19, మే 2014, సోమవారం

శిరిడి సాయినాధుని దర్శించుకొనే భాగ్యం

కర్నూల్ కు సుమారు 30 కి మీ. దూరంలో ఉన్న ఐదవ శక్తి పీఠమైన , జోగులాంబా దేవిని మొదటగా  చూచే అదృష్టం కలిగింది. ఆ తరువాత భక్త ప్రహ్లాదుని  అవతారమైన రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది . ఇది ఒక మనోహరానుభూతి .రెండు రోజుల వ్యవధానములోనే శిరిడి సాయినాధుని దర్శించుకొనే భాగ్యం కలిగింది. అనుకోని దర్శనమే సాయి బాబా ఇస్తారని అది వారి ప్రత్యేకత  అని అంటారు. నేనలానే పొందాను .  శిరిడి కి 90 కి . మీ  దూరం లో ఉన్న నాసిక్ తరువాత త్రయంబకేశ్వరుని దర్శించటం జరిగింది . గోదావరి జన్మఆపర్వత శ్రేణుల  సమీపం లోనే జరిగింది. పునీతమైన ఆ ప్రదేశాలు తిరుగుతుంటే మధుర మనోహర భావన ఎవరికైన తప్పక కలుగుతుందని నా భావన . అవకాశాలు చెప్పి రావనేది సత్యం.  చిత్రాలు మనోహరం. చూడండి భక్తి తో  మైమరచి . ఈ అవకాశానికి కారకుడు యల్లాప్రగడ సాయి తేజో భరద్వాజ. . వాడి శిరిడి మ్రొక్కు కారణం . 8 మందిమి కలసి మహదానందం పొందాము .































కామెంట్‌లు లేవు:

శోభారాజ్. అన్నమయ్య పురం , పరాభవ ఉగాది .దశావధానం

డా . శోభరాజ్ గారి ప్రస్తుతి పద్యం   వేంకటేశుని పాదాలు వినయగరిమ  అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ   వాని ఫణుతులు విస్తృత పఱచినట్టి  జ్ఞాన శోభాంచి...