24, ఆగస్టు 2014, ఆదివారం

అమ్మను నాన్నలో .....ది. 24. 08. 14.

                           శివాయ గురవే నమః

                     అమ్మను నాన్నలో .....ది. 24. 08. 14.
         ( వైష్ణవీ మాత ను గంగాధరునిలో )

శ్లొ. వాగార్దావివ సంపృక్తౌ ,వాగర్ధః  ప్రతిపత్త యే ,
    జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

వాక్కును అర్ధము కలసి యున్న రీతి గా
పార్వతీ పరమేశ్వరులు కలసియే ఉంటారు .

అమ్మను నాన్నలో , నాన్నను అమ్మలో
చూడవచ్చు .

 నేను హిమాలయాల్లో ఉన్న వైష్ణవీ మాతను
 చూద్దామని అనుకున్నా . కాని నా శ్రేయోభిలాషులైన
 భిష గ్వర్యులు మీరామెను ప్రత్యక్షంగా నేత్రాలతో చూడటం శ్రేయస్కరం కాదని , సముద్ర మట్టానికి దాదాపు 5000 మీటర్ల  ఎత్తున ఉండటం వలన , మామూలు
 గుండెలకే ఊపిరి అందదని , మీ గుండె రిపేరు చేయ బడింది కనుక అసలు కూడదని వారించారు . నిషేధించారు .
నేత్రాలతో చూడలేనివి  ఎన్నో మనో నేత్రముతో  చూడవచ్చు కదా. అందుకని గంగాధరుని వామ భాగం
మనో నేత్రం తో చూచి , అమ్మ వైష్ణవీ దేవిని దర్శించిన మానసిక తృప్తిని ,ఆనందాన్ని , పొన్దాను పైసా ఖర్చు
లేకుండా . కళ్ళ తో చూచినవి ఎప్పటికైనా మరచే  అవకాశం లేక పోలేదు . ఇలా మనసు తో దర్శిస్తే  ఇలలో
నున్నంత  కాలం  మరువలేము . ఈ భావన చ్చన్దస్సులో  ఎలా ఉంటుందో నని ఆలోచన వచ్చి అమలు పరిచానంతే .
1. వాసవి, వైష్ణవీ సతి నవారిత భక్తిని దర్శనార్ధమై
   దోసిలి యొగ్గి కోరితిని తోయజ నేత్రుడు గంగధారినిన్
   దోసము గల్గు మీ యెడద దుస్తర పర్వత శ్రేణి మీదటన్
  మోసము చేయవచ్చనుచు మోదము తెల్పరు ఖండితంబుగాన్ .

2. చక్కని యోచనన్ సలుప సాగితి నిట్టుల మానసంబునన్
   ఎక్కడ జూచినన్ గలుగు నీశ్వరి రూపము భక్తి  నిన్డినన్ .
   మక్కువ మీర కాంచెదనుమాపతి   కాయపు వామభాగమున్
  దక్కును నాకు వైష్ణవి సు దర్శనమాత్రపు భవ్య భాగ్యముల్.

3 అమ్మకు మారు రూపమగు నాశ్రిత వత్సల తత్త్వ మెంతయున్ ,
  చెమ్మగు కన్నులం గలిగి చిత్తము మొత్తము నామె వేడినన్
  రమ్మని కౌగిలించి తనరారెడు ప్రేమను వృష్టి సేయు .. మా
  యమ్మగు వైష్ణవమ్మ నిల హార్దిక భక్తిని నంజలించెదన్.

4. ఎంత చేసికొన్న నంతనె ఫలమిచ్చు , నదికమంచు కోర నర్హమగునె ,
   చేయునపుడె  మనము చిత్తంబు రంజిల్ల . భక్తి తత్త్వములను పరగ వలయు. .

