వర్ణనలు - 2
1. పృ :- శ్రీ .కె. వి. యస్. ఆచార్య.
వి.:- కవి గురించి. పదాలు. 1. రాగము. 2. భొగము. 3.యాగము. 4. త్యాగము.
ఉ.:- రాగ ముఖీనుడై రసము రంజిల చేయవలెన్ ఋషీంద్రుడై
భోగము సత్కవిత్వ నవ భోగము గాగ శిరంబు లూగగా
యాగము కావ్య ధార మహితాద్యముగా శతలోక పూజ్యమై
త్యాగము మూలభాగముగ సత్కృప శిష్య శిరంబు పైకనున్ ,
2. పృ :- శ్రీ మతి . టి . మీనా కుమారి .
వి. :- అమ్మను లలితతో పోలుస్తూ . పాట .
లలితా హృదయమే కదా తల్లి ,
శ్రీ కరుణా యుత సుధా కల్ప వల్లి ,
కొడుకు గుచ్చు ముల్లయినా తల్లికి సిరి మల్లి
విషము చిందు వాడైనా ఆ ఎదకు పాల వెల్లి
ఏ అమ్మయైన అమ్మల గన్నట్టి యమ్మ .
ఏ అమ్మయైన కొమ్మల పై తేనె పట్టు చిమ్మిన చిరు చెమ్మ . !! లలితా హృదయమే !!
3. పృ :- యం . కృష్ణయ్య గౌడ్ .
వి. :- మద్య పాన నిషేధం .
కం . మద్యము మానుము మానుము ,
హృదయము మానమ్ము నిచ్చు హృదయము విచ్చున్ .
సద్యో బలమౌ దేహము
విద్యయు జ్ఞానమ్ము ధన వివేకము గలుగున్ .
4. పృ :- శ్రీ మతి . ఆర్ . కమల గారు .
వి. :- విశ్వనాధ వారిని గురించి.
తే . గీ :- విశ్వ నాధుండు కవి కళా విశ్వనాధ .
కవన సామ్రాజ్య నాధుడై గణుతి కెక్కె.
తన పొలాన నాటనిది విత్తన మదేది ?
నాట పండనిడేది ధన్యాకరమ్ము .
5. పృ :- సురేష్ బాబు.
వి. :- శివుడికి తల్లిఉండి ఉంటే ఆయన హాలాహల భక్షణ సమయంలో ఆమె వేదన .
ఆ.వె. :- జనని లేదుగాన సరిపోయినదిగాని
తల్లడిల్లి పోవు తల్లి యున్న
మార్చి మార్చి గొంతు మరి మరి తడుముచు
స్పర్శ తోడ నమృత సారమిచ్చు .
ఈ పద్యము చెప్పి నప్పుడు నాగ ఫణి శర్మ గారి స్పందన వారి మాటల్లోనే .
" నేను అవధానాలు చేసేటప్పుడు నా మాతృ దేవత నా దగ్గఱకు వచ్చి గొంతు నొప్పిగా ఉన్నదా నాన్నా !
అంటూ నా గొంతు క్రింద స్పృసించేది . వెంటనే నాకెంతో ఆనందంగా హాయిగా ఉండేది . అదే తల్లి మనసు.
ఎన్ని జన్మలెత్తినా తల్లి ఋణము తీర్చుకో గలమా !!
సశేషం .
సశేషం .