5, అక్టోబర్ 2017, గురువారం

వృద్ధాప్యం వరమా?శాపమా?

వృద్ధాప్యం వరమా?శాపమా?

బాల్యం,యౌవనం,కౌమారం,వృద్ధాప్యం అనేవి అన్ని జీవరాసులకున్నా, ముఖ్యంగా మనం ఎక్కువగా గమనించగలిగేది మానవజన్మలోనే. విచిత్రం ఏమిటంటే మొదటి మూడు దశలలో కష్టాలున్నా  ఎవరో ఒకరు వాటిని వెనుక ఉండి బయట పడేస్తారు. బాల్యం అంతా అజ్ఞాన మిళిత ఆనందం. ఈ ఆనందం బాలుడికి ఏమీ తెలియకుండానే గడచిపోతుంది. అంటే తలిదండ్రులు వారి ఆనందం, హోదా చాటుట కొరకు వారి బాలబాలికల నలంకరించుకొంటారు. ఇక యౌవనంలో కొంతకొంత శారీరక మార్పులకు ప్రాతిపదికలు వేసుకుంటు, భిన్నరుచులు, అభిప్రాయాలకు పునాది ఔతుంది. ఈ వయసుకి కొంత సహకారం ఉంటుంది. కౌమారమంటే ముదిరిన యౌవనం.
ఎక్కువ భాగం మగవారిలో నూనూగుమీసాల స్థాయి దాటి  నాయకత్వ లక్షణాలు, పెద్దగా ఎవరిని లెక్కచేయకపోవటం,ఆడ పిల్లలలో వివేచన,విచక్షణా పూరిత సిగ్గు దొంతరలతోగూడిన ఆడతనం నాట్యం చేస్తుంది. మగవారికన్న రెట్టింపు జ్ఞానం కలిగి ఉంటారు.   ఈవయసే ఉద్యోగం, సంసార, సామాజిక బాధ్యత లను మోస్తుంది. తనంటే ఏమిటో ఋజువుచేసికొని పై మూడు రంగాలలో అద్వితీయ ప్రతిభను చాటుతుంది. అందరికీ ఆదర్శమై, హిమాలయసదృశంగా ఉంటుంది. తాను పదవీ విరమణ చేసేంతవరకు భార్యా సమేతమైన , భర్తృసహితమైన  జీవితం వరమని భావిద్దాం.
       పదవీవిరమణ చేసిన తరువాత ఎక్కువ మంది వారి ప్రతిభా వ్యుత్పత్తులను, వృత్తి నైపుణ్యాలను,వారు చేసిన సేవలను ప్రశంసించి ఇకపై భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావాలతో ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చి భావిజీవితాన్ని గడపమని పెద్దవారు దీవనలు, చిన్నవారు ఆకాంక్షలను  ఇస్తారు. కాని చాలా మంది  మగవారు నిరాశానిస్పృహలతో ఏదో సమస్తం కోల్పోయినట్లు భావించి  పడక కుర్చీకి అంకితమై, సాధారణ వ్యాయామం కూడ చేయక మానసిక, శారీరక వ్యాధిగ్రస్తులై వైద్యుల చుట్టు తిరుగుతుంటారు. బహుశః ఇక్కడి నుండే శాపం ప్రారంభమౌతుందేమో.
       ఎందుకంటే మొదట వివాహితులుగానున్నప్పుడు వారు జంటగా ఒంటరితనమే కోరుకుంటారు. ప్రకృతి సహజమే. ఆనాడది వరమౌతుంది. ఇరువురిలో శారీరక, మానసిక బలాలు ఉంటవి కనుక. అరవై సంవత్సరాల వయసులో , ఆపై వయసులో, రోగాలపాలై  అలా ఇరువురే ఉండి కనీసం వచ్చి చూచే వారుకూడ లేకుంటే....అది శాపం కాక ఏమౌతుంది? వారు సంతానమున్న నిస్సహాయులు.
    ఇక్కడొక సున్నితమైన అంశం ప్రస్తావించాలి.
           కొడుకులు, కూతుళ్ళు ఉంటారు. వారు ఈరోజుల్లో ఎవరి ఉద్యోగాలు, బాధ్యతలు , అభివృద్ధి కార్యక్రమాలు మానుకొని "మాతృదేవోభవ పితృదేవోభవ"అంటు వచ్చి కూర్చోరు. అలా ఈ వృద్ధులు కోరుకొన్నా వారి బిడ్డల అభ్యున్నతికి గొడ్డలి పెట్టు అయినట్లే. ఈస్థితి వరమో శాపమో ఆ పెరుమాళ్ళకెరుక. కొందరికి కొడుకులు గాని, కూతుళ్ళు గాని " రండి నాన్నా మనం కలసి ఉందాం కలిగింది తిందాం, ఈ వయసులో మీకు మేము ఆసరాగా ఉంటాం, అది మా బాధ్యత" అని నోరారా అనగలగటం తలిదండ్రులకు వరమే.
వారు  ప్రేమాభిమానాలతో  మనసార తమ దగ్గరే ఉండమనకపోవటం గాని, అలా వారు అన్నా  ఉండలేకపోవటం గాని, శాపమే. ఈ శాపగ్రస్తులు వారి దగ్గరకు వెళ్ళలేక, వారి పనులు వారు చేసుకోలేక ఒంటరి బ్రతుకులు ఈడుస్తుంటారు విధి వ్రాతకు ఏడుస్తుంటారు.
         ఇంత నావింత సోదికి ఒక 94 సంవత్సరాల చీకు వృద్ధుని దయనీయ గాధే మూలం.
          ఆయనకు కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు ఉన్నారు. ( కొందరు దగ్గరలోనే ఉన్నారు )  నిజాయితీ కలిగిన ప్రభుత్వోద్యోగిగా మన్ననలు పొంది విశ్రాంత జీవితం గడుపుతున్నారు. దురదృష్టవశాత్తు భార్యా హీనుడు. ఒక సీనియర్ సిటిజన్ సంస్థలో సన్మానము పొందబోతు " నాకిపుడు సన్మానము జరుగబోతున్నది. అందరికి ఎవరో ఒకరు వచ్చారు. నాకు కూడ మీరెవరైనా వస్తే సంతోషంగా ఉంటుంది. దయచేసి రండి" అని దీనంగా ప్రార్థించటం , ఏ ఒక్కరము రామని చెప్పటం నా మనసుని  కలచివేసింది. ఇపుడు చెప్పండి ఆయనకది వరమా? శాపమా?  మన చిన్నతనంలో మన బుడిబుడి అడుగులకు ఆనందపడుతునే, వాడెక్కడ క్రింద పడతాడో అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూచే వృద్ధ తలిదండ్రులకిచ్చే ఆసరా ఇదేనా?
      ఏదియేమైనా సంతానం పొందటం ఆనందదాయకమే. వారిని సంతోషపెట్టే సత్సంతానమైతే వరమే. దానికి భిన్నమైతే శాపమే కదా. తలిదండ్రుల గుండెల్లో తన్ని మనం ఎదిగామని గుర్తుంచుకొని, వారికి గుండె కోత తెప్పించరాదు. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సుమా!  

