29, ఆగస్టు 2015, శనివారం

ఆంద్ర భాషామ తల్లికి కట్టాలి రక్షా బంధనం . 29.08.2015

 ఆంద్ర భాషామ తల్లికి కట్టాలి రక్షా బంధనం . 29.08.2015
కీ. శే . గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతి సందర్భముగ
  శ్రావణ పున్నమికే  రక్షా బంధనం చేసుకోవటం ఒక సంప్రదాయం గ వస్తున్నది .సొదరీ సోదరులు పరస్పరం రక్షణ కోరుతూ  చేతికి కట్టే సూత్రమే ,యిది. ప్రేమ మనిషిని మనీషిగా చేస్తుంది . దానిని పెంచి, పంచాలి. అలాగే మాతృ భాషామతల్లికి కూడా మనమందరం  రక్షా బంధన చేయవలసిన దుస్తితి వచ్చింది . ఋణం తీర్చుకోవాలంటే కట్టక తప్పదు. అంటే ఏదో అద్భుతం చేయనవసరం లేదు . వీలైనంత తెలుగులో మాట్లాడితే చాలు  సంతోషిస్తుంది మన ఆంద్ర మాత.
      తెలుగు మాటలు నాలుగు పలుకు గలను
      తెలుగు స్వారస్య మెంతైనా తెలుప గలను
      తెలుగు తనమును భావాల నిలుప గలను
      తెలుగు  కవి వారసుండనై వెలుగ గలను.
      అమ్మ నీపాద పద్మంబు నహరహంబు
      కొలుచు చున్దును సదమల కూర్మి తోడ
      ఆంద్ర భాషామ తల్లికి హారతిచ్చి ,  
     రక్ష బంధన గూర్తును రమ్య గరిమ .    అని అంటీ చాలు మన భాషామతల్లి పొంగి పొతున్ది.
     

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...