కేరళ పర్యటన.
రమ్మభినందనా!భరత రత్నమ!వీరకిశోరమై తగన్
దమ్మును జూపి పాకునకు దర్పమడంచిన నుక్కుమానిసీ
ఇమ్మహి భారతీయుడొకడేకద శాంతియుశౌర్యదర్పముల్
చిమ్మెడు ధైర్య శాలి,ఘన శ్రేయము గూర్చిన నీవెయాతడౌ.
(శబరి ఎక్స్ప్రెస్ లో ఉండగా అభినందన్ ను పట్టుకొని
మరల విడుదలై భారత్ వస్తున్నాడని తెలసి,దానికి స్పందన.)
ది.1.03.19న మ.11.45.కి *శబరి ఎక్స్ప్రెస్ *లో మా కేరళ ప్రయాణం. మహాయోధుడు, భరతమాత ముద్దుబిడ్డ అయిన అభినందన్ స్వదేశానికి చేరుతున్నాడన్న శుభవార్త తో ప్రారంభమై , చేరాడన్న వార్త తో ముగిసింది. ఎంత సంతోషాన్ని అనుభవించింది భరతజాతి!!జై భారత్. !
ది.2.03.19. :కణ్ణగి(అంబ)ఆలయం,రామాలయం కొడంగలూర్: లోచి చూచి ఆ రాత్రికి గురువాయూర్ లో బసచేశాము.
(కణ్ణగి దేవతయైన కథ: కోవలన్,కణ్ణగి ప్రేయసీ ప్రియులు. కావేరి పట్టణపు ధనికుని కుమారుడు కోవలన్ అందాలరాశియైన కణ్ణగిని ప్రేమించి పెళ్ళిచేసికొని,కొంతకాలానికి మాధవి అనే వేశ్యా వ్యామోహంలో పడి, సర్వంకోల్పోయి మరల భార్యను వెదుకుతు వచ్చి, ఇంటనే ఉంటు వ్యాపారంచేసే నిమిత్తం భార్య ఇష్టప్రకారం
ఆమె ముత్యాల కాలియందె అమ్మే ప్రయత్నం చేయగా, అదే సమయంలో మహారాణి ఒక కాలి (ఇలాంటి దే)పోగా , దానికై వెదకు భటులీతనిని దొంగని భావించి రాజుదగ్గరకు తీసికొని పోగా రాజు ఇతనికి మరణశిక్ష వేస్తాడు. విషయం తెలిసిన వెంటనే కణ్ణగి రాజ సభకేగి తన భర్త నిరపరాధి యని, రాణిగారి అందెకు తన అందెకు కల భేదం నిరూపిస్తుంది. రాజదంపతులవమానభారంతో మరణిస్తారు. కోపోద్రిక్తురాలైన కణ్ణగి తన ఒక స్తనం కోసి మధురై లో విసరి ఆపట్టణం భస్మం కవాలని శపిస్తుంది. వెంటనే దేవతలు దిగి వచ్చి కణ్ణిగిని ఓదార్చి ఆమెను స్వర్గానికి పంపుతారు. ఆమే కొడంగలూర్ లో ఉన్న కణ్ణగి అమ్మవారు.)
ది.303.19న *గురువాయూర్*లో ఉ.6.00లకు వెళితే మ.1.30.కి దర్శనం అయింది. (కురువాయ్..అనగా సముద్రతీరం, ఊరు, కలసి కురువాయూర్,అయిందని, గురువు బృహస్పతి పాతాళశిలతో ఏర్పడ్డ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని వాయువు సహకారంతో త్రిశూర్ కు 30.కి.మీ దూరంలో గల గురువాయూర్ లో ఉంచారని కధనం, అచట ఉన్నది విష్ణురూపం, కృష్ణుని గా పూజిస్తారు ఆయనే గురువాయూరప్పన్.)

సీనియర్ సిటిజన్స్ కి ఉ.9.నుండి ప్రవేశమున్నది.
