సన్మానాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సన్మానాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2019, బుధవారం

ది . 10. 11.2019. ప్రజ పద్యం. త్యాగరాయ గాన సభ . బహుమతి ప్రధాన ఉత్సవము




 ది . 10. 11.2019. ప్రజ పద్యం.

త్యాగరాయ గాన సభ . బహుమతి ప్రదానోత్సవము

 ఈ నాటి పద్యో త్సవము మధురానుభూతి కలిగించినది. పెద్దల సమక్షంలో సన్మానము. వ్రాసి కావ్యము ( బుర్రకథ నాజర్  చరిత్ర) లో  రెండు పద్యాలు చదివే అవకాశము . కానీ సమయాభావం చేత ఒక పద్యము మాత్రమే చదివాను. అది మా యూరి బంగారు కొండ వర్ణన .

 సీ . భీకర వాయువుల్  పెను మంటలొచ్చిన
                                 నిశ్చలమై యుండు నిండుకొండ
      తనను ముక్కలు జేసి దారులు పెట్టిన
                               నిబ్బరమై యుండు నియతికొండ
     గుహలో వరదరాజు కొలువుండి యుండుట
                              నియమంబు తప్పని నిలువుకొండ
    జడలమ్మ బావికి జారుడు గంగమ్మ
                             పులకింతలాకునెల్ల  పొంగుకొండ
  ఆ. వె. పొన్నెకంటి కొండ పొగరైన కొండగ
           కోర మీసకట్టు కోరి దువ్వి
          హితుల హత్తు కొనగ హేమాద్రియై నిల్చి
          కూర్మి వరములీను కొండయిదియ. 1.

మస్తాన్ కుటుంబమండలి వ్యధను ( మస్తాను అన్న, ప్రఖ్యాత షెహనాయి కళాకారుడు , నాజర్ మరణించుట)  జూచి బాధతో సూర్యుడు అస్తమించాడని భావించు  సందర్భము.

సి . తన కాంతి రేఖలన్ ధరణి ప్రాణులకెల్ల
                     వెల్గుల బంచెడు వే వెలుంగు
     చిరువేడి ప్రసరించి చేతనత్వము బెంచు
                    ప్రత్యక్ష దైవమౌ భానుడతడు
    మధ్యాన్న బింబమై మరికొంత తైక్ష్ణ్యంపు
                     చేవ చూపించు రోచిష్ణుడతడు
తే. గీ . సృష్టి నియమంబు తలదాల్చి స్వేచ్చనుడిగి
         తూర్పు కొండకు సరసరా దూరమగుచు
        మౌన ముద్రను పాటించి మాన్యుడగుచు
        పశ్చిమాద్రికి గతి నెంచి పాఱి పోయె .
                 

                   

         

                     


10, అక్టోబర్ 2019, గురువారం

మహర్నవమి. అమ్మ కరుణ.7.10.2019.

మహర్నవమి., అమ్మ కరుణ.7.10.2019.

 శ్రీ గోపరాజు హనుమంతరావు గారి (దంపతుల)ఆహ్వానం మేరకు
 శ్రీయుతులు, సుహృన్మిత్రులు,ప్రముఖ అష్టావధాని సురభి శంకర శర్మ గారి పనుపున నేను, నాశ్రీమతి ఇందిరా దేవి వెళ్ళుట జరిగింది.
        గోపరాజు లక్ష్మి దంపతుల భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలు, ఆప్యాయతానురాగాలు, హిందూధర్మ నైష్టికతలు, సంప్రదాయాలు వాటిపై గల విశ్వాసం ఎనలేనివి, మరువరానివి. వారి మహోన్నత సంస్కారానికి ఇవే నిదర్శనాలు.  ముందుగా పార్వతీ పరమేశ్వరులకు పూజాదికములు పూర్తి చేసి మా యిరువురకు  మంత్ర యుక్త స్వాగతము పలుకుచు లోనికి దోడ్కొనిపోయి పీఠముల నలంకరింపజేసి నన్ను, ఇందిరను పార్వతీ పరమేశ్వరులుగా ఆవాహనజేసి షోడసోపచారములు చేసి మా ఆశీస్సులను(పద్యరూప) గైకొని తత్ఫలముగా వస్తు, వస్త్ర,ఫలాదిక భూరిదానములనిచ్చి భోజనముపెట్టి ఇంటికడ ఆ దాన సముదాయమును దింపుకొను నిమిత్తమొక సేవకుని బంపిన వారి యౌదార్యము కడు ప్రశంసనీయము. వారికి ధన్యవాదాలు. మీరు పొందవలసిన సన్మానము మేము పొందే  అవకాశము కల్పించుట మీకు మాపై గల అవ్యాజానురక్తులనక తప్పదు.శ్రీ గోపరాజు హనుమంతరావు గారు పొన్నెకంటి హనుమంతరావు గారికి శిష్యులగుట ఎంతో ఆనందము కలిగించినది.

