26, ఫిబ్రవరి 2014, బుధవారం

మహా శివ రాత్రికి . మహా దేవ స్మరణ


మహా శివ రాత్రికి . మహా దేవ స్మరణ
ఉ.    కుమ్భిని లోన జేరి తనకుం గల శక్తుల ప్రజ్జ్వలిన్చుచున్ ,
   
        దంభము జూపు బ్రహ్మకును తామర సాక్షుడు  విష్ణుదేవుకున్

       కమ్బపు మూలమున్నెరుక గాంచని భంగిమ లీల జూపు  నా

       శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో .                               1.

ఉ.    స్తంభమె  యగ్ని రూపమయి  శర్వుని కాంతులు తేజరిల్లగాన్

      సంభవ మాయెగా యరుణ శైల మనంగ  విశేష శేముషిన్

       అంబర కేశుడీ శ్వరు డనంతుడుమాపతి కాశి వాసుడా

        శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో                                 2.

ఉ.    దంభము జూపు నా దానవ మూర్ఖుల ద్రుంచి వైచు - వి

       శ్వమ్భర మూర్తి యా స్థా ణుడపారకృ పాన్తరంగుడై

       సంభరితాంతరంగముల సౌమ్యత జేరి సుఖంబు గూర్చు

       శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో .                               3.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

తాళ్ళమ్మకు తనివిదీర పాద్యం సమర్పిస్తున్న భక్తుడు

                                                                            తాళ్ళ మ్మకు తనివిదీర పాద్యం సమర్పిస్తున్న భక్తుడు                                  పాతూరి సత్యం బాబు.  12.. 02. 14. 

1. అలము  కున్నట్టి కష్టాల నలుగు చుండి 
 తల్లడిల్లుచు నుండు నా యుల్లముల కు 
   మల్లె గంధము జూపించి మరులు పంచు 
 తల్లి తాళ్ళమ్మ  నీకెపుడు దండమమ్మ. 

2. ఆడిగినంతనె  కడగండ్ల బాపు చుండి 
అమ్మకు ప్రతిగ, స్వర్గంగ చెమ్మగ కడు  
     నెమ్మది మము గాచు సతివి నీవ యందు 
 తల్లి తాళ్ళమ్మ  నీకెపుడు దండమమ్మ. 

                                                                 పుర ప్రముఖుల వినోద క్రీడ . దాడి .

                                                              పులి. మేక . ఆట 

18, జనవరి 2014, శనివారం

విరూపాక్ష స్వామీజీ దర్శనమ్. ది .18.01 .14.

                                                      విరూపాక్ష స్వామీజీ దర్శనమ్.  ది .18.01 .14. 

విరూపాక్ష స్వామీజి  ఈ రోజు యల్లాప్రగడ ప్రభాకర్ యింటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించారు . 30 మంది శిష్య బృందం తో వచ్చారు . వారిలో చాల నిశిత పరిశీలనా పటిమ కనబడింది . అది వారి తపస్ శక్తికి నిదర్శనం గ కనబడింది . అందరిని ప్రేమ పూర్వకముగా , ఆత్మీయముగా పలుకరించారు. చక్కని సంస్కృత సంభాషణ కలిగి ఉన్నారు  , పాద పూజను సున్నితంగా కాదనుట ద్వారా తమ గురువుల పై గల భక్తీ , ప్రేమ కనబడింది . ప్రభాకర్  ను  సహస్ర గాయత్రి చేయమన్నారు  ,అందరికి ప్రేమతో ఆశీస్సులిచ్చారు .    తద్వారా ఆగ్రహారానికి మేలు జరుగుతుందని అన్నారు . గాయత్రి మాత  జపం నిజంగా ఎంతో శక్తి వంతమైనది . న గాయ త్ర్యాహ్ పరమమ్  మంత్రం   (గాయత్రీ దేవిని మించిన మంత్రం లేదని  అన్నారు మహర్షులు . నిబద్ధత, క్రమ శిక్షణ , నిర్మలత్వం . ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడే పర మాత్మ స్వరూపమ్ ఉంటుంది నిస్సందేహం గ .  నేను రామ కృష్ణ మఠం వారి ప్రచురణ గ్రంధం  మనసు అనేది ఒకటి యశ్వంతాపూర్ లో కొన్నాను. దాని సారాంశం అంతా శుద్ధ చైతన్య స్వరూపమైన మనసును కలిగిన వాడే దయామయుడై , సత్వగుణ సంపన్నుడై , ఆత్మ స్వరూపమ్ తెలిసికోగలుగు తాడని ఉన్నది.  క్రమం తప్పని అభ్యాసమే , దీని కి పునాది అవుతున్ది. దీని లో ఆత్మను దర్శించటానికి , తద్వారా నీకు , దానికి తేడా లేదని ,( సోహం, అయమాత్మా పరబ్రహ్మ)  దానికి నిరంతర ఓం కారం , లేదా యిష్ట దైవ స్మరణ గాని  దోహద పడుతుందని  పేర్కొన్నారు . నాకు ఆ గ్రంధ సారాంశమే స్వామీజీగా కనిపించారు.  


