ది. 2. 11. 14 నుండి 9. 11. 2014 వరకు . అవధాన రాజధానీ
. ఈ కార్యక్రమం మహోన్నతంగ భారత దేశ రాజధాని అయిన డిల్లి మహానగరం లో ద్వి సహస్రావధాని ,డా . మాడుగుల నాగ ఫణి శర్మ గారి చే నిర్వహించబడింది . పృచ్చకులసంఖ్య 250. ఉత్తర,దక్షిణ ప్రాంత సంస్కృత కవులు , పండిత ప్రకాండులు కళాకారులు , రాజకీయ నాయకులు ఎందరో పాలుపంచుకొన్నారు ఎందరో మహాను భావులు . అందరికి వందనాలు . .
దీనిలో ముఖ్యముగా 1. సమస్య . 2. దత్త పది . 3. నిషిద్ధాక్షరి
4. వర్ణన 5 . అశువు 6. మీమాట ..నా పాట . 7. నృత్య పది .
8. స్వర పది . 9. చిత్ర పది.అనే అంశాలు ఉన్నాయి.
అన్ని అంశాలు మనోహరం గ మనో రంజకం గ సాగినవి. నేను
నిషిద్ధాక్షరి లో పాలు పంచుకొన్నాను నిషిద్ధాక్షరి అవధాని గారికి పృచ్చకునకు మధ్యన జరిగే సాహిత్య (తో )రణం. దీనిని
పద్య రచన చేయగలిగిన వారు మాత్రమే ఆనందించ గలుగు తారు.
తదన్యులు ప్రయత్న పూర్వకముగా ఆనందించగలరు .
సాధారణం గ అవధాని పద భాండాగారము . పదకొశమును యెదలో నిత్యం మననము చేస్తూఉంటారు అందువలన పై చేయి వారిదే నిస్సందేహంగా . ఇందు పృ చ్చకుని పద, పద్య , భావ పాండిత్యము , కూడా పని చేస్తుంది . దాని వలన అవధాని గారిని కొంత వరకు యిబ్బంది పెట్ట వచ్చు .
విషయము . సంగీతము . రొగనిర్మూలన కారిణి .
కంద పద్యము . ( పాద ప్రారంభములో యతి ఉంటుంది కనుక అవధాని గారే ప్రారమ్భిస్తారు. )
కం (అవధాని గారు ) భో గా ( న ) ( నిషేధం) య ( ఆవ ) మ ( నిషేధం) త ( ఆవ ) సం ( నిషేధం ) మీ ( ఆవ)రా (నిషేధం ) గా ( ఆవ) త్రం ( నిషేధం ) నం ( ఆవ)
(ఆవ) బాగా న (నిషేధం )ధం ( ఆవ) తె ( నిషేదం ) జె ( ఆవ) వి ( నిషేధం) ప్ప ( ఆవ) వి (నిషే )రో ( ఆవ )
గా (నిషేధం )ధ (ఆవ) సాం ( ఆవ) యతి స్థానం కనుక వారె ప్రయోగం . గ ( నిషేధం ) త ( ఆవ) ము (నిషే)
ర ( ఆవ) స్థి (నిషే) ద ( ఆవ) ర (నిషే) తి ( ఆవ) గా (నిషే ) యౌ (అవధాని )
కం .భోగాయతమీ గానం , బా గాధం జెప్ప రోధసాంతరదతియౌ
(ఈ రీతిగా రెండు పాదములు నిషేధ, నిక్షిప్తాలతో సాగినది. మిగిలిన రెండు పాదములు ఈ విధం గ ఊహించి వ్రాయడమైనది . )
రాగార్చితంపు దైవము , సాగున్ వైద్యంబు పగిది స్వాస్త్యము గూర్పన్
. ఈ కార్యక్రమం మహోన్నతంగ భారత దేశ రాజధాని అయిన డిల్లి మహానగరం లో ద్వి సహస్రావధాని ,డా . మాడుగుల నాగ ఫణి శర్మ గారి చే నిర్వహించబడింది . పృచ్చకులసంఖ్య 250. ఉత్తర,దక్షిణ ప్రాంత సంస్కృత కవులు , పండిత ప్రకాండులు కళాకారులు , రాజకీయ నాయకులు ఎందరో పాలుపంచుకొన్నారు ఎందరో మహాను భావులు . అందరికి వందనాలు . .