            గోపరాజు వారి కూరిమి సేవలు
            పూర్వపుణ్యఫలము ముక్తిత్రోవ
            అమ్మ కనకదుర్గ హర్షితమూర్తియై
            పూజలందుకొనియె రోజురోజు.
    గోపరాజు లక్ష్మి కోరగ మైత్రిచే
    నీశునైతి నేను నీప్సితముగ
    నచట నాదు సతియె అగజగా మారగా
    పూజలందె మాకు మోదమలర.
     శ్రీ హనుమంతరాయ వరచేడియ శ్రీసతి లక్ష్మి నామ్ని , న
     న్నూహలదేలజేసినదహో యన నీశుడు, దుర్గభావనన్
     స్నేహ విశేషబంధములు చేయును నద్భుత ధర్మకార్యముల్
     దేహపు తన్మయత్వమున తేజమునిండెనపూర్వశక్తి తోన్.

5, అక్టోబర్ 2017, గురువారం

న్యూ నాగోల్ సన్మానము. 2.10.2017.

     న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వారి సన్మానము. కృతజ్ఞతలు.

న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యవర్గం  మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా చేసిన సన్మానము. దానికి కృతజ్ఞతతో వ్రాసిన పద్యాలు.

సీ. జాతికి పితయౌచు జాగృతి నేర్పిన , గాంధి మహాత్ముని ఘనజయంతి
    " జై జవానంచును" జగతికి దెలిపిన , శాస్త్రి జీ పుట్టిన స్వాదుదినము
     వృద్ధుల సన్మాన వేదికై వరలిన , సర్వసభ్యులకిల సంతసంబు
     అధికార వర్గాల కాదరంబు గలుగు, సంస్థ గౌరవమంద చాలునిదియ
 తే.గీ.  మంచిపనిజేయ సతతంబు మాన్యులగుచు
           యశము కోరకె యేతెంచు నవనియందు
          శ్రీనివాసుని కరుణను సిరులు విరియు
           క్రొత్త నాగోలు సంస్థకు కూర్మిదనర.

 సీ. నాగోలు బుధులెల్ల నాయందు జూపిన, ఆత్మీయతలకెల్ల అంజలింతు
      సభ్యులందరు గూడి సాధుజీవనులౌచు, వర్తించు తీరుకు ప్రణతులిడుదు
      సాంఘిక కార్యాల సంఘటితంబుగా, కృషిచేయు మీకెప్డు కేలుమోడ్తు
       జాతీయ పండుగల్ జాగృత తేజమున్, జరిపెడి మీకునే జైయనందు
 తే.గీ.మమత సమతల నందరు మధురరీతి
         పంచి పెంచెడి తీరుకు పరవశింతు
         సభ్యులందరు నూరేండ్లు చల్లగాను
         ఆయురారోగ్యములు గల్గ నభిలషింతు.
 సీ. వయసున మీరిన వందనీయులనెల్ల, గారవించెడు మీరు ఘనులనందు
      జ్ఞానుల సాహితీ జ్ఞానుల వృద్ధుల , గారవించెడు మీరు ఘనులనందు
      ఆటపాటలలోన అందెవేసిన వారి , ప్రోత్సాహమిచ్చెడు పుణ్యులందు
      సంగీత పాండిత్య సౌహృదులందరి , నక్కునజేర్చెడి యమరులందు
 తే.గీ. పెధ్ద మనసున్న నాగోలు వృద్ధులకును
          జ్ఞాన విజ్ఞాన సరస విజ్ఞులకును
          మాదు సన్మాన సమయాన మమతతోడ
          వందనాలను నర్పింతు వందవేలు.

