25, మే 2013, శనివారం

నాగఫణి శర్మ గారి అవధానం

అవధాన సరస్వతీ పీఠం, హైదరాబాదు లో విశ్వ శాంతి కొఱకు 30..05. 2013 నుండి3.06.201 3 వఱకు" అవధాన సహస్రఫణి ,బృహత్ ద్వి సహస్రావధాని " బ్రహ్మశ్రీ  డా . మాడుగుల నాగఫణి శర్మగారి ద్వి శతావధానం ( 207 మందితో  ) జరిగినది .  దానికి అవధాన విజయినిగా నామకరణం చేయుట  జరిగింది . నేనాన్ద్ధ్రో పాధ్యాయునిగా  గా పనిచేయుచున్నప్పుడు వారి ద్వి సహస్రావధానంలో పాల్గొని చక్కని అనుభూతి పొన్దాను. మరల నాకి ప్పుడవకాశం కలగటం ఎంతో  అదృష్టము . ఆనాడు, ఈనాడు సమస్యనిచ్చే అవకాశమే వచ్చింది ,మరొక అనుభూతి , నిషిద్ధాక్షరి కూడా యివ్వవలసి రావటం క్రొత్త అనుభవము. నా సమస్య, నిషిద్ధాక్షరి , విషయాలు రెండు  వేద గాయత్రీ అగ్రహార సృష్టికర్త అయిన చి. ప్రభాకర శర్మను గూర్చి,  అభివృద్ధిని గూర్చి అడుగుట జరిగినది, పద్యములు రసస్పోరకముగా ,మనోహరముగా వచ్చినవి.

1. పృచ్చకులు :- పొన్నెకంటి సూర్య నారాయణ రావు .    30.. 3. 2013

    సమస్య :- ఉ:-వేదము రోదనంచు బహు విజ్ఞత బల్కిరి పండితోత్తముల్ .
     పూరణ :-      ఆదిమ కాలమందు శివుడద్భుతరీతి నటిమ్పగా --మహా
                         నాదము లుప్పతిల్లె ,రసనారస సర్వ శరీరమందు --నా
                         సోదిత రోదసీ కుహర సూనృత రోదన పుట్టె  వేదమై ,
                         వేదము రోదనంచు బహు విజ్ఞత బల్కిరి పండితోత్తముల్.
2.  పృచ్చకులు :- --            
     సమస్య :-     విద్య నేర్పువాడు వెఱ్ఱి వాడు .
   పూరణ :-తే.గీ. గుణము నేర్పకుండ గుణశాలి యనకుండ,
                         అదను చూచి బుద్ధి నరయ కుండ ,
                         శాస్త్ర  వాదములను శ్రద్ధతో ననయంబు ,
                         విద్య ............
3.   పృచ్చకులు :- --
      సమస్య :- ( సంస్కృతము ):- కవయః కావ్య తస్కరః
      పూరణ :-   వ్యాస వాల్మీకి కావ్యేషు చామ్శాన్ గృహ్ణన్ తి తే వరాన్ ,
                       తావన్మాత్రేణ కిం కిం తే కవయః కావ్య తస్కరాః

4.  పృచ్చకులు :- రాపాక ఎకామ్బరా చార్యులు గారు .
     సమస్య :-    దారుణ కృష్ణ సర్పము సుధల్ వేలిగ్రక్కుచునుండె చూడరే ,

    పూరణ :-     సార కవిత్వ మద్భుతము సమ్భ్రుత   ధర్మమ కావ్య మర్మమున్
                       ధీర సమాజ పూజితము ధీ వివిధప్రభు సేవితమ్బనన్
                       తీరుగనన్ సుధీవరుడు  తెల్పె  వధాని కవిత్వ రాజ -బృం
                       దారుణ .......                                                                                                  ( సశేషం )
                       
   

