8, సెప్టెంబర్ 2013, ఆదివారం

ప్రకృతి పురుషుల ఆరాధనే . వినాయక చతుర్థి. .

ప్రకృతి  పురుషుల ఆరాధనే . వినాయక చతుర్థి. .

ప్రకృతి పురుషులు వేరెవరో కాదు . ( ఆది దంపతు లైన
పార్వతీ పరమేశ్వరులు )
        శ్లో . వాగర్దా వివ  సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయే , 
              జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ .

ప్రకృతి, పార్వతి. పురుషుడు పరమశివుడు . ఈ సత్యాన్ని నమ్మిన వాడే మనవినాయక స్వామి. అందుకనే కుమార స్వామి కి తనకి వచ్చిన సేనా నాయకత్వఆధిపత్య పోరులో విజయం కొరకు  అతి సులువైన మార్గాన్ని తన తండ్రి అయినపరమేశ్వరుని ద్వారా తెలిసికొన్నాడు . అదే తల్లి దండ్రులకు సభక్తిక ప్రదక్షిణము.
కుమారస్వామికి తాను స్నానం చేసిన మూడు కోట్ల ఏబది లక్షల నదులలో
తన అన్నగారు ముందుగా స్నానం చేసినట్లు కనిపించాడు . దానికి కారణం
తెలియక విస్తుపోయాడు ,కుమారస్వామి. సూక్ష్మం లో మోక్షం గ తలిదండ్రులకుప్రదక్షిణం చేసి విజయం సాధించి , సర్వ సైన్యాధి పత్యాన్ని , సంపాదించాడు తెలివిగావినాయక స్వామి.  కనుక పార్వతీ పరమేశ్వరుల వంటి తలిదండ్రుల పూజ మహోన్నత మైనదనినిరూపించాడు బొజ్జ గణపతి. సమాజ శ్రేయస్సుకు  ఇంతకన్నా కావలసింది ఏముంటుంది .

     ఇక పత్రీ , పూజా ద్రవ్యాలు గురించి ఆలోచిస్తే . ఆయన కిష్టమైనది ముఖ్యం గ గరిక. దీనితో పూజిస్తే , సమస్త పూజా ద్రవ్యాలతో, పత్రులతో పూజించినట్లే .ఎక్కువ ధనం వెచ్చించకుండా సామాన్యుడుకూడాసులువుగా  పూజించే విధం గ ఏర్పాటు చేసినదే గరిక పూజ.    కాని మనం  సమస్త ఆయుర్వేద శక్తులు దాగి ఉన్న 21 పత్రాలతో పూజిస్తె ఆరోగ్య పరంగా , ఆధ్యాత్మిక పరంగా మంచిదని విజ్ఞులు చెప్పటం వలన ఆయా పత్రాలను సభక్తి కముగా సేకరించి పూజిస్తాము. ఈ విధంగా మనం నిర్మల భక్తి తో పూజ చేస్తే మన హృదయసరోవరంలోనే విహరిస్తాడుబుజ్జి  ( బొజ్జ )  గణపతి .
    ప్రతి పూజలో లౌకికము , పార లౌకికము ఉంటాయి . మట్టి తో చేసిన గణపతికి పూజ చేసి, నిమజ్జనం చేస్తే ,ప్రకృతి , ప్రకృతి లో కలసి పార లౌకికత  సిద్ధిస్తున్ది. కనుక మనమందరం అవకాశం మేరకు మృణ్మయ గణపతినేత్రికరణ శుద్ధిగా పూజ చేసి మనోభీస్టాలను సిద్ధింప జేసుకొందాము .
   శుభం భూయాత్.  సర్వే జనాః సుఖినో భవంతు .

20, ఆగస్టు 2013, మంగళవారం

"అన్నా అంటే నేనున్నా "

