31, డిసెంబర్ 2012, సోమవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                శుభాకాంక్షలు 


2012  సంవత్సరము కన్నా 2013 లో అధిక సంతోషాలు. భోగ . భాగ్యాలు .శాంతి సౌఖ్యాలు ఎల్లరు 

అనుభవించాలని నా ఆకాంక్ష . 

    పొన్నెకంటి  సూర్య నారాయణ రావు 

జ్ఞాన వృ ద్ధులకు

జ్ఞాన వృ ద్ధులకు 

మీరుసూదితో బాదితే కష్టం కానీ ( శరీరానికి  ) సుకుమారమైన శ్లోకంతో బాదితే యిష్టమే. సంతోషమే. కోపం వచ్చే అవసరం . అవకాశము లేదు. అయితే వయసును బట్టి చిన్న కనుక ఆశిస్సులు ,జ్ఞానాన్ని  బట్టి ( జ్ఞాన వృ ద్ధుడే వృద్ధుడు ) కనుక నమస్సుమాంజలి .

మీరుదహరించిన భగవద్గీత 6 వ .అ . 34.శ్లో . తర్వాత , 7వ .అ .10వ శ్లో . నందు   " బీజం మాం సర్వ భూతానాం , విద్ధి పార్థ సనాతనం ,  బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహం "..

7వ అ .12వశ్లో .  ఏ చైవ సత్వికాభావా , రాజసాస్తామసాశ్చ ఏ ....మత్త ఏవేతి తాన్విద్ధి  న త్వహం తేషు తే మయి ...

నేను సర్వ స్వతంత్రుడనని ప్రకృతి  త్రిగుణములు నాకు మాత్రమే లోబడి యుండుననియు పల్కినాడు. కనుక జీవులకు భావ ప్రేరణ మతడే . కర్త కర్మ క్రియ అతడే . అందువలన తానె అంతరాత్మయై నిలిచినాడు . ఆత్మ కూడా అంతరాత్మకు లోబడియే యుండును .
 15వ .అ . 15వ శ్లో .. సర్వస్యచాహం  హృది సన్నివిస్టో  ,  మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ , వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో ,   వేదాంత కృత్ వేద విదేవ చాహం.    అంటారు పరమాత్మ.

15వ. అ . 17వ శ్లో .నందు కూడా యిదే భావం కలదు . ఆలోచన ,బుద్ధి , ఆత్మా సహిత శరీర శకటమును పూర్వ జన్మ సుకృత ,దుష్కృత , శేషముల ననుభవిన్చుటకేర్పాటు చేయబడినదనునది సత్యము. వాటిని పోషించుచు కర్మానుసారి ఐ భొగానుభవమునకు అవకాశము  నొసగు దేవదేవుడగు శ్రేష్ట పురుషుడే అంతరాత్మ.

స్వామి  వివేకానంద మొదట అత్మాలోచనాపరుడై రామ కృష్ణ పరమ హంసను సామాన్యుడని భావించి అనంతరము అంతరాత్మ ప్రబోదితుడై ఆతని మాహాత్మ్యము గ్రహించి తన గురువుగా స్వీకరించెను .

          కనుక బుద్ధి రధ సారధి ఐనను ,జీవుడు ప్రయాణీకుడైనను  , అంతరాత్మ ననుసరించియే పయనించును .

   బ్రహ్మజిజ్ఞాస యందు మాత్రము బుద్ధిని జడ పదార్థము గాను ,ఆలోచనా  కేంద్రముగాను చూపినారు .
వేదము మూలజ్ఞానమైనను వారి వారి జ్ఞాన సామర్త్యమును బట్టి వ్యాఖ్యానము లున్డుననుట నిస్సందేహము .

శ్లోక బాదుడు

     శ్లోక బాదుడును నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను .కోపాన్ని ఏ కారణంగా పొందాలి.

శ్లో . విద్యయా వినయా వ్యాప్తిహి .


     సాచేత్ అవినయావహ ,

    కిం కుర్మః కిం ప్రతి బ్రూమః ,

   గరదాయా స్వమాతురి .

అందువలన నాకు నేర్పిన చదువు నాకు అకారణంగా కోపం తెప్పించదు . అయితే పట్టుదల మీరు నేర్పినదే .  

25, డిసెంబర్ 2012, మంగళవారం

ఆత్మ విచా రము .