3, నవంబర్ 2016, గురువారం

తెలిస్తే ఆవగింజ , తెలియకపోతే పెద్ద గుమ్మడి.

            తెలిస్తే ఆవగింజ , తెలియకపోతే పెద్ద గుమ్మడి.  

  మానవుని మేథస్సునకు ఎప్పుడు ఏదో ఒక పని చెప్పాలి. ఏపని అయినా మనకు మనముగా స్వయముగా చేసుకుంటేనే ఆనందం. ఉదాహరణకు భోజనం ...మనం భోజనం చేస్తేనే రుచి తెలుస్తుంది, కడుపు నిండుతుంది. ఎవరో చేస్తే మన కడుపు నిండదు కదా! ఒకరు ఇంతకుముందు చేసినవే మనం చేస్తున్నాము. ఏదిఅయినా అనుభవైక వేద్యం కావాలి. ఆనాడే మనకు మహదానందం.
       సుఖం మనం సృష్టించుకొంటేనే వస్తుంది. సింహం అంతటిది కూడ వేటాడక పోతే నోట్లోకి ఆహారం రాదు.
      ఈనాడు మనకు తరచూ ప్రయాణాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది చేయటానికి రకరకాలైన మార్గాలున్నాయి. 1.సొంతకారు.2. ఆటోలు.3. స్కూటీలు, హీరోహోండా వగైరాలు. కాని ఈనాడు పోటీ ప్రపంచంలోకి ఓలా, ఊబర్, లాంటి అద్దె కార్లు ఎన్నో అవతరించాయి. అవి మనం బుక్ చేసుకొంటే (ఆన్ లైన్ లో) చాల తక్కువ ఖర్చులో , ఏ.సీలో కూర్చుని హాయిగా గమ్యాన్ని చేరుకో వచ్చును. (మనం సొంత బండి మీద వెళ్లేదానికన్నా క్షేమంగా, సౌఖ్యవంతముగా ఉంటుంది.) ఈపని చేయటానికి ఎంతో పరిజ్ఞానం అక్కరలేదు. కావాల్సిన సామాను. 1.ఒక టచ్ ఫోన్, ఇంటర్నెట్ ఉన్నది.2. కొంచెం ఆంగ్ల పరిజ్ఞానం .(షుమారు 7వ తరగతి వరకు),3.కొంచెం చూపు 4.కొంచెం ముందు చూపు.5.వినకిడి శక్తి.6. క్రొత్త విషయాలు తెలిసికోవాలనే ఆసక్తి.(ఇది చాలా చాలా ముఖ్యం). కాని దురదృష్టమేమిటంటే ఇది చేయగలిగిన శక్తి కలవారు కూడ ,నిర్లిప్తతతో ముందుకు రావటం లేదు. ఆటోల సంగతి అతి దారుణం.....మీటర్ వెయ్యడు. వేసిన మీటర్ రేస్ గుర్రం స్పీడులో పోయేటట్లు చేస్తాడు. విసుక్కుంటాడు. మనం ఏదైనా మరచిపోతే ఇంతే సంగతులు. (ఆటోవాలాలు అందరు అలాంటివారు కాదు. వారిలోను కొందరు నిజాయతీపరులు ఇప్పటికి ఉన్నారు.)ఊబర్ లో ప్రయాణించేటప్పుడు మనం ఎటు వెళుతున్నామో మ్యాప్ చూపుతుంది.
      నా అనుభవం పంచుకొంటాను.
       మా ఇంటినుండి సిటిలో ఎక్కడి వెళ్లాలన్నా చక్కగా ఊబర్ లో బుక్ చేసుకొంటాము. ప్రయాణం కొంచెం ఆలస్యమైనా పరవాలేదనుకొంటే షేర్ బుకింగ్, లేకుంటే మామూలు బుకింగ్. నేనీరోజు స్వయంగా మౌలాలి, (పెన్షన్ ఆఫీసుకి ,లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు)వెళ్లి వచ్చాను. నాకు పోను రాను 160 రూ. అయినవి. అదే ఆటో అయితే 150+150=300.అవుతవి. న్యూ నాగోల్ నుండి మౌలాలి రైల్వే క్వార్టర్స్ వరకు.
 
      కనుక అందరు తప్పక చైతన్యవంతులు కావాలి. ఏదైన తెలియక ముందు గుమ్మడికాయ, తెలిసిన తరువాత ఆవగింజే......డబ్బు తక్కువ సుఖమెక్కువ.
         దీనిని వేరెవరైనా కూడ బుక్ చేసిపెట్టవచ్చు.    చేయూతనివ్వండి..

