10, ఏప్రిల్ 2013, బుధవారం

సర్వేజనాః విజయ వాసంత శుభ కామనః

                                       
            సర్వేజనాః   విజయ    వాసంత           శుభ కామనః 

11. 04. 2013
ప్రతి ఉగాది ప్రకృతి ని కను విందు చేస్తుంది 
                         తన నూతన చేతనత్వంతో ,
ఈ యుగాది విజయ నామ ధారియై , 
                         సకల జీవ రాశులకు  విజయ రహదారియై ,
మందార మకరంద సుధామయ జీవితాలలో . 
                          సుధలు చిలకాలని నాంది పలుకుతుంది .. 
విజయం వినటానికి చాల బాగుంటుంది . ,
                           కఠోర  పరీక్షల విశ్లేషణ లేకుంటే . 
విజయమా అనటానికి బలే బాగుంటుంది , 
                            అప జయాల ఊసులు లేకుంటే ,
విజయం సు వ్యసనమ్ అయితే ,
                             పరాజయలన్నీ దుర్వ్యసనాలే   . 
విజయానికి అలవాటు పడిన ప్రాణి , 
                             ప్రాణం పోయిన అపజయానికి ఒప్పుకోదు . 
వసంతం లోని ప్రతి విజయ చిహ్నమైన , 
                             చివురు వెనుక బలహీనపు పండుటాకు ఉంటుంది ... 
ప్రకృతి తన ధర్మంగా ఒక్కొక్క కాలంలో , 
                             ఒక్కొక్క దానికి ప్రతిభ,వ్యుత్పత్తి ,కాంతుల నిమ్పుతున్ది. 
వసంత ఋతు రాజు  కర్తవ్యమ్ గా చరాచర జగత్తుకు ,
                              ఈనాటి నుండి నూతన శోభలను విజయ   పరమ్పరలనన్దిస్తాడు . 
వసంత లక్ష్మీ శోభాయమాన సదృశ సహృదయులన్దరకు 
                               విజయ, ఆయు రారోగ్య ఐశ్వర్యా లను ప్రకృతి మాత ప్రసాదిస్తుంది . 
మారిన కాలం తో మనం మారి  కల కాలం ధర్మా చరణ తో ,
                                ప్రకృతి మాత పాద పద్మ రజోలేశాలను ,                                         
మన శిరస్సుల ధరిద్దాం , పునీతులమౌదామ్. 

                          

                             । ।  సర్వే జనాః విజయో భవంతు । ।  


1, ఏప్రిల్ 2013, సోమవారం

కీ. శే యల్లా ప్రగడ వెంకట నారాయణ రావు గారు.

            కీర్తి శేషులు యల్లా ప్రగడ వెంకట నారాయణ రావు గారు.




వీరు నామాతా మహులు . వాసుదాసు గారి
( ఆంద్ర వాల్మీకి గా ప్రసిద్ధి గాంచిన ,వావిల కొలను సుబ్బారావు
గారికి ) శిష్యులు . వైష్ణవం స్వీకరించారు .. గుంటూరు జిల్లా నగరం
స్వ గ్రామమ్. యేలేటి పాలెం గ్రామానికి కరణం  గా పని చెసారు.
ఈనాడు వేద గాయత్రి అగ్రహారం నిర్మాత అయిన యల్లాప్రగడ
ప్రభాకర శర్మ గారికి పితామహులు .  శిస్టా చార పరాయణులు .
భారత , భాగవత , రామాయణాది గ్రంధములు వారికి కన్థ స్థ మనిన
అతిశయోక్తి కాదు. పరమ భక్తులు . బహుముఖ ప్రజ్ఞాశాలి .
పోలములను కొలిచే సర్వ్ గొలుసు లేకున్డగానే ఆనాడు తన అంగలతో
పోలములను కొలిచే వారు. అది అందరిని ఆశ్చర్య పరచే విధంగా
చాల ఖచ్చితం గ లెక్క ఉండేది  ఒంటి కాలి మీద నిల్చి ఆదిత్య హృదయం  నలుబది రోజులు పారాయణ చేసి తన అభీష్టాన్ని
( కోర్టులో విజయం ) సంపాదించుకొన్న ఘనులు . నిరంతరం
రామ నామ జపమే ధ్యేయంగా పెట్టుకొన్న రామ భక్తులు.
అందరి చేత  దేవుడు తాతయ్య గా పిలిపించుకోనేవారు .ధన్యజీవులు .
                                                                                             


                                                                                 





                               

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...