10, ఏప్రిల్ 2013, బుధవారం

సర్వేజనాః విజయ వాసంత శుభ కామనః

                                       
            సర్వేజనాః   విజయ    వాసంత           శుభ కామనః 

11. 04. 2013
ప్రతి ఉగాది ప్రకృతి ని కను విందు చేస్తుంది 
                         తన నూతన చేతనత్వంతో ,
ఈ యుగాది విజయ నామ ధారియై , 
                         సకల జీవ రాశులకు  విజయ రహదారియై ,
మందార మకరంద సుధామయ జీవితాలలో . 
                          సుధలు చిలకాలని నాంది పలుకుతుంది .. 
విజయం వినటానికి చాల బాగుంటుంది . ,
                           కఠోర  పరీక్షల విశ్లేషణ లేకుంటే . 
విజయమా అనటానికి బలే బాగుంటుంది , 
                            అప జయాల ఊసులు లేకుంటే ,
విజయం సు వ్యసనమ్ అయితే ,
                             పరాజయలన్నీ దుర్వ్యసనాలే   . 
విజయానికి అలవాటు పడిన ప్రాణి , 
                             ప్రాణం పోయిన అపజయానికి ఒప్పుకోదు . 
వసంతం లోని ప్రతి విజయ చిహ్నమైన , 
                             చివురు వెనుక బలహీనపు పండుటాకు ఉంటుంది ... 
ప్రకృతి తన ధర్మంగా ఒక్కొక్క కాలంలో , 
                             ఒక్కొక్క దానికి ప్రతిభ,వ్యుత్పత్తి ,కాంతుల నిమ్పుతున్ది. 
వసంత ఋతు రాజు  కర్తవ్యమ్ గా చరాచర జగత్తుకు ,
                              ఈనాటి నుండి నూతన శోభలను విజయ   పరమ్పరలనన్దిస్తాడు . 
వసంత లక్ష్మీ శోభాయమాన సదృశ సహృదయులన్దరకు 
                               విజయ, ఆయు రారోగ్య ఐశ్వర్యా లను ప్రకృతి మాత ప్రసాదిస్తుంది . 
మారిన కాలం తో మనం మారి  కల కాలం ధర్మా చరణ తో ,
                                ప్రకృతి మాత పాద పద్మ రజోలేశాలను ,                                         
మన శిరస్సుల ధరిద్దాం , పునీతులమౌదామ్. 

                          

                             । ।  సర్వే జనాః విజయో భవంతు । ।  


1, ఏప్రిల్ 2013, సోమవారం

కీ. శే యల్లా ప్రగడ వెంకట నారాయణ రావు గారు.

            కీర్తి శేషులు యల్లా ప్రగడ వెంకట నారాయణ రావు గారు.




వీరు నామాతా మహులు . వాసుదాసు గారి
( ఆంద్ర వాల్మీకి గా ప్రసిద్ధి గాంచిన ,వావిల కొలను సుబ్బారావు
గారికి ) శిష్యులు . వైష్ణవం స్వీకరించారు .. గుంటూరు జిల్లా నగరం
స్వ గ్రామమ్. యేలేటి పాలెం గ్రామానికి కరణం  గా పని చెసారు.
ఈనాడు వేద గాయత్రి అగ్రహారం నిర్మాత అయిన యల్లాప్రగడ
ప్రభాకర శర్మ గారికి పితామహులు .  శిస్టా చార పరాయణులు .
భారత , భాగవత , రామాయణాది గ్రంధములు వారికి కన్థ స్థ మనిన
అతిశయోక్తి కాదు. పరమ భక్తులు . బహుముఖ ప్రజ్ఞాశాలి .
పోలములను కొలిచే సర్వ్ గొలుసు లేకున్డగానే ఆనాడు తన అంగలతో
పోలములను కొలిచే వారు. అది అందరిని ఆశ్చర్య పరచే విధంగా
చాల ఖచ్చితం గ లెక్క ఉండేది  ఒంటి కాలి మీద నిల్చి ఆదిత్య హృదయం  నలుబది రోజులు పారాయణ చేసి తన అభీష్టాన్ని
( కోర్టులో విజయం ) సంపాదించుకొన్న ఘనులు . నిరంతరం
రామ నామ జపమే ధ్యేయంగా పెట్టుకొన్న రామ భక్తులు.
అందరి చేత  దేవుడు తాతయ్య గా పిలిపించుకోనేవారు .ధన్యజీవులు .
                                                                                             


                                                                                 





                               

13, మార్చి 2013, బుధవారం

తెలుపు భాష . తెలుగు భాష

     తెలుపు భాష . తెలుగు భాష


1.             విశ్వ మంత కాంతి విరజుమ్ము నాభాష ,

               వేద విదులు మెచ్చు   విబుధ  భాష 

               పాల తెల్ల దనము , పసిపాప  నవ్వులు, 
                                                                      
                కలిపి తెలుపు భాష తెలుగు భాష .