           క్రొత్తవిషయాలు నేర్చుకోవటం తప్పుగాదు. అపకారం కలిగించేవి, మన సంస్క్రతీ సంప్రదాయాలకు గొడ్డలిపెట్టుగా ఉండేవి నేర్చుకోవడం, ఆచరించడం తప్పు. జై భారత్!!!!!  

5, మే 2015, మంగళవారం

కలలు నిజమవుతాయా . 5.05 2015.

                                కలలు నిజమవుతాయా . 5.05  2015. 

   నా అనుభవం అవుతాయనే రుజువు చేసింది. నాకు కలిగిన అను భవాన్ని బట్టి చూస్తె ముఖ్యంగా తెల్లవారు జామున 4.,5. గంటల మధ్యన వచ్చిన ప్రతి కల , 99% నిజముగా అవుతున్ది. ఈ విషయం రుజువు చేసుకొని చూచాను . ఇదే  విషయం రామాయణం  కుడా  చెబుతున్నది. దాని రుజువే త్రిజటా స్వప్నము . లంక నాశన మయినట్లు , తనకు తెల్ల వారు జామున కల వచ్చిందని తోటి రాక్షసులకు చెబుతుంది . ఇలానే దశరధుడు మరణించిన తరువాత భరతుడు అయోధ్యకు రాబోయేముందు తనకు తండ్రిని గురించి అమంగ ళ కరమైన కల వచ్చిందని చెబుతాడు .. కాని  చిత్ర మేమిటంటే దానిని మనం పూర్తిగా నిరోధించలేము . దుస్స్వప్న నివారణ కొరకు వెంటనే లేచి భగవన్నామం చేసుకొంటూ కాళ్ళు చేతులు  కడుగుకొని మరల నిద్రిమ్చాలి . అప్పుడు కొంత ప్రమాదం తప్పుతుంది . 

20, జనవరి 2015, మంగళవారం

బాల భావన శతకం. గురించి

బాల భావన  శతకం. గురించి                                                                                                             రామకృష్ణా రావు గారు జగమెరిగిన చిత్రకవి, విచిత్ర కవి. వారి భావనలు మధుర మనోహరాలు సుకుమారాలు , సమాజ చైతన్య స్పోరకాలు. వారు నన్ను సోదరునిగా భావించి తాను వ్రాసిన  బాల భావనలు అను శతకానికి అభిప్రాయం వ్రాయమనుట  చాలా సంతోషంగా ఉన్నది.. బాల బాలికలు మనకు అన్ని భావాలు  పైకి చెప్పరు కాని  చాల సున్నితం గ ఆలోచిస్తారు. రావు గారు వారిలో( పిల్లల్లో )  దూరి వారి  స్థాయిలో , శైలిలో చెప్పిన పద్యాలు ఆణి ముత్యాలు. నేటి సమాజానికి ఏది కావాలో అదే చెప్పారు. 4 వ పద్యంలో . ముద్దు చేసి మాకు హద్దులు నేర్పరు-----. హద్దు మీర మమ్ము గ్రుద్దుదురయ.--- హద్దు లెల్ల నేర్ప శ్రద్ధ గా నేర్వమా ----పెద్దలారజ్ఞాన వృద్దు లార . . అంటూ  ఆడుతూ పాడుతూ ఆట వెలదులలొ చెప్పారు . మొక్క అయి వంగనిది మ్రానై వంగునా అనే ప్రాచీన సూక్తి యిందులో దాగి ఉన్నది. ముద్దు హద్దు మీర రాదనే విషయం నిత్య సత్యం.    
           7 వ పద్యం లో .  పలక చేతికిచ్చి పద్యాలు వ్రాయించి -----పలుకునటుల జేయ పలుక గలము ---పద్యమొక్కటైన పలుక నేర్ప రదేల.  అంటారు. నేటి భాషామతల్లి అందున తెలుగు భాష ఈ విషయం లో ఏటికి ఎదురీదుతున్నది. వీలయినంత వరకు పిల్లలకు తెలుగు పలుకుబడి బడి లోనే కాక యింటిలో కూడా నేర్పాలి. ముఖ్యంగా అమ్మే యీపని చేయాలి. ఆనాడే భారత మాతృ.హృదయం సంతోషిస్తుంది .అమ్మఒక శతకం చదివితే పిల్లలకు చెప్పినట్లే . ఎంత సమాజ స్పృహ . ఇది అందరికి రావాలని కవి గారి తపన. 
           9.వ పద్యం లో . మాకు నచ్చు విద్య మమ్మన్దుకొనీక------మీకు నచ్చుదాని మాకు పులుమ -----మాకు రాక పోవు మాదోషమా యిది . ------- నిజమే మనకు నచ్చిన పనిని చాల సులువు గ చేస్తాము . నచ్చని పని కేవలం పరుల కొరకే . ఈనాడు  చాల మంది విద్యార్ధులు పడుతున్న పట్లే యివి. వారికీ స్వేఛ్చ యివ్వాలని కవి సూచన బాలల పట్ల సద్భావన . 
          ఇలా ఎన్నో సుకుమార సుందర భావాలతో సమ సమాజ నిర్మాణానికి , దేశ సమైక్యతకు పునాది రాళ్ళు అయిన బాలలకు , మంచి సూచనలతో శతకం వ్రాసిన  రామ కృష్ణారావు గారు మిక్కిలి అభినంద నీయులు. 
                                           సారస్వత సహోదరుడు. పొన్నకంటి సూర్య నారాయణ రావు.  భాగ్యనగరం. .  

15, అక్టోబర్ 2014, బుధవారం

విశ్వ ప్రయత్నమే విజయ హేతువు .

