29, ఆగస్టు 2011, సోమవారం

కాశి

కం . ౫. గంగా తీర్థము జీవికి, భంగంబులు కలుగనట్టి బహు ముఖ పుణ్యాల్

           లింగమ్ము తాకి నట్లుగ,  పొంగారుచు కల్గు గాదె మోదం బెలరన్ .

కాశి విశ్వేశ్వరు నకు ముందుగా డున్ద్ది గణపయ్య మనకు దర్శన మిస్తాడు.

 ఆయనను గురించి .

తే.గీ.౬. డున్ద్ది గణపయ్య కరుణ మాకున్డి యుంట , ఈశ్వరార్చన సులువాయె

            నీప్సితముగ .

            అన్నపూర్ణ, విశాలాక్షి  యాశిషాన, మధుర భావాలు నిండెను

            మనములందు.

అన్నపూర్ణాదేవి కాశిలో ఉండగా అన్నానికి కరువా ? భక్తు లందరికి భోజన

సదుపాయం ఉన్నది కాశిలో

ఉ. ౮. కమ్మని వంటకాలు మమకారము నిండిన వడ్డనమ్బులున్

         అమ్మకు దీసిపోని కరుణామృత సార రసంబు లన్నియున్ ,

         గుమ్మము ద్రొక్కు భక్తులకు కూరిమి నిత్తురు ప్రేమ భావనన్

         అమ్మగు నన్నపూర్ణ  దరి యన్నము లేదను నార్తు లున్దురే?

తే .గీ .౮, అన్నపూర్ణమ్మ సన్నిధి నన్న మెపుడు ,లేదు లేదంచు పల్కులు                 లేశమైన

             వినగ రావయ్యో  కలనైన విబుదులార , వ్యాసు డొక్కడే                పాపాన వాదు నొందె.?

కామెంట్‌లు లేవు:

శోభారాజ్. అన్నమయ్య పురం , పరాభవ ఉగాది .దశావధానం

డా . శోభరాజ్ గారి ప్రస్తుతి పద్యం   వేంకటేశుని పాదాలు వినయగరిమ  అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ   వాని ఫణుతులు విస్తృత పఱచినట్టి  జ్ఞాన శోభాంచి...