13, జనవరి 2012, శుక్రవారం

మకర సంక్రాంతి

మకర సంక్రాంతి . సూర్యుడు పన్నెండు రాసులలో 
సంచారం చేస్తూ పుష్య మాసంలో మకరరాసిలో 
ప్రవేశిస్తాడు  . అందు వలన మకర సంక్రాంతిగ 
దీనిని పిలుస్తారు . ఈ రోజు నుండి ఉత్తరాయణం 
వస్తుంది . అంటే భీష్ముడు కూడా స్వచ్చంద మరణం 
కోరుకున్న రోజు . భోగి , సంక్రాంతి , కనుమగ ఈ పండుగ ప్రసిద్ధి చెందింది. చిన్నారులకు దృష్టి దోషం తగలకుండా
రేగు పండ్లు, నాణెములు , పూలు, తలపై పోసి , పెద్దలు 
శతాయుష్మన్ భవ. అని దీవిస్తారు. భోగి మంటలలో మన పాపాలన్నీ కాలి, పునీతులము అవుతామని ,మానసిక స్వచ్ఛత పొందుతామని ప్రసిద్ధి , కనుమనాడు  పశువులను అలంకరిస్తారు. అనగా  హిందూసంప్రదాయానుసారం     పశు పక్షి జాతులను కూడా ప్రేమించే మానవాతీత మనస్సు మనది.    ఈ చిత్రం లో చిరజీవులు హిమజ , మహిత, మనోజ్ఞ , ధీరజ్ లు . నిష్కల్మష మనస్సుతో . వారి వారి భావాలను పంచుకుంటున్నారు కంప్యుటర్ లో. కానీ మనోజ్ఞ మాత్రం.............
సంక్రాంతి కొఱకు ఎదురు చూస్తున్నది కాబోలు . దాని చూపులు  చూడండి. చిన్నారి హృదయం పెద్ద దేవాలయం .
సంక్రాంతి అందరకు శుభ, సుఖ సంతోషాలు తేవాలని , మనసా, వాచా , కర్మణా  కోరుకుంటున్నాను.
  

7, జనవరి 2012, శనివారం

మనసు

మనసు
తేలికైన మనసు ఎప్పుడు మనిషికి ఆనందాన్ని యిస్తుంది .   ఆలోచనా కుహరం లోకూరుకుపోయిన మనసు తనుకుంచించుకు పోతూ
జీవితాన్ని కూడా కుంచింప జేస్తుంది . అది లేకుండా ఉండాలంటే మనసు లో
అలల తాకిడి కొంతైన తగ్గించు కోవాలి . అపుడే మానసిక ప్రశాంత చైతన్యం కలిగి
మానవుడు మాధవుడు గ మారుతాడు . దేహం దేవాలయం గ , సదాలోచనలే
దైవంగా రూపు చెందుతాయి . అపుడు
దైవం తో అను సంధానం అక్కర లేదు .
తనే దైవం .౬.౦౧.౨౦౧౨.
   

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...