 సీ.  అధికార గణముల అండదండలతోడ, అపురూప సౌధంబు నందుకొనిరి
       అధికార గణముల ఆత్మీయతలతోడ, సాంఘిక సేవల సల్పుకొనిరి
       అధికార గణముల ఆదరంబులనంది, ఆరోగ్య రక్షణ నందుకొనిరి
       అధికార గణముల అమృత వాక్కుల , సత్కార్యములనెల్ల సల్పుకొనిరి
 తే.గీ. సర్వ నాగోలు సభ్యులు సౌఖ్యమంద
          ఇందునున్నట్టి యధికార్లు హితమునంద
          సరళ సుగతి నీ సంస్థ స్థాయి నంద
          వేడుకొందును నీశుని వేడ్కతోడ.

 సీ. నాగోలు సంస్థకు నాకును బంధంబు , బిగిసెను మిత్రుల ప్రేమతోడ
      నాగోలు సంస్థకు నాకును బంధంబు ,  సాగెను సాహితీ సరసువలన
      నాగోలు సంస్థకు నాకును బంధంబు , మెండాయె క్రీడల మెరపు వలన
      నాగోలు సంస్థకు నాకును బంధంబు  , పెరిగెను సత్కళా ప్రియుల వలన
 తే.గీ. ఇన్ని బంధాల నిండిన ఇష్టమైన
          సంస్థ సర్వతోముఖముగ సాగిసాగి
          సభ్యులెల్లరు నారోగ్య సౌఖ్యమంది
          భావి జీవిత కాలాన వరలుగాక!

2, అక్టోబర్ 2016, ఆదివారం

న్యూనాగోల్ సమావేశం.2.10.2016

రఘుప్రసాద్ గారు,జోనల్ కమీషనర్. ముఖ్య అతిథిగా, సింగయ్యగారి అధ్యక్షతన "న్యూనాగోల్ లో సీనియర్ సిటిజన్స్" సమావేశం ది.2.10.2016,న సాయంకాలం 5గం.లకు ఘనంగా జరిగింది. ఆసందర్భంగా ఐదుగురు సీనియర్ సిటిజన్స్ కు సంస్థ తరఫున సన్మానం జరిగింది. రఘుప్రసాద్ గారు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. వారికి సర్వదా కృతజ్ఞతలు.
       ఆ సందర్భంగా సభ్యులకు నేనిలా స్వాగతం పలికాను.

  1. స్వాగతమో వయోగుణ సుసాధిత జ్ఞాన సమృద్దులార! స
      ర్వాగమ ధర్మనిర్మల విరాజిత మానిత ధుర్యులార! మీ
      యాగమనంబుమాకిపుడు హ్లాదముగూర్చును,సంస్థకున్ మహా
      భోగపుహేతువైచనునుపూర్ణమనోజ్ఞత పాదముంచుడీ!
                          సంస్థ స్థాపన.......
 2. రెండువేలపదిన పండిన యోచనన్
     జనవరి నెలలోన జననమందె
     నవ్యసంస్థ యిదియె నాగోలు పేరునన్
     దివ్యశక్తి మతిగ తేజరిల్లె.
 3. స్త్రీలు పురుషులిచట చైతన్యవంతులైకక
      నిలచియుండి తమదు నేర్పుమీర
     సభ్యులైరి కలసి సంస్థ శ్రేయస్సుకై
     వృద్ధి జెందెకీర్తి హృద్యముగను.
            ఈ రోజు ప్రాముఖ్యం.......
 4. ఐక్యరాజ్యసమితి యాధ్వర్యమందున
      విశ్వవృద్ధులకది వేడుకనగ
      జన్మదినమటంచు చాటించె ప్రభుతయె
      అక్టొబరొకటిన మహాద్భుతముగ
 5. ఐదుమంది సభ్యులర్హత గుర్తించి
     వయసులోన దగిన వారిజేర్చి
      గారవంబుసేయు ఘనమైన కార్యమున్
      సలుపుచుంటిమిచట సౌమ్యులార !
             సంస్థ లక్ష్యములు.....
 6. సభ్యులందరిలోన సాంఘిక చేతనన్
                         లాలన గలిగించు లక్ష్యమనగ
     సహకారమందించి సౌమ్యతగురిపింప
                          లాలించురీతులె లక్ష్యమనగ
     పుట్టిన రోజులన్ మోదాన గుర్తించి
                          లఘుగారవంబిడు లక్ష్యమనగ
      ఆటపాటలతోడ నారోగ్యమందించి
                           లౌక్యాన నడిపించు లక్ష్యమనగ
       స్థాపనంబైన చిరకాల సంస్థ మనది
       పెద్దవయసున్న మాన్యులు పేర్మిబొగడ
       నూతనంబైన నాగోలు పూతమవగ
       సద్యశమ్మును నార్జించె సౌమ్యులార!.
 

