20, ఆగస్టు 2013, మంగళవారం

"అన్నా అంటే నేనున్నా "

శ్రావణ పూర్ణిమ , జంధ్యాల పూర్ణిమ ,   రక్షాబంధన్, రాఖి.                                                                                                                                      
ఈ పేర్లన్నీ  చెల్లికి మానసిక బలాన్నిచ్చే చర్యకి ప్రతి రూపాలె. సృష్టిలో
ప్రేమ పాత్ర ఎంతో  ఎవరికీ  చెప్పనక్కరలేదు . భార్యా భర్తలు, అన్నా. చెల్లెలు. అక్కా,తమ్ముడు ఇలా ఎన్నో సంబంధాలు .
దేనికదే పవిత్రమైనది. విలువైనది. ఆ విలువలు నిలబెట్టుకోవా
లంటే కొన్నిసామాజిక  ధర్మాలు పాటించాలి . అన్నా, లేక తమ్ముని క్షేమం కోరి ఒక చెల్లి ,లేక అక్క బంధనాన్ని చేతికి కట్టడమే రక్షా బంధనం . దాని ద్వారా అన్న ,చెల్లికి అభయమిస్తాడు . మనం ముందుగా రక్తం పంచుకొని పుట్టిన వారికైనా ఇలాంటి రక్షణ కల్పించ గలిగితే ఆ తరువాత" అన్నా" అని పిలిచే ఏ చెల్లి కైనా చేయ గలుగుతాము.  అందుకే ప్రతి ఆడ పిల్ల తనకు పరిచయమైన పరాయి  పెద్ద మగ పిల్లలను అన్నా అని పిలుస్తున్ది. అది మన సంప్రదాయం . దీనిని గుర్తు చేస్తుంది మహా భారతమ్.ద్రౌపది కష్టకాలంలో కృష్ణా , అన్నా అని పిలిచి తన మానాన్ని కాపాడు కొంటుంది  . సమాజంలోని సంబంధాలు బలపడాలి , విదేశీ యులకు మనం ఆదర్శం కావాలి అంటే తప్పక కొన్ని ఉత్తమ ధర్మాలను ఆచరించాలి.   "అన్నా అంటే నేనున్నా " అనే సద్భావన కలిగిస్తూ వ్యక్తిత్వం పెంచు కోవాలి . ఆనాడే మనం అన్ని విజ్ఞాన సౌధాలు ఎక్కినట్లు . ఇవి లేకుంటే అజ్ఞాన అంధకారంలో దిగజారినట్లు . కాదంటారా .  

సత్కార్యాచరణం . సత్ఫలితాలు .

సత్కార్యాచరణం . సత్ఫలితాలు .

"చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ"  . అను సామెత అందరికి తెలిసిందే . చేసుకోవటం అనే పని మన వల్లనే జరుగుతుంది . చేసుకొనుట అనేది క్రియ.ఇది  సత్కార్యం, కావచ్చును దుష్కార్యం కావచ్చును . అలానే క్రియ (మంచి, చెడు ) గత జన్మ, లేక ప్రస్తుత జన్మలోది కావచ్చు , ఫలితాలు మాత్రం అనివార్యమ్. పనులలోకి ఆలోచన కూడా వస్తుంది . చెడ్డ, లేక మంచి ఆలోచన కూడా తగిన ఫలితాలనేఅందిస్తుంది .. కనుకనే విజ్ఞులందరూ సదాలోచనకే గొప్ప ప్రాముఖ్యత నిచ్చారు . సదాలోచన ఫలితమే సత్కార్యాచరణ . సత్కార్యాచరణ ఫలితమే సజ్జన సాంగత్యము . తద్వారా మహనీయత్వము. మనము మంచిని నమ్మి , ఆచరిస్తే , మనలను నమ్మిన వారందరూ దానిని ఆచరిస్తారు. దాని వలన సమాజంలో మంచి , మానవత్వము పెరిగి . అందరి విలువలు పెరుగుతాయి. మనము ముందుగా సాధించ వలసినది మానవతా విలువలు , ఆ తరువాత అవే దైవత్వ ప్రతిపాదితాలై రాక్షస నిర్మూలనం చేస్తాయి .  మనం సర్వే జనాః సుఖినో భవంతు అని భావించినంతకాలం రాక్షస భావాలు మనలో చోటు చేసుకొవు. మనము చేసిన ప్రతి మంచి పని ఇతరులకు కూడా మంచి ఫలితాలనిస్తే అంతకంటే మనకు కావలసినది ఏముంటుంది , అందుకే మనసును మంచి వైపే అను నిత్యం మరలిద్దామ్. దానికి మనవ శక్తి చాలకుంటే దైవశక్తి జోడించుదాం .      శుభం భూయాత్ .   

