25, మే 2013, శనివారం

నాగఫణి శర్మ గారి అవధానం

అవధాన సరస్వతీ పీఠం, హైదరాబాదు లో విశ్వ శాంతి కొఱకు 30..05. 2013 నుండి3.06.201 3 వఱకు" అవధాన సహస్రఫణి ,బృహత్ ద్వి సహస్రావధాని " బ్రహ్మశ్రీ  డా . మాడుగుల నాగఫణి శర్మగారి ద్వి శతావధానం ( 207 మందితో  ) జరిగినది .  దానికి అవధాన విజయినిగా నామకరణం చేయుట  జరిగింది . నేనాన్ద్ధ్రో పాధ్యాయునిగా  గా పనిచేయుచున్నప్పుడు వారి ద్వి సహస్రావధానంలో పాల్గొని చక్కని అనుభూతి పొన్దాను. మరల నాకి ప్పుడవకాశం కలగటం ఎంతో  అదృష్టము . ఆనాడు, ఈనాడు సమస్యనిచ్చే అవకాశమే వచ్చింది ,మరొక అనుభూతి , నిషిద్ధాక్షరి కూడా యివ్వవలసి రావటం క్రొత్త అనుభవము. నా సమస్య, నిషిద్ధాక్షరి , విషయాలు రెండు  వేద గాయత్రీ అగ్రహార సృష్టికర్త అయిన చి. ప్రభాకర శర్మను గూర్చి,  అభివృద్ధిని గూర్చి అడుగుట జరిగినది, పద్యములు రసస్పోరకముగా ,మనోహరముగా వచ్చినవి.

1. పృచ్చకులు :- పొన్నెకంటి సూర్య నారాయణ రావు .    30.. 3. 2013

    సమస్య :- ఉ:-వేదము రోదనంచు బహు విజ్ఞత బల్కిరి పండితోత్తముల్ .
     పూరణ :-      ఆదిమ కాలమందు శివుడద్భుతరీతి నటిమ్పగా --మహా
                         నాదము లుప్పతిల్లె ,రసనారస సర్వ శరీరమందు --నా
                         సోదిత రోదసీ కుహర సూనృత రోదన పుట్టె  వేదమై ,
                         వేదము రోదనంచు బహు విజ్ఞత బల్కిరి పండితోత్తముల్.
2.  పృచ్చకులు :- --            
     సమస్య :-     విద్య నేర్పువాడు వెఱ్ఱి వాడు .
   పూరణ :-తే.గీ. గుణము నేర్పకుండ గుణశాలి యనకుండ,
                         అదను చూచి బుద్ధి నరయ కుండ ,
                         శాస్త్ర  వాదములను శ్రద్ధతో ననయంబు ,
                         విద్య ............
3.   పృచ్చకులు :- --
      సమస్య :- ( సంస్కృతము ):- కవయః కావ్య తస్కరః
      పూరణ :-   వ్యాస వాల్మీకి కావ్యేషు చామ్శాన్ గృహ్ణన్ తి తే వరాన్ ,
                       తావన్మాత్రేణ కిం కిం తే కవయః కావ్య తస్కరాః

4.  పృచ్చకులు :- రాపాక ఎకామ్బరా చార్యులు గారు .
     సమస్య :-    దారుణ కృష్ణ సర్పము సుధల్ వేలిగ్రక్కుచునుండె చూడరే ,

    పూరణ :-     సార కవిత్వ మద్భుతము సమ్భ్రుత   ధర్మమ కావ్య మర్మమున్
                       ధీర సమాజ పూజితము ధీ వివిధప్రభు సేవితమ్బనన్
                       తీరుగనన్ సుధీవరుడు  తెల్పె  వధాని కవిత్వ రాజ -బృం
                       దారుణ .......                                                                                                  ( సశేషం )
                       
   

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...