24, జనవరి 2013, గురువారం

ఎరావికులం నేషనల్ పార్క్




ఎరావికులం నేషనల్ పార్క్ :- మున్నారు :-నుండి  15కి.మీ. దూరంలో,97.కి.మీ. వైశాల్యంతో  ఉన్నది .ఇచటి ప్రత్యేక  జంతువు నీలగిరిటార్ ( మేకవంటి జంతువు ).ఈ పార్కులో  అసాధారణమైన శీతాకోకచిలుకలు,జంతువులు ,పక్షులున్నాయి .నీలకురింజి పూలు ,కొండవాలులలో మనకు ప్రత్యేక  దర్శనమిస్తాయి .నీలి రంగు పరదా కప్పినట్లున్నది  .పశ్చిమ కనుమలలోనే కనుపించే ఈ నీల కురింజి 12 సంవత్సరాలకొకసారి వికసిస్తుంది .ఇది 2006లో వికసించినట్లు చెప్పారు . మరల 2018లో మనం వానిని చూడవచ్చు .ఇచట పలురకాల టీ పాకెట్లు అమ్ముతారు .వివిధమైన తేనీరు మనం రుచి చూడవచ్చు. ( ఖరీదు చెల్లించి ). రు 7.కె మనకు పెద్దగ్లాసు         తే నీరు వస్తుంది . మున్నార్ నుండి మనం కేరళ ప్రభుత్వమేర్పాటు చేసిన వాహనాలలోనే పార్కుకి వెళ్ళాలి ఇచటి డ్రైవర్ల ప్రతిభ వర్ణణాతీతం . ఈమాత్రం పొరబాటు జరిగిన మనం కీర్తి శేషులము కాగలము. వారి చేతులలో ప్రతి సారి 30 మంది ప్రాణాలు .వారికి, భగవానునకు మనం కృతజ్ఞులం. ఈ పార్క్ లోనే అనేక ఓషధులున్నాయట .
  టాప్  స్టేషన్ .:- మున్నార్ నుండి 3 మీ.కి. దూరంలో కలదు .ఇది మున్నార్ కొడైకెనాల్ రహదారిలోనున్న ఎతైన ప్రదేశం . ఇక్కడనుండి తమిళనాడును చూడవచ్చు .నీలకురింజి పూలిచట విస్తారంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ":స్ట్రాబిలాంతస్ కున్తియానా" .
   పల్లివాసన్ :-కేరళలోని మొదటి విద్యుత్ ప్రణాలికా  కేంద్రం. చిన్నకసల్
  అనునది 2000మీ .ఎత్తునుండి పడే జలపాతం .ఎతిరాపల్లికి 10కి.మీ.
  దూరం లో ఉండే మనోహర జలపాతం .దానిని చూడగానే మా మనసులు
ఈ విధంగా స్పందించాయి .
  సీ .జలపాతముంజూడ ,తలపున మెరయును ,బమ్మెర కవిశ్రేస్టు భక్తి  రసము
       జలపాతముంగాంచ చక్కగ వెల్గును , రవి వర్మ కుంచెన రంగులన్ని
          జలపాతమున్గన్న తలపోయగానగు , స్వామి నరేంద్రుల స్థాయి ఎంతో
          జలపాతమున్దల్ప జాణయౌ బ్రహ్మను , స్వ్మరియిమ్పజాలక సాగలేము  .
తే.గీ . ఎదిరపల్లికి చేరువన్నెగసి పడెడు ,  జలధి సోయగమేమని చాట గలము ?
ప్రకృతి అందాలు భావింప పరవశించు , మనసు తనువెల్ల పులకించి మధుర మగును.

  అలెప్పి.:-ఇది ఎర్నాకులం నుండి 50 కి.మీ దూరంలో నున్న ( బ్యాక్ వాటర్ ) సముద్రపు నీరున్న ప్రాంతము .ఇందులో బోటు షికారు చేస్తారు . బోటులోనే                                     మనయింటిలో మాదిరిగా  సమస్త
సౌకర్యాలుంటాయి. ఈ బొట్లు మనమిచ్చే  డబ్బునుబట్టి ఉంటాయి . రాత్రులందు                                      అందులో నివాసముండే అవకాశముంటుంది .ఆబోటులో ఒక డ్రైవరు ,వంట మనిషి ,                                          ఒక సహాయకుడు ఉంటారు . ఉదయం 8.గం.లకు .అల్పాహారము . మధ్యాహ్నం
2.గం.లకు . భోజనముంటుంది . సముద్రపు నీటిఒడ్డునే చిన్నచిన్న గ్రామాలున్నాయి .
అచ్చటి నారికేళ వృక్షాలు మన సరిహద్దులను  కావలి  కాచే సిపాయిల మాదిరిగా ,
ఒకే వరుసలో ఇరుప్రక్కల ఉండి వాటి క్రమ శిక్షణ ను నీటిలో తొంగి చూసుకుంటున్నాయి
ఆ ప్రకృతి  మనోహర సోయగాలు అవ్యక్త మధురాలు . అనిర్వచనీయాలు,అనుభవైక
బోధ్యాలు. అచటి వంట మాత్రమె కాక .అనాస పండు కోసి పెట్టిన తీరు మమ్ములనెంతో 
 అబ్బురపరచింది . కేరళ నావలు నడిపే పందాలకు ప్రసస్తి. అందుకే ఒకనాటి ఉదయమే
అచటికి విద్యార్థులు వచ్చి నావలను నడుపుతున్నారు. అందులో బాలికలున్డటం ,
విశేషం .వారికి తగిన సూచనలివ్వటానికోక యిద్దరు ఉపాధ్యాయులు వచ్చారు .         అలెప్పి ని చూచినపుడు మా భావమిలాఉన్నది .

సీ. సంద్రంపు నీటిలో సాగిపోవ నా బోటు,సందర్శకాళికి సంతసంబు ,

     అలలపై తేలెడి అందాల అలెపియే ,హృదయంత రాళాల హత్తుకొనును,
    ఆదరమ్బును జూపి యజమాని రప్పించి, ఆనందపర్చు నాయలెపిబోటు,  
    అనుభవించినకొద్ది ఆహ్లాదమిచ్చును ,మధుర యానంబును మరువలేము
తే.గీ .నారికేళపు వృక్షాల నడుమనున్న,బోటు వరుసల శోభల పోల్చగల్గు,
   పదములున్డునే తెలుగునపారజూడ,కాంచగల్గుటయొక్కటే ఘనతయౌను.  

 " ఏటి ఒడ్డు  వారికి నీటి భయం , కాటి ఒడ్డు వారికి చావు భయం ఉండదంటారు "అక్షర సత్యం అనిపించింది.
         16 వ తేది అలెప్పి లో గడపి . 17 ఉ. ఎర్నాకులం వచ్చి. బొట్ మెరైన్ చూచి
ఆ రాత్రి బెంగుళూరికి  తిరుగు ముఖం పట్టాము . మా కన్నా మా పిల్లలు ఎక్కువ
ఆనందాన్ని అనుభవించారు. సహజమేకదా .  మరొకసారి వెళ్లి వచ్చిన  అనుభవాలతో కలుద్దాం .
 నమస్తే.      
   
 .

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...