10, అక్టోబర్ 2019, గురువారం

మహర్నవమి. అమ్మ కరుణ.7.10.2019.

మహర్నవమి., అమ్మ కరుణ.7.10.2019.

 శ్రీ గోపరాజు హనుమంతరావు గారి (దంపతుల)ఆహ్వానం మేరకు
 శ్రీయుతులు, సుహృన్మిత్రులు,ప్రముఖ అష్టావధాని సురభి శంకర శర్మ గారి పనుపున నేను, నాశ్రీమతి ఇందిరా దేవి వెళ్ళుట జరిగింది.
        గోపరాజు లక్ష్మి దంపతుల భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలు, ఆప్యాయతానురాగాలు, హిందూధర్మ నైష్టికతలు, సంప్రదాయాలు వాటిపై గల విశ్వాసం ఎనలేనివి, మరువరానివి. వారి మహోన్నత సంస్కారానికి ఇవే నిదర్శనాలు.  ముందుగా పార్వతీ పరమేశ్వరులకు పూజాదికములు పూర్తి చేసి మా యిరువురకు  మంత్ర యుక్త స్వాగతము పలుకుచు లోనికి దోడ్కొనిపోయి పీఠముల నలంకరింపజేసి నన్ను, ఇందిరను పార్వతీ పరమేశ్వరులుగా ఆవాహనజేసి షోడసోపచారములు చేసి మా ఆశీస్సులను(పద్యరూప) గైకొని తత్ఫలముగా వస్తు, వస్త్ర,ఫలాదిక భూరిదానములనిచ్చి భోజనముపెట్టి ఇంటికడ ఆ దాన సముదాయమును దింపుకొను నిమిత్తమొక సేవకుని బంపిన వారి యౌదార్యము కడు ప్రశంసనీయము. వారికి ధన్యవాదాలు. మీరు పొందవలసిన సన్మానము మేము పొందే  అవకాశము కల్పించుట మీకు మాపై గల అవ్యాజానురక్తులనక తప్పదు.శ్రీ గోపరాజు హనుమంతరావు గారు పొన్నెకంటి హనుమంతరావు గారికి శిష్యులగుట ఎంతో ఆనందము కలిగించినది.

            గోపరాజు వారి కూరిమి సేవలు
            పూర్వపుణ్యఫలము ముక్తిత్రోవ
            అమ్మ కనకదుర్గ హర్షితమూర్తియై
            పూజలందుకొనియె రోజురోజు.
    గోపరాజు లక్ష్మి కోరగ మైత్రిచే
    నీశునైతి నేను నీప్సితముగ
    నచట నాదు సతియె అగజగా మారగా
    పూజలందె మాకు మోదమలర.
     శ్రీ హనుమంతరాయ వరచేడియ శ్రీసతి లక్ష్మి నామ్ని , న
     న్నూహలదేలజేసినదహో యన నీశుడు, దుర్గభావనన్
     స్నేహ విశేషబంధములు చేయును నద్భుత ధర్మకార్యముల్
     దేహపు తన్మయత్వమున తేజమునిండెనపూర్వశక్తి తోన్.

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...