21, అక్టోబర్ 2013, సోమవారం

మధురాను భూతి .

                                                                       మధురాను భూతి . 20. 10. 13. 


బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి  గారిని ప్రత్యక్షంగా  చూడటమే ఒక మహత్తర దివ్యాను భూతి . వారితో మాట్లాడటం మరువలేని మధురాను భూతి . వారిరువురు ( దంపతులు ) పార్వతీ పరమేశ్వరుల ప్రతి రూపమ్ . నేను వారిని గురించి పద్యాలు వ్రాయటం చాల ఆనంద దాయకం . జన్మ తరించి నట్లుగా భావిస్తాను . వారి పురాణ ప్రవచనమునకు వయస్సు సప్తతి (70. సం .లు ) ఈనాటికి వారి వయస్సు 90 వసన్తాలు. స్వరం ఆనాటికి ఈనాటికి ఏమి తేడా లేదు . సాక్షాత్ వాల్మీకి  , వ్యాస ముని రూపమె. ఈనాడు వారికి  సువర్ణ పుష్ప సహిత రజత కిరీటం ( ప్రభాకరశర్మ, సుధారాణి చేత )అలంకరించటం జరిగిన్ది.  తదనంతరం  వారిని గురించిన పద్యాలు చదివి వినిపించడం , దానికి వారు మహదానంద భరితులు కావడం , ఆ సందర్భం గ వారితో మాట్లాడటం  పురాకృత పుణ్య విశేషంగా భావిస్తాను . 

     ఈ మహత్తర అవకాశం  నాకు చి. ప్రభాకర శర్మ ద్వారా  లభించిన్ది.  ఆనాటి సభానిర్వాహకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు.( సినీ  కవి .)  ప్రధమంగా నా పద్యాలు  వారికి చదివి వినిపించాను.  నేను పద్యాలు వ్రాద్దామని అనుకున్నాను . మీ పద్యాలు విన్నతరువాత అభిప్రాయం మార్చుకొన్నాను మీ పద్యాలు చాలా బాగున్నాయి వానినే అచ్చు వేయించి సమర్పించండి అని చెప్పటం నాకు మహదానందం కలిగించింది  . పద్యాలు చదివిన తరువాత  విభీషణ శర్మ గారు, ( తి . తి .దె . సాహితీ కార్యక్రమ నిర్వాహకులు ) వల్లూరి శంకర శాస్త్రి గారు ( తి . తి .దె . ప్రముఖులు ) చాల మంచిపద్యాలు బాగా చదివారని ఆశీస్సులన్దించటం 
మిగుల ఆనందాన్ని కలిగించిన్ది. ఇంతటి మహనీయుడు పుట్టిన అమరావతి కి ( గుంటూరు జిల్లా) సమీపంలోనే నేను జన్మించడం నా భాగ్యమ్.  

15, అక్టోబర్ 2013, మంగళవారం

అక్షర నీరాజనం 20. 10. 2013

 అభి నవ వ్యాస , సవ్య సాచి . బ్రహ్మశ్రీ  మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి . యల్లాప్రగడ  ప్రభాకర  శర్మ గారి చేత 
 20. 10. 2013 న  సన్మాన కార్య క్రమము . ( సువర్ణ పుష్పసహిత రజత 
 కిరీట ధారణ ) 

                                                       అక్షర నీరాజనం 


1. సి.  కృష్ణా జలంబు లు తృష్ణ దీరగ ద్రావి ,

                  వేద సారము పంచు విజ్ఞు లెవరు 
         వైదిక జ్ఞానియై వాదనన్ గెలువంగ
                  తాత  చైనుల మేధ తరచే నెవరు
          కమ్మని స్వరమున కవితా ఝరులిల
                   ధారలై పొంగించు దాత ఎవరు
 తే . గీ .  వారలెవ్వరొ కాదుసు వసుధ యందు
             చంద్ర శేఖర శాస్త్రి నాన్ చదువులయ్య

             బ్రాహ్మి పుంభావ రూపంబు వాస్తవముగ

             పాద పద్మంబు లర్పించి ప్రణతు లిడుదు 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...