మాకావిషయం తెలియక ఆ ప్రయత్నమే చేయలేదు.ఇక నుండి తప్పక ఏ గుడికి వెళ్లినా ఒక చేసంచిలో ఆధార్ , బిస్కెట్లు, మంచి నీళ్ళు తీసుకుని వెళ్ళాలి. వచ్చిన భాషలోనే సెక్యూరిటీని వివరాలడగాలి. ఇది స్వానుభవము.భోజనానంతరం కాలడి, శంకరాచార్యుల పాదుకలున్న స్థలం, కనధారా స్తోత్రము చదివిన స్థలము , లక్ష్మీ దేవాలయము చూచి చోటానిక్కర కు చేరాము. చోటా నిక్కర అను ఊరిలో రాజరాజేశ్వరి దేవిని, భగవతి అమ్మవారిని చూచి, ఇచటే మకాం చేశాము.


వేదంబు నాదరూపిగ
ఖేదంబులుబాపుభూమి కేరళయిదియే
వాదాంతమయ్యెనిచ్చట
మోదంబంతామాదే మున్నార్ లోనన్.1.
పేదరాలైన ప్రమదయె ఖేదమంది
ఉసిరి కాయను భిక్షగా నుంచుమనగ
నాదిశంకరులంతట నమ్మనడిగి
స్వర్ణ వర్షమ్ము గురియించె పూర్ణకృపను.4.
ది.4.03.19.మహాశివరాత్రి. ఉ.7.గం.లకు*చోటానిక్కర్ *లో బయలుదేరి *వైకాం*లోని శివుని దర్శనం చేసుకున్నాము.11.గం.లకు *అలెప్పీ *చేరాము. అచటినుండి *మున్నార్ *కి బయలుదేరి రాత్రి 8కి చేరాము.
ది.5.3.19.ఉ.9.గం.లకు బయలుదేరి తేయాకు తోటలు చూచి భోజనం చేసి హోటల్ రూంకు వచ్చాము.


దమ్మును జూపి పాకునకు దర్పమడంచిన నుక్కుమానిసీ
ఇమ్మహి భారతీయుడొకడేకద శాంతియుశౌర్యదర్పముల్
చిమ్మెడు ధైర్య శాలి,ఘన శ్రేయము గూర్చిన నీవెయాతడౌ.
(శబరి ఎక్స్ప్రెస్ లో ఉండగా అభినందన్ ను పట్టుకొని
మరల విడుదలై భారత్ వస్తున్నాడని తెలసి,దానికి స్పందన.)
ది.1.03.19న మ.11.45.కి *శబరి ఎక్స్ప్రెస్ *లో మా కేరళ ప్రయాణం. మహాయోధుడు, భరతమాత ముద్దుబిడ్డ అయిన అభినందన్ స్వదేశానికి చేరుతున్నాడన్న శుభవార్త తో ప్రారంభమై , చేరాడన్న వార్త తో ముగిసింది. ఎంత సంతోషాన్ని అనుభవించింది భరతజాతి!!జై భారత్. !
ది.2.03.19. :కణ్ణగి(అంబ)ఆలయం,రామాలయం కొడంగలూర్: లోచి చూచి ఆ రాత్రికి గురువాయూర్ లో బసచేశాము.
