25, డిసెంబర్ 2012, మంగళవారం

ఆత్మ విచా రము .

                                                      ఆత్మ విచా రము .

     బుద్ధి .          శ్లో .. అధిష్టానం చిదాభాసో , బుద్ధి రేత త్రయం యదా .
   ....                                        అఙ్ఞానాదేకవత్ భాతి , జీవ యిత్యుచ్యతే  తదా .
                           భావం ...  అధిస్టా నమగు కూటస్తుడు, చిదాభాసుడు , బుద్ధి , ఈ మూడును , అజ్ఞానము                   వలన ఒకటిగ తోచినప్పుడు జీవ సంజ్ఞ తోచుచున్నది . 1) కూట స్తుడు ... నిర్వికారుడగుట వలన జీవుడు కాదు.  2) చిదాభాసుడు ... మిధ్య యగుట వలన జీవుడు కాదు . 3) బుద్ధి ... యిది జడ మైనది,                                    ఆశ్ర యించునది .  ఈ మూడును కలసియే జీవుడైనాడు .  ( బ్రహ్మ జిజ్ఞాస .2 వ , ప్ర .,, స్వాత్మ ..36. ) 

ఆత్మ....            జీవుడు , శ రీరాదులు
అంతరాత్మ ......బ్రహ్మ పదార్దము. 

వేదాంత పంచ దశి యందు .....బ్రహ్మమే శరీర మందు ప్రవేశించి జీవరూపు డాయెనని , ప్రాణాదులను   ప్రేరేచుట వలన జీవుని పేరు కలిగె నందురు.  ఆత్మయే శరీరాదులు తాన నుకొనుట వలన జీవ భావము కలిగె నని చెప్పిరి .  

బుద్ధి , లింగ దేహము ,ఈ రెండు , అవిద్యా పరిణామములు... ( శంకర విద్యారణ్యులు )


విచార దృష్టి తో జూచిన   జీవేశ్వర భేదమే లేదు . జీవుడు ఆలోచిందే దానినే బ్రహ్మ పదార్థము నిశితం గ ఆలోచిస్తుంది . అందు వలన ఆలోచనలకు అది నికష . 


మనో వాక్ కాయ  కర్మలే  త్రికరణములు . త్రికరణ శుద్ధి కలిగితే దైవత్వమే .

24, డిసెంబర్ 2012, సోమవారం

గోపూజ .

                             గోపూజ
 గవాం అన్గేషు స్థితః  సర్వే దేవతః అహం పూజ యామి

ఇది వేద గాయత్రీ అగ్రహారమందలి పవిత్ర గో పూజ

గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే . .గోవులు బ్రాహ్మణులు, మహిళలు ,ఎచట పూజింప బడతారో అచట సమస్త శుభాలు జరుగుతాయి.
  










                ఆటవెలది 

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
కడివె డైన నేమి ఖరము పాలు 
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభి రామ వినుర వేమ.

ఈ వేమన గారి పద్యం అందరి యెడల సార్థకం కావాలని కోరుకుందాం . సర్వే జనాః సుఖినో భవంతు .సర్వే భద్రాణి పశ్యంతు. 

                                        

            ప్రేమికుల దినోత్సవ సందర్భంగా. గో కౌగిలి. 
         14.02.2023.

అమ్మపాల రుచిని నందలేనటువంటి
           మందభాగ్యునకిది మాతృమూర్తి
కర్షక జీవుల కాడికి కోడెల
           నందించి కాపాడు నమృతమూర్తి
భూసారముంబెంచి ముక్కారు పంటల
             సంపదల్ నింపెడు సాధుమూర్తి
పుణ్య గోమాతయై ముట్టుకొన్ననె చాలు
             స్వర్గమందించు నిస్స్వార్ధమూర్తి
  ఆమె యెవ్వరో యననేల యమలదివ్య
  కామధేనువు సంతతి కరుణనిలయ
  పరమ ప్రేమామృతంబను వర్షమిచ్చి
  తనియజేసెడు శ్రీలక్ష్మి ధన్యురాలు
  కౌగిలింతల మునుగంగ కదలిరండు!                                          

22, డిసెంబర్ 2012, శనివారం

మనసు ,బుద్ది , అంతరాత్మ.

మనసు ,బుద్ది , అంతరాత్మ.

మనసు ...ఇది చంచలమైనది . చురుకైనది. కానీ దీనిని  ఒక చోట కట్టి వేయడం మానవ మాత్రులము గ మనం చేయలేము. కొంత దైవ శక్తి కావాలి. అప్పుడు మన మసును కట్టి వేయగల సూత్రాలు దొరుకుతాయి.  ఆ నాడు
మనం మనవా తీతులము అవుతాము.

బుద్ధి ... ఇది ప్రళ యాన్తకమైనది . ఆ  మనసుని అనుసరిస్తుంది అనాలోచితంగా . అందుకే , అంతరాత్మ నిశితంగా

ఆలోచించి చేయదగిన పనినే సూచిస్తుంది .అదే చేయాలి .

అంతరాత్మ.  అనంతమైన శక్తి కల దైవ వరం . దీనిని ఆధారం చేసుకొనే మనం నిర్ణయాలు  చేసుకోవాలి. ఆనాడే మనం మనవా తీతులుగా ప్రసిద్ధి కెక్కు.తాము


ఈ మూడు శక్తుల కలయికే అనంత త్రికరణ శుద్ధి . యిదే దైవశక్తి. 