శ్రావణ పూర్ణిమ , జంధ్యాల పూర్ణిమ ,   రక్షాబంధన్, రాఖి.                                                                                                                                      
ఈ పేర్లన్నీ  చెల్లికి మానసిక బలాన్నిచ్చే చర్యకి ప్రతి రూపాలె. సృష్టిలో
ప్రేమ పాత్ర ఎంతో  ఎవరికీ  చెప్పనక్కరలేదు . భార్యా భర్తలు, అన్నా. చెల్లెలు. అక్కా,తమ్ముడు ఇలా ఎన్నో సంబంధాలు .
దేనికదే పవిత్రమైనది. విలువైనది. ఆ విలువలు నిలబెట్టుకోవా
లంటే కొన్నిసామాజిక  ధర్మాలు పాటించాలి . అన్నా, లేక తమ్ముని క్షేమం కోరి ఒక చెల్లి ,లేక అక్క బంధనాన్ని చేతికి కట్టడమే రక్షా బంధనం . దాని ద్వారా అన్న ,చెల్లికి అభయమిస్తాడు . మనం ముందుగా రక్తం పంచుకొని పుట్టిన వారికైనా ఇలాంటి రక్షణ కల్పించ గలిగితే ఆ తరువాత" అన్నా" అని పిలిచే ఏ చెల్లి కైనా చేయ గలుగుతాము.  అందుకే ప్రతి ఆడ పిల్ల తనకు పరిచయమైన పరాయి  పెద్ద మగ పిల్లలను అన్నా అని పిలుస్తున్ది. అది మన సంప్రదాయం . దీనిని గుర్తు చేస్తుంది మహా భారతమ్.ద్రౌపది కష్టకాలంలో కృష్ణా , అన్నా అని పిలిచి తన మానాన్ని కాపాడు కొంటుంది  . సమాజంలోని సంబంధాలు బలపడాలి , విదేశీ యులకు మనం ఆదర్శం కావాలి అంటే తప్పక కొన్ని ఉత్తమ ధర్మాలను ఆచరించాలి.   "అన్నా అంటే నేనున్నా " అనే సద్భావన కలిగిస్తూ వ్యక్తిత్వం పెంచు కోవాలి . ఆనాడే మనం అన్ని విజ్ఞాన సౌధాలు ఎక్కినట్లు . ఇవి లేకుంటే అజ్ఞాన అంధకారంలో దిగజారినట్లు . కాదంటారా .  

సత్కార్యాచరణం . సత్ఫలితాలు .

సత్కార్యాచరణం . సత్ఫలితాలు .

"చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ"  . అను సామెత అందరికి తెలిసిందే . చేసుకోవటం అనే పని మన వల్లనే జరుగుతుంది . చేసుకొనుట అనేది క్రియ.ఇది  సత్కార్యం, కావచ్చును దుష్కార్యం కావచ్చును . అలానే క్రియ (మంచి, చెడు ) గత జన్మ, లేక ప్రస్తుత జన్మలోది కావచ్చు , ఫలితాలు మాత్రం అనివార్యమ్. పనులలోకి ఆలోచన కూడా వస్తుంది . చెడ్డ, లేక మంచి ఆలోచన కూడా తగిన ఫలితాలనేఅందిస్తుంది .. కనుకనే విజ్ఞులందరూ సదాలోచనకే గొప్ప ప్రాముఖ్యత నిచ్చారు . సదాలోచన ఫలితమే సత్కార్యాచరణ . సత్కార్యాచరణ ఫలితమే సజ్జన సాంగత్యము . తద్వారా మహనీయత్వము. మనము మంచిని నమ్మి , ఆచరిస్తే , మనలను నమ్మిన వారందరూ దానిని ఆచరిస్తారు. దాని వలన సమాజంలో మంచి , మానవత్వము పెరిగి . అందరి విలువలు పెరుగుతాయి. మనము ముందుగా సాధించ వలసినది మానవతా విలువలు , ఆ తరువాత అవే దైవత్వ ప్రతిపాదితాలై రాక్షస నిర్మూలనం చేస్తాయి .  మనం సర్వే జనాః సుఖినో భవంతు అని భావించినంతకాలం రాక్షస భావాలు మనలో చోటు చేసుకొవు. మనము చేసిన ప్రతి మంచి పని ఇతరులకు కూడా మంచి ఫలితాలనిస్తే అంతకంటే మనకు కావలసినది ఏముంటుంది , అందుకే మనసును మంచి వైపే అను నిత్యం మరలిద్దామ్. దానికి మనవ శక్తి చాలకుంటే దైవశక్తి జోడించుదాం .      శుభం భూయాత్ .   

21, జూన్ 2013, శుక్రవారం

జిజ్ఞాస .

                  జిజ్ఞాసకు నిదర్శనం . డా . యల్లాప్రగడ సుబ్బారావుగారు  .





జ్ఞాతుం  ఇచ్చా జిజ్ఞాస . ఏ విషయ మైన తెలిసికోవాలనే కోరికనే జిజ్ఞాస అంటారు . వీనిలో చాలా పద్ధతులు న్నాయి .  1. మనకు మనం స్వయముగా  ఆలోచించుట .   2. గ్రంధములను చదువుట . 3.అనుభవజ్ఞులైన  వారిని  ( గురువులను ) అడుగుట . 4.  దేశ పర్యటన .   5. స్వాను భవము  ముఖ్యమైనవి.  ఈ సందర్భముగా మనము ఒక మహా కవి శ్లోకమును గుర్తు చేసికొందాము .