                                విశ్వ ప్రయత్నమే  విజయ హేతువు .                                                                                      ఈ రోజు నాకు చాలా  సంతోషం గా ఉన్నది . రాధి వాళ్ళ టాబ్ నుండి తెలుగులో టైప్ చేస్తున్నాను . సాధనే సర్వతో ముఖ విజయ హేతువు . కిరణ్ పుట్టిన రోజు సందర్భం గా ఒక ఫోటో మీద వాడికి  శుభాకాంక్షలు పంపా ను . అది  వాడికి చాలా బాగా నచ్చింది . ఈ టాబ్ లో చాలా సమయం వరకు తెలుగులో టైపు చేయటానికి రాలేదు . అయినా నా ప్రయత్నం వదల లేదు . విశ్వ ప్రయత్నమే
 విజయ హేతువు . 

20, ఆగస్టు 2013, మంగళవారం

సత్కార్యాచరణం . సత్ఫలితాలు .

సత్కార్యాచరణం . సత్ఫలితాలు .

"చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ"  . అను సామెత అందరికి తెలిసిందే . చేసుకోవటం అనే పని మన వల్లనే జరుగుతుంది . చేసుకొనుట అనేది క్రియ.ఇది  సత్కార్యం, కావచ్చును దుష్కార్యం కావచ్చును . అలానే క్రియ (మంచి, చెడు ) గత జన్మ, లేక ప్రస్తుత జన్మలోది కావచ్చు , ఫలితాలు మాత్రం అనివార్యమ్. పనులలోకి ఆలోచన కూడా వస్తుంది . చెడ్డ, లేక మంచి ఆలోచన కూడా తగిన ఫలితాలనేఅందిస్తుంది .. కనుకనే విజ్ఞులందరూ సదాలోచనకే గొప్ప ప్రాముఖ్యత నిచ్చారు . సదాలోచన ఫలితమే సత్కార్యాచరణ . సత్కార్యాచరణ ఫలితమే సజ్జన సాంగత్యము . తద్వారా మహనీయత్వము. మనము మంచిని నమ్మి , ఆచరిస్తే , మనలను నమ్మిన వారందరూ దానిని ఆచరిస్తారు. దాని వలన సమాజంలో మంచి , మానవత్వము పెరిగి . అందరి విలువలు పెరుగుతాయి. మనము ముందుగా సాధించ వలసినది మానవతా విలువలు , ఆ తరువాత అవే దైవత్వ ప్రతిపాదితాలై రాక్షస నిర్మూలనం చేస్తాయి .  మనం సర్వే జనాః సుఖినో భవంతు అని భావించినంతకాలం రాక్షస భావాలు మనలో చోటు చేసుకొవు. మనము చేసిన ప్రతి మంచి పని ఇతరులకు కూడా మంచి ఫలితాలనిస్తే అంతకంటే మనకు కావలసినది ఏముంటుంది , అందుకే మనసును మంచి వైపే అను నిత్యం మరలిద్దామ్. దానికి మనవ శక్తి చాలకుంటే దైవశక్తి జోడించుదాం .      శుభం భూయాత్ .   

21, జూన్ 2013, శుక్రవారం

జిజ్ఞాస .

                  జిజ్ఞాసకు నిదర్శనం . డా . యల్లాప్రగడ సుబ్బారావుగారు  .





జ్ఞాతుం  ఇచ్చా జిజ్ఞాస . ఏ విషయ మైన తెలిసికోవాలనే కోరికనే జిజ్ఞాస అంటారు . వీనిలో చాలా పద్ధతులు న్నాయి .  1. మనకు మనం స్వయముగా  ఆలోచించుట .   2. గ్రంధములను చదువుట . 3.అనుభవజ్ఞులైన  వారిని  ( గురువులను ) అడుగుట . 4.  దేశ పర్యటన .   5. స్వాను భవము  ముఖ్యమైనవి.  ఈ సందర్భముగా మనము ఒక మహా కవి శ్లోకమును గుర్తు చేసికొందాము .

శ్లో .   ఆచార్యాత్  పాదమాదత్తే , పాదం  శిష్య స్వమేధయా , 
        పాదం స బ్రహ్మచారిభ్య్హ : , పాదం కాల క్రమేణ చ.

( జ్ఞానము గురువుగారి నుండి  1భాగము, శిష్యుని స్వమేధ వలన 2వ భాగము , తోడి విద్యార్థుల వలన 3వ భాగము , కాలక్రమముగా వచ్చు అనుభవముతో 4వ భాగము వస్తుంది )
                 
        ఏ విషయమైన తెలియ నంత వరకు యెంత కష్టం గ ఉంటుందో , ఆ విషయము తెలిసిన తరువాత అంత సులువు అవుతున్ది." కరతల ఆమలకం" ( చేతిలో నున్న ఉసిరిక పండు ) అవుతున్ది.  తెలిస్తే అది ఆవ గింజ , తెలియకుంటే అది అనంత పర్వతం . ప్రతి విషయము మనకు తెలియటానికి మనం నిరంతర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది .  "  కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు " అనే వాక్యం నిత్య సత్యమ్. కృషితో నాస్తి దుర్భిక్షం , జపతో నాస్తి పాతకం . 

      మన మెదడుకి పదును పెట్టి విషయాన్ని మనం కనుక్కుంటే కలిగే ఆనందం అనిర్వచనీయం , అద్భుతం . ఇది మన శక్తికి నిదర్శనం . ఉత్తమం . ఇతరుల వలన తెలిసి కొనుట ఆనంద దాయకం , ద్వితీయ శ్రేణి . విషయగ్రహణా పేక్ష లేక యుండుట అధమం .ఉత్తమ మానవుడు నిరంతరం ఉత్తమ మార్గ గామిగానే ఉండుటకు ప్రయత్నిస్తాడు . ఆతడే సమాజానికి, దేశానికి , మేలు చేయ గలుగుతాడు . మార్గ దర్శకుడు అవుతాడు . ద్వితీయ శ్రేణికి చెందిన వారు మార్గ అనుయాయులుగా అవుతారు . తృతీయ శ్రేణికి చెందినవారు  వారే అధమస్తులు గ ఉండుట వలన సమాజానికి అంతగా ఉపయోగ పడలేరు .

