30, సెప్టెంబర్ 2014, మంగళవారం

బీదర్ లోని లక్ష్మీనరసింహ స్వామీ ఆలయ దర్శనం . ది 30.. 14

             బీదర్ లోని లక్ష్మీనరసింహ స్వామి  ఆలయ దర్శనం .ది 30.09 . 14 

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రవేశం ఒక ప్రత్యేక మైనది . తాండూరు లోని 
ద్వాదశ శివ క్షేత్రం సుప్రసిద్ధము  . ఎందుకనగా పరమ శివుని దర్శించటానికి 
భక్తులు కొంత దూరం నీటి లో నడవాలి . ఆ నీరు షుమారు రొమ్ముబంటి ఉంటాయి . ఇష్టమైన  వారు నీటిలో వెళ్ళుట , అలా వీలుకాని వారు వేరే విధం గ వెళ్ళుట జరిగి మొత్తానికి శివ దర్శనము చేసికొన వచ్చును, 
               
కాని బీదర్ లో మాత్రం తప్పక నీటిలో వెళ్లి మరల నీటిలో నుంచే రావాలి. ఆ నీరు మొలబంటి ఉన్నాయి .వయసు యెంత అయిన ఎవరికి వారికి రొమ్ము బంటే నీరు వస్తాయట . అదే నరసింహ స్వామి మాహాత్మ్యమట . కాని ఈ రోజు మాత్రం నీరు కటి బంటి  మాత్రమె ఉన్నాయి .  ఏ రకమైన యిబ్బంది లేకుండా మేమందరము  స్వామిని దర్శించుకొని వచ్చాము . చాల ఆనందం గ ఉన్నది. 101 అంటి గారి భర్త గారిని కూడా జాగ్రత గ తీసికొని వెళ్లి తీసికొని వచ్చాను. ఆయన ఉబ్బసము తో బాధ పడుతున్నారు . కాని వెళ్లి రావటం లో ఏ యిబ్బంది పడలేదు . 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...