(కణ్ణగి దేవతయైన కథ: కోవలన్,కణ్ణగి ప్రేయసీ ప్రియులు. కావేరి పట్టణపు ధనికుని కుమారుడు కోవలన్ అందాలరాశియైన కణ్ణగిని ప్రేమించి పెళ్ళిచేసికొని,కొంతకాలానికి మాధవి అనే వేశ్యా వ్యామోహంలో పడి, సర్వంకోల్పోయి మరల భార్యను వెదుకుతు వచ్చి, ఇంటనే ఉంటు వ్యాపారంచేసే నిమిత్తం భార్య ఇష్టప్రకారం
ఆమె ముత్యాల కాలియందె అమ్మే ప్రయత్నం చేయగా, అదే సమయంలో మహారాణి ఒక కాలి (ఇలాంటి దే)పోగా , దానికై వెదకు భటులీతనిని దొంగని భావించి రాజుదగ్గరకు తీసికొని పోగా రాజు ఇతనికి మరణశిక్ష వేస్తాడు. విషయం తెలిసిన వెంటనే కణ్ణగి రాజ సభకేగి తన భర్త నిరపరాధి యని, రాణిగారి అందెకు తన అందెకు కల భేదం నిరూపిస్తుంది. రాజదంపతులవమానభారంతో మరణిస్తారు. కోపోద్రిక్తురాలైన కణ్ణగి తన ఒక స్తనం కోసి మధురై లో విసరి ఆపట్టణం భస్మం కవాలని శపిస్తుంది. వెంటనే దేవతలు దిగి వచ్చి కణ్ణిగిని ఓదార్చి ఆమెను స్వర్గానికి పంపుతారు. ఆమే కొడంగలూర్ లో ఉన్న కణ్ణగి అమ్మవారు.)
ది.303.19న *గురువాయూర్*లో ఉ.6.00లకు వెళితే మ.1.30.కి దర్శనం అయింది. (కురువాయ్..అనగా సముద్రతీరం, ఊరు, కలసి కురువాయూర్,అయిందని, గురువు బృహస్పతి పాతాళశిలతో ఏర్పడ్డ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని వాయువు సహకారంతో త్రిశూర్ కు 30.కి.మీ దూరంలో గల గురువాయూర్ లో ఉంచారని కధనం, అచట ఉన్నది విష్ణురూపం, కృష్ణుని గా పూజిస్తారు ఆయనే గురువాయూరప్పన్.)

సీనియర్ సిటిజన్స్ కి ఉ.9.నుండి ప్రవేశమున్నది.
మాకావిషయం తెలియక ఆ ప్రయత్నమే చేయలేదు.ఇక నుండి తప్పక ఏ గుడికి వెళ్లినా ఒక చేసంచిలో ఆధార్ , బిస్కెట్లు, మంచి నీళ్ళు తీసుకుని వెళ్ళాలి. వచ్చిన భాషలోనే సెక్యూరిటీని వివరాలడగాలి. ఇది స్వానుభవము.భోజనానంతరం కాలడి, శంకరాచార్యుల పాదుకలున్న స్థలం, కనధారా స్తోత్రము చదివిన స్థలము , లక్ష్మీ దేవాలయము చూచి చోటానిక్కర కు చేరాము. చోటా నిక్కర అను ఊరిలో రాజరాజేశ్వరి దేవిని, భగవతి అమ్మవారిని చూచి, ఇచటే మకాం చేశాము.


వేదంబు నాదరూపిగ
ఖేదంబులుబాపుభూమి కేరళయిదియే
వాదాంతమయ్యెనిచ్చట
మోదంబంతామాదే మున్నార్ లోనన్.1.
పేదరాలైన ప్రమదయె ఖేదమంది
ఉసిరి కాయను భిక్షగా నుంచుమనగ
నాదిశంకరులంతట నమ్మనడిగి
స్వర్ణ వర్షమ్ము గురియించె పూర్ణకృపను.4.
ది.4.03.19.మహాశివరాత్రి. ఉ.7.గం.లకు*చోటానిక్కర్ *లో బయలుదేరి *వైకాం*లోని శివుని దర్శనం చేసుకున్నాము.11.గం.లకు *అలెప్పీ *చేరాము. అచటినుండి *మున్నార్ *కి బయలుదేరి రాత్రి 8కి చేరాము.
ది.5.3.19.ఉ.9.గం.లకు బయలుదేరి తేయాకు తోటలు చూచి భోజనం చేసి హోటల్ రూంకు వచ్చాము.

ఎన్నో సుందర తరువులు
మిన్నున్ కరమంటజూచు మేల్భళి యనగా
చెన్నౌ తేయాకుగుబురు
లెన్నన్ మున్నారునందు నెలవైయుండెన్.2.
