29, మార్చి 2014, శనివారం

            మధుమాస మకరందం . 31. 03. 2014 

        జయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలతో  

నవజీవనానికి  నాంది మధుమాసం . 
వన జీవనానికి వసంతం సుమ దరహాసం , సుమధుర హాసం , 
మానవ జీవన శైలికిది  సన్మార్గ సూచిక . 
మానస పరిణతి కిది మహనీయ రోచిక 

షడ్రుచుల యుగాది దేవతకు సాష్టాంగ ప్రణామం . 
ఏ రుచైనా ప్రకృతి మాత  ప్రసాదంగా చేద్దాం ప్రమాణం 
తీపి సుఖాలు కోరుతూ , చేదు కష్టాల పరాకాష్ట ల నధిగమించి 
గెలుపు పులుపు రసమూరిస్తే , ఉప్పు కారాల జయం ఊపందు కొంటే 
వగరు పొగరుతో జీవనం సాగించే 
మానవ రూపానికి మధు మాసం ఒక వరం . 
శుభోదయంతో సుందరి యిచ్చిన ఉగాది పచ్చడి లో 
కొంచెం చేదు  ఎక్కువైన, చిరు నవ్వులు చిందిస్తూ 
 శ్రీమతి మనసు తీపి చేయటానికి 
 ఏమోయ్, ఉగాది పచ్చడి అచ్చంగా పటిక  బెల్లం తో చేశావా అనే 
భర్తల నటనా విన్యాసం అద్భుతం వేప పూత సాక్షిగా . 
( ఉగాది రోజు మనసు బాధపెడితే సంవత్సరమంతా బాధ పడతారని ) 
చేదెక్కువైనా , తక్కువైనా , అది నింబ పుష్పాది సమ్మిశ్రితం 
ఆయురారోగ్య ప్రదాయకం . 
నవ జీవన కుసుమానికి , నవ్య పరిమళ విలసితం 
సర్వ రుచుల సమ్మేళనం తో సౌభాగ్య భోగ భాగ్యాలను 
జయ నామ ఉగాదికి పంచుకుందాం . అవకాశమిమ్మని దేవుని వేడుకొందాం ,


1, మార్చి 2014, శనివారం

శివానంద మూర్తి గారికి పద్య నీరాజనమ్

  శైవ పీఠాధిపతి,మహా మహో పాధ్యాయ , సద్గురు డా . శ్రీ శివానంద మూర్తి గారికి పద్య నీరాజనమ్.  ( వేద గాయత్రీ అగ్రహారం తరఫున ) ది.02.03. 2014 . 
                                                 లలితకళా మండపం లో . 
  కందుకూరి వంశోద్భవ కాంతిరేఖా , మంగళ  స్వరూపా .......

1.సీ.  సర్వమంగళాఖ్యత సాధ్వీమతల్లికి ,  ముద్దుల పట్టి యౌ మోహనుండు .
       
         వీర బసవరాజ వేదాంత సారంబు , కోరి జుఱ్ఱినయట్టి  వారసుండు .

         భీముని పట్నాన ప్రేమను పంచగా , ఆశ్రయమంబిడి నట్టి యమృత మూర్తి .

         చిన్నతనము నుండి చిన్ముద్ర పట్టిన , చిద్రూపి , సద్యోగ చిన్మయుండు .

తే.గీ.  తల్లి దండ్రుల విఖ్యాతి ధరణి బెంచ , సవ్య సాచిగా నిల్చిన సత్త్వ మూర్తి .

         కందుకూరి వంశోద్భవ కాంతి రేఖ , నవ్య ధార్మికాత్ముడు శివానందమూర్తి .

ఆర్ష ధర్మ ప్రచారకా , అమల యోగీ . ......

2. సీ.  సంగీత నాటక సారస్వతంబులన్ , వృద్ధి పరుపగా జూచు సిద్ధ యోగి

         ఉద్ద్యోగ ధర్మాన నున్నత లక్ష్యాల చెక్కు చెదరనీని చిద్విలాసి.

         ఆర్ష ధర్మంబుల నద్వితీయపు రీతి , పంచి పెట్టిన యట్టి పరమ గురువు .

        సంస్కృతీ విభవాల సాటి దేశములందు , చాటి చెప్పు  మన చిచ్ఛక్తి యితడు ..

తే.గీ.  వాణి  కరుణకు పాత్రుడౌ వందనీయ , సాధు సన్మూర్తి సద్ధర్మ సాధకుండు .

         శ్రీ శివానంద వర్యుండు శ్రేయమంద కాంక్ష సేయుదు నిరతంబు గరళ  కంఠు .

 ఆనంద నిలయా . శివానంద సదయా ,.........

