25, జనవరి 2013, శుక్రవారం

ముగ్ధ మనోహర మున్నారు

       భారతీయ సోదరు లందరికి  గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
                               
ముగ్ధ మనోహర మున్నారు .    ప్రకృతి  అందాల బాల .  అందరికి  సమానంగ   ఆనందం  పంచుతుంది . మనసు.దోస్తుంది . అలాంటి సుందర , సుకుమార , ప్రాంతమే  మున్నారు .    పచ్చికల, పచ్చదనము  తేయాకుల,  పచ్చదనం , నీల కురుంజి పూల నీలం , కొండలపై వినీల   ఆకాశం , మమ్ములను పరవసిమ్ప జేసాయి .

     ఎటు చూచినా తమనీడలను    సముద్రపు నీటిలో  చూచుకునే  నారికేళ వృక్షాలు , సందర్శకుల   బోటుషికార్లు అలెప్పికి  దైవ మిచ్చిన  వరాలు .  ఆ  అనుభ వాలు .  నా  బ్లాగ్ లో పంచుకుందాం. 

24, జనవరి 2013, గురువారం

ఎరావికులం నేషనల్ పార్క్




ఎరావికులం నేషనల్ పార్క్ :- మున్నారు :-నుండి  15కి.మీ. దూరంలో,97.కి.మీ. వైశాల్యంతో  ఉన్నది .ఇచటి ప్రత్యేక  జంతువు నీలగిరిటార్ ( మేకవంటి జంతువు ).ఈ పార్కులో  అసాధారణమైన శీతాకోకచిలుకలు,జంతువులు ,పక్షులున్నాయి .నీలకురింజి పూలు ,కొండవాలులలో మనకు ప్రత్యేక  దర్శనమిస్తాయి .నీలి రంగు పరదా కప్పినట్లున్నది  .పశ్చిమ కనుమలలోనే కనుపించే ఈ నీల కురింజి 12 సంవత్సరాలకొకసారి వికసిస్తుంది .ఇది 2006లో వికసించినట్లు చెప్పారు . మరల 2018లో మనం వానిని చూడవచ్చు .ఇచట పలురకాల టీ పాకెట్లు అమ్ముతారు .వివిధమైన తేనీరు మనం రుచి చూడవచ్చు. ( ఖరీదు చెల్లించి ). రు 7.కె మనకు పెద్దగ్లాసు         తే నీరు వస్తుంది . మున్నార్ నుండి మనం కేరళ ప్రభుత్వమేర్పాటు చేసిన వాహనాలలోనే పార్కుకి వెళ్ళాలి ఇచటి డ్రైవర్ల ప్రతిభ వర్ణణాతీతం . ఈమాత్రం పొరబాటు జరిగిన మనం కీర్తి శేషులము కాగలము. వారి చేతులలో ప్రతి సారి 30 మంది ప్రాణాలు .వారికి, భగవానునకు మనం కృతజ్ఞులం. ఈ పార్క్ లోనే అనేక ఓషధులున్నాయట .
  టాప్  స్టేషన్ .:- మున్నార్ నుండి 3 మీ.కి. దూరంలో కలదు .ఇది మున్నార్ కొడైకెనాల్ రహదారిలోనున్న ఎతైన ప్రదేశం . ఇక్కడనుండి తమిళనాడును చూడవచ్చు .నీలకురింజి పూలిచట విస్తారంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ":స్ట్రాబిలాంతస్ కున్తియానా" .
   పల్లివాసన్ :-కేరళలోని మొదటి విద్యుత్ ప్రణాలికా  కేంద్రం. చిన్నకసల్
  అనునది 2000మీ .ఎత్తునుండి పడే జలపాతం .ఎతిరాపల్లికి 10కి.మీ.
  దూరం లో ఉండే మనోహర జలపాతం .దానిని చూడగానే మా మనసులు
ఈ విధంగా స్పందించాయి .
  సీ .జలపాతముంజూడ ,తలపున మెరయును ,బమ్మెర కవిశ్రేస్టు భక్తి  రసము
       జలపాతముంగాంచ చక్కగ వెల్గును , రవి వర్మ కుంచెన రంగులన్ని
          జలపాతమున్గన్న తలపోయగానగు , స్వామి నరేంద్రుల స్థాయి ఎంతో
          జలపాతమున్దల్ప జాణయౌ బ్రహ్మను , స్వ్మరియిమ్పజాలక సాగలేము  .
తే.గీ . ఎదిరపల్లికి చేరువన్నెగసి పడెడు ,  జలధి సోయగమేమని చాట గలము ?
ప్రకృతి అందాలు భావింప పరవశించు , మనసు తనువెల్ల పులకించి మధుర మగును.

