6, జూన్ 2015, శనివారం

కృషితో నాస్తి.

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం.   నిరంతరం కృషి చేసే వారికి ఏనాడు దరిద్రము ఉండదు. తపో ధనులకు పాపముండదు.
                 కృషి అనే పదానికి , వ్యవ సాయము,  పని , ప్రయత్నం  అని అర్ధాలు న్నవి . వ్యవ సాయం చేసే , వ్యవసాయ దారునకు , నెల్లపుడు ఏదో ఒక పని ఉంటుంది .దాని వలన అతనికి ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ఆదాయం ఉంటుంది .ఆదాయం ఉన్నప్పుడు దరిద్రానికి తావులేదు . అలానే తపస్సు చేసే తాపసికి పాపముండదు .                నిరంతరం కృషి చేయటం వలన ( ఏపని లో మనకు నైపుణ్యం కావాలో దానిని ) ఆ పనిలో ప్రత్యక నైపుణ్యం వస్తుంది . దీనినే ఆంగ్లం లో  వర్క్ యక్స్పీరియన్స్ అంటారు . పని అనుభవం  లేకుంటే , ప్రతి పని లోను మనం రాణించ లేము . మన మనసు చాల విచిత్రమైనది. పాపం దానిని ఎలా అలవాటు చేస్తే అలా పని చేస్తుంది .ఈ సమయానికే మనం అన్నం తినాలని నిర్ణ యించుకొంటే , మన మనసు ఆ సమయానికే ఆకలి కలిగించేటట్లు ఆజ్ఞలు జారి చేస్తుంది . . అలానే ఒక వాహనం నడపాలంటే దానిని ప్రతి రోజు ఉపయోగించి తీరాల్సిన్దె. కన్నులు , చేతులు , కాళ్ళు , అప్రయత్నంగా వాటి పని అవి నైపుణ్యంగా చేసికోనేవరకు వదలకూడదు .
                                                        పని .పొరపాట్లు
             పని చేస్తేనే మనం ఏ పోరపాటు చేశామో , ఎక్కడ చేసామో తెలుస్తున్ది.  పని చేయక పొతే మనకు పొరపాటు ఏమిటో తెలియదు. అయితే తెలివి గల వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే , చేసిన పొరపాటే మరల చేయ కుండుట అంటే క్రొత్తవి చేయమని కాదు. తినగా తినగా వేము తియ్యనుండు . అనగా యెంత కష్టమైన పని అయినా సులువు అవుతుంది  ఏపని అయిన సాధనము చేతనే సులభ సాధ్యమౌతుంది . ఇది నిత్య సత్యమ్.
         

5, మే 2015, మంగళవారం

కలలు నిజమవుతాయా . 5.05 2015.

                                కలలు నిజమవుతాయా . 5.05  2015. 

   నా అనుభవం అవుతాయనే రుజువు చేసింది. నాకు కలిగిన అను భవాన్ని బట్టి చూస్తె ముఖ్యంగా తెల్లవారు జామున 4.,5. గంటల మధ్యన వచ్చిన ప్రతి కల , 99% నిజముగా అవుతున్ది. ఈ విషయం రుజువు చేసుకొని చూచాను . ఇదే  విషయం రామాయణం  కుడా  చెబుతున్నది. దాని రుజువే త్రిజటా స్వప్నము . లంక నాశన మయినట్లు , తనకు తెల్ల వారు జామున కల వచ్చిందని తోటి రాక్షసులకు చెబుతుంది . ఇలానే దశరధుడు మరణించిన తరువాత భరతుడు అయోధ్యకు రాబోయేముందు తనకు తండ్రిని గురించి అమంగ ళ కరమైన కల వచ్చిందని చెబుతాడు .. కాని  చిత్ర మేమిటంటే దానిని మనం పూర్తిగా నిరోధించలేము . దుస్స్వప్న నివారణ కొరకు వెంటనే లేచి భగవన్నామం చేసుకొంటూ కాళ్ళు చేతులు  కడుగుకొని మరల నిద్రిమ్చాలి . అప్పుడు కొంత ప్రమాదం తప్పుతుంది . 

4, మే 2015, సోమవారం

సుసర్ల భవానీ ప్రసాద్, వేమవరపు లలిత షష్టి పూర్తి పద్యాలు.


  చిరంజీవి సుసర్ల భవానీ ప్రసాద్ షష్టి పూర్తి  ఉత్సవ సందర్బముగా                                         ఆశీస్సులు . 10.. 05 . 2015.



