గాంధేయవాది. పల్లెవాడలో జననం. 1972న అవనిగడ్డ లో ఎన్నికైన ఏకైక శాసనసభ్యుడు. 1974లో విద్యామంత్రి. అంతర్జాతీయ తెలుగు కేంద్రం ను
మం.వెం.కృ.రావు తెలుగు కేంద్రంగా మార్చారు. దివిసీమగాంధి. ప్రథమ
ప్రపంచ తె.సభల అధ్యక్షులు. మండలి వెంకట కృష్ణారావు.
పల్లెవాడను పల్లె ప్రభవించి వెల్గిన
మండలివంశాబ్ధి మండనుండు
చదువు సంధ్యలయందు సామర్ధ్యముంజూపి
సత్కీర్తి గన్నట్టి సౌమ్యుడితడు
అవనిగడ్డ పరిధి నాత్మీయుడైవెల్గి
శాసనసభ్యుడై చనినవాడు
విద్యల మంత్రిగా విలువైన సేవలన్
ఆంధ్రులకొసగిన నార్యుడతడు
దివిసీమగాంధిగా తేజరిల్లినవాడు
కృష్ణరావాఖ్య వాజ్ఞ్నిపుణుడతడు
పుణ్యభారతమాతకు ముద్దుబిడ్డ
శాంతిదాంతులుపాటించు సారయశుడు
కీర్తిశేషులు పేదల కార్తిహరులు
ఐదుపదిసేతు వారికి నహరహంబు.