దేవభూమియనెడు ధీరత్వగరిమచే
మిన్ను నంటజూచు మన్నునుండి
చిన్న బీజమైన చిగురులుతొడుగునుచె
కరము ముదముతోడ శరమువోలె.3.
ది.6.3.19.ఉ.7.గం.లకి మున్నార్ లో బయల్దేరి *ఎట్టుమనూర్* శివాలయం 12.40.కి చేరాము. ఆలయం మూశారు.(మున్నార్ నుండి ఎట్టుమనూర్ 130కి.మీ) సా.5.30.లకు *తిరువనంతపురం* రాత్రికి 7.15కి చేరి వెంటనే దర్శనం చేసుకున్నాము.
ది.7.3.19.న శ్రీపద్మనాభస్వామి దర్శనం రెండవసారి అయింది.
పద్మనాభుని దర్శనంబదియొకింత
పుణ్యమో భవ బంధ విమోచనమ్మొ
తెలియరాదది యెప్పుడున్ ధీరమతికి
నైన, పరమవిజ్ఞాని మహాత్ముకైన.5.
నాభిన సృష్టి కర్త,చరణాబ్జములందుపవిత్రగంగనిన్
శోభదలిర్పగా సిరిని సుందర డెందమునందునిల్పి సం
క్షోభములెన్నిరేగినను కోపముజెందని చిద్విలాసతన్
ప్రాభవముల్వెలార్చుసురవందితునంబుజనాభుగొల్చెదన్.6.
దైవదూషణంబు,ధనగర్వముండుటన్
మహిషుడౌను గాదె మానవుండు
పద్మనాభ! నిన్ను పలుమార్లు ధ్యానింప
పుణ్యహృదయుడగుచు మోక్షమందు.7.
పద్మనాభుని దర్శనం రెండవసారి అయిన పిదప ఉ.10.00లకు బయలుదేరాము.మ.1.00కి * పండలమ్ *లో భోజనం పూర్తి అయింది. *అర్నాముల*పార్థసారథి* దేవాలయములో
సా.5.00.లకు కృష్ణ దర్శనం అయింది. *చెంగనూర్*లో సా.6లకు. ఈశ్వర దర్శనం అయినది. ఎట్టుమన్నూర్ లో ,రాత్రికి బస.
ది.8.3.19. ఎట్టుమన్నూర్ లో శివదర్శనమైనది.
శివశివ యంచునామమును చిత్తము నందనిశంబుదల్చినన్
భవభవ యంచుపాపములుభగ్గున మండుచుబూదియౌనుగా
అవనత శీర్షతన్ భవుని హ్లాదముతోడుత నంజలించినన్
నవవిధ భక్తిభావములనాట్యముజేయుహృదంతరాళముల్.8.
అమ్మ పార్వతి సద్దయనందుకొనిన
కమ్మనైనట్టి కైతలు కళలవెన్నొ
చిమ్ముకొనివచ్చు నిరతంబు చేతమందు
అమ్మదనమున నున్నదే కమ్మదనము.9.
విఘ్నరాజైన గణపతి వీక్షసేయ
సర్వకార్యాలు సిద్ధించి సౌఖ్యమబ్బి
వాంఛితంబులు ఫలియించి వైభవాన
మాన నీయుడై వెలుగొందు మానవుండు.10.
కార్తికేయుని దర్శింప నార్తిదీరి
సంతు లేదను దుఃఖంబు సమసిపోవు
పూర్వజన్మంపు కర్మముల్ ముగిసిపోవు
భావిజీవితమంతయు భవ్యమగును.11.
ఎట్టుమన్నూరు పరమేశు నెట్టులైన
కాంచగల్గిన భాగ్యంపు కాంక్షదీరు
సర్వమంగళ దర్శన సారమనిన
జన్మ సార్ధక్యమందును జగతిలోన.12.
వడక్కనాథన్ ఆలయం త్రిశూర్ లో సా 6.00.లకు చూచాము.
మిన్నున్ కరమంటజూచు మేల్భళి యనగా
చెన్నౌ తేయాకుగుబురు
లెన్నన్ మున్నారునందు నెలవైయుండెన్.2.
