28, ఆగస్టు 2014, గురువారం

శారద నీరదేందు





శారద నీరదేందు ....పద్య ప్రతి పదార్ధం.  శారద = శరత్కాలమన్దలి, నీరద =మేఘము , ఇందు=చంద్రుడు , ఘనసార =కర్పూరము , పటీర =పటిక, మరాళ=హంస , మల్లికాహార =మల్లెల దండ , తుషార =నీటి తుంపర , ఫేన =నురుగు , రజత +అచల = వెండికొండ , కాశ=రెల్లుగడ్డి ,ఫణీశ =నాగేంద్రుడు , కుంద=మల్లె , మందార =తెల్ల మందార ,సుధా పయోధి = పాల సముద్రము , సిత=తెల్లని , తామరస =తామరపువ్వు , అమర వాహిని = గంగానది , వలె, శుభ ఆకారతన్= ఆకారముతో , ఒప్పు =ప్రకాశించు , నిన్ను, మదిన్ =మనసులో , ఎప్పుడు , కాన గల్గుదు , భారతీ .

 పోతనామాత్యులు అన్ని తెల్లని రంగు గలిగి వానితో సరస్వతిని పోలుస్తూ మనోహరంగా వర్నిచిన పద్య రత్నము .  

24, ఆగస్టు 2014, ఆదివారం

అమ్మను నాన్నలో .....ది. 24. 08. 14.

                           శివాయ గురవే నమః

                     అమ్మను నాన్నలో .....ది. 24. 08. 14.
         ( వైష్ణవీ మాత ను గంగాధరునిలో )

శ్లొ. వాగార్దావివ సంపృక్తౌ ,వాగర్ధః  ప్రతిపత్త యే ,
    జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

వాక్కును అర్ధము కలసి యున్న రీతి గా
పార్వతీ పరమేశ్వరులు కలసియే ఉంటారు .

అమ్మను నాన్నలో , నాన్నను అమ్మలో
చూడవచ్చు .

 నేను హిమాలయాల్లో ఉన్న వైష్ణవీ మాతను
 చూద్దామని అనుకున్నా . కాని నా శ్రేయోభిలాషులైన
 భిష గ్వర్యులు మీరామెను ప్రత్యక్షంగా నేత్రాలతో చూడటం శ్రేయస్కరం కాదని , సముద్ర మట్టానికి దాదాపు 5000 మీటర్ల  ఎత్తున ఉండటం వలన , మామూలు
 గుండెలకే ఊపిరి అందదని , మీ గుండె రిపేరు చేయ బడింది కనుక అసలు కూడదని వారించారు . నిషేధించారు .
నేత్రాలతో చూడలేనివి  ఎన్నో మనో నేత్రముతో  చూడవచ్చు కదా. అందుకని గంగాధరుని వామ భాగం
మనో నేత్రం తో చూచి , అమ్మ వైష్ణవీ దేవిని దర్శించిన మానసిక తృప్తిని ,ఆనందాన్ని , పొన్దాను పైసా ఖర్చు
లేకుండా . కళ్ళ తో చూచినవి ఎప్పటికైనా మరచే  అవకాశం లేక పోలేదు . ఇలా మనసు తో దర్శిస్తే  ఇలలో
నున్నంత  కాలం  మరువలేము . ఈ భావన చ్చన్దస్సులో  ఎలా ఉంటుందో నని ఆలోచన వచ్చి అమలు పరిచానంతే .
1. వాసవి, వైష్ణవీ సతి నవారిత భక్తిని దర్శనార్ధమై
   దోసిలి యొగ్గి కోరితిని తోయజ నేత్రుడు గంగధారినిన్
   దోసము గల్గు మీ యెడద దుస్తర పర్వత శ్రేణి మీదటన్
  మోసము చేయవచ్చనుచు మోదము తెల్పరు ఖండితంబుగాన్ .