                                                      ఆత్మ విచా రము .

     బుద్ధి .          శ్లో .. అధిష్టానం చిదాభాసో , బుద్ధి రేత త్రయం యదా .
   ....                                        అఙ్ఞానాదేకవత్ భాతి , జీవ యిత్యుచ్యతే  తదా .
                           భావం ...  అధిస్టా నమగు కూటస్తుడు, చిదాభాసుడు , బుద్ధి , ఈ మూడును , అజ్ఞానము                   వలన ఒకటిగ తోచినప్పుడు జీవ సంజ్ఞ తోచుచున్నది . 1) కూట స్తుడు ... నిర్వికారుడగుట వలన జీవుడు కాదు.  2) చిదాభాసుడు ... మిధ్య యగుట వలన జీవుడు కాదు . 3) బుద్ధి ... యిది జడ మైనది,                                    ఆశ్ర యించునది .  ఈ మూడును కలసియే జీవుడైనాడు .  ( బ్రహ్మ జిజ్ఞాస .2 వ , ప్ర .,, స్వాత్మ ..36. ) 

ఆత్మ....            జీవుడు , శ రీరాదులు
అంతరాత్మ ......బ్రహ్మ పదార్దము. 

వేదాంత పంచ దశి యందు .....బ్రహ్మమే శరీర మందు ప్రవేశించి జీవరూపు డాయెనని , ప్రాణాదులను   ప్రేరేచుట వలన జీవుని పేరు కలిగె నందురు.  ఆత్మయే శరీరాదులు తాన నుకొనుట వలన జీవ భావము కలిగె నని చెప్పిరి .  

బుద్ధి , లింగ దేహము ,ఈ రెండు , అవిద్యా పరిణామములు... ( శంకర విద్యారణ్యులు )


విచార దృష్టి తో జూచిన   జీవేశ్వర భేదమే లేదు . జీవుడు ఆలోచిందే దానినే బ్రహ్మ పదార్థము నిశితం గ ఆలోచిస్తుంది . అందు వలన ఆలోచనలకు అది నికష . 


మనో వాక్ కాయ  కర్మలే  త్రికరణములు . త్రికరణ శుద్ధి కలిగితే దైవత్వమే .

24, డిసెంబర్ 2012, సోమవారం

గోపూజ .

                             గోపూజ
 గవాం అన్గేషు స్థితః  సర్వే దేవతః అహం పూజ యామి

ఇది వేద గాయత్రీ అగ్రహారమందలి పవిత్ర గో పూజ

గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే . .గోవులు బ్రాహ్మణులు, మహిళలు ,ఎచట పూజింప బడతారో అచట సమస్త శుభాలు జరుగుతాయి.
  










                ఆటవెలది 

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
కడివె డైన నేమి ఖరము పాలు 
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభి రామ వినుర వేమ.

ఈ వేమన గారి పద్యం అందరి యెడల సార్థకం కావాలని కోరుకుందాం . సర్వే జనాః సుఖినో భవంతు .సర్వే భద్రాణి పశ్యంతు. 

                                        

            ప్రేమికుల దినోత్సవ సందర్భంగా. గో కౌగిలి. 
         14.02.2023.

అమ్మపాల రుచిని నందలేనటువంటి
           మందభాగ్యునకిది మాతృమూర్తి
కర్షక జీవుల కాడికి కోడెల
           నందించి కాపాడు నమృతమూర్తి
భూసారముంబెంచి ముక్కారు పంటల
             సంపదల్ నింపెడు సాధుమూర్తి
పుణ్య గోమాతయై ముట్టుకొన్ననె చాలు
             స్వర్గమందించు నిస్స్వార్ధమూర్తి
  ఆమె యెవ్వరో యననేల యమలదివ్య
  కామధేనువు సంతతి కరుణనిలయ
  పరమ ప్రేమామృతంబను వర్షమిచ్చి
  తనియజేసెడు శ్రీలక్ష్మి ధన్యురాలు
  కౌగిలింతల మునుగంగ కదలిరండు!                                          

22, డిసెంబర్ 2012, శనివారం

మనసు ,బుద్ది , అంతరాత్మ.

మనసు ,బుద్ది , అంతరాత్మ.