21, జూన్ 2013, శుక్రవారం

జిజ్ఞాస .

                  జిజ్ఞాసకు నిదర్శనం . డా . యల్లాప్రగడ సుబ్బారావుగారు  .





జ్ఞాతుం  ఇచ్చా జిజ్ఞాస . ఏ విషయ మైన తెలిసికోవాలనే కోరికనే జిజ్ఞాస అంటారు . వీనిలో చాలా పద్ధతులు న్నాయి .  1. మనకు మనం స్వయముగా  ఆలోచించుట .   2. గ్రంధములను చదువుట . 3.అనుభవజ్ఞులైన  వారిని  ( గురువులను ) అడుగుట . 4.  దేశ పర్యటన .   5. స్వాను భవము  ముఖ్యమైనవి.  ఈ సందర్భముగా మనము ఒక మహా కవి శ్లోకమును గుర్తు చేసికొందాము .

శ్లో .   ఆచార్యాత్  పాదమాదత్తే , పాదం  శిష్య స్వమేధయా , 
        పాదం స బ్రహ్మచారిభ్య్హ : , పాదం కాల క్రమేణ చ.

( జ్ఞానము గురువుగారి నుండి  1భాగము, శిష్యుని స్వమేధ వలన 2వ భాగము , తోడి విద్యార్థుల వలన 3వ భాగము , కాలక్రమముగా వచ్చు అనుభవముతో 4వ భాగము వస్తుంది )
                 
        ఏ విషయమైన తెలియ నంత వరకు యెంత కష్టం గ ఉంటుందో , ఆ విషయము తెలిసిన తరువాత అంత సులువు అవుతున్ది." కరతల ఆమలకం" ( చేతిలో నున్న ఉసిరిక పండు ) అవుతున్ది.  తెలిస్తే అది ఆవ గింజ , తెలియకుంటే అది అనంత పర్వతం . ప్రతి విషయము మనకు తెలియటానికి మనం నిరంతర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది .  "  కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు " అనే వాక్యం నిత్య సత్యమ్. కృషితో నాస్తి దుర్భిక్షం , జపతో నాస్తి పాతకం . 

      మన మెదడుకి పదును పెట్టి విషయాన్ని మనం కనుక్కుంటే కలిగే ఆనందం అనిర్వచనీయం , అద్భుతం . ఇది మన శక్తికి నిదర్శనం . ఉత్తమం . ఇతరుల వలన తెలిసి కొనుట ఆనంద దాయకం , ద్వితీయ శ్రేణి . విషయగ్రహణా పేక్ష లేక యుండుట అధమం .ఉత్తమ మానవుడు నిరంతరం ఉత్తమ మార్గ గామిగానే ఉండుటకు ప్రయత్నిస్తాడు . ఆతడే సమాజానికి, దేశానికి , మేలు చేయ గలుగుతాడు . మార్గ దర్శకుడు అవుతాడు . ద్వితీయ శ్రేణికి చెందిన వారు మార్గ అనుయాయులుగా అవుతారు . తృతీయ శ్రేణికి చెందినవారు  వారే అధమస్తులు గ ఉండుట వలన సమాజానికి అంతగా ఉపయోగ పడలేరు .