శ్లో .   ఆచార్యాత్  పాదమాదత్తే , పాదం  శిష్య స్వమేధయా , 
        పాదం స బ్రహ్మచారిభ్య్హ : , పాదం కాల క్రమేణ చ.

( జ్ఞానము గురువుగారి నుండి  1భాగము, శిష్యుని స్వమేధ వలన 2వ భాగము , తోడి విద్యార్థుల వలన 3వ భాగము , కాలక్రమముగా వచ్చు అనుభవముతో 4వ భాగము వస్తుంది )
                 
        ఏ విషయమైన తెలియ నంత వరకు యెంత కష్టం గ ఉంటుందో , ఆ విషయము తెలిసిన తరువాత అంత సులువు అవుతున్ది." కరతల ఆమలకం" ( చేతిలో నున్న ఉసిరిక పండు ) అవుతున్ది.  తెలిస్తే అది ఆవ గింజ , తెలియకుంటే అది అనంత పర్వతం . ప్రతి విషయము మనకు తెలియటానికి మనం నిరంతర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది .  "  కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు " అనే వాక్యం నిత్య సత్యమ్. కృషితో నాస్తి దుర్భిక్షం , జపతో నాస్తి పాతకం . 

      మన మెదడుకి పదును పెట్టి విషయాన్ని మనం కనుక్కుంటే కలిగే ఆనందం అనిర్వచనీయం , అద్భుతం . ఇది మన శక్తికి నిదర్శనం . ఉత్తమం . ఇతరుల వలన తెలిసి కొనుట ఆనంద దాయకం , ద్వితీయ శ్రేణి . విషయగ్రహణా పేక్ష లేక యుండుట అధమం .ఉత్తమ మానవుడు నిరంతరం ఉత్తమ మార్గ గామిగానే ఉండుటకు ప్రయత్నిస్తాడు . ఆతడే సమాజానికి, దేశానికి , మేలు చేయ గలుగుతాడు . మార్గ దర్శకుడు అవుతాడు . ద్వితీయ శ్రేణికి చెందిన వారు మార్గ అనుయాయులుగా అవుతారు . తృతీయ శ్రేణికి చెందినవారు  వారే అధమస్తులు గ ఉండుట వలన సమాజానికి అంతగా ఉపయోగ పడలేరు .

ఇంతటి మహత్తర జ్ఞానము వినమ్ర గుణ భూషితుల దగ్గర ఉంటే సర్వ కాల సర్వావస్థలలో మణి వలే ప్రకాసిస్తున్ది. 


13, జూన్ 2013, గురువారం

వర్ణనలు -1

వర్ణనలు

   6.  పృ :-   కళ్యాణ ప్రభాకర రావు .

         వి. :-  వేంకటేశ్వర  స్వామి స్తుతి.  పదాలు. 1. మల్లి. 2. జాజి. 3. బంతి . 4. కేతకి .  చంపక మాల వృత్తం లో.

        చం .  నిరతమహింస  " మల్లి"యగ నిత్యపు సత్యపు " జాజి " పువ్వు గా
                 పరమ సు నిగ్రహంబు రస భాసురమౌ  ఒక "బంతి "పువ్వుగా
                 నిరుపమ శౌచ  "కేతకి "ని నిశ్చల మిన్ద్రియమన్న మొల్లలున్
                 తిరుపతి వేంకటేశ్వర పదే పదమై రచియింతు మాలికన్ .

  7.    పృ :- బి. వెంకట్ .

              వి. :-  పర దేశం  వెళ్ళిన కొడుకును గురించి తల్లి ఆవేదన .

        తే . గీ. :-  పొరుగు దేశాలలో నున్న పుత్రులెల్ల
                      సౌఖ్య సంతోషముల తోడ  సాగి వచ్చి
                      విజయ విభవైక రీతి జీవింతు రింక
                      రమ్య మాతృకా ప్రేమ శ్రీ రామ రక్ష.

8.      పృ :-   డా . శ్రీమతి , మంగళగిరి ప్రమీలా దేవి .

         వి. :-  వెన్నెల పాటకు పద్యమ్.

    తే . గీ. :- కలువ చంద్రునికై రేయి కలవరించు .
                 కలల చంద్రుని  ప్రేమగా కళ ఫలించు .
                 దూరమే లేదు ప్రేమ సంసార మందు .
                 జగతి ప్రేమించు నా జన్మ సఫలమందు ..
  9.  పృ :- చంద్ర శేఖర శర్మ .

       వి. :- పర బ్రహ్మ తత్త్వమౌ  దక్షిణా మూర్తి , నాగ ఫణి శర్మ గారయి పాడితే  ?   పద్యం .

      తే . గీ. :- దక్షిణా మూర్తి యా మౌన దీక్ష వీడి
                   ధన్య రాగాల గళ మాల తాన మనగ
                   ఉపనిషద్గీత లోకమ్ము లొదుగ పాడు .
                   జ్ఞాన వైరాగ్య మవధాన జ్ఞాన మనగ .

  10. పృ :-  ఆత్రేయ శర్మ .

     
        వి. :-  లైఫ్ ఆఫ్ పై . చిత్రం లో  ఒంటరి కుర్ర వాని మనోభావ తరంగాలు .


     తే . గీ. :- ఇలకు వచ్చిన ప్రతివాని నెంచి చూడ
                  ఒంటరియె  వాడు దేవుని నంట వఱకు .
                  కరుణ ఏకాగ్ర మైన ఏకాకి ఎవరు ?
                  సాగి పై స్థాయి నందు నీ సాగరమున .


               

12, జూన్ 2013, బుధవారం

వర్ణనలు -2

వర్ణనలు - 2

1.     పృ :-  శ్రీ .కె. వి. యస్. ఆచార్య. 
  
         వి.:- కవి గురించి.  పదాలు. 1. రాగము. 2. భొగము. 3.యాగము. 4. త్యాగము. 

        ఉ.:- రాగ ముఖీనుడై రసము రంజిల చేయవలెన్ ఋషీంద్రుడై 
               భోగము సత్కవిత్వ నవ భోగము గాగ శిరంబు లూగగా 
               యాగము కావ్య ధార మహితాద్యముగా శతలోక పూజ్యమై 
               త్యాగము మూలభాగముగ సత్కృప శిష్య శిరంబు పైకనున్ , 

2. పృ :-  శ్రీ మతి .   టి . మీనా కుమారి . 

     వి. :- అమ్మను లలితతో పోలుస్తూ .  పాట . 

    లలితా హృదయమే కదా తల్లి , 
    శ్రీ కరుణా యుత సుధా కల్ప వల్లి ,
    కొడుకు గుచ్చు ముల్లయినా తల్లికి సిరి మల్లి 
    విషము చిందు వాడైనా ఆ ఎదకు పాల వెల్లి 
    ఏ అమ్మయైన అమ్మల గన్నట్టి యమ్మ . 
    ఏ అమ్మయైన కొమ్మల పై తేనె పట్టు చిమ్మిన చిరు  చెమ్మ . !! లలితా హృదయమే !!

3. పృ :-  యం . కృష్ణయ్య గౌడ్ . 

    వి. :- మద్య పాన నిషేధం . 

కం . మద్యము మానుము మానుము ,
        హృదయము మానమ్ము నిచ్చు హృదయము విచ్చున్ .
        సద్యో బలమౌ దేహము  
       విద్యయు జ్ఞానమ్ము ధన వివేకము గలుగున్ . 

4. పృ :-  శ్రీ మతి . ఆర్ . కమల గారు . 
   వి. :- విశ్వనాధ వారిని గురించి. 

  తే . గీ :-  విశ్వ నాధుండు కవి కళా విశ్వనాధ . 
               కవన సామ్రాజ్య నాధుడై గణుతి కెక్కె. 
               తన పొలాన నాటనిది విత్తన మదేది ?
               నాట పండనిడేది ధన్యాకరమ్ము . 

5. పృ :-  సురేష్ బాబు. 

     వి. :-  శివుడికి తల్లిఉండి  ఉంటే  ఆయన హాలాహల భక్షణ సమయంలో ఆమె వేదన . 

     ఆ.వె.  :-   జనని లేదుగాన సరిపోయినదిగాని 
                     తల్లడిల్లి పోవు తల్లి యున్న 
                    మార్చి మార్చి గొంతు మరి మరి తడుముచు 
                     స్పర్శ  తోడ నమృత సారమిచ్చు . 

 ఈ పద్యము చెప్పి నప్పుడు నాగ ఫణి శర్మ గారి స్పందన  వారి మాటల్లోనే . 
 " నేను అవధానాలు చేసేటప్పుడు నా మాతృ దేవత నా దగ్గఱకు వచ్చి గొంతు నొప్పిగా ఉన్నదా నాన్నా ! 
అంటూ నా గొంతు క్రింద స్పృసించేది .  వెంటనే నాకెంతో ఆనందంగా హాయిగా ఉండేది .  అదే తల్లి మనసు. 
ఎన్ని జన్మలెత్తినా తల్లి ఋణము తీర్చుకో గలమా !! 