మనసు ...ఇది చంచలమైనది . చురుకైనది. కానీ దీనిని  ఒక చోట కట్టి వేయడం మానవ మాత్రులము గ మనం చేయలేము. కొంత దైవ శక్తి కావాలి. అప్పుడు మన మసును కట్టి వేయగల సూత్రాలు దొరుకుతాయి.  ఆ నాడు
మనం మనవా తీతులము అవుతాము.

బుద్ధి ... ఇది ప్రళ యాన్తకమైనది . ఆ  మనసుని అనుసరిస్తుంది అనాలోచితంగా . అందుకే , అంతరాత్మ నిశితంగా

ఆలోచించి చేయదగిన పనినే సూచిస్తుంది .అదే చేయాలి .

అంతరాత్మ.  అనంతమైన శక్తి కల దైవ వరం . దీనిని ఆధారం చేసుకొనే మనం నిర్ణయాలు  చేసుకోవాలి. ఆనాడే మనం మనవా తీతులుగా ప్రసిద్ధి కెక్కు.తాము


ఈ మూడు శక్తుల కలయికే అనంత త్రికరణ శుద్ధి . యిదే దైవశక్తి. 

21, డిసెంబర్ 2012, శుక్రవారం

పరిమళించిన కవితా హృదయం

పరిమళించిన కవితా  హృదయం     తేది 21.12.2012. రంగారెడ్డి జిల్లా ఈనాడు పేపర్ లో పడింది .ప్రపంచ తెలుగు మహా సభల సందర్భముగా మాబోటి వారికి ఒక నూలుపోగు .అంటే చిన్నపరిచయం ..యింటికి వెతుక్కొంటూ వచ్చిన సాహిత్యాభిమానం . వ్యాస కర్త  ఈ నాడు విలేఖరి చిరంజీవి నంద కిషోర్ 

19, డిసెంబర్ 2012, బుధవారం

అమ్మ

తెలుగు బాసల యాసలు తెలుపుచుండు, తెలుగు బంగారు తీగను తెంపి తెంపి ,ఎన్ని నగలను జేసిన ఎట్టులైన ,     విలువ మారదు తగ్గదు విభవమందు .

                                                              అమ్మ పాట 

అమ్మ కరుణ నాకుంటే అవలీలగ  పాటలొచ్చు  ,    అమ్మ కరుణ నాకుంటే అలవోకగ    మాటలొచ్చు  ,   అమ్మ దయయె   నాకుంటే ఆశువుగా పద్యమొచ్చు .అమ్మ కృపయె   నాకుంటే  అనగరాని దేముందీ  , అమ్మ చూపు  నాకుంటే జగమంతట జయమే ,అమ్మ మనసు నావెంటే  నాకెందుకు భయము  , అమ్మ మదిని తడివి చూడ  అమృతంపు ధారలే  . కమ్మగ అవి  త్రాగితే అసహాయపు ధీరులే    , ఆ అమ్మే వీణ పాణి , ఆ అమ్మే నలువ రాణి . మరువబోకు ,మరువబోకు  ,మహిమలన్నీ ఆమేవే . పాదకమల సేవజీసి ప్రాంజలించు భక్తి తోడ. 

18, మే 2012, శుక్రవారం

భావన

  భావన .  మానవుని మనుగడకు సమాజ శ్రేయస్సు ఒక దివ్య ఆయుధం . ఏ మానవుడు ఎక్కువగా సమాజాన్ని గురించి ఆలోచిస్తాడో అతని మనుగడకి , జీవితానికి ఒక అర్థం ఒక పరమార్థము ఉంటుంది . మాములు ఆయుధాలకి  పదును పోయే అవకాసం ఉన్నది . ఈ మహా ఆయుధానికి సేవ చేసిన కొలది పదునేక్కుతుంది ..కనుకనే అందరు ఈ ఆయుధాన్ని ధరించి దుర్మార్గ , నీచ భావాలకు ఆలవాలమైన  ప్రతి ఒక్కరి మనస్సులలో నున్న స్వార్థ పూరిత విష వృక్షాలను చ్చేదించాలి . నిరంతరం ఆనందాన్ని ప్రసాదించే కల్ప వృక్షాలను పెంచి పోషించాలి . ఎవరి హృదయము లో నిరంతరం నిశ్చల , నిర్మల , భావాలు ఉంటాయో  వారి హృదయమే దేవాలయం . భావమే మహోత్క్రుస్ట దైవము .  