ఇంతటి మహత్తర జ్ఞానము వినమ్ర గుణ భూషితుల దగ్గర ఉంటే సర్వ కాల సర్వావస్థలలో మణి వలే ప్రకాసిస్తున్ది. 


22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

దేవాలయానికి వెళితే దేవుని దగ్గరకు వెళ్లి నట్లేనా.

 ఉగ్ర వాదుల దుశ్చర్యలకు అమాయకులు బలి అయినందుకు విచారిస్తూ ,22..02.  13 న

చనిపోయిన వారి ఆత్మ శాన్తించాలని మనసార కొరుకొంటున్నాను . వారి వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుకొంటున్నాను .   మానవత్వం మంటకలియకుండా మమ్ములను కాపాడు భగవంతుడా                                                                      
            దేవాలయానికి వెళితే దేవుని దగ్గరకు వెళ్లి నట్లేనా. భగవంతుడిని చూచి తిరిగి యింటికి వచ్చే అదృష్టం మనకు లేదా . మతం ఏదైనా మానవత్వంతో ఆలోచించగలిగే మనసేలేదా . మనుషులు యిలా  మృగాలుగా ఎందుకు మారుతున్నారు . ఉదాహరణకి ,  భర్తృహరి గారి ఒక పద్యం చూద్దాం .

     ఉ.  గ్రాసములేక స్రుక్కిన జరా కృశమైన ,నిశీర్ణ మైన ,సా

          యాసము నైన నష్ట రుచియైన మదేభకుమ్భ  .......

అని సింహము యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తూ .  అది యెంత ఆకలి వేసిన ఏనుగు కుంభ స్థలాన్ని మాత్రమె చీలుస్తుంది ,తింటుంది ,కాని గడ్డి తినదు అంటాడు . కనుక సామాన్యుల మీదకు రావటం అలాంటిదే .                     మృ గాలకున్న నీతి కూ డా మనకు లేదా . ఎంతో విజ్ఞానుల మంటూ అన్ని లోకాలికి వెళ్లి వస్తున్నాం . కాని ఏ విజ్ఞానము మనలను కాపాడలేక పోవటం దురదృష్ట కరం

హైదరాబాదు మనకు ఒక భాగ్యనగరం . అనుకునే పరిస్తితులు లేవా . ఈనాడు జరిగిన మరణ కాండ ,మారణ కాండ, దిల్శుఖ్నగర్లో జరిగిన్ది. దిల్ షుఖ్ మనిషికి పేరులో మాత్రమె మిగిలిన్ది. మరి ఇలాంటి స్తితిలో మన జీవితాలు గాలిలో దీపాలెనా .  విద్యయా వినయా వాప్తిహి  ,సాచేత్  అవినయావాహ , కిం కుర్మః కిం ప్రతి బ్రూమః  గరదాయా స్వమాతరి.  .విద్య వలన వినయాది సద్గుణాలు రావాలిదానికి బదులు దుర్గుణాలు  వస్తే అది స్వయముగా తల్లే విషం పెట్టినట్లు అవుతుంది అనేది దీని అర్థమ్. మనం ఏ స్తితిలో ఉన్నామో ఏమి అర్థం కావటంలేదు .  ఉగ్రవాదుల మనస్సులు సమగ్ర ప్రేమ ,మానవతా భావాలతోనిండి మనమందరం క్షేమంగా ఉండాలని త్రికరణ శుద్ధిగా కొరుకొన్దాము. తధాస్తు. 

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

అతి సర్వత్ర వర్జయేత్

అతి సర్వత్ర వర్జయేత్ .

నమ్మి చెడ్డవాడు .......అనే సామెత భగవంతుని గూర్చి చెప్పింది . నమ్మకం వ్యతిరేక పదం అప నమ్మకం . కాని అమ్మకు వ్యతిరేక పదం నాన్న కాదు . వినియోగం విలువ తక్కువదే అయితే విలువకే విలువ తక్కువ. గుడ్డి తనం (అపనమ్మకం ) ఎక్కువ అయితేనే కదా చూపు మందగించేది .మోసగించి పై చేయి తెచ్చుకొని మోసగింప బడిన వాని ఎదాన బడి , వాడి మానసిక వేదనకు , ( ఒక్కొక్క సారి ) మరణానికి కారకుడైతే మిగిలేది పై చెయ్యి కాదు . పై లోకమే . ఈనాటి సమాజంలో

            . శ్లో ." యేన కేనాప్యుపాయేన .ప్రసిద్ధః పురుషో భవేత్ " . 


               అనే దానిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతున్నామని అనుకోని వెనక్కు వెళుతున్నారు. దాని సరైన అర్థం ఏ మంచి పని అయిన చేసి అని తీసుకొంటే మానవ కల్యాణం జరుగుతుంది. అలాగే నమ్మకం ,ఆశ ఉండాలి , కాని గుడ్డి నమ్మకం , అత్యాశ ,అనర్థ దాయకాలు . 

                       " అతి సర్వత్ర వర్జయేత్ " కదా . 

           ఈనాడే  కాదు ఏనాటి మోసాలకైన ,గుడ్డి నమ్మకం , (మానవుని విషయంగా)అత్యాశే కారణం. 