3. సీ. యజ్ఞ యాగములందు  ప్రజ్ఞా ధురీణ తన్ , ఆర్షము  పండించు కర్షకుండు

        భారతీయత పేర భవ్యసంస్కృ తులెల్ల , విశ్వాన పంచెడు విబుధ వరుడు .

       అద్వైత జ్ఞానంబు నహరహంబున పంచి , విజ్ఞాన తెజుడై వెల్గు నతడు

       యోగ శాస్త్రంబన రాగంబు జూపుచు , ఋషి తుల్యు లైనట్టి రుత్విజుండు .

తే.గీ. భరత భూమికి దిగినట్టి ప్రణవ మూర్తి , భక్తి  తత్త్వంబు పండిన ప్రాక్తనుండు

       పరమ పుణ్యుం డు సద్దయా భరణుడతడు , శ్రీ శివానంద వర్యుండు శ్రేయధనుడు .

బహు గ్రంథ రచనా దురీణా  .  పూజ్య మహర్షీ ........

4. సీ. కఠ యోగ గ్రంథంబు కంచి స్వాముల చేత , మన్ననలందుట మరువలేము .

        పూజ్య మహర్షుల పుణ్య చరిత్రలు , మాల గూర్చుటదియ  మరువలేము .

         గౌతమ చరితంబు స్తుత్యమై రాజిల్ల , శిల్ప నైపుణ్యంబు చెదరలేదు .

       శ్రీ కృష్ణ పేరున చిద్విలాసము గాగ , భావ రమ్యంబది భద్రమగును .

తే.గీ. కావ్య మెట్టిదియైనను ఖ్యాతిగాంచి , సారవంతంపుటర్ధాల సరసి యగుచు

        ధర్మ వేదాంత శాస్త్రాల దారి జూపి , మూర్తి వర్యులు ధన్యులై మురిసినారు.

చరద్వి జ్ఞాన  సర్వస్వమా . పీఠాధిపతీ ...........

5. ఉ. మానవ జీవితంబెతుల మాన్యత గల్గెడు రీతి నుండునో .

          తానుగ చేసి చూపుచును ధర్మ ప్రర్తన ఎంత ముఖ్యమో ,

          వేనకు వేలుగా పరమా వేదిక లందు వచించి చూపు .. నా

          ధ్యాన నిమగ్న మూర్తి గుణ దామునకున్ కుసుమామ్జలిత్తు ..నే .  .

  కలం, గళం , పొన్నె కంటి సూర్య నారాయణ రావు . సమర్పణ . యల్లాప్రగడ  ప్రభాకర శర్మ .










26, ఫిబ్రవరి 2014, బుధవారం

మహా శివ రాత్రికి . మహా దేవ స్మరణ


మహా శివ రాత్రికి . మహా దేవ స్మరణ
ఉ.    కుమ్భిని లోన జేరి తనకుం గల శక్తుల ప్రజ్జ్వలిన్చుచున్ ,
   
        దంభము జూపు బ్రహ్మకును తామర సాక్షుడు  విష్ణుదేవుకున్

       కమ్బపు మూలమున్నెరుక గాంచని భంగిమ లీల జూపు  నా

       శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో .                               1.

ఉ.    స్తంభమె  యగ్ని రూపమయి  శర్వుని కాంతులు తేజరిల్లగాన్

      సంభవ మాయెగా యరుణ శైల మనంగ  విశేష శేముషిన్

       అంబర కేశుడీ శ్వరు డనంతుడుమాపతి కాశి వాసుడా

        శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో                                 2.

ఉ.    దంభము జూపు నా దానవ మూర్ఖుల ద్రుంచి వైచు - వి

       శ్వమ్భర మూర్తి యా స్థా ణుడపారకృ పాన్తరంగుడై

       సంభరితాంతరంగముల సౌమ్యత జేరి సుఖంబు గూర్చు

       శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో .                               3.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

తాళ్ళమ్మకు తనివిదీర పాద్యం సమర్పిస్తున్న భక్తుడు

                                                                            తాళ్ళ మ్మకు తనివిదీర పాద్యం సమర్పిస్తున్న భక్తుడు                                  పాతూరి సత్యం బాబు.  12.. 02. 14. 

1. అలము  కున్నట్టి కష్టాల నలుగు చుండి 
 తల్లడిల్లుచు నుండు నా యుల్లముల కు 
   మల్లె గంధము జూపించి మరులు పంచు 
 తల్లి తాళ్ళమ్మ  నీకెపుడు దండమమ్మ. 

2. ఆడిగినంతనె  కడగండ్ల బాపు చుండి 
అమ్మకు ప్రతిగ, స్వర్గంగ చెమ్మగ కడు  
     నెమ్మది మము గాచు సతివి నీవ యందు 
 తల్లి తాళ్ళమ్మ  నీకెపుడు దండమమ్మ. 