తృప్తి

తృప్తి   మానవునకు ఏంతో ఆనందాన్ని స్తుంది ,ఒకరికి మానసికంగా , మరోకరికి శారీరకంగా. శారీరకంగా  పొందే తృప్తి తత్కాలికమే . మానసికం మరువలేని శాశ్విత ఆనందాన్ని యిస్తుంది . సాధారణ మానవులు శారీరకమే కోరుకొంటారు . మహాత్ములు మానసికం కోరుకొంటారు . మహాత్ములకు , సాధారణ మానవులకు ఉన్న తేడ  కేవలం మనస్సు . మనస్సు కోరికల పుట్ట . తీర్చటం మొదలు పెడితే కోరటం ఆపదు . క్రమంగా కొన్ని అయిన తీర్చకుండా మనసును మనం అరికడితే , క్రమంగా అది మన దారికి వస్తుంది . దానికి మనకు జ్ఞానము అవసరం . జ్ఞానములోనే విచక్షణ ( చేయ తగిన, తగని పనులు ) ఉంటుంది . జ్ఞానమునకు మూలము గురువు . వారివలన ఒక వంతు వస్తుంది .మిగిలిన మూడు తోటి విద్యార్థులతో ,స్వ శక్తి తో , కాల క్రమము లో వస్తుంది . శ్లో .....ఆచార్యాత్   పాదమాదత్తే  , పాదం శిష్య స్వ మేధయా .పాదం స బ్రహ్మచా రిభ్యః ,  పాదం కాలక్రమేణ  చ .  కనుక సంపూర్ణ జ్ఞానం రావాలంటే  మానసిక పరిపూర్ణత రావాలి . దానికి కొంత అయిన దైవ ఆరాధన , ఆత్మ స్థైర్యం , సేవానురక్తి , పెద్దల యెడ ప్రేమానురాగాలు . అవసరం . ఇలాంటి మనసు తో మనం అందరం తృప్తి గ ఉందామా . ప్రయత్నం చేసి చూడడం తప్పులేదు .

5, మార్చి 2012, సోమవారం

భయం

భయం ...భయం ...భయం ...


మనసును బాధపెట్టే దేనిని చూచిన భయమే. సంతోషాని కి వ్యతిరేక పదమే ఈ భయం . ముఖ్యంగా ప్రతి జీవికి మరణం అంటే( మృత్యువు) భయం . మనం సహజంగా దేన్ని చూచి భయపడతామో  అదే నిరంతరం మనలను చూచి కవ్విస్తుంది. మన వెంట పడుతుంది ఆంటాడు ఒక మహా కవి . నిజమేమరి సమాజం లో కూడా అదే జరుగుతున్నది . ఎవరు    ( ధర్మ అధర్మ విచక్షణతో ) భయపడతారో వారినే ఎదుటివారు భయపెడతారు . ఎదురు తిరిగేవారిని ఎవరు భయపెట్టలేరు. ఉదాహరణకు మన వెంట ఒక శునకం వెంట పడితే ....మనం భయపడి పరుగిడితే అది వెంటపడుతుంది. అది భయపడి పరుగిడితే మనం వెంట పడతాము .

    మరి ఏసంగతి అయిన యింతే అనుకుంటే పనులు చాల సులువు అవుతవి . మన భయం మరణం గురించి కనుక మనమే దానికి ఎదురు తిరిగితే సరి. అంటే ఆధ్యాత్మకముగా మనసును ధైర్యం చేస్తే మరణం అంటే భయం ఉండదు. యిది ఏనాటికైనా నిత్య సత్యము. కనుక  ఒంటరిదానినని మనసు భావించకుండా దానికి ఏదో ఒక దైవ శక్తిని జోడిస్తే అది ధైర్యం పుంజుకొని మరణాన్ని సైతం జయిస్తుంది. వేదాంతం కాదిది నిజంగా నిజం.  

1, మార్చి 2012, గురువారం

వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః ...

వృక్షములను మనము రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి. అవి  నిస్వార్థ జీవులు. త్యాగ జీవులు. మన మనుగడ, శ్వాస పైనే ఆధారపడి 
యున్నది. అలాంటి శ్వాసను ( ఆక్సిజన్ ) ప్రతి ఫలాపేక్ష లేకనే  యిచ్చి వాటి త్యాగమయ జీవితాన్ని రుజువు చేసుకొంటున్నాయి వృక్షాలు. అందుకనే ఒక మహాకవి , 

           పరోపకారాయ వహంతి నద్యః , పరోపకారాయ  దుహన్తి గావః ,
           పరోపకారాయ  ఫలంతి వృక్షః . పరోపకారార్థం  యిదం శరీరం.

