జాతీయస్థాయి ఉగాది పద్యాల కవితల పోటి.
జాతీయ తెలుగు పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న
శ్రీవిశ్వావసు ఉగాదిపోటీలకు ఆహ్వానం.
అంశము: నేటి తెలుగు భాష స్ధితిగతులు.
పంపవలసిన చివరి తేది. మార్చి 30.2025.
వాట్సప్ నం.6362973252
మాతృభాషపట్ల మమకారభావన
న్దెలుగుపలుకుబడులు తేటపఱచి
అక్షరాక్షరంపుటర్థంబులెఱిగించ
మరచిపోయెనేటి మాతృమూర్తి. 1
తెలుగు బాస నేర్వ తెరువులుకఱవని
"ఇంగిలీసు"మీద నీప్సితంబు
పెంచుకొనిరి నేటి పెరజాతిప్రేమికుల్
అదియె శాపమయ్యె నాంధ్రులకును. 2
తల్లిదండ్రు లెపుడు హల్లొ!హాయని బల్క
వందనంబు లనరు వారిసంతు
ఆవు చేనుమేయ నాత్మజగట్టునా?
సాజమౌను నదియె సారమగును. 3
ప్రభుతకూడ కనగ ప్రథమకారణమయ్యె
తెలుగు భాషకంత విలువనిడదు
"దేశభాషలందు తెలుగు లెస్స"నియెను
"కృష్ణరాయ"విభుడు కేలుమోడ్చి. 4
మీడియాలు కొన్ని మిడిమిడి జ్ఞానులన్
తెలుగు మాటలాడ తీసికొనుచు
రూప మొక్కటె యపురూపమటంచును
భావముంచ తెలుగు భ్రష్టుపట్టె. 5
తెలుగు సంస్కృతాల తేజంబుగ్రహియించి
ఇతరదేశవాసులిచ్ఛనేర్వ
భరతమాతసంతు పనివడి కొందరు
మాతృమూర్తి నెపుడు "మమ్మీ"గ బిల్తురే. 6
తెలుగు సంస్కృతాల తిరమైన ప్రజ్ఞతో
కావ్యనాటకాలు కవులువ్రాయ
శ్రీ వధానులెల్ల చిత్రంపువాణులై
తెలుగు పలుకు చుండు వెలుగుచుండె. 7
ప్రక్కరాష్ట్ర ప్రజల పరికించి చూడుమా
ఆంధ్రరాష్ట్ర జీవి!అసలు నిజము
వారిమాతృభాష వారికే వరమంద్రు
తెల్విదెచ్చుకొనుచు తెలుగు పలుకు. 8.
ఈ పద్యములు కేవలము ఈ పోటీ కి నేను
స్వయముగా వ్రాసినవేయని
హామీ యిచ్చుచున్నాను.
నా చిరునామా:
పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
"భాషా ప్రవీణ" ఎం.ఏ., తెలుగు.
మధుశ్రీ తిరుమల అపార్ట్ మెంట్. జి.ఎఫ్.4.
విమలాదేవి నగర్. మల్కాజిగిరి.
హైదరాబాదు. 50047.
ఫోన్: 9866675770.