10, సెప్టెంబర్ 2016, శనివారం

నాగోలు పద్యాలు.

    1.    సీ. సీనియర్ సిటిజన్సు శ్రేయంబు కాంక్షించి
                          నాగోలు ప్రాంతాన జ్ఞానులంత
             ఒకరికినొకరౌచు నొద్దిక మీరంగ
                           సాయంబునందించు సరసులగుచు
             సంగీత సాహిత్య సమ్మేళనంబులన్
                            సత్కళల్ జొనిపించి చక్కబరచి
             ప్రాచీన యోగంబు పరమౌషధమ్మని
                           యమలుజరుపునట్టి యార్యులున్న
            ఇట్టి సంస్థ యెదిగె ఈశుని సత్కృపన్
             ఆరు వత్సరాల యవధిదాటె
             స్వాగ తాంజలులివె సజ్జన వరులార!
             సంస్థ జయముగోరు సౌమ్యులార!

     2.     ఆటల పాటలంగలసి యందరు సభ్యులు బాలబాలురై
              నేటికి షష్టిపూర్తియయి నిశ్చల నిర్భయ దేహకాంతితో
              ధాటిని జూపగోరెదరు ధార్మిక పూర్ణులు సత్యవర్తనుల్
              మేటిగుణాఢ్యులౌ సరస మిత్రులు పల్కెడు స్వాగతంబిదే.

     3.     కొమరు రాజు వారి కూర్మి సాయమునంది
              పరిఢవిల్లె సంస్థ ప్రాభవంబు
              శిరమువంచి వారి శ్రేయంబుగోరుచు
              పలుక వలెను శుభము ప్రాంజలించి.
   
     4.   భారముకాదులే వయసు భక్తిని నింపిన డెందమంతయున్,
           భారముకాదులే మనసు పర్వతమంతటి ఆత్మశక్తితోన్ ,
           భారముకాదులే తనువు బంధిత స్నేహసమావృతంబునన్
           చేరుడి సభ్యులౌచుమన చేరువనున్నవి శాలసంస్థలోన్.

     5.  నాగోలుసభ్యులెల్లరు
          భూగోళపుటెల్లలెల్ల పుష్కల రీతిన్
          క్రీగంటజూడ నేర్చిరి
          వేగంబుగజేరియిచట విజ్ఞులుగారే.
         
           
           
           
     

మడిపల్లి వారి.లక్ష్మీ నృసింహ శతకం

మాన్యులు ,శ్రీ మడిపల్లి భద్రయ్యగారి లక్ష్మీ నృసింహ శతకము గ్రంథావిష్కరణ సందర్భంగా అభినందన పద్యాలు. 30.06.2016.

1.సీ. హస్తినాపురమున నవధానక్షేత్రాన
                       సాహితీ స్నేహంబు సాగెమాకు
         పద్యరచన ఘన పారవశ్యంబున
                       జేయుచునుండగ జెలిమిగలిగె      
         కంఠమెత్తి కవిత గానంబుజేయగా
                       నిండుమనసుతోడ నెయ్యమబ్బె
        నవరస భావాలు నవ్వల జల్లులు
                        పూవులై పూయించ మోదమయ్యె
  తే.గీ.  వారలెవ్వరో కాదు మా భద్రనామ
            యశులు మడిపల్లి ధీరులత్యంత ఘనులు
            నారసింహుని సత్కృపన్ ధారగల్గి
            కావ్యమందించుచున్న సంభావ్య వరులు.

2.సీ. గొంతెత్తి పాడెనా కోకిలమరపించు
                    నవరసంబులజూపి నవ్యఫణితి
         పద్యంబు రచియింప హృద్యంబెయౌనుగా
                     సత్కవుల్ పొగడంగ సభలయందు
         సాహిత్య సంగీత సమ్మేళనంబుల
                       కాలుమోపినజాలు ఘల్లుమనును
          నాటకరంగాన నాణెంపు నటనతో
                        పాత్రలో లీనమై పరవశించు
  తే.గీ. అట్టి మడిపల్లి భద్రయ్య హస్తినపుర
           మందు నాకు మిత్రుడగుట మరువలేను
           నారసింహుడు సతతంబు వారికెపుడు
           కోరుకొనినట్టి వరముల గూర్చుగాత!
   

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...