ఇంతటి మహత్తర జ్ఞానము వినమ్ర గుణ భూషితుల దగ్గర ఉంటే సర్వ కాల సర్వావస్థలలో మణి వలే ప్రకాసిస్తున్ది. 


13, జూన్ 2013, గురువారం

వర్ణనలు -1

వర్ణనలు

   6.  పృ :-   కళ్యాణ ప్రభాకర రావు .

         వి. :-  వేంకటేశ్వర  స్వామి స్తుతి.  పదాలు. 1. మల్లి. 2. జాజి. 3. బంతి . 4. కేతకి .  చంపక మాల వృత్తం లో.

        చం .  నిరతమహింస  " మల్లి"యగ నిత్యపు సత్యపు " జాజి " పువ్వు గా
                 పరమ సు నిగ్రహంబు రస భాసురమౌ  ఒక "బంతి "పువ్వుగా
                 నిరుపమ శౌచ  "కేతకి "ని నిశ్చల మిన్ద్రియమన్న మొల్లలున్
                 తిరుపతి వేంకటేశ్వర పదే పదమై రచియింతు మాలికన్ .

  7.    పృ :- బి. వెంకట్ .

              వి. :-  పర దేశం  వెళ్ళిన కొడుకును గురించి తల్లి ఆవేదన .

        తే . గీ. :-  పొరుగు దేశాలలో నున్న పుత్రులెల్ల
                      సౌఖ్య సంతోషముల తోడ  సాగి వచ్చి
                      విజయ విభవైక రీతి జీవింతు రింక
                      రమ్య మాతృకా ప్రేమ శ్రీ రామ రక్ష.

8.      పృ :-   డా . శ్రీమతి , మంగళగిరి ప్రమీలా దేవి .

         వి. :-  వెన్నెల పాటకు పద్యమ్.

    తే . గీ. :- కలువ చంద్రునికై రేయి కలవరించు .
                 కలల చంద్రుని  ప్రేమగా కళ ఫలించు .
                 దూరమే లేదు ప్రేమ సంసార మందు .
                 జగతి ప్రేమించు నా జన్మ సఫలమందు ..
  9.  పృ :- చంద్ర శేఖర శర్మ .

       వి. :- పర బ్రహ్మ తత్త్వమౌ  దక్షిణా మూర్తి , నాగ ఫణి శర్మ గారయి పాడితే  ?   పద్యం .

      తే . గీ. :- దక్షిణా మూర్తి యా మౌన దీక్ష వీడి
                   ధన్య రాగాల గళ మాల తాన మనగ
                   ఉపనిషద్గీత లోకమ్ము లొదుగ పాడు .
                   జ్ఞాన వైరాగ్య మవధాన జ్ఞాన మనగ .

  10. పృ :-  ఆత్రేయ శర్మ .

     
        వి. :-  లైఫ్ ఆఫ్ పై . చిత్రం లో  ఒంటరి కుర్ర వాని మనోభావ తరంగాలు .


     తే . గీ. :- ఇలకు వచ్చిన ప్రతివాని నెంచి చూడ
                  ఒంటరియె  వాడు దేవుని నంట వఱకు .
                  కరుణ ఏకాగ్ర మైన ఏకాకి ఎవరు ?
                  సాగి పై స్థాయి నందు నీ సాగరమున .


               

12, జూన్ 2013, బుధవారం

వర్ణనలు -2

వర్ణనలు - 2

1.     పృ :-  శ్రీ .కె. వి. యస్. ఆచార్య. 
  
         వి.:- కవి గురించి.  పదాలు. 1. రాగము. 2. భొగము. 3.యాగము. 4. త్యాగము. 