2. చక్కని యోచనన్ సలుప సాగితి నిట్టుల మానసంబునన్
   ఎక్కడ జూచినన్ గలుగు నీశ్వరి రూపము భక్తి  నిన్డినన్ .
   మక్కువ మీర కాంచెదనుమాపతి   కాయపు వామభాగమున్
  దక్కును నాకు వైష్ణవి సు దర్శనమాత్రపు భవ్య భాగ్యముల్.

3 అమ్మకు మారు రూపమగు నాశ్రిత వత్సల తత్త్వ మెంతయున్ ,
  చెమ్మగు కన్నులం గలిగి చిత్తము మొత్తము నామె వేడినన్
  రమ్మని కౌగిలించి తనరారెడు ప్రేమను వృష్టి సేయు .. మా
  యమ్మగు వైష్ణవమ్మ నిల హార్దిక భక్తిని నంజలించెదన్.

4. ఎంత చేసికొన్న నంతనె ఫలమిచ్చు , నదికమంచు కోర నర్హమగునె ,
   చేయునపుడె  మనము చిత్తంబు రంజిల్ల . భక్తి తత్త్వములను పరగ వలయు. .

5. చానగు వైష్ణవిన్, పరమ సాధ్విని, అంబను , విశ్వ శక్తినిన్ ,
   మానస దర్శనంబు కడు మాన్యత, ధన్యత, సత్ఫలంబిడన్,
   నేనటు జేసితిన్ మదిని నిల్కడ యైన సభక్తి ప్రేరణన్ .
   వేనకు వేలు జోతలివె  వేడ్కను నర్పణ జేతు  మాతకున్ .
 

18, ఆగస్టు 2014, సోమవారం

కృష్ణాష్టమి

కృష్ణాష్టమి

కంజ దళాక్షుని , కన్జాతముల బోలు ఈ చిన్ని పాదముద్రలు మధురా నాధుని , మధుర మనోహర 
మనోజ్ఞ , మంజుల, మాననీయ సౌందర్య విలసితాలు . చిన్ని కృష్ణుని చిరునవ్వులు చిద్విలాసపు 
భువనైక మోహనాలు, అమాయకత్వపు అద్వితీయ నటనా సౌందర్య సారస్యానికి సమగ్ర స్వరూపాలు .ఆ మురళీ నాధుని జన్మాష్టమి సకల భువనములకు పుణ్యా స్టమి. శ్రీ కృష్ణ కృపా కటాక్ష వీక్షణ మహత్ భాగ్యం సర్వులకు కలగాలని మనాసా ఆసిస్తూ. మా యింటికి వచ్చిన జాడలు మీకు చుపిస్తూ .

4, ఆగస్టు 2014, సోమవారం

మానవత్వం

                                                                              మానవత్వం
                                                                         
ఎవరన్న కష్టం లో ఉంటే వారికివారే  కష్టంలో ఉన్నట్లు యితరులకు తెలియజేస్తేనే తెలుస్తుంది. కానీ ఆ సమయంలో అది అందరికి అందించలేక పోవచ్చు . మానవత్వం ఏమంటే ఆ విషయం ఎవరి ద్వారా తెలిసిన వెళ్లి ఓదార్చాలి. అలా ఓదార్చి నా మానసిక బాధని పంచుకొన్నవాడు స్వయంగ నా బావ మరది కీ .శే . గంగరాజు వాసుదేవ మూర్తి . మరొకరు మా కుటుంబ వైద్య శిఖామణి . వారికి కృతఙ్ఞతలు .ఇది 8 సంవత్సరముల నాటి మాట. హృదయాని కలిగిన కోత ఫలితంగా , మానసిక వికారాలు. ( ఊహలు, వగైరాలు ) చెబుతుంటే  అందరు విసుక్కునే వారు. వారు  మాత్రం మీ భావాలన్నీ కాగితం మీద చమత్కారాలు కలిపి పెట్టండి అని సలహా యిచ్చారు . దాని ఫలితమే  ఈ నాటిక. ఇప్పుదేంటి 8 సంవత్సరాలనాటి  సోది అంటారేమో. మొన్ననే దానిని కంప్యుటర్ లో బంధించాను. క్షమించండి.  అందుకని. 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...