22, ఏప్రిల్ 2015, బుధవారం

త్రాగి త్రాగించాలి.

  త్రాగి త్రాగించాలి . పలికి పలికించాలి .( సూర్య శ్రీరామమ్ )

 'పిబరే రామ రసమ్:"   అన్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి  వారు .వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం వ్రాసి దానిని అమృత కలశం గా చేసి అపురూపంగా అందరికి అందకుండా చేశారు.ఆ అమృతం ఆస్వాదిమ్చాలంటే సంస్కృత పాండిత్యం కావాలి మరి ఆ భాష రాని వారి స్థితి ఏమిటి . అమృతం వారికి అవసరం లేదా . దీనికి సమాధానంగా ఎందరో మహానుభావులు తెలుగులో పద్య, గద్య, చంపు , కీర్తన , అను అనేక రీతులలో మకరందాన్ని వారనుభవించి సామాన్యులకును అనుభవింప జేశారు . అమృతం ఎవరు  త్రాగితే ఆ రుచి వారికే తెలుస్తుంది . అందుకే నేను ముందు త్రాగి , నా శిష్యులచే , సాహితీ మిత్రులచే , హితులచే , సన్నిహితులచే  రామామృతం త్రాగిమ్చాలని , ఆశించాను . అమృత భాండమును వంచి కొన్ని బిందువులను త్రాగి , జీర్ణించుకొని , తెలుగు పలుకులలో , కొంత తేట పరచి , పంచి , ఆనందించాలనే నా తపన . తిక్కన గారు  " మధుర పదార్ధాన్ని , ఒంటరిగా తినరాదు, త్రాగరాదు. అడవులలో ఒంటరిగా నడువరాడు " అని చెప్పారు . అందుకే నేను మహర్షి పదములను , పాదములను  ఆశ్రయించి , అనుకరించి , అనుసరించి , నా జన్మ ధన్యమగునట్లు చేసుకొంటున్నాను . అందుకు కరదీపికలుగా  , మాన్యులు , డా, యం. కృష్ణమాచార్యులు గారు, డా. గోలి వెంకట రామయ్య గారు వ్రాసిన అనువాద గ్రంధము ఉన్నది  . వారికి నా కృతఙ్ఞతలు . వారి ఆశీస్సులతో కొన్ని తెలుగు పలుకులు పలికి , మాతృభాషాభిమానాన్ని చాటుకుందామని అనుకొంటున్నాను .  " బాణోచ్చిస్టం  జగత్ సర్వమ్ " అన్నారు పెద్దలు . ఈ రామ రసాన్ని (క్లాసులలో ) గ్లాసులలో పోసి అందరికి అందించాలని నా కోరిక.
   తొలి తెలుగు తొక్కు పలుకులను నాచే ముందుగ పలికించిన నా తలిదండ్రులకు  ఈ గ్రంధమును అంకితము చేయుచున్నాను . తరువాత నా పలుకులను సాహితీ ములుకులుగా ,, తీర్చి దిద్దిన ప్రతి ఒక్క గురుదేవునకు సాష్టాంగనమస్కారములు చేయుచున్నాను .
                        బుధజన విధేయుడు . పొన్నెకంటి .