21, డిసెంబర్ 2012, శుక్రవారం

పరిమళించిన కవితా హృదయం

పరిమళించిన కవితా  హృదయం     తేది 21.12.2012. రంగారెడ్డి జిల్లా ఈనాడు పేపర్ లో పడింది .ప్రపంచ తెలుగు మహా సభల సందర్భముగా మాబోటి వారికి ఒక నూలుపోగు .అంటే చిన్నపరిచయం ..యింటికి వెతుక్కొంటూ వచ్చిన సాహిత్యాభిమానం . వ్యాస కర్త  ఈ నాడు విలేఖరి చిరంజీవి నంద కిషోర్ 

19, డిసెంబర్ 2012, బుధవారం

అమ్మ

తెలుగు బాసల యాసలు తెలుపుచుండు, తెలుగు బంగారు తీగను తెంపి తెంపి ,ఎన్ని నగలను జేసిన ఎట్టులైన ,     విలువ మారదు తగ్గదు విభవమందు .

                                                              అమ్మ పాట 

అమ్మ కరుణ నాకుంటే అవలీలగ  పాటలొచ్చు  ,    అమ్మ కరుణ నాకుంటే అలవోకగ    మాటలొచ్చు  ,   అమ్మ దయయె   నాకుంటే ఆశువుగా పద్యమొచ్చు .అమ్మ కృపయె   నాకుంటే  అనగరాని దేముందీ  , అమ్మ చూపు  నాకుంటే జగమంతట జయమే ,అమ్మ మనసు నావెంటే  నాకెందుకు భయము  , అమ్మ మదిని తడివి చూడ  అమృతంపు ధారలే  . కమ్మగ అవి  త్రాగితే అసహాయపు ధీరులే    , ఆ అమ్మే వీణ పాణి , ఆ అమ్మే నలువ రాణి . మరువబోకు ,మరువబోకు  ,మహిమలన్నీ ఆమేవే . పాదకమల సేవజీసి ప్రాంజలించు భక్తి తోడ. 

18, మే 2012, శుక్రవారం

భావన

  భావన .  మానవుని మనుగడకు సమాజ శ్రేయస్సు ఒక దివ్య ఆయుధం . ఏ మానవుడు ఎక్కువగా సమాజాన్ని గురించి ఆలోచిస్తాడో అతని మనుగడకి , జీవితానికి ఒక అర్థం ఒక పరమార్థము ఉంటుంది . మాములు ఆయుధాలకి  పదును పోయే అవకాసం ఉన్నది . ఈ మహా ఆయుధానికి సేవ చేసిన కొలది పదునేక్కుతుంది ..కనుకనే అందరు ఈ ఆయుధాన్ని ధరించి దుర్మార్గ , నీచ భావాలకు ఆలవాలమైన  ప్రతి ఒక్కరి మనస్సులలో నున్న స్వార్థ పూరిత విష వృక్షాలను చ్చేదించాలి . నిరంతరం ఆనందాన్ని ప్రసాదించే కల్ప వృక్షాలను పెంచి పోషించాలి . ఎవరి హృదయము లో నిరంతరం నిశ్చల , నిర్మల , భావాలు ఉంటాయో  వారి హృదయమే దేవాలయం . భావమే మహోత్క్రుస్ట దైవము .  

తృప్తి

తృప్తి   మానవునకు ఏంతో ఆనందాన్ని స్తుంది ,ఒకరికి మానసికంగా , మరోకరికి శారీరకంగా. శారీరకంగా  పొందే తృప్తి తత్కాలికమే . మానసికం మరువలేని శాశ్విత ఆనందాన్ని యిస్తుంది . సాధారణ మానవులు శారీరకమే కోరుకొంటారు . మహాత్ములు మానసికం కోరుకొంటారు . మహాత్ములకు , సాధారణ మానవులకు ఉన్న తేడ  కేవలం మనస్సు . మనస్సు కోరికల పుట్ట . తీర్చటం మొదలు పెడితే కోరటం ఆపదు . క్రమంగా కొన్ని అయిన తీర్చకుండా మనసును మనం అరికడితే , క్రమంగా అది మన దారికి వస్తుంది . దానికి మనకు జ్ఞానము అవసరం . జ్ఞానములోనే విచక్షణ ( చేయ తగిన, తగని పనులు ) ఉంటుంది . జ్ఞానమునకు మూలము గురువు . వారివలన ఒక వంతు వస్తుంది .మిగిలిన మూడు తోటి విద్యార్థులతో ,స్వ శక్తి తో , కాల క్రమము లో వస్తుంది . శ్లో .....ఆచార్యాత్   పాదమాదత్తే  , పాదం శిష్య స్వ మేధయా .పాదం స బ్రహ్మచా రిభ్యః ,  పాదం కాలక్రమేణ  చ .  కనుక సంపూర్ణ జ్ఞానం రావాలంటే  మానసిక పరిపూర్ణత రావాలి . దానికి కొంత అయిన దైవ ఆరాధన , ఆత్మ స్థైర్యం , సేవానురక్తి , పెద్దల యెడ ప్రేమానురాగాలు . అవసరం . ఇలాంటి మనసు తో మనం అందరం తృప్తి గ ఉందామా . ప్రయత్నం చేసి చూడడం తప్పులేదు .

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...