16, ఫిబ్రవరి 2013, శనివారం

\\నమ్మకం //మానవఖర్మం

 \\నమ్మకం // 

నమ్మకం అనేది మనిషికి చాల అవసరం . ఏ నమ్మకం అయితే మనిషికి మేలిమి బంగారం లాగా మేలు చేస్తుందో అదే నమ్మకం గ్రుడ్డిది అయితే   మనిషిని మసి చేస్తుంది. దీనికి తోడుదొంగ ఆశ . నమ్మకం మీదే ఒక ఆశ కలుగుతుంది. అయితే రెండింటిని సాలోచనాత్మకంగా , సమన్వయ పూర్వకంగా , ముందు చూపుతో , కొంత అనుభవం తో , అంతరాత్మ చెప్పే సత్యాలను నమ్ముతు అడుగులు వేస్తె అనర్థాలకి కొంత దూరంగా ఉండవచ్చు. కాని విధి మనలను కర్మానుభవం వైపే నడుపుతుంది. నమ్మకం యెంత బలమైనదో , ఆశ కూడా అంతే  బలమైనది. అందువల్ల మోసగించే వాడిదే నిరంతరం పై చేయి అవుతున్నది. దానికి తార్కాణమే కోట్లను అవలీలగా సంపాదించాలనే ఆశతో,వస్తాయనే గుడ్డి నమ్మకంతో మనం ముందుకు సాగటమే మన పతనానికి నాంది అవుతున్నది. యిలా జీవితం ఎన్ని పాఠాలు నేర్పినా మనకు రోజు కొత్తే .తప్పులను చూస్తూ కూడా తప్పులు చేయడమేనా మానవఖర్మం కాదు,కాదు మానవ ధర్మం .

4, ఫిబ్రవరి 2013, సోమవారం

బంధాలు అనుబంధాలు


బంధాలు అనుబంధాలు 4.02.2013
.
ఇవి మనం ఊహింప గలమా.. . బంధం మనం కల్పించు కొన్నదైతే , అనుబంధం సహజ సిద్ధంగా  ఏర్పడేది . ముందుగ మనం వివాహ పరంగా ఒక బంధం ఏర్పాటు చేసుకొంటాము . సంతానం కలగటం వలన వారికొక అనుబంధం ఏర్పడుతుంది . అనుబంధానికి సంకేతమే ప్రేమ .బన్ధానిది ఒక ప్రేమ .అనుబందాని కి మరొక ప్రేమ .ఈ ప్రేమలు మానవత్వానికి ప్రతీకలుగా ఉంటె, పస్పరం అనుబంధం బలపడి, అవి  కుటుంబానికి ,సమాజానికి , దేశానికి మేలుని చేకూరుస్తాయి . అయితే సమాజంలో ఎక్కువమంది   అసూయా, ద్వేషం, అహంభావం , అనే స్వార్థభావాలు  మూలాలుగా  కలిగియుండుట చేత మనం అనుకునే అనుబంధాలు ,బంధాలు . వ్యర్థ పదాలుగా కేవలం కధలలో, కవితలలో, ఉహలలో  మిగిలి పోతున్నాయి . విడిపోతున్న బంధాలకు , అనుబంధాలకు నిస్స్వార్ధవర్తనమే సరి అయిన పరిష్కారం . జీవితం మనమూహించినంత సుదీర్ఘమైనది కాదు . కనుక యిద్దరి మనసులలో నిస్వార్థంగా , సాంఘిక మర్యాదలతో కలిగే ప్రేమ, అనేక బంధాలకు , అనుబంధాలకు సంకేతమై నిలుస్తుంది. అందుకనే హిందూ ధర్మానుసారం , ఒక వ్యక్తి తల్లి గాని, తండ్రి గాని మరణించి నప్పుడు  పేగు బంధం తెగి పోయినది అనుదానికి సంకేతం గ దీక్షా వస్త్రంలో ఒక భాగాన్ని  చింపి అతని మెడలో వేస్తారు , కార్య క్రమాలు పూర్తి   కాగానే తీసివేస్తారు . మనం వాటిని నిలబెట్టుకోకపోతే మానవత్వానికి , హిందుత్వానికి విలువ ఏముంటుంది . 

31, డిసెంబర్ 2012, సోమవారం

జ్ఞాన వృ ద్ధులకు

జ్ఞాన వృ ద్ధులకు 

మీరుసూదితో బాదితే కష్టం కానీ ( శరీరానికి  ) సుకుమారమైన శ్లోకంతో బాదితే యిష్టమే. సంతోషమే. కోపం వచ్చే అవసరం . అవకాశము లేదు. అయితే వయసును బట్టి చిన్న కనుక ఆశిస్సులు ,జ్ఞానాన్ని  బట్టి ( జ్ఞాన వృ ద్ధుడే వృద్ధుడు ) కనుక నమస్సుమాంజలి .

మీరుదహరించిన భగవద్గీత 6 వ .అ . 34.శ్లో . తర్వాత , 7వ .అ .10వ శ్లో . నందు   " బీజం మాం సర్వ భూతానాం , విద్ధి పార్థ సనాతనం ,  బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహం "..

7వ అ .12వశ్లో .  ఏ చైవ సత్వికాభావా , రాజసాస్తామసాశ్చ ఏ ....మత్త ఏవేతి తాన్విద్ధి  న త్వహం తేషు తే మయి ...

నేను సర్వ స్వతంత్రుడనని ప్రకృతి  త్రిగుణములు నాకు మాత్రమే లోబడి యుండుననియు పల్కినాడు. కనుక జీవులకు భావ ప్రేరణ మతడే . కర్త కర్మ క్రియ అతడే . అందువలన తానె అంతరాత్మయై నిలిచినాడు . ఆత్మ కూడా అంతరాత్మకు లోబడియే యుండును .
 15వ .అ . 15వ శ్లో .. సర్వస్యచాహం  హృది సన్నివిస్టో  ,  మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ , వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో ,   వేదాంత కృత్ వేద విదేవ చాహం.    అంటారు పరమాత్మ.

15వ. అ . 17వ శ్లో .నందు కూడా యిదే భావం కలదు . ఆలోచన ,బుద్ధి , ఆత్మా సహిత శరీర శకటమును పూర్వ జన్మ సుకృత ,దుష్కృత , శేషముల ననుభవిన్చుటకేర్పాటు చేయబడినదనునది సత్యము. వాటిని పోషించుచు కర్మానుసారి ఐ భొగానుభవమునకు అవకాశము  నొసగు దేవదేవుడగు శ్రేష్ట పురుషుడే అంతరాత్మ.