  అలెప్పి.:-ఇది ఎర్నాకులం నుండి 50 కి.మీ దూరంలో నున్న ( బ్యాక్ వాటర్ ) సముద్రపు నీరున్న ప్రాంతము .ఇందులో బోటు షికారు చేస్తారు . బోటులోనే                                     మనయింటిలో మాదిరిగా  సమస్త
సౌకర్యాలుంటాయి. ఈ బొట్లు మనమిచ్చే  డబ్బునుబట్టి ఉంటాయి . రాత్రులందు                                      అందులో నివాసముండే అవకాశముంటుంది .ఆబోటులో ఒక డ్రైవరు ,వంట మనిషి ,                                          ఒక సహాయకుడు ఉంటారు . ఉదయం 8.గం.లకు .అల్పాహారము . మధ్యాహ్నం
2.గం.లకు . భోజనముంటుంది . సముద్రపు నీటిఒడ్డునే చిన్నచిన్న గ్రామాలున్నాయి .
అచ్చటి నారికేళ వృక్షాలు మన సరిహద్దులను  కావలి  కాచే సిపాయిల మాదిరిగా ,
ఒకే వరుసలో ఇరుప్రక్కల ఉండి వాటి క్రమ శిక్షణ ను నీటిలో తొంగి చూసుకుంటున్నాయి
ఆ ప్రకృతి  మనోహర సోయగాలు అవ్యక్త మధురాలు . అనిర్వచనీయాలు,అనుభవైక
బోధ్యాలు. అచటి వంట మాత్రమె కాక .అనాస పండు కోసి పెట్టిన తీరు మమ్ములనెంతో 
 అబ్బురపరచింది . కేరళ నావలు నడిపే పందాలకు ప్రసస్తి. అందుకే ఒకనాటి ఉదయమే
అచటికి విద్యార్థులు వచ్చి నావలను నడుపుతున్నారు. అందులో బాలికలున్డటం ,
విశేషం .వారికి తగిన సూచనలివ్వటానికోక యిద్దరు ఉపాధ్యాయులు వచ్చారు .         అలెప్పి ని చూచినపుడు మా భావమిలాఉన్నది .

సీ. సంద్రంపు నీటిలో సాగిపోవ నా బోటు,సందర్శకాళికి సంతసంబు ,

     అలలపై తేలెడి అందాల అలెపియే ,హృదయంత రాళాల హత్తుకొనును,
    ఆదరమ్బును జూపి యజమాని రప్పించి, ఆనందపర్చు నాయలెపిబోటు,  
    అనుభవించినకొద్ది ఆహ్లాదమిచ్చును ,మధుర యానంబును మరువలేము
తే.గీ .నారికేళపు వృక్షాల నడుమనున్న,బోటు వరుసల శోభల పోల్చగల్గు,
   పదములున్డునే తెలుగునపారజూడ,కాంచగల్గుటయొక్కటే ఘనతయౌను.  

 " ఏటి ఒడ్డు  వారికి నీటి భయం , కాటి ఒడ్డు వారికి చావు భయం ఉండదంటారు "అక్షర సత్యం అనిపించింది.
         16 వ తేది అలెప్పి లో గడపి . 17 ఉ. ఎర్నాకులం వచ్చి. బొట్ మెరైన్ చూచి
ఆ రాత్రి బెంగుళూరికి  తిరుగు ముఖం పట్టాము . మా కన్నా మా పిల్లలు ఎక్కువ
ఆనందాన్ని అనుభవించారు. సహజమేకదా .  మరొకసారి వెళ్లి వచ్చిన  అనుభవాలతో కలుద్దాం .
 నమస్తే.      
   