5. చానగు వైష్ణవిన్, పరమ సాధ్విని, అంబను , విశ్వ శక్తినిన్ ,
   మానస దర్శనంబు కడు మాన్యత, ధన్యత, సత్ఫలంబిడన్,
   నేనటు జేసితిన్ మదిని నిల్కడ యైన సభక్తి ప్రేరణన్ .
   వేనకు వేలు జోతలివె  వేడ్కను నర్పణ జేతు  మాతకున్ .
 

18, ఆగస్టు 2014, సోమవారం

కృష్ణాష్టమి

కృష్ణాష్టమి

కంజ దళాక్షుని , కన్జాతముల బోలు ఈ చిన్ని పాదముద్రలు మధురా నాధుని , మధుర మనోహర 
మనోజ్ఞ , మంజుల, మాననీయ సౌందర్య విలసితాలు . చిన్ని కృష్ణుని చిరునవ్వులు చిద్విలాసపు 
భువనైక మోహనాలు, అమాయకత్వపు అద్వితీయ నటనా సౌందర్య సారస్యానికి సమగ్ర స్వరూపాలు .ఆ మురళీ నాధుని జన్మాష్టమి సకల భువనములకు పుణ్యా స్టమి. శ్రీ కృష్ణ కృపా కటాక్ష వీక్షణ మహత్ భాగ్యం సర్వులకు కలగాలని మనాసా ఆసిస్తూ. మా యింటికి వచ్చిన జాడలు మీకు చుపిస్తూ .

4, ఆగస్టు 2014, సోమవారం

మానవత్వం

                                                                              మానవత్వం
                                                                         
ఎవరన్న కష్టం లో ఉంటే వారికివారే  కష్టంలో ఉన్నట్లు యితరులకు తెలియజేస్తేనే తెలుస్తుంది. కానీ ఆ సమయంలో అది అందరికి అందించలేక పోవచ్చు . మానవత్వం ఏమంటే ఆ విషయం ఎవరి ద్వారా తెలిసిన వెళ్లి ఓదార్చాలి. అలా ఓదార్చి నా మానసిక బాధని పంచుకొన్నవాడు స్వయంగ నా బావ మరది కీ .శే . గంగరాజు వాసుదేవ మూర్తి . మరొకరు మా కుటుంబ వైద్య శిఖామణి . వారికి కృతఙ్ఞతలు .ఇది 8 సంవత్సరముల నాటి మాట. హృదయాని కలిగిన కోత ఫలితంగా , మానసిక వికారాలు. ( ఊహలు, వగైరాలు ) చెబుతుంటే  అందరు విసుక్కునే వారు. వారు  మాత్రం మీ భావాలన్నీ కాగితం మీద చమత్కారాలు కలిపి పెట్టండి అని సలహా యిచ్చారు . దాని ఫలితమే  ఈ నాటిక. ఇప్పుదేంటి 8 సంవత్సరాలనాటి  సోది అంటారేమో. మొన్ననే దానిని కంప్యుటర్ లో బంధించాను. క్షమించండి.  అందుకని. 

19, మే 2014, సోమవారం

శిరిడి సాయినాధుని దర్శించుకొనే భాగ్యం

కర్నూల్ కు సుమారు 30 కి మీ. దూరంలో ఉన్న ఐదవ శక్తి పీఠమైన , జోగులాంబా దేవిని మొదటగా  చూచే అదృష్టం కలిగింది. ఆ తరువాత భక్త ప్రహ్లాదుని  అవతారమైన రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది . ఇది ఒక మనోహరానుభూతి .రెండు రోజుల వ్యవధానములోనే శిరిడి సాయినాధుని దర్శించుకొనే భాగ్యం కలిగింది. అనుకోని దర్శనమే సాయి బాబా ఇస్తారని అది వారి ప్రత్యేకత  అని అంటారు. నేనలానే పొందాను .  శిరిడి కి 90 కి . మీ  దూరం లో ఉన్న నాసిక్ తరువాత త్రయంబకేశ్వరుని దర్శించటం జరిగింది . గోదావరి జన్మఆపర్వత శ్రేణుల  సమీపం లోనే జరిగింది. పునీతమైన ఆ ప్రదేశాలు తిరుగుతుంటే మధుర మనోహర భావన ఎవరికైన తప్పక కలుగుతుందని నా భావన . అవకాశాలు చెప్పి రావనేది సత్యం.  చిత్రాలు మనోహరం. చూడండి భక్తి తో  మైమరచి . ఈ అవకాశానికి కారకుడు యల్లాప్రగడ సాయి తేజో భరద్వాజ. . వాడి శిరిడి మ్రొక్కు కారణం . 8 మందిమి కలసి మహదానందం పొందాము .































