
ప్రకృతి పురుషులు వేరెవరో కాదు . ( ఆది దంపతు లైన
పార్వతీ పరమేశ్వరులు )
శ్లో . వాగర్దా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయే ,
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ .
ప్రకృతి, పార్వతి. పురుషుడు పరమశివుడు . ఈ సత్యాన్ని నమ్మిన వాడే మనవినాయక స్వామి. అందుకనే కుమార స్వామి కి తనకి వచ్చిన సేనా నాయకత్వఆధిపత్య పోరులో విజయం కొరకు అతి సులువైన మార్గాన్ని తన తండ్రి అయినపరమేశ్వరుని ద్వారా తెలిసికొన్నాడు . అదే తల్లి దండ్రులకు సభక్తిక ప్రదక్షిణము.
కుమారస్వామికి తాను స్నానం చేసిన మూడు కోట్ల ఏబది లక్షల నదులలో
తన అన్నగారు ముందుగా స్నానం చేసినట్లు కనిపించాడు . దానికి కారణం
తెలియక విస్తుపోయాడు ,కుమారస్వామి. సూక్ష్మం లో మోక్షం గ తలిదండ్రులకుప్రదక్షిణం చేసి విజయం సాధించి , సర్వ సైన్యాధి పత్యాన్ని , సంపాదించాడు తెలివిగావినాయక స్వామి. కనుక పార్వతీ పరమేశ్వరుల వంటి తలిదండ్రుల పూజ మహోన్నత మైనదనినిరూపించాడు బొజ్జ గణపతి. సమాజ శ్రేయస్సుకు ఇంతకన్నా కావలసింది ఏముంటుంది .
ఇక పత్రీ , పూజా ద్రవ్యాలు గురించి ఆలోచిస్తే . ఆయన కిష్టమైనది ముఖ్యం గ గరిక. దీనితో పూజిస్తే , సమస్త పూజా ద్రవ్యాలతో, పత్రులతో పూజించినట్లే .ఎక్కువ ధనం వెచ్చించకుండా సామాన్యుడుకూడాసులువుగా పూజించే విధం గ ఏర్పాటు చేసినదే గరిక పూజ. కాని మనం సమస్త ఆయుర్వేద శక్తులు దాగి ఉన్న 21 పత్రాలతో పూజిస్తె ఆరోగ్య పరంగా , ఆధ్యాత్మిక పరంగా మంచిదని విజ్ఞులు చెప్పటం వలన ఆయా పత్రాలను సభక్తి కముగా సేకరించి పూజిస్తాము. ఈ విధంగా మనం నిర్మల భక్తి తో పూజ చేస్తే మన హృదయసరోవరంలోనే విహరిస్తాడుబుజ్జి ( బొజ్జ ) గణపతి .
ప్రతి పూజలో లౌకికము , పార లౌకికము ఉంటాయి . మట్టి తో చేసిన గణపతికి పూజ చేసి, నిమజ్జనం చేస్తే ,ప్రకృతి , ప్రకృతి లో కలసి పార లౌకికత సిద్ధిస్తున్ది. కనుక మనమందరం అవకాశం మేరకు మృణ్మయ గణపతినేత్రికరణ శుద్ధిగా పూజ చేసి మనోభీస్టాలను సిద్ధింప జేసుకొందాము .
శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు .
ప్రకృతి, పార్వతి. పురుషుడు పరమశివుడు . ఈ సత్యాన్ని నమ్మిన వాడే మనవినాయక స్వామి. అందుకనే కుమార స్వామి కి తనకి వచ్చిన సేనా నాయకత్వఆధిపత్య పోరులో విజయం కొరకు అతి సులువైన మార్గాన్ని తన తండ్రి అయినపరమేశ్వరుని ద్వారా తెలిసికొన్నాడు . అదే తల్లి దండ్రులకు సభక్తిక ప్రదక్షిణము.
కుమారస్వామికి తాను స్నానం చేసిన మూడు కోట్ల ఏబది లక్షల నదులలో
తన అన్నగారు ముందుగా స్నానం చేసినట్లు కనిపించాడు . దానికి కారణం
తెలియక విస్తుపోయాడు ,కుమారస్వామి. సూక్ష్మం లో మోక్షం గ తలిదండ్రులకుప్రదక్షిణం చేసి విజయం సాధించి , సర్వ సైన్యాధి పత్యాన్ని , సంపాదించాడు తెలివిగావినాయక స్వామి. కనుక పార్వతీ పరమేశ్వరుల వంటి తలిదండ్రుల పూజ మహోన్నత మైనదనినిరూపించాడు బొజ్జ గణపతి. సమాజ శ్రేయస్సుకు ఇంతకన్నా కావలసింది ఏముంటుంది .
ఇక పత్రీ , పూజా ద్రవ్యాలు గురించి ఆలోచిస్తే . ఆయన కిష్టమైనది ముఖ్యం గ గరిక. దీనితో పూజిస్తే , సమస్త పూజా ద్రవ్యాలతో, పత్రులతో పూజించినట్లే .ఎక్కువ ధనం వెచ్చించకుండా సామాన్యుడుకూడాసులువుగా పూజించే విధం గ ఏర్పాటు చేసినదే గరిక పూజ. కాని మనం సమస్త ఆయుర్వేద శక్తులు దాగి ఉన్న 21 పత్రాలతో పూజిస్తె ఆరోగ్య పరంగా , ఆధ్యాత్మిక పరంగా మంచిదని విజ్ఞులు చెప్పటం వలన ఆయా పత్రాలను సభక్తి కముగా సేకరించి పూజిస్తాము. ఈ విధంగా మనం నిర్మల భక్తి తో పూజ చేస్తే మన హృదయసరోవరంలోనే విహరిస్తాడుబుజ్జి ( బొజ్జ ) గణపతి .
ప్రతి పూజలో లౌకికము , పార లౌకికము ఉంటాయి . మట్టి తో చేసిన గణపతికి పూజ చేసి, నిమజ్జనం చేస్తే ,ప్రకృతి , ప్రకృతి లో కలసి పార లౌకికత సిద్ధిస్తున్ది. కనుక మనమందరం అవకాశం మేరకు మృణ్మయ గణపతినేత్రికరణ శుద్ధిగా పూజ చేసి మనోభీస్టాలను సిద్ధింప జేసుకొందాము .
శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు .