5, మార్చి 2012, సోమవారం

భయం

భయం ...భయం ...భయం ...


మనసును బాధపెట్టే దేనిని చూచిన భయమే. సంతోషాని కి వ్యతిరేక పదమే ఈ భయం . ముఖ్యంగా ప్రతి జీవికి మరణం అంటే( మృత్యువు) భయం . మనం సహజంగా దేన్ని చూచి భయపడతామో  అదే నిరంతరం మనలను చూచి కవ్విస్తుంది. మన వెంట పడుతుంది ఆంటాడు ఒక మహా కవి . నిజమేమరి సమాజం లో కూడా అదే జరుగుతున్నది . ఎవరు    ( ధర్మ అధర్మ విచక్షణతో ) భయపడతారో వారినే ఎదుటివారు భయపెడతారు . ఎదురు తిరిగేవారిని ఎవరు భయపెట్టలేరు. ఉదాహరణకు మన వెంట ఒక శునకం వెంట పడితే ....మనం భయపడి పరుగిడితే అది వెంటపడుతుంది. అది భయపడి పరుగిడితే మనం వెంట పడతాము .

    మరి ఏసంగతి అయిన యింతే అనుకుంటే పనులు చాల సులువు అవుతవి . మన భయం మరణం గురించి కనుక మనమే దానికి ఎదురు తిరిగితే సరి. అంటే ఆధ్యాత్మకముగా మనసును ధైర్యం చేస్తే మరణం అంటే భయం ఉండదు. యిది ఏనాటికైనా నిత్య సత్యము. కనుక  ఒంటరిదానినని మనసు భావించకుండా దానికి ఏదో ఒక దైవ శక్తిని జోడిస్తే అది ధైర్యం పుంజుకొని మరణాన్ని సైతం జయిస్తుంది. వేదాంతం కాదిది నిజంగా నిజం.  

1, మార్చి 2012, గురువారం

వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః ...

వృక్షములను మనము రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి. అవి  నిస్వార్థ జీవులు. త్యాగ జీవులు. మన మనుగడ, శ్వాస పైనే ఆధారపడి 
యున్నది. అలాంటి శ్వాసను ( ఆక్సిజన్ ) ప్రతి ఫలాపేక్ష లేకనే  యిచ్చి వాటి త్యాగమయ జీవితాన్ని రుజువు చేసుకొంటున్నాయి వృక్షాలు. అందుకనే ఒక మహాకవి , 

           పరోపకారాయ వహంతి నద్యః , పరోపకారాయ  దుహన్తి గావః ,
           పరోపకారాయ  ఫలంతి వృక్షః . పరోపకారార్థం  యిదం శరీరం.

(పరోపకారం కొరకే నదులు , ఆవులు , వృక్షాలు , మహాత్ములు .పాటు పడుతున్నారు ) అన్నాడు . మహాత్ములావిధం గానే ఉంటారు. వారు  మేలు చేసి మరచి పోతారు. వారిని  మరచి పోయినచొ  వారిపట్ల మనం కృతఘ్నులమే .  కొందరు చెట్టంత పెరుగుతారు కాని చెట్టుకున్నంత  జ్ఞానాన్ని , త్యాగ గుణమును   పొందలేరు. 
అది వారి వారి జన్మ సంస్కారం. అంతేకదా మరి.మనందరం అలా కాకుండా ఉందామా . 

29, ఫిబ్రవరి 2012, బుధవారం

చిరునవ్వు

చిరునవ్వు  ...చిరునవ్వు , 

నవ్వులన్నిటిలో ఆకర్షణీయ మైనది. నవ్వులలో చాలా రకాలున్నాయి. హాసము, మంద హాసము, వికటాట్ట హాసము. హాసము అంటే దంతములు కనబడేటట్లు , నవ్వటం . మంద హాసమంటే దంతములు కూడా కనబడ కుండా నవ్వటము.యిదే చిరునవ్వు . శరీరమంతా చలించే టట్లు  నవ్వ టము .మన సాహిత్య లోకంలో నవ్వు నాలుగందాల చేటు అంటారు . దీనికి కారణం రామాయణంలో రామ పట్టాభిషేక  సమయానలక్ష్మన స్వామి , నవ్వటం . ( లక్ష్మణుడు తన పదునాలుగేండ్ల రామసేవా సమయంలో రాని నిద్రాదేవత యిప్పుడు ,పట్టాభి షేక  సమయంలో వచ్చిందనే భావనతో నవ్వాడు .,) అది అందరికి అన్యార్థం తోచి మనసులలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసారు . మంద హాసం చేసి ఉంటె అలాంటి భావం వచ్చేదే  కాదేమో . కనుక మనం మంద హాసం (చిరునవ్వు ) చేయటం ఎంతైనా మంచిది . నవ్వు నాలుగందాల అనర్థం అంటే, వికటాట్ట హాసం విపరీతార్థం యిస్తుంది. అందుకే నవ్వాలి , కానీ పరిధి దాట కుండా. నవ్వటం, యోగం, నవ్వలేక పోవటం రోగం , నవ్వించడం భోగం .

22, ఫిబ్రవరి 2012, బుధవారం

వాక్ శుద్ధి

వాక్  శుద్ధి . 


భావనా పటిమ కలవాడే వాక్ శుద్ధి కలవాడు. భావానికి ప్రేరణ మనస్సు . త్రికరణ శుద్దులలో మనసు మొదటిది .  రెండవది వాక్కు  ,మూడవది కాయము . స్వచ్చమైన ఆలోచన సరళి , అంతే స్వచ్ఛతతో అలోచిన్చినదే 
వాక్కు రూపంలో వెలువరించడం , ఏ రెండిటికి సమాన   స్థాయిలో శరీరంతో పని చేయించడం . ఈ మూడింటి సమన్వయమే త్రికరణ శుద్ధి అనవచ్చును . త్రికరణ శుద్ధి కలిగి ఉండటమే దైవత్వము. సత్యవచనాన్ని పన్నెండు సంవత్సరాలు  విధి గ పాటిస్తే దైవత్వం వస్తుందని ఆర్యోక్తి . మరి నిరంతరం సత్య వాక్ పాలనా నియమం ఉంటె వారు దైవమే. దైవం అంటే ఆనంద నిలయం . అలాంటప్పుడు త్రికరణ శుద్ధితో ఆనంద నిలయ ప్రవేశ అర్హత సాధించటానికి ఎందుకు కృషి చేయ కూడదు ? అందరికి ఆనందం కావాలి . ప్రవేశ అర్హత కావాలి . అందుకే అందరం ప్రయత్నిద్దాం. రండి .

1, ఫిబ్రవరి 2012, బుధవారం

పరిశీలించడం ,

చూడటం , వీక్షించడం , పరికించడం , పరిశీలించడం , 

ఈ నాలుగు పదాలు  భిన్నమైన అర్ధాలు కలిగి ఉంటాయి .

చూడటం ..... ఏ ఆలోచన లేక కన్నులకు మాత్రమే పని అప్పచెప్పటం .

వీక్షించడం ...కన్నులకు , బుద్ధి కి , మాత్రమె పని అప్పచెప్పటం .

పరికించడం . కన్నులకు ,బుద్దికి ,మనస్సుకి ,మాత్రమే పని చెప్పటం .

పరిశీలించటం  ..కన్నులకు ,మనస్సుకు , అంతరాత్మకు , సాక్షిగా ,
                           ఆలొచనాసహితంగా  స్పందించడం
వస్తువులను , చూస్తే సరిపోతుంది .ప్రకృతిని వీక్షిస్తే సరిపోతుంది . లౌకిక
విషయాలను పరికిస్తే సరిపోతుంది . కాని పార లౌకిక విషయాలను
పరిశీలించినా, ఒక పట్టాన అర్థం కావు.
వానిని సద్గురు ముఖముగా మాత్రమే అధ్యయనం చేయాలి . అప్పుడు కూడావారి వారి పూర్వ జన్మ పుణ్య ఫలం గ ఆద్యాత్మిక విషయాలు అబ్బుతాయి .

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...