                                                                  సశేషం .







11, జూన్ 2013, మంగళవారం

దత్తపదులు

దత్తపదులు .  (అవధానిగారికి  4 పదములిచ్చి ,   పృచ్ఛకుని కోరిక మేరకు  విషయమిచ్చి పదములకు వేరే అర్ధము వచ్చునట్లు  పద్యము చెప్పవలసినది గా  కోరడమే దీని ప్రత్యేకత . )


1. పృ :-   చి. మాడుగుల రేణుక .

   వి :-      మహా సరస్వతి  స్తుతి.

.  పదములు . 1. నాగ పల్లవి  2. శ్రావణి 3. లక్ష్మీ  సౌజన్య .4. శుక ప్రియ .

      తే .గీ.    " నాగ పల్లవి"   ఋగ్వేద నాద మొదవ .
                  " శ్రావ\ణీ "    సామ గానమై  సన్నుతింప
                   యాజుషీ     " లక్ష్మి సౌజన్య"మై   ఘటింప
                   వర    "శుకప్రియ"    వేదమై వాని కొలిచె  .

2. పృ :-  శ్రీమతి , కె. విమలా రాణి .

     వి :-  పసిడి గురించి . పదములు 1. అట్లాంటిక్ . 2. ఆర్కిటిక్ . 3. అంటార్కిటిక్ . 4. ఇంటర్ నెట్ .

      తే .గీ.   అతుల" మట్లాంటిక"ము  దాటి అట్లు మీటి
                 పసిడి పది దిక్కుల దాటి పసిమి బెంచి
                "ఆర్కి టిక్కు"ను దాటి "అంటార్కి టిక్కు "
                మించే ఇంటరు నెట్టు తా మేదినందు .

3. పృ :-  శ్రీమతి , కె. గిరిజా కుమారి .

    వి :-  భారతార్ధం . పదములు . 1. చైనా .2. జపాన్ . 3. ఇరాన్ . 4. ఇరాక్ .

  తే .గీ. ఎచటి నుం" చైన" శుభ లాభ మొంద వచ్చు
           శాంతి సు "జపాను "రక్తి తో సరళుడైన
           పో" యిరాను"న్నదింక మహోన్నత దశ
           చే"యి రాకు"న్నె దీవింప వాయుపుత్ర .

4. పృ :-  మాడుగుల శుక ప్రియ .


   వి :-  అమ్మవారి వర్ణన . పదములు . 1. హకూన . 2. మఠాట . 3. తొట్టి మాన్ .

   తే .గీ. శ్రీ  "మఠాట"వీ చరితార్ధ చిత్ర శైల
            దివ్య మంగళ సౌరభ్య దే "హకూన"
            తామరల "తొట్టిమ"న్నించు  ధన్య చింత
           వెలిగి పుంభావ వాణి లో వెలసె నిపుడు .

5.  పృ :-   ?. వి :-   అమ్మవారి వర్ణన .  శ్లోకం

      పదములు. 1. సచిన్ , 2. ధోని . 3. సెహవాగ్ . 4. లక్ష్మణ్

             శ్లో .   వ్యా"స చ్చి"న్వంతి శ్రీ కావ్య వల్లరీషు
                      వ్యర్ధ కై" స్సహవాగు"రాన్  తాన్ విధూయ
                      లక్ష్మణా గ్రజ సత్ కృపామ్ తాం విధృత్య
                      తత్త్వ మేధో నివాసినీం తాం భజామి .

6. పృ :-   ?. వి :- తెలుగును గూర్చి . పదములు . 1. తెగులు .2. తగులు . 3. పగలు . 4. పగులు.


     తే .గీ.  తెగులు   కలవారు తెలుగన్న రాగులుచుంద్రు
               తగులు   నిక భాష పై ప్రేమ తర తరములు
               పగలు    రేలును తెలుగు పై మిగులు వెలుగు
               పగులు   గుండెలు రసవార్ది పయన మందు .

   



     

బోసుదంపతులకు ఆశీస్సులు. 6.05.2026.

 జీ.బోసు గారి 49వ వత్సర వివాహ మహోత్సవము.           శీర్షిక.. మూడుముళ్ళు. సీ. జీవితమంతయున్ కష్టసుఖాలలో        ముంచితేల్చుచునుండు మూడుముళ్ళు  ...