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

ప్రపంచ మాతృ భాషా దినోత్సవం , 21.02. 2015




ప్రపంచ మాతృ భాషా దినోత్సవం , 21.02. 2015
తుర్క యామ్జాల్ లోని  జ్ఞానోదయా విద్యా నికేతన్ , వార్షికోత్సవము సందర్భముగా  వ్రాసి చదివిన పద్యాలు . 
                                                              తెలు(గు వాడు 
1. సీ . తిక్కన్న కవితలో తియ్యని మధుధార 
                                తనివిదీరని భంగి త్రావుచుండ
          పోతన్న భక్తిలో పూర్ణ త్వమున్బొన్ది 
                                   సతతంబు హరి సేవ సల్పుచుండ
           పొన్నగంటి వారి చెన్నైన తెను(గులో 
                                     అచ్చ తెను(గు కావ్య మలరుచుండ
          శ్రీనాధు సీసాల శేషంబు నుంచక 
                                    గుట గుట త్రాగంగ కోరుచుండ 
     తే . గీ. తెల్గు వానికి లోటేమి తెల్పుమయ్య 
               తిక్కనార్యుని, శ్రీనాధు తీరులన్ని 
               పొన్నగంటితో కలగల్పి పొదివి పొదివి 
               ముద్దు మురిపాల తెలు(గున మురియగలరు. 
సీ.  గళ మెత్తి, కలమెత్తి గంభీర భావాలు 
                          పదిమంది నెదిరించి పల్కువాడు!
     నమ్మిన సత్యంబు నవనిదులిచ్చినా 
                          వదలని ధీరుండు వజ్ర సముడు!
      ధర్మ పాలనమందు దారిద్ర్యమొచ్చినా 
                          హ్లాదాన జీవంబు నందువాడు! 
తే.గీ. వాడి గల్గిన పలుకుల వరలువాడు 
        ఒంటి పోరుకు నెదురొడ్డి ఓర్చువాడు 
        మిన్ను మన్నును లీలగా మెదపువాడు 
       తెలుపవలెనా! యింకను తెలు(గు వాని! . 
తెగీ.  దేశ దేశములందున ధిషణ జూపి 
        తనదియైనట్టి శైలిన తనరుచుండి 
        తెలు(గు వెలుగులు  విశ్వాన తేట పరచి 
        కీర్తి కాంతను చేబట్టు మూర్తి యితడు! .    


20, జనవరి 2015, మంగళవారం

బాల భావన శతకం. గురించి

బాల భావన  శతకం. గురించి                                                                                                             రామకృష్ణా రావు గారు జగమెరిగిన చిత్రకవి, విచిత్ర కవి. వారి భావనలు మధుర మనోహరాలు సుకుమారాలు , సమాజ చైతన్య స్పోరకాలు. వారు నన్ను సోదరునిగా భావించి తాను వ్రాసిన  బాల భావనలు అను శతకానికి అభిప్రాయం వ్రాయమనుట  చాలా సంతోషంగా ఉన్నది.. బాల బాలికలు మనకు అన్ని భావాలు  పైకి చెప్పరు కాని  చాల సున్నితం గ ఆలోచిస్తారు. రావు గారు వారిలో( పిల్లల్లో )  దూరి వారి  స్థాయిలో , శైలిలో చెప్పిన పద్యాలు ఆణి ముత్యాలు. నేటి సమాజానికి ఏది కావాలో అదే చెప్పారు. 4 వ పద్యంలో . ముద్దు చేసి మాకు హద్దులు నేర్పరు-----. హద్దు మీర మమ్ము గ్రుద్దుదురయ.--- హద్దు లెల్ల నేర్ప శ్రద్ధ గా నేర్వమా ----పెద్దలారజ్ఞాన వృద్దు లార . . అంటూ  ఆడుతూ పాడుతూ ఆట వెలదులలొ చెప్పారు . మొక్క అయి వంగనిది మ్రానై వంగునా అనే ప్రాచీన సూక్తి యిందులో దాగి ఉన్నది. ముద్దు హద్దు మీర రాదనే విషయం నిత్య సత్యం.    
           7 వ పద్యం లో .  పలక చేతికిచ్చి పద్యాలు వ్రాయించి -----పలుకునటుల జేయ పలుక గలము ---పద్యమొక్కటైన పలుక నేర్ప రదేల.  అంటారు. నేటి భాషామతల్లి అందున తెలుగు భాష ఈ విషయం లో ఏటికి ఎదురీదుతున్నది. వీలయినంత వరకు పిల్లలకు తెలుగు పలుకుబడి బడి లోనే కాక యింటిలో కూడా నేర్పాలి. ముఖ్యంగా అమ్మే యీపని చేయాలి. ఆనాడే భారత మాతృ.హృదయం సంతోషిస్తుంది .అమ్మఒక శతకం చదివితే పిల్లలకు చెప్పినట్లే . ఎంత సమాజ స్పృహ . ఇది అందరికి రావాలని కవి గారి తపన. 
           9.వ పద్యం లో . మాకు నచ్చు విద్య మమ్మన్దుకొనీక------మీకు నచ్చుదాని మాకు పులుమ -----మాకు రాక పోవు మాదోషమా యిది . ------- నిజమే మనకు నచ్చిన పనిని చాల సులువు గ చేస్తాము . నచ్చని పని కేవలం పరుల కొరకే . ఈనాడు  చాల మంది విద్యార్ధులు పడుతున్న పట్లే యివి. వారికీ స్వేఛ్చ యివ్వాలని కవి సూచన బాలల పట్ల సద్భావన . 
          ఇలా ఎన్నో సుకుమార సుందర భావాలతో సమ సమాజ నిర్మాణానికి , దేశ సమైక్యతకు పునాది రాళ్ళు అయిన బాలలకు , మంచి సూచనలతో శతకం వ్రాసిన  రామ కృష్ణారావు గారు మిక్కిలి అభినంద నీయులు. 
                                           సారస్వత సహోదరుడు. పొన్నకంటి సూర్య నారాయణ రావు.  భాగ్యనగరం. .  