 .

21, జనవరి 2013, సోమవారం

మనోహర మున్నారు . మా అనుభవాలు

 మనోహర మున్నారు . మా అనుభవాలు

నిరంతరం శ్రమపడే విద్యార్ధి జీవితంలో కాని , ఉద్యోగ జీవితంలో కానీ , కొన్ని

రోజులు మానసిక ప్రశాంతత చాల అవసరము. వృద్ధులు, భక్తులు, తీర్థ
 యాత్రలుచేసి ప్రశాంతత పొందినట్లే పిల్లలు ప్రకృతిని చూసి పరవశించి ,సేద తీరుతారు. ముఖ్యంగా సెలవులను సద్వినియోగ పరచుకుంటారు. .

       బెంగుళూరు లో నున్న మా అమ్మాయి , పిల్లలు ఎక్కడికైనా , వెళదామని ఆలోచించి సుందర , మనోహర, ప్రకృతి సంపదకల కేరళను సూచించారు .మేము ( సూర్యనారాయణరావు , ఇందిర ) కూడా చాలా

కాలంగా ఆ మనోహర ప్రాంతాన్ని చూడాలని ఉత్సాహ పడుతున్నాము .

కాగల కార్యము గంధర్వులు తీర్చారన్నట్లు సంక్రాంతి సెలవులొచ్చాయి .

      జనవరి 13,14,15,16,తేదీలు మాకు ఆనందానుభూతులనిచ్చాయి .
     ఆనందం అనేక రకాలు . కొందరికి ప్రకృతి  దర్శనం ,కొందరికి  మృస్టాన్న భోజనం, .యింకొందరికి చిత్రకళానురక్తి. సహజంగా మా కుటుంబ సభ్యులందరకు కళ లపై మక్కువ ఎక్కువ. అందరకు అన్ని కళలలోప్రవేశమే  కాని ప్రావీణ్యం లేక పోవటందురదృష్టం అదృష్టమేమంటే అన్ని కళలను ఆస్వాదిస్తాము. .
                కేరళ ప్రయాణం ఖాయం చేసుకున్నాము. ( మున్నారు, అలెప్పి ).వెంటనే దుర్గా ట్రావెల్స్ ను సంప్రదించి మున్నారు, అలెప్పి లలో గదులు బుక్ చేయిన్చుకున్నాము . 12.01.2013. న రాత్రి 10. గం.లకు బెంగుళూరు నుండి బయలుదేరి 13.01.2013 ఉ. 6.గం. లకు ఎర్నాకులం చేరాము .అచ్చట మమ్ములను తీసికొని వెళ్లి ప్రదేశాలను చూపించటానికి ఒక కారు,డ్రైవర్ని ఏర్పాటు చేసారు .ఆ డ్రైవర్ కి ఒక్క మళయాళ భాష మాత్రమె వచ్చు .మిగిలిన భాషలన్నీ యస్,నో ,ఆల్ రైట్ .అనే పాండిత్యమే .మాకు మళయాళ భాషలో ఆ మూడు ముక్కలు కూడా రావు .కొంత అనాగరిక సౌజ్ఞలతో  నున్న మా పాండిత్యం అక్కరకు వచ్చింది .అప్పుడు మాకు మన మాజీ ప్రధాన మంత్రి గారైన శ్రీ పాములపర్తి  వెంకట నరసింహా రావు గారు ( బహు భాషా కోవిదులు ) గుర్తుకు వచ్చారు . బహు భాషా పాండిత్యమెందు కవసరమో మా అందరికి తెలియ వచ్చింది.కనుక మన భాషా సామర్థ్యం పెరగటానికి , పర భాషలు నేర్చుకోవటం యెంత అవసరమో తెసింది.    