దేవభూమియనెడు ధీరత్వగరిమచే
మిన్ను నంటజూచు మన్నునుండి
చిన్న బీజమైన చిగురులుతొడుగునుచె
కరము ముదముతోడ శరమువోలె.3.
ది.6.3.19.ఉ.7.గం.లకి మున్నార్ లో బయల్దేరి *ఎట్టుమనూర్* శివాలయం 12.40.కి చేరాము. ఆలయం మూశారు.(మున్నార్ నుండి ఎట్టుమనూర్ 130కి.మీ) సా.5.30.లకు *తిరువనంతపురం* రాత్రికి 7.15కి చేరి వెంటనే దర్శనం చేసుకున్నాము.
ది.7.3.19.న శ్రీపద్మనాభస్వామి దర్శనం రెండవసారి అయింది.
పద్మనాభుని దర్శనంబదియొకింత
పుణ్యమో భవ బంధ విమోచనమ్మొ
తెలియరాదది యెప్పుడున్ ధీరమతికి
నైన, పరమవిజ్ఞాని మహాత్ముకైన.5.
నాభిన సృష్టి కర్త,చరణాబ్జములందుపవిత్రగంగనిన్
శోభదలిర్పగా సిరిని సుందర డెందమునందునిల్పి సం
క్షోభములెన్నిరేగినను కోపముజెందని చిద్విలాసతన్
ప్రాభవముల్వెలార్చుసురవందితునంబుజనాభుగొల్చెదన్.6.
దైవదూషణంబు,ధనగర్వముండుటన్
మహిషుడౌను గాదె మానవుండు
పద్మనాభ! నిన్ను పలుమార్లు ధ్యానింప
పుణ్యహృదయుడగుచు మోక్షమందు.7.
పద్మనాభుని దర్శనం రెండవసారి అయిన పిదప ఉ.10.00లకు బయలుదేరాము.మ.1.00కి * పండలమ్ *లో భోజనం పూర్తి అయింది. *అర్నాముల*పార్థసారథి* దేవాలయములో
సా.5.00.లకు కృష్ణ దర్శనం అయింది. *చెంగనూర్*లో సా.6లకు. ఈశ్వర దర్శనం అయినది. ఎట్టుమన్నూర్ లో ,రాత్రికి బస.
ది.8.3.19. ఎట్టుమన్నూర్ లో శివదర్శనమైనది.
శివశివ యంచునామమును చిత్తము నందనిశంబుదల్చినన్
భవభవ యంచుపాపములుభగ్గున మండుచుబూదియౌనుగా
అవనత శీర్షతన్ భవుని హ్లాదముతోడుత నంజలించినన్
నవవిధ భక్తిభావములనాట్యముజేయుహృదంతరాళముల్.8.
అమ్మ పార్వతి సద్దయనందుకొనిన
కమ్మనైనట్టి కైతలు కళలవెన్నొ
చిమ్ముకొనివచ్చు నిరతంబు చేతమందు
అమ్మదనమున నున్నదే కమ్మదనము.9.
విఘ్నరాజైన గణపతి వీక్షసేయ
సర్వకార్యాలు సిద్ధించి సౌఖ్యమబ్బి
వాంఛితంబులు ఫలియించి వైభవాన
మాన నీయుడై వెలుగొందు మానవుండు.10.
కార్తికేయుని దర్శింప నార్తిదీరి
సంతు లేదను దుఃఖంబు సమసిపోవు
పూర్వజన్మంపు కర్మముల్ ముగిసిపోవు
భావిజీవితమంతయు భవ్యమగును.11.
ఎట్టుమన్నూరు పరమేశు నెట్టులైన
కాంచగల్గిన భాగ్యంపు కాంక్షదీరు
సర్వమంగళ దర్శన సారమనిన
జన్మ సార్ధక్యమందును జగతిలోన.12.
వడక్కనాథన్ ఆలయం త్రిశూర్ లో సా 6.00.లకు చూచాము.