21, జూన్ 2013, శుక్రవారం

జిజ్ఞాస .

                  జిజ్ఞాసకు నిదర్శనం . డా . యల్లాప్రగడ సుబ్బారావుగారు  .





జ్ఞాతుం  ఇచ్చా జిజ్ఞాస . ఏ విషయ మైన తెలిసికోవాలనే కోరికనే జిజ్ఞాస అంటారు . వీనిలో చాలా పద్ధతులు న్నాయి .  1. మనకు మనం స్వయముగా  ఆలోచించుట .   2. గ్రంధములను చదువుట . 3.అనుభవజ్ఞులైన  వారిని  ( గురువులను ) అడుగుట . 4.  దేశ పర్యటన .   5. స్వాను భవము  ముఖ్యమైనవి.  ఈ సందర్భముగా మనము ఒక మహా కవి శ్లోకమును గుర్తు చేసికొందాము .

శ్లో .   ఆచార్యాత్  పాదమాదత్తే , పాదం  శిష్య స్వమేధయా , 
        పాదం స బ్రహ్మచారిభ్య్హ : , పాదం కాల క్రమేణ చ.

( జ్ఞానము గురువుగారి నుండి  1భాగము, శిష్యుని స్వమేధ వలన 2వ భాగము , తోడి విద్యార్థుల వలన 3వ భాగము , కాలక్రమముగా వచ్చు అనుభవముతో 4వ భాగము వస్తుంది )
                 
        ఏ విషయమైన తెలియ నంత వరకు యెంత కష్టం గ ఉంటుందో , ఆ విషయము తెలిసిన తరువాత అంత సులువు అవుతున్ది." కరతల ఆమలకం" ( చేతిలో నున్న ఉసిరిక పండు ) అవుతున్ది.  తెలిస్తే అది ఆవ గింజ , తెలియకుంటే అది అనంత పర్వతం . ప్రతి విషయము మనకు తెలియటానికి మనం నిరంతర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది .  "  కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు " అనే వాక్యం నిత్య సత్యమ్. కృషితో నాస్తి దుర్భిక్షం , జపతో నాస్తి పాతకం . 

      మన మెదడుకి పదును పెట్టి విషయాన్ని మనం కనుక్కుంటే కలిగే ఆనందం అనిర్వచనీయం , అద్భుతం . ఇది మన శక్తికి నిదర్శనం . ఉత్తమం . ఇతరుల వలన తెలిసి కొనుట ఆనంద దాయకం , ద్వితీయ శ్రేణి . విషయగ్రహణా పేక్ష లేక యుండుట అధమం .ఉత్తమ మానవుడు నిరంతరం ఉత్తమ మార్గ గామిగానే ఉండుటకు ప్రయత్నిస్తాడు . ఆతడే సమాజానికి, దేశానికి , మేలు చేయ గలుగుతాడు . మార్గ దర్శకుడు అవుతాడు . ద్వితీయ శ్రేణికి చెందిన వారు మార్గ అనుయాయులుగా అవుతారు . తృతీయ శ్రేణికి చెందినవారు  వారే అధమస్తులు గ ఉండుట వలన సమాజానికి అంతగా ఉపయోగ పడలేరు .

ఇంతటి మహత్తర జ్ఞానము వినమ్ర గుణ భూషితుల దగ్గర ఉంటే సర్వ కాల సర్వావస్థలలో మణి వలే ప్రకాసిస్తున్ది. 


పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...