దీనిలో ముఖ్యముగా 1. సమస్య . 2. దత్త పది . 3. నిషిద్ధాక్షరి
4. వర్ణన 5 . అశువు 6. మీమాట ..నా పాట . 7. నృత్య పది .
8. స్వర పది . 9. చిత్ర పది.అనే అంశాలు ఉన్నాయి.
అన్ని అంశాలు మనోహరం గ మనో రంజకం గ సాగినవి. నేను
నిషిద్ధాక్షరి లో పాలు పంచుకొన్నాను నిషిద్ధాక్షరి అవధాని గారికి పృచ్చకునకు మధ్యన జరిగే సాహిత్య (తో )రణం. దీనిని
పద్య రచన చేయగలిగిన వారు మాత్రమే ఆనందించ గలుగు తారు.
తదన్యులు ప్రయత్న పూర్వకముగా ఆనందించగలరు .
సాధారణం గ అవధాని పద భాండాగారము . పదకొశమును యెదలో నిత్యం మననము చేస్తూఉంటారు అందువలన పై చేయి వారిదే నిస్సందేహంగా . ఇందు పృ చ్చకుని పద, పద్య , భావ పాండిత్యము , కూడా పని చేస్తుంది . దాని వలన అవధాని గారిని కొంత వరకు యిబ్బంది పెట్ట వచ్చు .
విషయము . సంగీతము . రొగనిర్మూలన కారిణి .
కంద పద్యము . ( పాద ప్రారంభములో యతి ఉంటుంది కనుక అవధాని గారే ప్రారమ్భిస్తారు. )
కం (అవధాని గారు ) భో గా ( న ) ( నిషేధం) య ( ఆవ ) మ ( నిషేధం) త ( ఆవ ) సం ( నిషేధం ) మీ ( ఆవ)రా (నిషేధం ) గా ( ఆవ) త్రం ( నిషేధం ) నం ( ఆవ)
(ఆవ) బాగా న (నిషేధం )ధం ( ఆవ) తె ( నిషేదం ) జె ( ఆవ) వి ( నిషేధం) ప్ప ( ఆవ) వి (నిషే )రో ( ఆవ )
గా (నిషేధం )ధ (ఆవ) సాం ( ఆవ) యతి స్థానం కనుక వారె ప్రయోగం . గ ( నిషేధం ) త ( ఆవ) ము (నిషే)
ర ( ఆవ) స్థి (నిషే) ద ( ఆవ) ర (నిషే) తి ( ఆవ) గా (నిషే ) యౌ (అవధాని )
కం .భోగాయతమీ గానం , బా గాధం జెప్ప రోధసాంతరదతియౌ
(ఈ రీతిగా రెండు పాదములు నిషేధ, నిక్షిప్తాలతో సాగినది. మిగిలిన రెండు పాదములు ఈ విధం గ ఊహించి వ్రాయడమైనది . )
రాగార్చితంపు దైవము , సాగున్ వైద్యంబు పగిది స్వాస్త్యము గూర్పన్
అవధాన రాజధాని బ్రహ్మశ్రీ నాగ ఫణి శర్మగారి చేత విజయవంతమ్ చేయబడినది. నేను నిషిద్ధాక్షరిలో పాల్గొన్నాను . చాలా చక్కని పద్యం వచ్చింది .
విషయం .. సంగీతం . రోగ నిరోధకం .
కం . భోగాయతమీ గానం
బాగాధం జెప్ప రోధసాంతర దతియౌ . ( ఈ రెండు పాదములు నాగఫణి గారు చెప్పినవి )
రాగార్చితంపు దైవము ,
సాగున్ వైద్యంబు పగిది సౌమ్యత గూర్పన్. ( ఈ రెండు పాదాలు నేను ఊహించి వ్రాసినవి )
నాగఫణిశర్మ గారిని అభినందిస్తూ వ్రాసిన గీతమ్.
