.
ఇవి మనం ఊహింప గలమా.. . బంధం మనం కల్పించు కొన్నదైతే , అనుబంధం సహజ సిద్ధంగా ఏర్పడేది . ముందుగ మనం వివాహ పరంగా ఒక బంధం ఏర్పాటు చేసుకొంటాము . సంతానం కలగటం వలన వారికొక అనుబంధం ఏర్పడుతుంది . అనుబంధానికి సంకేతమే ప్రేమ .బన్ధానిది ఒక ప్రేమ .అనుబందాని కి మరొక ప్రేమ .ఈ ప్రేమలు మానవత్వానికి ప్రతీకలుగా ఉంటె, పస్పరం అనుబంధం బలపడి, అవి కుటుంబానికి ,సమాజానికి , దేశానికి మేలుని చేకూరుస్తాయి . అయితే సమాజంలో ఎక్కువమంది అసూయా, ద్వేషం, అహంభావం , అనే స్వార్థభావాలు మూలాలుగా కలిగియుండుట చేత మనం అనుకునే అనుబంధాలు ,బంధాలు . వ్యర్థ పదాలుగా కేవలం కధలలో, కవితలలో, ఉహలలో మిగిలి పోతున్నాయి . విడిపోతున్న బంధాలకు , అనుబంధాలకు నిస్స్వార్ధవర్తనమే సరి అయిన పరిష్కారం . జీవితం మనమూహించినంత సుదీర్ఘమైనది కాదు . కనుక యిద్దరి మనసులలో నిస్వార్థంగా , సాంఘిక మర్యాదలతో కలిగే ప్రేమ, అనేక బంధాలకు , అనుబంధాలకు సంకేతమై నిలుస్తుంది. అందుకనే హిందూ ధర్మానుసారం , ఒక వ్యక్తి తల్లి గాని, తండ్రి గాని మరణించి నప్పుడు పేగు బంధం తెగి పోయినది అనుదానికి సంకేతం గ దీక్షా వస్త్రంలో ఒక భాగాన్ని చింపి అతని మెడలో వేస్తారు , కార్య క్రమాలు పూర్తి కాగానే తీసివేస్తారు . మనం వాటిని నిలబెట్టుకోకపోతే మానవత్వానికి , హిందుత్వానికి విలువ ఏముంటుంది .