                      మున్నార్:- కేరళ రాష్ట్రంలో  పశ్చిమ కనుమల మీదనున్న యిదుక్కి జిల్లాలో ,ఎర్నాకులాషుమారు 110 కి.మీ .దూరం లో నున్న దేవీకుళం బ్లాకులో నున్న పంచాయతి .దీని వైశాల్యం 557.కి.మీ .దీనికి 105 కి.మీ .దూరం లో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నదినికి  .
                      వాతావరణం :-  సముద్ర మట్టం నుండి 2000 మీ. నుండి 2600 మీ ఎత్తు నున్నది .గత సంవత్సరం ఉష్లోగ్రత -4 డిగ్రీలున్నది .అదృష్ట వశాత్తీసంవత్సరం + 8 డిగ్రీలున్నదని అచటి హోటల్ మానేజర్ చెప్పారు . దీనికి కేరళ ప్రభుత్వం 2000 సంవత్సరం లో పర్యాటక కేంద్రంగా అనుమతి చ్చింది.   మేము హోటల్ కి
వెళ్ళగానే      మాకు త్రాగటానికి గోరు వెచ్చని  నీరు టేబుల్ మీద పెట్టారు .అవికొంత మూలికలతో కాచినట్లున్నాయి. .
అంద చందాల ప్రకృతి కేంద్రం :- మున్నార్ పట్టణానికి 10 కి.మీ .దూరంలో గల " డీప్ ఉడ్ పులిమోటిల్ ఎస్టేట్ " మాకు బసగా ఏర్పాటు చేసారు .మాకొరకు 2 గదులు కేటాయించారు . మా డ్రైవర్ పాము మెలికలు తిరిగినట్లు తిరుగుతూ పోయే  ఘాట్ రోడ్లో డ్రైవింగ్ మొదలు పెట్టాడు . ఘాటు రోడ్ ఎక్కేటప్పుడుపాము పడగెత్తి బుసలు కొట్టినట్లు పెద్ద శబ్దము మరల క్రిందికి దిగేటప్పుడు కలుగులోనికి వెళుతున్న సరసర సవ్వడి ,భయము ,భ్రాంతి ,ఆశ్చర్యము .కలిగి మన మన యిస్ట  దైవాలని తలచు కుంటాము . డ్రైవర్ కి భాషలో పాండిత్యం లేక పోయినా మా అదృష్టం కొద్ది చాల అనుభవం ,నైపుణ్యం కలదు .పచ్చదనానికి పరాకా స్థ   ఆప్రాంతమంతా .సాక్షాత్ భరతమాత తెల్లని రత్నాలు పొదిగిన పచ్చని పట్టు చీరతో, పూలద్దిన రవికతో,నీలపు పరదాలలో దాగి చిరు నవ్వులు చిన్దిస్తుందా అన్నట్లున్నది .అక్కడక్కడా టీ తోటలలో పనిచేసే శ్రామికులు , వారి నివాసాలు కనిపిస్తుంటాయి .మున్నారు ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు మా భావనిలా ఉన్నది.
 సీ .మున్నారు ప్రాంతంబు మోహన రూపంబు ,తేయాకు తోటల తీరు వలన .
      మున్నారు గిరులెల్ల ముచ్చట గూర్చును , పచ్చని పాదప పంక్తి వలన .
      మున్నారు లోయలు మ్రోగుచునుండును ,జలపాత పరవళ్ల జారువలన ,
   మున్నారుసూర్యుడు ముసుగుదుప్పటివీడి, లేశమాత్రమురాడు లేచికూడ,
 ఆ.వె.ఎన్న మున్నారు ప్రాంతంబు కన్నమీద , చెన్ను మీరగ పచ్చల చీరగట్టి .నీలి మేఘంపు ముసుగున నిల్చియున్న,భరతమాతగ కనిపించె  భ్రాంతికాదు.






