25, సెప్టెంబర్ 2014, గురువారం

దసరా ది. 26..09 . 14 న కార్యక్రమము .

           శరన్నవ రాత్రి ఉత్సవముల సందర్భముగా .( దసరా) ది. 26..09 . 14 న కార్యక్రమము .

               శ్రీమాన్ మరింగంటి రాఘవాచార్యుల  వారితో ( అష్ట లక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు ) పరిచయం.  (ది. 24. 09. 14 న )

   దేవాలయ ప్రాంగణం లో ది. 26. 09. 14. ఉదయము 8. గం .లకు శ్రీమతి  వి. వి. యస్. కృష్ణ  కుమారి , మరియు  శ్రీమతి  పద్మ లత గారు  అన్నమాచార్యుల వారి కీర్తనలు  పాడుటకు  అనుమతి లభించింది . కృష్ణ కుమారి గారు కీర్తన లకు వ్యాఖ్యానం ఉంటే  బాగుంటుందనే ఆలోచన వచ్చి నన్ను చెప్పమని అడిగారు . నేను

అంగీకరించాను . వారి కీర్తనలకు అనుగుణం గ విషయం వ్రాసుకొన్నాను . ఈ రోజు ఆచార్యుల వారి దగ్గర కొంత అభ్యాసం చేయాలని విషయం వారికీ చూపించాలని అంటే వారి యింటికి వెళ్ళాము . నేను వ్రాసిన దానిలో అన్నమయ్య గారిని గురించి కొంచెం తగ్గించి చెప్పమన్నారు . మిగిలినది అంతా బాగున్నది అని అన్నారు . చాలఆనందం గ ఉన్నది. కార్య క్రమం 
విజయవంతమైతే యింకా ఆనందం . క్రొత్త క్రొత్త అనుభవాలు వస్తున్నాయి . 
అయాచితం గ వచ్చే అవకాశాలే మధురానుభూతులను యిస్తాయి . విలువలను పెంచుతాయి. 

.

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...