2.            తెలుప గల్గు నన్ని తేటతెల్లము గాగ,


               నిలుప గల్గు నిన్ను నింగి కంట ,

              తులువ లెన్ని మనల దుర్భాష లాడిన ,

              తూచ నలవి కాని తూర్పు కొండ .

3..          దాని గుండె తెలుపు , ధర్మసూక్ష్మము లెన్నొ  


,             దాని మోము తెలుపు ధైర్యమెంతొ

              దాని పనులు తెలుపు  దార్శనికంబని ,  

              తెలుగు భాష యదియె వెలుగు భాష .










  

5, మార్చి 2013, మంగళవారం

సంవత్సర సంతోషం .

                                                 సంవత్సర సంతోషం . కృతఙ్ఞతలు 

    23. 2. 2013. న  హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలోని తుర్క యామ్జల్ లో13 సంవత్సరముల క్రిందట స్తాపింప బడిన  శ్రీ జ్ఞానోదయ విద్యా నికేతన్ లోని  వార్షికోత్సవానికి నాందిగా   జ్యోతి ప్రజ్జ్వలనంచేస్తూ  ముఖ్య అతిధులు, ( బి .వెంకటేశం గారు, ఎం  ,ఇ . ఓ . హీర్యానాయక్ గారు ,ప్రిన్సిపాల్ .                   ( యెన్.పద్మజారాణి  ) సభా సంప్రదాయాన్ని పాటించారు.  .                                                      
 ఈ సందర్భం గానే చిరంజీవి అరుణ్ కిరణ్ ద్వారా  బాల బాలికలలో ,నాయకత్వ లక్షణములను ప్రేరేపించే ఒక కార్య క్రమం , ఊరేగింపు, దానినిగురించి వివరణ జరిగాయి. మానవ జీవితం లో నాయకత్వ లక్షణం ఒక విలక్షణ మైనది . దానిని సద్వినియోగ పరచుకొంటు ముందుకు సాగితే జీవితం సమర్థ వంతం గ , సుఖ వంతం గ సాగుతుంది, దానిని ప్రచారం చెయ్యాలన్న ఒక నాయక లక్షణం ఉన్నవాడే చేయగలుగుతాడు . నాయకుడు సహజంగా జన్మిస్తాడు.( సుభాస్ చంద్ర బోస్ ,అల్లూరి ., మహాత్మా గాంధి జి ,పండిట్ నెహ్రు జి ,లాల్ బహదూర్ శాస్త్రి జీ , టంగుటూరి ప్రకాశం పంతులుగారు , మొదలగువారు యెన్దరో  మహనీయులు )కాని కొంత పరిశ్రమ మీద కూడా కావచ్చు . ఏది ఏమైన, ఈ ప్రయత్నం అభినందనీయం  . ప్రతి విద్యాలయంలో ఇది నిరంతరం కొన సాగాలిసిన్దె. నేటి విద్యార్ధులే రేపటి నాయకులు .. తధాస్తు

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

దేవాలయానికి వెళితే దేవుని దగ్గరకు వెళ్లి నట్లేనా.

 ఉగ్ర వాదుల దుశ్చర్యలకు అమాయకులు బలి అయినందుకు విచారిస్తూ ,22..02.  13 న

చనిపోయిన వారి ఆత్మ శాన్తించాలని మనసార కొరుకొంటున్నాను . వారి వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుకొంటున్నాను .   మానవత్వం మంటకలియకుండా మమ్ములను కాపాడు భగవంతుడా                                                                      
            దేవాలయానికి వెళితే దేవుని దగ్గరకు వెళ్లి నట్లేనా. భగవంతుడిని చూచి తిరిగి యింటికి వచ్చే అదృష్టం మనకు లేదా . మతం ఏదైనా మానవత్వంతో ఆలోచించగలిగే మనసేలేదా . మనుషులు యిలా  మృగాలుగా ఎందుకు మారుతున్నారు . ఉదాహరణకి ,  భర్తృహరి గారి ఒక పద్యం చూద్దాం .

