2, అక్టోబర్ 2016, ఆదివారం

న్యూనాగోల్ సమావేశం.2.10.2016

రఘుప్రసాద్ గారు,జోనల్ కమీషనర్. ముఖ్య అతిథిగా, సింగయ్యగారి అధ్యక్షతన "న్యూనాగోల్ లో సీనియర్ సిటిజన్స్" సమావేశం ది.2.10.2016,న సాయంకాలం 5గం.లకు ఘనంగా జరిగింది. ఆసందర్భంగా ఐదుగురు సీనియర్ సిటిజన్స్ కు సంస్థ తరఫున సన్మానం జరిగింది. రఘుప్రసాద్ గారు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. వారికి సర్వదా కృతజ్ఞతలు.
       ఆ సందర్భంగా సభ్యులకు నేనిలా స్వాగతం పలికాను.

  1. స్వాగతమో వయోగుణ సుసాధిత జ్ఞాన సమృద్దులార! స
      ర్వాగమ ధర్మనిర్మల విరాజిత మానిత ధుర్యులార! మీ
      యాగమనంబుమాకిపుడు హ్లాదముగూర్చును,సంస్థకున్ మహా
      భోగపుహేతువైచనునుపూర్ణమనోజ్ఞత పాదముంచుడీ!
                          సంస్థ స్థాపన.......
 2. రెండువేలపదిన పండిన యోచనన్
     జనవరి నెలలోన జననమందె
     నవ్యసంస్థ యిదియె నాగోలు పేరునన్
     దివ్యశక్తి మతిగ తేజరిల్లె.
 3. స్త్రీలు పురుషులిచట చైతన్యవంతులైకక
      నిలచియుండి తమదు నేర్పుమీర
     సభ్యులైరి కలసి సంస్థ శ్రేయస్సుకై
     వృద్ధి జెందెకీర్తి హృద్యముగను.
            ఈ రోజు ప్రాముఖ్యం.......
 4. ఐక్యరాజ్యసమితి యాధ్వర్యమందున
      విశ్వవృద్ధులకది వేడుకనగ
      జన్మదినమటంచు చాటించె ప్రభుతయె
      అక్టొబరొకటిన మహాద్భుతముగ
 5. ఐదుమంది సభ్యులర్హత గుర్తించి
     వయసులోన దగిన వారిజేర్చి
      గారవంబుసేయు ఘనమైన కార్యమున్
      సలుపుచుంటిమిచట సౌమ్యులార !
             సంస్థ లక్ష్యములు.....
 6. సభ్యులందరిలోన సాంఘిక చేతనన్
                         లాలన గలిగించు లక్ష్యమనగ
     సహకారమందించి సౌమ్యతగురిపింప
                          లాలించురీతులె లక్ష్యమనగ
     పుట్టిన రోజులన్ మోదాన గుర్తించి
                          లఘుగారవంబిడు లక్ష్యమనగ
      ఆటపాటలతోడ నారోగ్యమందించి
                           లౌక్యాన నడిపించు లక్ష్యమనగ
       స్థాపనంబైన చిరకాల సంస్థ మనది
       పెద్దవయసున్న మాన్యులు పేర్మిబొగడ
       నూతనంబైన నాగోలు పూతమవగ
       సద్యశమ్మును నార్జించె సౌమ్యులార!.
 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...