(పరోపకారం కొరకే నదులు , ఆవులు , వృక్షాలు , మహాత్ములు .పాటు పడుతున్నారు ) అన్నాడు . మహాత్ములావిధం గానే ఉంటారు. వారు  మేలు చేసి మరచి పోతారు. వారిని  మరచి పోయినచొ  వారిపట్ల మనం కృతఘ్నులమే .  కొందరు చెట్టంత పెరుగుతారు కాని చెట్టుకున్నంత  జ్ఞానాన్ని , త్యాగ గుణమును   పొందలేరు. 
అది వారి వారి జన్మ సంస్కారం. అంతేకదా మరి.మనందరం అలా కాకుండా ఉందామా . 

29, ఫిబ్రవరి 2012, బుధవారం

చిరునవ్వు

చిరునవ్వు  ...చిరునవ్వు , 

నవ్వులన్నిటిలో ఆకర్షణీయ మైనది. నవ్వులలో చాలా రకాలున్నాయి. హాసము, మంద హాసము, వికటాట్ట హాసము. హాసము అంటే దంతములు కనబడేటట్లు , నవ్వటం . మంద హాసమంటే దంతములు కూడా కనబడ కుండా నవ్వటము.యిదే చిరునవ్వు . శరీరమంతా చలించే టట్లు  నవ్వ టము .మన సాహిత్య లోకంలో నవ్వు నాలుగందాల చేటు అంటారు . దీనికి కారణం రామాయణంలో రామ పట్టాభిషేక  సమయానలక్ష్మన స్వామి , నవ్వటం . ( లక్ష్మణుడు తన పదునాలుగేండ్ల రామసేవా సమయంలో రాని నిద్రాదేవత యిప్పుడు ,పట్టాభి షేక  సమయంలో వచ్చిందనే భావనతో నవ్వాడు .,) అది అందరికి అన్యార్థం తోచి మనసులలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసారు . మంద హాసం చేసి ఉంటె అలాంటి భావం వచ్చేదే  కాదేమో . కనుక మనం మంద హాసం (చిరునవ్వు ) చేయటం ఎంతైనా మంచిది . నవ్వు నాలుగందాల అనర్థం అంటే, వికటాట్ట హాసం విపరీతార్థం యిస్తుంది. అందుకే నవ్వాలి , కానీ పరిధి దాట కుండా. నవ్వటం, యోగం, నవ్వలేక పోవటం రోగం , నవ్వించడం భోగం .

22, ఫిబ్రవరి 2012, బుధవారం

వాక్ శుద్ధి

వాక్  శుద్ధి . 


భావనా పటిమ కలవాడే వాక్ శుద్ధి కలవాడు. భావానికి ప్రేరణ మనస్సు . త్రికరణ శుద్దులలో మనసు మొదటిది .  రెండవది వాక్కు  ,మూడవది కాయము . స్వచ్చమైన ఆలోచన సరళి , అంతే స్వచ్ఛతతో అలోచిన్చినదే 
వాక్కు రూపంలో వెలువరించడం , ఏ రెండిటికి సమాన   స్థాయిలో శరీరంతో పని చేయించడం . ఈ మూడింటి సమన్వయమే త్రికరణ శుద్ధి అనవచ్చును . త్రికరణ శుద్ధి కలిగి ఉండటమే దైవత్వము. సత్యవచనాన్ని పన్నెండు సంవత్సరాలు  విధి గ పాటిస్తే దైవత్వం వస్తుందని ఆర్యోక్తి . మరి నిరంతరం సత్య వాక్ పాలనా నియమం ఉంటె వారు దైవమే. దైవం అంటే ఆనంద నిలయం . అలాంటప్పుడు త్రికరణ శుద్ధితో ఆనంద నిలయ ప్రవేశ అర్హత సాధించటానికి ఎందుకు కృషి చేయ కూడదు ? అందరికి ఆనందం కావాలి . ప్రవేశ అర్హత కావాలి . అందుకే అందరం ప్రయత్నిద్దాం. రండి .