   టీ తోటల చరిత్ర :-మున్నార్ అనునది మళయాల పదము .మును   మూడు ) ఆర (నది)మున్నారు అయినది. ఇది 1.ముతిరప్పుజ ,2. నల్ల తన్ని 3. కుండలి అనే మూడునదుల సంగమం వద్దగల ప
 ప్రాంతము .  మధువనులు తమిళనాడు , మదురై ,నుండి వచ్చి మున్నార్ ప్రాంతంలో  నివసించారు . తిరువాన్కూరు మహారాజుల దగ్గరున్న పున్జార్ వంశీకులు వారికీ సామంత రాజులు . మిస్టర్ జాన్ డానియల్ మున్రో  అనునతడు పున్జార్ వంశీకుల ద్వార 1877 నుండి 1879 వరకు 588. చ.కి.మీ. భూమిని  రు .5000/- లకు లీజు కి తీసుకున్నాడు .తేయాకు మొక్కలను మొదట గ  ఏ .హెచ్ . షార్ప్ .అనునతడు పెంచాడు .ఆతోట లు 20.హెక్టార్లలో 1910.లో సాగు మొద లైనది . ఆర్ధిక భారంతో ఆ తోటలు అమ్మాల్సి  వ చ్చింది .బారన్ వోటో మైకేల్ ఓన్ రోజన్ బెరి    వానిని కొని 26.ఎస్టేట్లు గ వృద్ధి పరిచాడు . జోన్ మైకేల్ వృద్ధి చేసిన తరువాత ఇంగ్లాండ్ వారీ ప్రాంతాన్ని స్వాధీన పరచుకొని మరి కొన్ని ఎస్టేట్లు గ వృద్ధి పరిచారు .
మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ ఎస్టేట్లను ( 1,14,000 హేక్టార్లను .)  కేరళ ప్రభుత్వానికి  స్వాధీన పరచి వెళ్లారు . ప్రస్తుతం టాటా టీ వే వారి స్వాధీనం లో ఉన్నది.

     టీ ఆకుల గుర్తింపును గూర్చి ఒక  సంఘటన చెబుతారు .  అది , ఒక గొర్రెలకాపరి గొర్రెలనా ప్రాంతంలో మేపుతుండగా  ఒక మేక పిల్ల  ప్రతి రోజు ఒకే చోట ఒకే  చెట్టు ఆకు  తిని  ఎక్కువ  ఉత్సాహం గ కనిపిస్తున్దట . దానినిఆ కాపరి గమనించి  ఆ ఆకులను నీటిలో కాచి రసాన్నిత్రాగటం మొదలు పెట్టాడట .  చాల చురుకు తనం తనలో  గమనించాడు .
తేయాకు ప్రదర్శనశాల :-
కొన్ని సంవత్సరాల క్రితం టాటా టీ వె ప్రత్యేకం  గ   తేయాకు కొరకు  మున్నార్ లో  నల్ల తన్ని ఎస్టేట్ ఆఫ్ టాటా టీ వద్ద ఒక ప్రదర్శన శాల  ఆరంభించ బడింది . దీనిలో అసాధారణ మైన  ఛాయా  చిత్రాలు, యంత్ర  పరికరాలు న్నాయి . టీ తోటల లోని శ్రామికులు రోజుకి 25కిలో ల  ఆకును సేకరిస్తారు . మంచి సీజను  లో 50.కిలో లు సేకరించ గలుగు తారు . టీ తోటలు 120.సంవత్సముల వరకు ఉంచుతారు . అంతకు  మించిన వయసున్న  తోటలను  తొలగిస్తారు .

మట్టుపెట్టి డాం :-     ఇదిమున్నార్కి 13.కి.మీ దూరంలోనున్నది.సముద్ర మట్టం నుండి 1700మీ .ఎత్తునున్న ఆనకట్ట .ఇదొక  అందమైన సరస్సు .బోటు షికార్ చేస్తారు పర్యాటకులు .ఇండో స్విస్ లైవ్ స్టాక్ ప్రాజెక్ట్ చే నడుపబడుచున్న పాల ఉత్పత్తుల కేంద్రం ఇచట ప్రాముఖ్యం పొందింది .ఇచట అత్యధిక పాల దిగుబడి నిచ్చే గోమాతలను చూడ వచ్చు . ఇది అనేక పక్షి జాతులకు నిలయం .మట్టుపెట్టు డాం కి వెళ్ళే త్రోవలో ఒక పుష్ప ప్రదర్శన శాల ఉన్నది .ఇందులోని పూలు నోరులేని శీతాకొక  చిలుకలనే కాక మనసున్న మానవులనందరిని సాదరంగా శిరస్సులు వంచి ఆహ్వానం పలుకుతున్నాయి .భగవంతుని కళా తృష్ణ ,కళా హృదయం వాటి ద్వారా మనకు అవగతమౌతుంది .ప్రదర్శన నుండి మనం బలవంతంగా రావలసిందే .    
     