                                                                 పుర ప్రముఖుల వినోద క్రీడ . దాడి .

                                                              పులి. మేక . ఆట 

18, జనవరి 2014, శనివారం

విరూపాక్ష స్వామీజీ దర్శనమ్. ది .18.01 .14.

                                                      విరూపాక్ష స్వామీజీ దర్శనమ్.  ది .18.01 .14. 

విరూపాక్ష స్వామీజి  ఈ రోజు యల్లాప్రగడ ప్రభాకర్ యింటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించారు . 30 మంది శిష్య బృందం తో వచ్చారు . వారిలో చాల నిశిత పరిశీలనా పటిమ కనబడింది . అది వారి తపస్ శక్తికి నిదర్శనం గ కనబడింది . అందరిని ప్రేమ పూర్వకముగా , ఆత్మీయముగా పలుకరించారు. చక్కని సంస్కృత సంభాషణ కలిగి ఉన్నారు  , పాద పూజను సున్నితంగా కాదనుట ద్వారా తమ గురువుల పై గల భక్తీ , ప్రేమ కనబడింది . ప్రభాకర్  ను  సహస్ర గాయత్రి చేయమన్నారు  ,అందరికి ప్రేమతో ఆశీస్సులిచ్చారు .    తద్వారా ఆగ్రహారానికి మేలు జరుగుతుందని అన్నారు . గాయత్రి మాత  జపం నిజంగా ఎంతో శక్తి వంతమైనది . న గాయ త్ర్యాహ్ పరమమ్  మంత్రం   (గాయత్రీ దేవిని మించిన మంత్రం లేదని  అన్నారు మహర్షులు . నిబద్ధత, క్రమ శిక్షణ , నిర్మలత్వం . ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడే పర మాత్మ స్వరూపమ్ ఉంటుంది నిస్సందేహం గ .  నేను రామ కృష్ణ మఠం వారి ప్రచురణ గ్రంధం  మనసు అనేది ఒకటి యశ్వంతాపూర్ లో కొన్నాను. దాని సారాంశం అంతా శుద్ధ చైతన్య స్వరూపమైన మనసును కలిగిన వాడే దయామయుడై , సత్వగుణ సంపన్నుడై , ఆత్మ స్వరూపమ్ తెలిసికోగలుగు తాడని ఉన్నది.  క్రమం తప్పని అభ్యాసమే , దీని కి పునాది అవుతున్ది. దీని లో ఆత్మను దర్శించటానికి , తద్వారా నీకు , దానికి తేడా లేదని ,( సోహం, అయమాత్మా పరబ్రహ్మ)  దానికి నిరంతర ఓం కారం , లేదా యిష్ట దైవ స్మరణ గాని  దోహద పడుతుందని  పేర్కొన్నారు . నాకు ఆ గ్రంధ సారాంశమే స్వామీజీగా కనిపించారు.  


21, డిసెంబర్ 2013, శనివారం

,పొన్నె కల్లు , హై స్కూల్ కి 21.1 2.1 3.

 గుంటూరు , శ్రీ రామ మామయ్య కార్యక్రమము సందర్భము గ ,పొన్నె కల్లు  , హై స్కూల్ కి 
వెళ్ళినప్పటి చిత్రాలు . 21.1 2.1 3. 
























2, నవంబర్ 2013, శనివారం

దివ్య దీపావళి శుభాకాంక్షలు

     చెడుగు చీకట్ల నిరతంబు చీల్చివేయు             3.11.2013.

     వెలుగు రేఖలు జీవన వేల్పులనగ

    మాన వాళి కి లభియించె మహితగతిని

    దివ్యదీపావళింటింట తేజమలర .1. 

    రాక్ష సంబైన పనులకు శిక్ష నునిచి 

    రమ్య ,సౌజన్య భావాలు రాణకెక్క
  
    మహిని నరకుని నరకి మాన్య సత్య 

    కంట కంబును దొలగించె వింటి చేత 2
.
 .  దీపమన్దున శ్రీలక్ష్మి దేవి యుండి

    పాప హరణంబు గావించి పరమ పుణ్య


    హేతు వగచును ప్రజలెల్ల హేల మెలగ


    వరము లిచ్చును క్రీగంటి కరుణతోడ 3.        



బోసుదంపతులకు ఆశీస్సులు. 6.05.2026.

 జీ.బోసు గారి 49వ వత్సర వివాహ మహోత్సవము.           శీర్షిక.. మూడుముళ్ళు. సీ. జీవితమంతయున్ కష్టసుఖాలలో        ముంచితేల్చుచునుండు మూడుముళ్ళు  ...