11, మే 2014, ఆదివారం

చాలదు భావం అమ్మ గూర్చి చెప్పటానికి .

చాలదు భావం అమ్మ గూర్చి చెప్పటానికి .
చాలవు పదాలు అమ్మ గూర్చి చెప్పటానికి .
చాలవు శబ్దాలు అమ్మ గూర్చి చెప్పటానికి .
చాలవు లేఖినులు అమ్మ గూర్చి వ్రాయటానికి .
చాలదు యెంత సేవైన అమ్మకు చేయటానికి .
చాలదు యెంత ధనమైన మాత్రూణము తీర్చటానికి .
చాలవు ఎన్ని జన్మలైనా అమ్మ ప్రేమకు బదులివ్వటానికి
చాలరు ఎందరున్న అమ్మ పదవి తీర్చటానికి .
ప్ర కృ తే  అమ్మ , అమ్మయే ప్ర కృ తి .
 పురుషుడు నాన్న ప్రకృతి తోడుగా  నాకు మమతల మల్లెలు పంచారు
అందుకు చాలిన ఆలోచన నాకొకటి వచ్చింది . అదే నిరంతరంప్రేమగా  మాతాపితృభ్యో నమహ అనటం.
తన జన్మకు కారకులైన వారికి చెరగని చిరునవ్వుతో ప్రేమను పంచటం,పెంచటం
చాలు చాలు చాలు అంటుంది చల్లని తల్లి ఎవరైనా ఎక్కడున్నా .

        మాతృ దినోత్సవం సందర్భంగా . నమస్సులతొ.  సూర్యనారాయణ రావు . 11. 05. 14

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

బెండపూడి లక్ష్మి కుమారి గారికి అభినందన పద్యము

   శ్రీమతి బెండపూడి లక్ష్మి కుమారి  గారికి అభినందన పద్యము. ( వల్లీ  కల్యాణం ) 9.04.2014.



సీ.  సంగీత సాధనన్ సం స్తూ యమానినై 
                        వాణి కి రూపుగా వరలె  నెవరు 
      సాహితీ పాతవ సమ్స్కారముల్ జూపి 
                           పలుకుల రాణి గ పండె నెవరు 
     చిరు నాట్య విన్యాస చిన్ముద్ర లం జూపి 
                        భంగిమల్ జూపెడు భామ యెవరు  
    దేశ దేశాలెల్ల  తెల్గు వైభవమ్ము 
                              హరి కదా రూపాన అందజేసి 
తే.గీ. బెండ పూ డి వంశ ప్రేమార్ద్ర రాశి యౌ 
        లక్ష్మి కొమరిత గుణ రత్న భావ 
       విలషిత మమతాల వాలమౌ గృ హిణి 
       భావి కాలమందు భద్ర మగుత . 

గుంటూరు . 
శ్రీ రామ్ నగర్  


కీ.శే . యల్లాప్రగడ శ్రీరామ మూర్తి గారి ప్రాంగణం (గుంటూరు ) లో శ్రీ సీతారామ కల్యాణమహోత్సవము  . చిత్రపటాలు . 














 
 




 


విజయవాడ దుర్గ అమ్మవారి ఆలయంలో చిత్రం . 







        

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...