స్వామి  వివేకానంద మొదట అత్మాలోచనాపరుడై రామ కృష్ణ పరమ హంసను సామాన్యుడని భావించి అనంతరము అంతరాత్మ ప్రబోదితుడై ఆతని మాహాత్మ్యము గ్రహించి తన గురువుగా స్వీకరించెను .

          కనుక బుద్ధి రధ సారధి ఐనను ,జీవుడు ప్రయాణీకుడైనను  , అంతరాత్మ ననుసరించియే పయనించును .

   బ్రహ్మజిజ్ఞాస యందు మాత్రము బుద్ధిని జడ పదార్థము గాను ,ఆలోచనా  కేంద్రముగాను చూపినారు .
వేదము మూలజ్ఞానమైనను వారి వారి జ్ఞాన సామర్త్యమును బట్టి వ్యాఖ్యానము లున్డుననుట నిస్సందేహము .

శ్లోక బాదుడు

     శ్లోక బాదుడును నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను .కోపాన్ని ఏ కారణంగా పొందాలి.

శ్లో . విద్యయా వినయా వ్యాప్తిహి .


     సాచేత్ అవినయావహ ,

    కిం కుర్మః కిం ప్రతి బ్రూమః ,

   గరదాయా స్వమాతురి .

అందువలన నాకు నేర్పిన చదువు నాకు అకారణంగా కోపం తెప్పించదు . అయితే పట్టుదల మీరు నేర్పినదే .  

25, డిసెంబర్ 2012, మంగళవారం

ఆత్మ విచా రము .

                                                      ఆత్మ విచా రము .

     బుద్ధి .          శ్లో .. అధిష్టానం చిదాభాసో , బుద్ధి రేత త్రయం యదా .
   ....                                        అఙ్ఞానాదేకవత్ భాతి , జీవ యిత్యుచ్యతే  తదా .
                           భావం ...  అధిస్టా నమగు కూటస్తుడు, చిదాభాసుడు , బుద్ధి , ఈ మూడును , అజ్ఞానము                   వలన ఒకటిగ తోచినప్పుడు జీవ సంజ్ఞ తోచుచున్నది . 1) కూట స్తుడు ... నిర్వికారుడగుట వలన జీవుడు కాదు.  2) చిదాభాసుడు ... మిధ్య యగుట వలన జీవుడు కాదు . 3) బుద్ధి ... యిది జడ మైనది,                                    ఆశ్ర యించునది .  ఈ మూడును కలసియే జీవుడైనాడు .  ( బ్రహ్మ జిజ్ఞాస .2 వ , ప్ర .,, స్వాత్మ ..36. ) 

ఆత్మ....            జీవుడు , శ రీరాదులు
అంతరాత్మ ......బ్రహ్మ పదార్దము. 

వేదాంత పంచ దశి యందు .....బ్రహ్మమే శరీర మందు ప్రవేశించి జీవరూపు డాయెనని , ప్రాణాదులను   ప్రేరేచుట వలన జీవుని పేరు కలిగె నందురు.  ఆత్మయే శరీరాదులు తాన నుకొనుట వలన జీవ భావము కలిగె నని చెప్పిరి .  

బుద్ధి , లింగ దేహము ,ఈ రెండు , అవిద్యా పరిణామములు... ( శంకర విద్యారణ్యులు )


విచార దృష్టి తో జూచిన   జీవేశ్వర భేదమే లేదు . జీవుడు ఆలోచిందే దానినే బ్రహ్మ పదార్థము నిశితం గ ఆలోచిస్తుంది . అందు వలన ఆలోచనలకు అది నికష . 


మనో వాక్ కాయ  కర్మలే  త్రికరణములు . త్రికరణ శుద్ధి కలిగితే దైవత్వమే .

22, డిసెంబర్ 2012, శనివారం

మనసు ,బుద్ది , అంతరాత్మ.

మనసు ,బుద్ది , అంతరాత్మ.

మనసు ...ఇది చంచలమైనది . చురుకైనది. కానీ దీనిని  ఒక చోట కట్టి వేయడం మానవ మాత్రులము గ మనం చేయలేము. కొంత దైవ శక్తి కావాలి. అప్పుడు మన మసును కట్టి వేయగల సూత్రాలు దొరుకుతాయి.  ఆ నాడు
మనం మనవా తీతులము అవుతాము.

బుద్ధి ... ఇది ప్రళ యాన్తకమైనది . ఆ  మనసుని అనుసరిస్తుంది అనాలోచితంగా . అందుకే , అంతరాత్మ నిశితంగా

ఆలోచించి చేయదగిన పనినే సూచిస్తుంది .అదే చేయాలి .

అంతరాత్మ.  అనంతమైన శక్తి కల దైవ వరం . దీనిని ఆధారం చేసుకొనే మనం నిర్ణయాలు  చేసుకోవాలి. ఆనాడే మనం మనవా తీతులుగా ప్రసిద్ధి కెక్కు.తాము


ఈ మూడు శక్తుల కలయికే అనంత త్రికరణ శుద్ధి . యిదే దైవశక్తి. 

18, మే 2012, శుక్రవారం

భావన

  భావన .  మానవుని మనుగడకు సమాజ శ్రేయస్సు ఒక దివ్య ఆయుధం . ఏ మానవుడు ఎక్కువగా సమాజాన్ని గురించి ఆలోచిస్తాడో అతని మనుగడకి , జీవితానికి ఒక అర్థం ఒక పరమార్థము ఉంటుంది . మాములు ఆయుధాలకి  పదును పోయే అవకాసం ఉన్నది . ఈ మహా ఆయుధానికి సేవ చేసిన కొలది పదునేక్కుతుంది ..కనుకనే అందరు ఈ ఆయుధాన్ని ధరించి దుర్మార్గ , నీచ భావాలకు ఆలవాలమైన  ప్రతి ఒక్కరి మనస్సులలో నున్న స్వార్థ పూరిత విష వృక్షాలను చ్చేదించాలి . నిరంతరం ఆనందాన్ని ప్రసాదించే కల్ప వృక్షాలను పెంచి పోషించాలి . ఎవరి హృదయము లో నిరంతరం నిశ్చల , నిర్మల , భావాలు ఉంటాయో  వారి హృదయమే దేవాలయం . భావమే మహోత్క్రుస్ట దైవము .  