1, ఫిబ్రవరి 2012, బుధవారం

పరిశీలించడం ,

చూడటం , వీక్షించడం , పరికించడం , పరిశీలించడం , 

ఈ నాలుగు పదాలు  భిన్నమైన అర్ధాలు కలిగి ఉంటాయి .

చూడటం ..... ఏ ఆలోచన లేక కన్నులకు మాత్రమే పని అప్పచెప్పటం .

వీక్షించడం ...కన్నులకు , బుద్ధి కి , మాత్రమె పని అప్పచెప్పటం .

పరికించడం . కన్నులకు ,బుద్దికి ,మనస్సుకి ,మాత్రమే పని చెప్పటం .

పరిశీలించటం  ..కన్నులకు ,మనస్సుకు , అంతరాత్మకు , సాక్షిగా ,
                           ఆలొచనాసహితంగా  స్పందించడం
వస్తువులను , చూస్తే సరిపోతుంది .ప్రకృతిని వీక్షిస్తే సరిపోతుంది . లౌకిక
విషయాలను పరికిస్తే సరిపోతుంది . కాని పార లౌకిక విషయాలను
పరిశీలించినా, ఒక పట్టాన అర్థం కావు.
వానిని సద్గురు ముఖముగా మాత్రమే అధ్యయనం చేయాలి . అప్పుడు కూడావారి వారి పూర్వ జన్మ పుణ్య ఫలం గ ఆద్యాత్మిక విషయాలు అబ్బుతాయి .

13, జనవరి 2012, శుక్రవారం

మకర సంక్రాంతి

మకర సంక్రాంతి . సూర్యుడు పన్నెండు రాసులలో 
సంచారం చేస్తూ పుష్య మాసంలో మకరరాసిలో 
ప్రవేశిస్తాడు  . అందు వలన మకర సంక్రాంతిగ 
దీనిని పిలుస్తారు . ఈ రోజు నుండి ఉత్తరాయణం 
వస్తుంది . అంటే భీష్ముడు కూడా స్వచ్చంద మరణం 
కోరుకున్న రోజు . భోగి , సంక్రాంతి , కనుమగ ఈ పండుగ ప్రసిద్ధి చెందింది. చిన్నారులకు దృష్టి దోషం తగలకుండా
రేగు పండ్లు, నాణెములు , పూలు, తలపై పోసి , పెద్దలు 
శతాయుష్మన్ భవ. అని దీవిస్తారు. భోగి మంటలలో మన పాపాలన్నీ కాలి, పునీతులము అవుతామని ,మానసిక స్వచ్ఛత పొందుతామని ప్రసిద్ధి , కనుమనాడు  పశువులను అలంకరిస్తారు. అనగా  హిందూసంప్రదాయానుసారం     పశు పక్షి జాతులను కూడా ప్రేమించే మానవాతీత మనస్సు మనది.    ఈ చిత్రం లో చిరజీవులు హిమజ , మహిత, మనోజ్ఞ , ధీరజ్ లు . నిష్కల్మష మనస్సుతో . వారి వారి భావాలను పంచుకుంటున్నారు కంప్యుటర్ లో. కానీ మనోజ్ఞ మాత్రం.............
సంక్రాంతి కొఱకు ఎదురు చూస్తున్నది కాబోలు . దాని చూపులు  చూడండి. చిన్నారి హృదయం పెద్ద దేవాలయం .
సంక్రాంతి అందరకు శుభ, సుఖ సంతోషాలు తేవాలని , మనసా, వాచా , కర్మణా  కోరుకుంటున్నాను.
  

7, జనవరి 2012, శనివారం

మనసు

మనసు
తేలికైన మనసు ఎప్పుడు మనిషికి ఆనందాన్ని యిస్తుంది .   ఆలోచనా కుహరం లోకూరుకుపోయిన మనసు తనుకుంచించుకు పోతూ
జీవితాన్ని కూడా కుంచింప జేస్తుంది . అది లేకుండా ఉండాలంటే మనసు లో
అలల తాకిడి కొంతైన తగ్గించు కోవాలి . అపుడే మానసిక ప్రశాంత చైతన్యం కలిగి
మానవుడు మాధవుడు గ మారుతాడు . దేహం దేవాలయం గ , సదాలోచనలే
దైవంగా రూపు చెందుతాయి . అపుడు
దైవం తో అను సంధానం అక్కర లేదు .
తనే దైవం .౬.౦౧.౨౦౧౨.
   

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...