31, డిసెంబర్ 2012, సోమవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                శుభాకాంక్షలు 


2012  సంవత్సరము కన్నా 2013 లో అధిక సంతోషాలు. భోగ . భాగ్యాలు .శాంతి సౌఖ్యాలు ఎల్లరు 

అనుభవించాలని నా ఆకాంక్ష . 

    పొన్నెకంటి  సూర్య నారాయణ రావు 

జ్ఞాన వృ ద్ధులకు

జ్ఞాన వృ ద్ధులకు 

మీరుసూదితో బాదితే కష్టం కానీ ( శరీరానికి  ) సుకుమారమైన శ్లోకంతో బాదితే యిష్టమే. సంతోషమే. కోపం వచ్చే అవసరం . అవకాశము లేదు. అయితే వయసును బట్టి చిన్న కనుక ఆశిస్సులు ,జ్ఞానాన్ని  బట్టి ( జ్ఞాన వృ ద్ధుడే వృద్ధుడు ) కనుక నమస్సుమాంజలి .

మీరుదహరించిన భగవద్గీత 6 వ .అ . 34.శ్లో . తర్వాత , 7వ .అ .10వ శ్లో . నందు   " బీజం మాం సర్వ భూతానాం , విద్ధి పార్థ సనాతనం ,  బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహం "..

7వ అ .12వశ్లో .  ఏ చైవ సత్వికాభావా , రాజసాస్తామసాశ్చ ఏ ....మత్త ఏవేతి తాన్విద్ధి  న త్వహం తేషు తే మయి ...

నేను సర్వ స్వతంత్రుడనని ప్రకృతి  త్రిగుణములు నాకు మాత్రమే లోబడి యుండుననియు పల్కినాడు. కనుక జీవులకు భావ ప్రేరణ మతడే . కర్త కర్మ క్రియ అతడే . అందువలన తానె అంతరాత్మయై నిలిచినాడు . ఆత్మ కూడా అంతరాత్మకు లోబడియే యుండును .
 15వ .అ . 15వ శ్లో .. సర్వస్యచాహం  హృది సన్నివిస్టో  ,  మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ , వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో ,   వేదాంత కృత్ వేద విదేవ చాహం.    అంటారు పరమాత్మ.

15వ. అ . 17వ శ్లో .నందు కూడా యిదే భావం కలదు . ఆలోచన ,బుద్ధి , ఆత్మా సహిత శరీర శకటమును పూర్వ జన్మ సుకృత ,దుష్కృత , శేషముల ననుభవిన్చుటకేర్పాటు చేయబడినదనునది సత్యము. వాటిని పోషించుచు కర్మానుసారి ఐ భొగానుభవమునకు అవకాశము  నొసగు దేవదేవుడగు శ్రేష్ట పురుషుడే అంతరాత్మ.

స్వామి  వివేకానంద మొదట అత్మాలోచనాపరుడై రామ కృష్ణ పరమ హంసను సామాన్యుడని భావించి అనంతరము అంతరాత్మ ప్రబోదితుడై ఆతని మాహాత్మ్యము గ్రహించి తన గురువుగా స్వీకరించెను .

          కనుక బుద్ధి రధ సారధి ఐనను ,జీవుడు ప్రయాణీకుడైనను  , అంతరాత్మ ననుసరించియే పయనించును .

   బ్రహ్మజిజ్ఞాస యందు మాత్రము బుద్ధిని జడ పదార్థము గాను ,ఆలోచనా  కేంద్రముగాను చూపినారు .
వేదము మూలజ్ఞానమైనను వారి వారి జ్ఞాన సామర్త్యమును బట్టి వ్యాఖ్యానము లున్డుననుట నిస్సందేహము .

శ్లోక బాదుడు

     శ్లోక బాదుడును నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను .కోపాన్ని ఏ కారణంగా పొందాలి.

శ్లో . విద్యయా వినయా వ్యాప్తిహి .


     సాచేత్ అవినయావహ ,

    కిం కుర్మః కిం ప్రతి బ్రూమః ,

   గరదాయా స్వమాతురి .

అందువలన నాకు నేర్పిన చదువు నాకు అకారణంగా కోపం తెప్పించదు . అయితే పట్టుదల మీరు నేర్పినదే .  

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...