తృప్తి

తృప్తి   మానవునకు ఏంతో ఆనందాన్ని స్తుంది ,ఒకరికి మానసికంగా , మరోకరికి శారీరకంగా. శారీరకంగా  పొందే తృప్తి తత్కాలికమే . మానసికం మరువలేని శాశ్విత ఆనందాన్ని యిస్తుంది . సాధారణ మానవులు శారీరకమే కోరుకొంటారు . మహాత్ములు మానసికం కోరుకొంటారు . మహాత్ములకు , సాధారణ మానవులకు ఉన్న తేడ  కేవలం మనస్సు . మనస్సు కోరికల పుట్ట . తీర్చటం మొదలు పెడితే కోరటం ఆపదు . క్రమంగా కొన్ని అయిన తీర్చకుండా మనసును మనం అరికడితే , క్రమంగా అది మన దారికి వస్తుంది . దానికి మనకు జ్ఞానము అవసరం . జ్ఞానములోనే విచక్షణ ( చేయ తగిన, తగని పనులు ) ఉంటుంది . జ్ఞానమునకు మూలము గురువు . వారివలన ఒక వంతు వస్తుంది .మిగిలిన మూడు తోటి విద్యార్థులతో ,స్వ శక్తి తో , కాల క్రమము లో వస్తుంది . శ్లో .....ఆచార్యాత్   పాదమాదత్తే  , పాదం శిష్య స్వ మేధయా .పాదం స బ్రహ్మచా రిభ్యః ,  పాదం కాలక్రమేణ  చ .  కనుక సంపూర్ణ జ్ఞానం రావాలంటే  మానసిక పరిపూర్ణత రావాలి . దానికి కొంత అయిన దైవ ఆరాధన , ఆత్మ స్థైర్యం , సేవానురక్తి , పెద్దల యెడ ప్రేమానురాగాలు . అవసరం . ఇలాంటి మనసు తో మనం అందరం తృప్తి గ ఉందామా . ప్రయత్నం చేసి చూడడం తప్పులేదు .

5, మార్చి 2012, సోమవారం

భయం

భయం ...భయం ...భయం ...


మనసును బాధపెట్టే దేనిని చూచిన భయమే. సంతోషాని కి వ్యతిరేక పదమే ఈ భయం . ముఖ్యంగా ప్రతి జీవికి మరణం అంటే( మృత్యువు) భయం . మనం సహజంగా దేన్ని చూచి భయపడతామో  అదే నిరంతరం మనలను చూచి కవ్విస్తుంది. మన వెంట పడుతుంది ఆంటాడు ఒక మహా కవి . నిజమేమరి సమాజం లో కూడా అదే జరుగుతున్నది . ఎవరు    ( ధర్మ అధర్మ విచక్షణతో ) భయపడతారో వారినే ఎదుటివారు భయపెడతారు . ఎదురు తిరిగేవారిని ఎవరు భయపెట్టలేరు. ఉదాహరణకు మన వెంట ఒక శునకం వెంట పడితే ....మనం భయపడి పరుగిడితే అది వెంటపడుతుంది. అది భయపడి పరుగిడితే మనం వెంట పడతాము .

    మరి ఏసంగతి అయిన యింతే అనుకుంటే పనులు చాల సులువు అవుతవి . మన భయం మరణం గురించి కనుక మనమే దానికి ఎదురు తిరిగితే సరి. అంటే ఆధ్యాత్మకముగా మనసును ధైర్యం చేస్తే మరణం అంటే భయం ఉండదు. యిది ఏనాటికైనా నిత్య సత్యము. కనుక  ఒంటరిదానినని మనసు భావించకుండా దానికి ఏదో ఒక దైవ శక్తిని జోడిస్తే అది ధైర్యం పుంజుకొని మరణాన్ని సైతం జయిస్తుంది. వేదాంతం కాదిది నిజంగా నిజం.  

1, ఫిబ్రవరి 2012, బుధవారం

పరిశీలించడం ,

చూడటం , వీక్షించడం , పరికించడం , పరిశీలించడం , 

ఈ నాలుగు పదాలు  భిన్నమైన అర్ధాలు కలిగి ఉంటాయి .

చూడటం ..... ఏ ఆలోచన లేక కన్నులకు మాత్రమే పని అప్పచెప్పటం .

వీక్షించడం ...కన్నులకు , బుద్ధి కి , మాత్రమె పని అప్పచెప్పటం .

పరికించడం . కన్నులకు ,బుద్దికి ,మనస్సుకి ,మాత్రమే పని చెప్పటం .

పరిశీలించటం  ..కన్నులకు ,మనస్సుకు , అంతరాత్మకు , సాక్షిగా ,
                           ఆలొచనాసహితంగా  స్పందించడం
వస్తువులను , చూస్తే సరిపోతుంది .ప్రకృతిని వీక్షిస్తే సరిపోతుంది . లౌకిక
విషయాలను పరికిస్తే సరిపోతుంది . కాని పార లౌకిక విషయాలను
పరిశీలించినా, ఒక పట్టాన అర్థం కావు.
వానిని సద్గురు ముఖముగా మాత్రమే అధ్యయనం చేయాలి . అప్పుడు కూడావారి వారి పూర్వ జన్మ పుణ్య ఫలం గ ఆద్యాత్మిక విషయాలు అబ్బుతాయి .

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...