        ఉ.:- రాగ ముఖీనుడై రసము రంజిల చేయవలెన్ ఋషీంద్రుడై 
               భోగము సత్కవిత్వ నవ భోగము గాగ శిరంబు లూగగా 
               యాగము కావ్య ధార మహితాద్యముగా శతలోక పూజ్యమై 
               త్యాగము మూలభాగముగ సత్కృప శిష్య శిరంబు పైకనున్ , 

2. పృ :-  శ్రీ మతి .   టి . మీనా కుమారి . 

     వి. :- అమ్మను లలితతో పోలుస్తూ .  పాట . 

    లలితా హృదయమే కదా తల్లి , 
    శ్రీ కరుణా యుత సుధా కల్ప వల్లి ,
    కొడుకు గుచ్చు ముల్లయినా తల్లికి సిరి మల్లి 
    విషము చిందు వాడైనా ఆ ఎదకు పాల వెల్లి 
    ఏ అమ్మయైన అమ్మల గన్నట్టి యమ్మ . 
    ఏ అమ్మయైన కొమ్మల పై తేనె పట్టు చిమ్మిన చిరు  చెమ్మ . !! లలితా హృదయమే !!

3. పృ :-  యం . కృష్ణయ్య గౌడ్ . 

    వి. :- మద్య పాన నిషేధం . 

కం . మద్యము మానుము మానుము ,
        హృదయము మానమ్ము నిచ్చు హృదయము విచ్చున్ .
        సద్యో బలమౌ దేహము  
       విద్యయు జ్ఞానమ్ము ధన వివేకము గలుగున్ . 

4. పృ :-  శ్రీ మతి . ఆర్ . కమల గారు . 
   వి. :- విశ్వనాధ వారిని గురించి. 

  తే . గీ :-  విశ్వ నాధుండు కవి కళా విశ్వనాధ . 
               కవన సామ్రాజ్య నాధుడై గణుతి కెక్కె. 
               తన పొలాన నాటనిది విత్తన మదేది ?
               నాట పండనిడేది ధన్యాకరమ్ము . 

5. పృ :-  సురేష్ బాబు. 

     వి. :-  శివుడికి తల్లిఉండి  ఉంటే  ఆయన హాలాహల భక్షణ సమయంలో ఆమె వేదన . 

     ఆ.వె.  :-   జనని లేదుగాన సరిపోయినదిగాని 
                     తల్లడిల్లి పోవు తల్లి యున్న 
                    మార్చి మార్చి గొంతు మరి మరి తడుముచు 
                     స్పర్శ  తోడ నమృత సారమిచ్చు . 

 ఈ పద్యము చెప్పి నప్పుడు నాగ ఫణి శర్మ గారి స్పందన  వారి మాటల్లోనే . 
 " నేను అవధానాలు చేసేటప్పుడు నా మాతృ దేవత నా దగ్గఱకు వచ్చి గొంతు నొప్పిగా ఉన్నదా నాన్నా ! 
అంటూ నా గొంతు క్రింద స్పృసించేది .  వెంటనే నాకెంతో ఆనందంగా హాయిగా ఉండేది .  అదే తల్లి మనసు. 
ఎన్ని జన్మలెత్తినా తల్లి ఋణము తీర్చుకో గలమా !! 

                                                                  సశేషం .







11, జూన్ 2013, మంగళవారం

దత్తపదులు

దత్తపదులు .  (అవధానిగారికి  4 పదములిచ్చి ,   పృచ్ఛకుని కోరిక మేరకు  విషయమిచ్చి పదములకు వేరే అర్ధము వచ్చునట్లు  పద్యము చెప్పవలసినది గా  కోరడమే దీని ప్రత్యేకత . )


1. పృ :-   చి. మాడుగుల రేణుక .

   వి :-      మహా సరస్వతి  స్తుతి.

.  పదములు . 1. నాగ పల్లవి  2. శ్రావణి 3. లక్ష్మీ  సౌజన్య .4. శుక ప్రియ .

      తే .గీ.    " నాగ పల్లవి"   ఋగ్వేద నాద మొదవ .
                  " శ్రావ\ణీ "    సామ గానమై  సన్నుతింప
                   యాజుషీ     " లక్ష్మి సౌజన్య"మై   ఘటింప
                   వర    "శుకప్రియ"    వేదమై వాని కొలిచె  .