పల్లవి .. నలువ రాణి పాదమణి , నాగఫణి మీరు .
పలుకులమ్మ పనుపున , నిల దిగిన సౌరు.
చరణమ్ .రాజధాని నంత రస రమ్యం జీసి
కళల సారమెంతెంతో కలగలుపుగ నేసి
అసమానపుటనురాగం అందరకు పంచి
కవి, పండిత, చిత్రకార,గాయకాళి రప్పించి .
నలువ రాణి పాదమణి, నాగఫణి మీరు.
ప. దిల్లి ప్రభుత కవితకున్న ప్రాముఖ్యం దలచి
తల్లివోలె తపన తోడ తనవద్దకు పిలచి
వినిపించెను వినువీధిని విమల తెలుగు కవిత
వ్యాపించును తరతరముల జిలుగు వెలుగు భవిత .
నలువ రాణి పాదమణి, నాగఫణి మీరు.
చ. క్రొత్త పుంత త్రొక్కుట క్రొత్త మీకు కాదు .
అవధానము , ధారణంబు వింతేమి కాదు .
కుంచె వెంట కూర్చుపదము కోరుకున్న కూర్మిపధము
నృత్త పదము , నృత్య పదము నవ్య పధం మీకు .
నలువ రాణి పాదమణి, నాగఫణి మీరు.
ప. సంస్కృతంబు , రాజ భాష సవరించిన గళము
ప్రకటించును స్వారస్యము మీదు పొన్ను కలము
కవిత మీకు బలము , రసము మాకు ఫలము
నవ రసాలు చిలుకుటే నవ్య వరము మాకు .
నలువ రాణి పాదమణి, నాగఫణి మీరు.
విషయం .. సంగీతం . రోగ నిరోధకం .
కం . భోగాయతమీ గానం
బాగాధం జెప్ప రోధసాంతర దతియౌ . ( ఈ రెండు పాదములు నాగఫణి గారు చెప్పినవి )
రాగార్చితంపు దైవము ,
సాగున్ వైద్యంబు పగిది సౌమ్యత గూర్పన్. ( ఈ రెండు పాదాలు నేను ఊహించి వ్రాసినవి )
నాగఫణిశర్మ గారిని అభినందిస్తూ వ్రాసిన గీతమ్.
పల్లవి .. నలువ రాణి పాదమణి , నాగఫణి మీరు .
పలుకులమ్మ పనుపున , నిల దిగిన సౌరు.
చరణమ్ .రాజధాని నంత రస రమ్యం జీసి
కళల సారమెంతెంతో కలగలుపుగ నేసి
అసమానపుటనురాగం అందరకు పంచి
కవి, పండిత, చిత్రకార,గాయకాళి రప్పించి .
నలువ రాణి పాదమణి, నాగఫణి మీరు.
ప. దిల్లి ప్రభుత కవితకున్న ప్రాముఖ్యం దలచి
తల్లివోలె తపన తోడ తనవద్దకు పిలచి
వినిపించెను వినువీధిని విమల తెలుగు కవిత
వ్యాపించును తరతరముల జిలుగు వెలుగు భవిత .
నలువ రాణి పాదమణి, నాగఫణి మీరు.
చ. క్రొత్త పుంత త్రొక్కుట క్రొత్త మీకు కాదు .
అవధానము , ధారణంబు వింతేమి కాదు .
కుంచె వెంట కూర్చుపదము కోరుకున్న కూర్మిపధము
నృత్త పదము , నృత్య పదము నవ్య పధం మీకు .
నలువ రాణి పాదమణి, నాగఫణి మీరు.
ప. సంస్కృతంబు , రాజ భాష సవరించిన గళము
ప్రకటించును స్వారస్యము మీదు పొన్ను కలము
కవిత మీకు బలము , రసము మాకు ఫలము
నవ రసాలు చిలుకుటే నవ్య వరము మాకు .
నలువ రాణి పాదమణి, నాగఫణి మీరు.