మకర సంక్రాంతి . సూర్యుడు పన్నెండు రాసులలో
సంచారం చేస్తూ పుష్య మాసంలో మకరరాసిలో
ప్రవేశిస్తాడు . అందు వలన మకర సంక్రాంతిగ
దీనిని పిలుస్తారు . ఈ రోజు నుండి ఉత్తరాయణం
వస్తుంది . అంటే భీష్ముడు కూడా స్వచ్చంద మరణం
కోరుకున్న రోజు . భోగి , సంక్రాంతి , కనుమగ ఈ పండుగ ప్రసిద్ధి చెందింది. చిన్నారులకు దృష్టి దోషం తగలకుండా
రేగు పండ్లు, నాణెములు , పూలు, తలపై పోసి , పెద్దలు
శతాయుష్మన్ భవ. అని దీవిస్తారు. భోగి మంటలలో మన పాపాలన్నీ కాలి, పునీతులము అవుతామని ,మానసిక స్వచ్ఛత పొందుతామని ప్రసిద్ధి , కనుమనాడు పశువులను అలంకరిస్తారు. అనగా హిందూసంప్రదాయానుసారం పశు పక్షి జాతులను కూడా ప్రేమించే మానవాతీత మనస్సు మనది. ఈ చిత్రం లో చిరజీవులు హిమజ , మహిత, మనోజ్ఞ , ధీరజ్ లు . నిష్కల్మష మనస్సుతో . వారి వారి భావాలను పంచుకుంటున్నారు కంప్యుటర్ లో. కానీ మనోజ్ఞ మాత్రం.............
సంక్రాంతి కొఱకు ఎదురు చూస్తున్నది కాబోలు . దాని చూపులు చూడండి. చిన్నారి హృదయం పెద్ద దేవాలయం .
సంక్రాంతి అందరకు శుభ, సుఖ సంతోషాలు తేవాలని , మనసా, వాచా , కర్మణా కోరుకుంటున్నాను.