     ఉ.  గ్రాసములేక స్రుక్కిన జరా కృశమైన ,నిశీర్ణ మైన ,సా

          యాసము నైన నష్ట రుచియైన మదేభకుమ్భ  .......

అని సింహము యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తూ .  అది యెంత ఆకలి వేసిన ఏనుగు కుంభ స్థలాన్ని మాత్రమె చీలుస్తుంది ,తింటుంది ,కాని గడ్డి తినదు అంటాడు . కనుక సామాన్యుల మీదకు రావటం అలాంటిదే .                     మృ గాలకున్న నీతి కూ డా మనకు లేదా . ఎంతో విజ్ఞానుల మంటూ అన్ని లోకాలికి వెళ్లి వస్తున్నాం . కాని ఏ విజ్ఞానము మనలను కాపాడలేక పోవటం దురదృష్ట కరం

హైదరాబాదు మనకు ఒక భాగ్యనగరం . అనుకునే పరిస్తితులు లేవా . ఈనాడు జరిగిన మరణ కాండ ,మారణ కాండ, దిల్శుఖ్నగర్లో జరిగిన్ది. దిల్ షుఖ్ మనిషికి పేరులో మాత్రమె మిగిలిన్ది. మరి ఇలాంటి స్తితిలో మన జీవితాలు గాలిలో దీపాలెనా .  విద్యయా వినయా వాప్తిహి  ,సాచేత్  అవినయావాహ , కిం కుర్మః కిం ప్రతి బ్రూమః  గరదాయా స్వమాతరి.  .విద్య వలన వినయాది సద్గుణాలు రావాలిదానికి బదులు దుర్గుణాలు  వస్తే అది స్వయముగా తల్లే విషం పెట్టినట్లు అవుతుంది అనేది దీని అర్థమ్. మనం ఏ స్తితిలో ఉన్నామో ఏమి అర్థం కావటంలేదు .  ఉగ్రవాదుల మనస్సులు సమగ్ర ప్రేమ ,మానవతా భావాలతోనిండి మనమందరం క్షేమంగా ఉండాలని త్రికరణ శుద్ధిగా కొరుకొన్దాము. తధాస్తు. 

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

అతి సర్వత్ర వర్జయేత్

అతి సర్వత్ర వర్జయేత్ .

నమ్మి చెడ్డవాడు .......అనే సామెత భగవంతుని గూర్చి చెప్పింది . నమ్మకం వ్యతిరేక పదం అప నమ్మకం . కాని అమ్మకు వ్యతిరేక పదం నాన్న కాదు . వినియోగం విలువ తక్కువదే అయితే విలువకే విలువ తక్కువ. గుడ్డి తనం (అపనమ్మకం ) ఎక్కువ అయితేనే కదా చూపు మందగించేది .మోసగించి పై చేయి తెచ్చుకొని మోసగింప బడిన వాని ఎదాన బడి , వాడి మానసిక వేదనకు , ( ఒక్కొక్క సారి ) మరణానికి కారకుడైతే మిగిలేది పై చెయ్యి కాదు . పై లోకమే . ఈనాటి సమాజంలో

            . శ్లో ." యేన కేనాప్యుపాయేన .ప్రసిద్ధః పురుషో భవేత్ " . 


               అనే దానిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతున్నామని అనుకోని వెనక్కు వెళుతున్నారు. దాని సరైన అర్థం ఏ మంచి పని అయిన చేసి అని తీసుకొంటే మానవ కల్యాణం జరుగుతుంది. అలాగే నమ్మకం ,ఆశ ఉండాలి , కాని గుడ్డి నమ్మకం , అత్యాశ ,అనర్థ దాయకాలు . 

                       " అతి సర్వత్ర వర్జయేత్ " కదా . 

           ఈనాడే  కాదు ఏనాటి మోసాలకైన ,గుడ్డి నమ్మకం , (మానవుని విషయంగా)అత్యాశే కారణం. 

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...