12, జూన్ 2013, బుధవారం

వర్ణనలు -2

వర్ణనలు - 2

1.     పృ :-  శ్రీ .కె. వి. యస్. ఆచార్య. 
  
         వి.:- కవి గురించి.  పదాలు. 1. రాగము. 2. భొగము. 3.యాగము. 4. త్యాగము. 

        ఉ.:- రాగ ముఖీనుడై రసము రంజిల చేయవలెన్ ఋషీంద్రుడై 
               భోగము సత్కవిత్వ నవ భోగము గాగ శిరంబు లూగగా 
               యాగము కావ్య ధార మహితాద్యముగా శతలోక పూజ్యమై 
               త్యాగము మూలభాగముగ సత్కృప శిష్య శిరంబు పైకనున్ , 

2. పృ :-  శ్రీ మతి .   టి . మీనా కుమారి . 

     వి. :- అమ్మను లలితతో పోలుస్తూ .  పాట . 

    లలితా హృదయమే కదా తల్లి , 
    శ్రీ కరుణా యుత సుధా కల్ప వల్లి ,
    కొడుకు గుచ్చు ముల్లయినా తల్లికి సిరి మల్లి 
    విషము చిందు వాడైనా ఆ ఎదకు పాల వెల్లి 
    ఏ అమ్మయైన అమ్మల గన్నట్టి యమ్మ . 
    ఏ అమ్మయైన కొమ్మల పై తేనె పట్టు చిమ్మిన చిరు  చెమ్మ . !! లలితా హృదయమే !!

3. పృ :-  యం . కృష్ణయ్య గౌడ్ . 

    వి. :- మద్య పాన నిషేధం . 

కం . మద్యము మానుము మానుము ,
        హృదయము మానమ్ము నిచ్చు హృదయము విచ్చున్ .
        సద్యో బలమౌ దేహము  
       విద్యయు జ్ఞానమ్ము ధన వివేకము గలుగున్ . 

4. పృ :-  శ్రీ మతి . ఆర్ . కమల గారు . 
   వి. :- విశ్వనాధ వారిని గురించి. 

  తే . గీ :-  విశ్వ నాధుండు కవి కళా విశ్వనాధ . 
               కవన సామ్రాజ్య నాధుడై గణుతి కెక్కె. 
               తన పొలాన నాటనిది విత్తన మదేది ?
               నాట పండనిడేది ధన్యాకరమ్ము . 

5. పృ :-  సురేష్ బాబు. 

     వి. :-  శివుడికి తల్లిఉండి  ఉంటే  ఆయన హాలాహల భక్షణ సమయంలో ఆమె వేదన . 

     ఆ.వె.  :-   జనని లేదుగాన సరిపోయినదిగాని 
                     తల్లడిల్లి పోవు తల్లి యున్న 
                    మార్చి మార్చి గొంతు మరి మరి తడుముచు 
                     స్పర్శ  తోడ నమృత సారమిచ్చు . 

 ఈ పద్యము చెప్పి నప్పుడు నాగ ఫణి శర్మ గారి స్పందన  వారి మాటల్లోనే . 
 " నేను అవధానాలు చేసేటప్పుడు నా మాతృ దేవత నా దగ్గఱకు వచ్చి గొంతు నొప్పిగా ఉన్నదా నాన్నా ! 
అంటూ నా గొంతు క్రింద స్పృసించేది .  వెంటనే నాకెంతో ఆనందంగా హాయిగా ఉండేది .  అదే తల్లి మనసు. 
ఎన్ని జన్మలెత్తినా తల్లి ఋణము తీర్చుకో గలమా !! 

                                                                  సశేషం .







పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...