1, ఏప్రిల్ 2013, సోమవారం

కీ. శే యల్లా ప్రగడ వెంకట నారాయణ రావు గారు.

            కీర్తి శేషులు యల్లా ప్రగడ వెంకట నారాయణ రావు గారు.




వీరు నామాతా మహులు . వాసుదాసు గారి
( ఆంద్ర వాల్మీకి గా ప్రసిద్ధి గాంచిన ,వావిల కొలను సుబ్బారావు
గారికి ) శిష్యులు . వైష్ణవం స్వీకరించారు .. గుంటూరు జిల్లా నగరం
స్వ గ్రామమ్. యేలేటి పాలెం గ్రామానికి కరణం  గా పని చెసారు.
ఈనాడు వేద గాయత్రి అగ్రహారం నిర్మాత అయిన యల్లాప్రగడ
ప్రభాకర శర్మ గారికి పితామహులు .  శిస్టా చార పరాయణులు .
భారత , భాగవత , రామాయణాది గ్రంధములు వారికి కన్థ స్థ మనిన
అతిశయోక్తి కాదు. పరమ భక్తులు . బహుముఖ ప్రజ్ఞాశాలి .
పోలములను కొలిచే సర్వ్ గొలుసు లేకున్డగానే ఆనాడు తన అంగలతో
పోలములను కొలిచే వారు. అది అందరిని ఆశ్చర్య పరచే విధంగా
చాల ఖచ్చితం గ లెక్క ఉండేది  ఒంటి కాలి మీద నిల్చి ఆదిత్య హృదయం  నలుబది రోజులు పారాయణ చేసి తన అభీష్టాన్ని
( కోర్టులో విజయం ) సంపాదించుకొన్న ఘనులు . నిరంతరం
రామ నామ జపమే ధ్యేయంగా పెట్టుకొన్న రామ భక్తులు.
అందరి చేత  దేవుడు తాతయ్య గా పిలిపించుకోనేవారు .ధన్యజీవులు .
                                                                                             


                                                                                 





                               

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...