జ్ఞాన వృ ద్ధులకు
మీరుసూదితో బాదితే కష్టం కానీ ( శరీరానికి ) సుకుమారమైన శ్లోకంతో బాదితే యిష్టమే. సంతోషమే. కోపం వచ్చే అవసరం . అవకాశము లేదు. అయితే వయసును బట్టి చిన్న కనుక ఆశిస్సులు ,జ్ఞానాన్ని బట్టి ( జ్ఞాన వృ ద్ధుడే వృద్ధుడు ) కనుక నమస్సుమాంజలి .
మీరుదహరించిన భగవద్గీత 6 వ .అ . 34.శ్లో . తర్వాత , 7వ .అ .10వ శ్లో . నందు " బీజం మాం సర్వ భూతానాం , విద్ధి పార్థ సనాతనం , బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహం "..
7వ అ .12వశ్లో . ఏ చైవ సత్వికాభావా , రాజసాస్తామసాశ్చ ఏ ....మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ...
నేను సర్వ స్వతంత్రుడనని ప్రకృతి త్రిగుణములు నాకు మాత్రమే లోబడి యుండుననియు పల్కినాడు. కనుక జీవులకు భావ ప్రేరణ మతడే . కర్త కర్మ క్రియ అతడే . అందువలన తానె అంతరాత్మయై నిలిచినాడు . ఆత్మ కూడా అంతరాత్మకు లోబడియే యుండును .
15వ .అ . 15వ శ్లో .. సర్వస్యచాహం హృది సన్నివిస్టో , మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ , వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో , వేదాంత కృత్ వేద విదేవ చాహం. అంటారు పరమాత్మ.
15వ. అ . 17వ శ్లో .నందు కూడా యిదే భావం కలదు . ఆలోచన ,బుద్ధి , ఆత్మా సహిత శరీర శకటమును పూర్వ జన్మ సుకృత ,దుష్కృత , శేషముల ననుభవిన్చుటకేర్పాటు చేయబడినదనునది సత్యము. వాటిని పోషించుచు కర్మానుసారి ఐ భొగానుభవమునకు అవకాశము నొసగు దేవదేవుడగు శ్రేష్ట పురుషుడే అంతరాత్మ.
స్వామి వివేకానంద మొదట అత్మాలోచనాపరుడై రామ కృష్ణ పరమ హంసను సామాన్యుడని భావించి అనంతరము అంతరాత్మ ప్రబోదితుడై ఆతని మాహాత్మ్యము గ్రహించి తన గురువుగా స్వీకరించెను .
కనుక బుద్ధి రధ సారధి ఐనను ,జీవుడు ప్రయాణీకుడైనను , అంతరాత్మ ననుసరించియే పయనించును .
బ్రహ్మజిజ్ఞాస యందు మాత్రము బుద్ధిని జడ పదార్థము గాను ,ఆలోచనా కేంద్రముగాను చూపినారు .
వేదము మూలజ్ఞానమైనను వారి వారి జ్ఞాన సామర్త్యమును బట్టి వ్యాఖ్యానము లున్డుననుట నిస్సందేహము .