 

12, జనవరి 2013, శనివారం

రాయలుగా సూర్య నారాయణ రావు










2005.వ.సం. భట్టిప్రోలు లో ప్రధానోపాధ్యాయిని  పదవీ విరమణ  చేసిన సందర్భంగ భువన విజయము                  శ్రీ కృష్ణ దేవరాయలుగ పొన్నెకంటి సూర్య నారాయణరావు .తిమ్మరుసు గ ముద్దాలీలా మోహన రావు.ఉన్నాము . సన్మాన గ్రహీత  సూర్య నారాయణ రావు. సన్మాన కర్త, విద్యాలయ వ్యవస్థాపకులు పులికొండ రాదా కృష్ణ గుప్తగారు . .

1971వ. సం లో . విద్యాలయంలో చేరినప్పటినుండి నా సోదరుడు మద్దా లీలా  మోహనరావు తోబాటు. అనేక భువనవిజయములు ,ఇందిరా  మందిర సభలు,  అవధానాలలో పాల్గొనటం జరిగింది .లీలా మోహనరావు తిమ్మరు పాత్రనెంతో రక్తి కట్టిస్తూ తనకి తనే సాటి యనిపించుకున్నాడు . నేను రామరాజ భూషణుని గ ,ముక్కు తిమ్మనగ, పింగళి సూరనగా పాలు పంచుకోనటం జరిగింది .రేపల్లెలో పండిత పరిషత్కార్యక్రమాలు జరిగినంత కాలం అదొక స్వర్ణ యుగంగా ఉన్నది.  లీలామోహనరావు ,నేను ఒకే కళాశాలలో కలసి చదువుకొన్నందుకు , దగ్గర,దగ్గర విద్యాలయాలలో( ఒకరు భట్టిప్రోలు ,మరొకరు ధూళిపూడి)  చేరాము. దాని ఫలితంగా 36.సం .కళాశాల లోనే ఉన్నట్లు అనిపించింది .    

11, జనవరి 2013, శుక్రవారం

పల్లె సంక్రాంతి .

అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు..  పల్లె సంక్రాంతి .
ఉ. ఎద్దుల పందెముల్ ఘనత కెక్కిన కుక్కుట పాద ఘట్టనల్ 
    ముద్దుగనున్న గోమయపు మోహనరూపము, రంగవల్లులున్ 
    ముద్దులుమూటగట్టు విరిబోడుల రంగుల పట్టువస్త్రముల్
  హద్దులులేని మోదములు హైదవజాతికి సంస్కృతుల్ సుమా. 
 ఆ.వె. రేగి పండ్లు బోయ రేగిన జుత్తుతో 
         పాపలెల్ల విరియు పర్వ మిదియె 
         పాప దృష్టి తొలగి పదివేల కాలాలు 
         బ్రతుక గోరు క్రాంతి పధము లివియె.
             వంగి మ్రుగ్గుపెట్టు వనితశోభ 
             హారి హారి యనెడు హరిదాసు కీర్తనల్ 
          పల్లె పట్టులందు పరిమళాలు .

2, జనవరి 2013, బుధవారం

కవి ...భావన

కవి ...భావన 

కవి తలలోనే ఓకే సృజనాత్మకత ఉండాలి .ఉంటేనే కవితకు ఒక అర్థం ఉంటుంది భావనా పరంపర ఉంటె అది మనోరంజకం కాగలదు. మీకు కవిత నచ్చినందుకు కృతఙ్ఞతలు .  

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...