21, డిసెంబర్ 2013, శనివారం

,పొన్నె కల్లు , హై స్కూల్ కి 21.1 2.1 3.

 గుంటూరు , శ్రీ రామ మామయ్య కార్యక్రమము సందర్భము గ ,పొన్నె కల్లు  , హై స్కూల్ కి 
వెళ్ళినప్పటి చిత్రాలు . 21.1 2.1 3. 
























2, నవంబర్ 2013, శనివారం

దివ్య దీపావళి శుభాకాంక్షలు

     చెడుగు చీకట్ల నిరతంబు చీల్చివేయు             3.11.2013.

     వెలుగు రేఖలు జీవన వేల్పులనగ

    మాన వాళి కి లభియించె మహితగతిని

    దివ్యదీపావళింటింట తేజమలర .1. 

    రాక్ష సంబైన పనులకు శిక్ష నునిచి 

    రమ్య ,సౌజన్య భావాలు రాణకెక్క
  
    మహిని నరకుని నరకి మాన్య సత్య 

    కంట కంబును దొలగించె వింటి చేత 2
.
 .  దీపమన్దున శ్రీలక్ష్మి దేవి యుండి

    పాప హరణంబు గావించి పరమ పుణ్య


    హేతు వగచును ప్రజలెల్ల హేల మెలగ


    వరము లిచ్చును క్రీగంటి కరుణతోడ 3.        



21, అక్టోబర్ 2013, సోమవారం

మధురాను భూతి .

                                                                       మధురాను భూతి . 20. 10. 13. 


బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి  గారిని ప్రత్యక్షంగా  చూడటమే ఒక మహత్తర దివ్యాను భూతి . వారితో మాట్లాడటం మరువలేని మధురాను భూతి . వారిరువురు ( దంపతులు ) పార్వతీ పరమేశ్వరుల ప్రతి రూపమ్ . నేను వారిని గురించి పద్యాలు వ్రాయటం చాల ఆనంద దాయకం . జన్మ తరించి నట్లుగా భావిస్తాను . వారి పురాణ ప్రవచనమునకు వయస్సు సప్తతి (70. సం .లు ) ఈనాటికి వారి వయస్సు 90 వసన్తాలు. స్వరం ఆనాటికి ఈనాటికి ఏమి తేడా లేదు . సాక్షాత్ వాల్మీకి  , వ్యాస ముని రూపమె. ఈనాడు వారికి  సువర్ణ పుష్ప సహిత రజత కిరీటం ( ప్రభాకరశర్మ, సుధారాణి చేత )అలంకరించటం జరిగిన్ది.  తదనంతరం  వారిని గురించిన పద్యాలు చదివి వినిపించడం , దానికి వారు మహదానంద భరితులు కావడం , ఆ సందర్భం గ వారితో మాట్లాడటం  పురాకృత పుణ్య విశేషంగా భావిస్తాను . 

     ఈ మహత్తర అవకాశం  నాకు చి. ప్రభాకర శర్మ ద్వారా  లభించిన్ది.  ఆనాటి సభానిర్వాహకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు.( సినీ  కవి .)  ప్రధమంగా నా పద్యాలు  వారికి చదివి వినిపించాను.  నేను పద్యాలు వ్రాద్దామని అనుకున్నాను . మీ పద్యాలు విన్నతరువాత అభిప్రాయం మార్చుకొన్నాను మీ పద్యాలు చాలా బాగున్నాయి వానినే అచ్చు వేయించి సమర్పించండి అని చెప్పటం నాకు మహదానందం కలిగించింది  . పద్యాలు చదివిన తరువాత  విభీషణ శర్మ గారు, ( తి . తి .దె . సాహితీ కార్యక్రమ నిర్వాహకులు ) వల్లూరి శంకర శాస్త్రి గారు ( తి . తి .దె . ప్రముఖులు ) చాల మంచిపద్యాలు బాగా చదివారని ఆశీస్సులన్దించటం 
మిగుల ఆనందాన్ని కలిగించిన్ది. ఇంతటి మహనీయుడు పుట్టిన అమరావతి కి ( గుంటూరు జిల్లా) సమీపంలోనే నేను జన్మించడం నా భాగ్యమ్.  

బోసుదంపతులకు ఆశీస్సులు. 6.05.2026.

 జీ.బోసు గారి 49వ వత్సర వివాహ మహోత్సవము.           శీర్షిక.. మూడుముళ్ళు. సీ. జీవితమంతయున్ కష్టసుఖాలలో        ముంచితేల్చుచునుండు మూడుముళ్ళు  ...