2. పృ :-  శ్రీమతి , కె. విమలా రాణి .

     వి :-  పసిడి గురించి . పదములు 1. అట్లాంటిక్ . 2. ఆర్కిటిక్ . 3. అంటార్కిటిక్ . 4. ఇంటర్ నెట్ .

      తే .గీ.   అతుల" మట్లాంటిక"ము  దాటి అట్లు మీటి
                 పసిడి పది దిక్కుల దాటి పసిమి బెంచి
                "ఆర్కి టిక్కు"ను దాటి "అంటార్కి టిక్కు "
                మించే ఇంటరు నెట్టు తా మేదినందు .

3. పృ :-  శ్రీమతి , కె. గిరిజా కుమారి .

    వి :-  భారతార్ధం . పదములు . 1. చైనా .2. జపాన్ . 3. ఇరాన్ . 4. ఇరాక్ .

  తే .గీ. ఎచటి నుం" చైన" శుభ లాభ మొంద వచ్చు
           శాంతి సు "జపాను "రక్తి తో సరళుడైన
           పో" యిరాను"న్నదింక మహోన్నత దశ
           చే"యి రాకు"న్నె దీవింప వాయుపుత్ర .

4. పృ :-  మాడుగుల శుక ప్రియ .


   వి :-  అమ్మవారి వర్ణన . పదములు . 1. హకూన . 2. మఠాట . 3. తొట్టి మాన్ .

   తే .గీ. శ్రీ  "మఠాట"వీ చరితార్ధ చిత్ర శైల
            దివ్య మంగళ సౌరభ్య దే "హకూన"
            తామరల "తొట్టిమ"న్నించు  ధన్య చింత
           వెలిగి పుంభావ వాణి లో వెలసె నిపుడు .

5.  పృ :-   ?. వి :-   అమ్మవారి వర్ణన .  శ్లోకం

      పదములు. 1. సచిన్ , 2. ధోని . 3. సెహవాగ్ . 4. లక్ష్మణ్

             శ్లో .   వ్యా"స చ్చి"న్వంతి శ్రీ కావ్య వల్లరీషు
                      వ్యర్ధ కై" స్సహవాగు"రాన్  తాన్ విధూయ
                      లక్ష్మణా గ్రజ సత్ కృపామ్ తాం విధృత్య
                      తత్త్వ మేధో నివాసినీం తాం భజామి .

6. పృ :-   ?. వి :- తెలుగును గూర్చి . పదములు . 1. తెగులు .2. తగులు . 3. పగలు . 4. పగులు.


     తే .గీ.  తెగులు   కలవారు తెలుగన్న రాగులుచుంద్రు
               తగులు   నిక భాష పై ప్రేమ తర తరములు
               పగలు    రేలును తెలుగు పై మిగులు వెలుగు
               పగులు   గుండెలు రసవార్ది పయన మందు .

   



     

10, జూన్ 2013, సోమవారం

నిషిద్ధాక్షరి - 1

నిషిద్ధాక్షరి. 1.      31. 05. 13.

1. పృచ్చకులు . పొన్నెకంటి  సూర్య నారాయణ రావు . 

విషయము :-వేద గాయత్రీ అగ్రహారమునకు ఆశీ స్సులు (  సర్వ లఘు కందము  , చివరి గణం లో గురువు రావచ్చు )

            కం . వరములు సిరియయి వెసవెస 
                   సరస ముఖ మనగ జల జల జనముల కొలుపన్ 
                   వర వేదమైన గాయ 
                   త్రి  రమా హితమై సహస్ర రీతుల బ్రోచున్ . 

2.  పృచ్చకులు:- శివశ్రీ శర్మ . 

విషయము :- కాళి  , లక్ష్మి , వాణి . పదములను వాడకుండ  అమ్మవారి వర్ణన . 

   శ్లో .  ఐశ్వర్యామృత వర్షిణీ , మహానందాను సంధాయినీ , 
          వాచీ శ్రీ మధురాత్త ధారిణి , జగజ్జే తృత్వ సంపాదినీ ,
         పద్మాలంబిత నిత్య గేహిని , సదా పద్మాక్ష హృద్వాసినీ , 
         దేవీం త్వాం చ సరస్వతీం , హృది భజే గౌరీం ,రమామ్  సర్వదామ్ . !

3. పృచ్చకులు:- డా . అమళ్ళ దిన్నె వెంకట రమణ ప్రసాద్ . 

 విషయము :- నాగఫణి శర్మ గారి తండ్రిగారిని ( నాగభూషణ శర్మ ) గురించి 

కం .              ఆనందమతియు దాతయు 
                    తానై,  శివుడై,  భజింతు తత్త్వ విదుండై ,
                    ఆ  నాగభూష ణు,  సుశీ
                    లా నుత సఫలైక జన్ము ప్రణుతింతు  మదిన్ . 
4. పృచ్చకులు:- మావుడూరి  సూర్య నారాయణ మూర్తి . 

విషయము :- అ, ప, వర్గ నిషిద్ధం గ .  

కం .             ఆవృత్తి రహిత సుస్థితి
                    ఏ వృత్తుల నున్నవా రికేనిన్ కలుగున్
                   జీవుల కైశ్వర్యములై 
                   తానై నెలకొను నితాంత తాత్విక కళ లై .    

5. పృచ్చకులు:- సత్య ప్రసాద్ గారు . 

విషయము :- తిరుపతి వేంకటేశ్వరుని నిత్య పెండ్లి కొడుకుగా 

కం .            మంగాధీశా ! జనహిత 
                  అంగాంగా నందన రూఢ అక్షత సుఖ లీ 
                  లంగా !కల్యాణ  విభవ
                  మంగళ శ్రీ శ్రీ నివాస మాగోవిందా .                                                                                                                                   
6. పృచ్చకులు:- మాన్య శ్రీ  వసంత గాడ్గిల్ గారు .( హస్తిన నుండి వచ్చిన గొప్ప సంస్కృత పండితులు )

విషయము :-భారతే పాతు  భారతీ  ( ప కార నిషిద్ధం )

శ్లొ.  శ్రీ భారతేషు వసతాం జన మానసేషు ,
      సంస్కార దివ్య విభవా విదధాతు వాణీం 
     మాంగల్య మేవ సతతం బహు లోక రుచ్యమ్ . 

7.  పృచ్చకులు:-  డా . బలదేవానంద సాగరః ( హస్తిన ఆకాశవాణి లో సంస్కృత వార్తలను చిరకాలము గ       చదువుచున్నవారు )

శ్లో .  సిద్ధ్యంతి సర్వ కార్యాణి ,యస్యైవం మతిరన్వహం ,
       శివే శివార్చనే ప్రీతా , ధర్మార్దౌ కామ మోక్షదౌ 
      ధర్మార్ధ కామ మోక్షాశ్చ  యిహంతు  పరయేవ చ 
      యస్య దేవీ వశం చిత్తం తస్య భాన్తి సుసాన్తితః   . 

8. పృచ్చకులు:- ఆర్ . అనంత పద్మ నాభరావు గారు . ( అసిస్టెంట్ డైరెక్టర్ , ఆకాశవాణి , హైదరాబాద్ )

విషయము :- పుత్ర మమకారం  .  ( మ కార నిషిద్ధం )

కం .            కొడుకుపయి ప్రీతి ధారలు ,
                   అడుగడుగున కురియుచుండు నయ్యది సబబే 
                  కొడుకనిన సుశీలామ్బకు 
                  ఎడదను కడు తీపి హెచ్చు  నేను నుతింతున్ .  
                                                                                                                                    సశేషం .                                                                                                                                              



         

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...