5, మార్చి 2012, సోమవారం

భయం

భయం ...భయం ...భయం ...


మనసును బాధపెట్టే దేనిని చూచిన భయమే. సంతోషాని కి వ్యతిరేక పదమే ఈ భయం . ముఖ్యంగా ప్రతి జీవికి మరణం అంటే( మృత్యువు) భయం . మనం సహజంగా దేన్ని చూచి భయపడతామో  అదే నిరంతరం మనలను చూచి కవ్విస్తుంది. మన వెంట పడుతుంది ఆంటాడు ఒక మహా కవి . నిజమేమరి సమాజం లో కూడా అదే జరుగుతున్నది . ఎవరు    ( ధర్మ అధర్మ విచక్షణతో ) భయపడతారో వారినే ఎదుటివారు భయపెడతారు . ఎదురు తిరిగేవారిని ఎవరు భయపెట్టలేరు. ఉదాహరణకు మన వెంట ఒక శునకం వెంట పడితే ....మనం భయపడి పరుగిడితే అది వెంటపడుతుంది. అది భయపడి పరుగిడితే మనం వెంట పడతాము .

    మరి ఏసంగతి అయిన యింతే అనుకుంటే పనులు చాల సులువు అవుతవి . మన భయం మరణం గురించి కనుక మనమే దానికి ఎదురు తిరిగితే సరి. అంటే ఆధ్యాత్మకముగా మనసును ధైర్యం చేస్తే మరణం అంటే భయం ఉండదు. యిది ఏనాటికైనా నిత్య సత్యము. కనుక  ఒంటరిదానినని మనసు భావించకుండా దానికి ఏదో ఒక దైవ శక్తిని జోడిస్తే అది ధైర్యం పుంజుకొని మరణాన్ని సైతం జయిస్తుంది. వేదాంతం కాదిది నిజంగా నిజం.  

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...