28, నవంబర్ 2014, శుక్రవారం

తెలుగు పలుకు, ఘనతకు కారణాలు.

 తెలుగు వెలుగులోకి రావాలంటే తెలుగు వచ్చిన ప్రతివారు మౌనం విడనాడాలి . తెలుగుకు వెన్నుదన్నుగా నిలవాలి. తమ వంతు సహాయం చేయాలి .

 తెలుగు పలుకు పలికి దేశాల  వినిపించి 
 తెలుగు పద్య మనుచు తేనె లొలికి 
 తెలుగు వారి ధీర తేజంబు జూపుచు 
 వెలుగు మోయి సతము వేయి నాళ్ళు 

 
మన మాతృభాష గొప్పదనుటకు ౠ. బావగారు(సత్యనారాయణ గారు) పంపిన ఆంగ్లమునకాంధ్రానువాదం.1. క్రీ.శ. 400సం.ల.నుండి తెలుగు ఉన్నట్లు తెలుస్తున్నది. 2. తెలుగు లిపి అంతర్జాతీయ అక్షర మాలా సంఘముచేత 2012లో ఉత్తమ రెండవ లిపిగా ఎన్నుకో బడినది.(కొరియా కు 1వ స్థానం)3. తెలుగు భాషోచ్చారణ వలన 72000నాడులు స్పందిస్తాయని విజ్ఞానశాస్త్రం నిరూపించింది. 4. శ్రీలంకలో ని జిప్సీ అను తెగవారు ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. 5. మయన్మార్ లో తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి.6. ఈభాష ఇటాలియన్ భాష వలె అచ్చులు చివరగా ఉండుటచే భాషాపరిషోధకుడైన "నికోలో డి కాంటి" తెలుగు ను "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అన్నారు. 7. ప్రపంచ మానవజాతి విషయ సేకరణ శాస్త్రవేత్తల జాబితా ప్రకారం దేశ పరిధిలో 3వ దిగా , ప్రపంచ పరిధిలో 15 వదిగా లెక్కించారు. 8. భారతదేశంలో ని నిజాం లోని కాళేశ్వరం, రాయలసీమలో ని శ్రీశైలం, కోస్తాలో ని భీమేశ్వరంలోని మూడు శివలింగముల మధ్య వారు మాట్లాడే భాష కనుక దీనిని త్రిలింగ,తెలుగు, అని పిలువబడుతున్నది..9. తూర్పు దేశ ప్రాంతంలో అజంతంగా మాట్లాడే భాష తెలుగు.10. ఎక్కువ సామెతలు న్న భాష తెలుగు. 11.పూర్వము కూడ తెలుగు,తెనుగు,తెనుంగు అని పిలిచేవారు. 12. రవీంద్రనాధ్ఠాగూర్ కూడ దేశభాషలందు తెలుగు తీయనిదన్నారు. 13. 200 సం.ల క్రితం 400 మంది మారిషస్ కు బానిసలుగా పంపబడితే వారి వారసులలో ఒకరు ఇప్పటి ప్రధాని. 14. 40 సంస్కృత శ్లోకాలు (రామకృష్ణ విలోమకావ్యం) మొదటినుంచి చివరకు రామాయణం, చివరినుండి మొదటికి భారతం ఉంటుంది. ఇలా మరే భాషలో లేదు. 15. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళములోని ఆంధ్రమహా విష్ణువు ను భక్తి శ్రద్ధలతో ధ్యానించి వారి ఆదేశానుసారం "ఆముక్తమాల్యద"ను వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని తెలిపి ఆ భాషను ఆధికారికం చేశారు. 16. తెలుగు భాషలో మాత్రమే ఏకాక్షరి పద్యములున్నవి. .....జై తెలుగు, జైజై తెలుగు భాషాభిమానులారా! నమస్సుమాంజలులు.... పొన్నెకంటి.

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...