6, జూన్ 2015, శనివారం

కృషితో నాస్తి.

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం.   నిరంతరం కృషి చేసే వారికి ఏనాడు దరిద్రము ఉండదు. తపో ధనులకు పాపముండదు.
                 కృషి అనే పదానికి , వ్యవ సాయము,  పని , ప్రయత్నం  అని అర్ధాలు న్నవి . వ్యవ సాయం చేసే , వ్యవసాయ దారునకు , నెల్లపుడు ఏదో ఒక పని ఉంటుంది .దాని వలన అతనికి ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ఆదాయం ఉంటుంది .ఆదాయం ఉన్నప్పుడు దరిద్రానికి తావులేదు . అలానే తపస్సు చేసే తాపసికి పాపముండదు .                నిరంతరం కృషి చేయటం వలన ( ఏపని లో మనకు నైపుణ్యం కావాలో దానిని ) ఆ పనిలో ప్రత్యక నైపుణ్యం వస్తుంది . దీనినే ఆంగ్లం లో  వర్క్ యక్స్పీరియన్స్ అంటారు . పని అనుభవం  లేకుంటే , ప్రతి పని లోను మనం రాణించ లేము . మన మనసు చాల విచిత్రమైనది. పాపం దానిని ఎలా అలవాటు చేస్తే అలా పని చేస్తుంది .ఈ సమయానికే మనం అన్నం తినాలని నిర్ణ యించుకొంటే , మన మనసు ఆ సమయానికే ఆకలి కలిగించేటట్లు ఆజ్ఞలు జారి చేస్తుంది . . అలానే ఒక వాహనం నడపాలంటే దానిని ప్రతి రోజు ఉపయోగించి తీరాల్సిన్దె. కన్నులు , చేతులు , కాళ్ళు , అప్రయత్నంగా వాటి పని అవి నైపుణ్యంగా చేసికోనేవరకు వదలకూడదు .
                                                        పని .పొరపాట్లు
             పని చేస్తేనే మనం ఏ పోరపాటు చేశామో , ఎక్కడ చేసామో తెలుస్తున్ది.  పని చేయక పొతే మనకు పొరపాటు ఏమిటో తెలియదు. అయితే తెలివి గల వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే , చేసిన పొరపాటే మరల చేయ కుండుట అంటే క్రొత్తవి చేయమని కాదు. తినగా తినగా వేము తియ్యనుండు . అనగా యెంత కష్టమైన పని అయినా సులువు అవుతుంది  ఏపని అయిన సాధనము చేతనే సులభ సాధ్యమౌతుంది . ఇది నిత్య సత్యమ్.
         

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...