30, సెప్టెంబర్ 2014, మంగళవారం

బీదర్ లోని లక్ష్మీనరసింహ స్వామీ ఆలయ దర్శనం . ది 30.. 14

             బీదర్ లోని లక్ష్మీనరసింహ స్వామి  ఆలయ దర్శనం .ది 30.09 . 14 

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రవేశం ఒక ప్రత్యేక మైనది . తాండూరు లోని 
ద్వాదశ శివ క్షేత్రం సుప్రసిద్ధము  . ఎందుకనగా పరమ శివుని దర్శించటానికి 
భక్తులు కొంత దూరం నీటి లో నడవాలి . ఆ నీరు షుమారు రొమ్ముబంటి ఉంటాయి . ఇష్టమైన  వారు నీటిలో వెళ్ళుట , అలా వీలుకాని వారు వేరే విధం గ వెళ్ళుట జరిగి మొత్తానికి శివ దర్శనము చేసికొన వచ్చును, 
               
కాని బీదర్ లో మాత్రం తప్పక నీటిలో వెళ్లి మరల నీటిలో నుంచే రావాలి. ఆ నీరు మొలబంటి ఉన్నాయి .వయసు యెంత అయిన ఎవరికి వారికి రొమ్ము బంటే నీరు వస్తాయట . అదే నరసింహ స్వామి మాహాత్మ్యమట . కాని ఈ రోజు మాత్రం నీరు కటి బంటి  మాత్రమె ఉన్నాయి .  ఏ రకమైన యిబ్బంది లేకుండా మేమందరము  స్వామిని దర్శించుకొని వచ్చాము . చాల ఆనందం గ ఉన్నది. 101 అంటి గారి భర్త గారిని కూడా జాగ్రత గ తీసికొని వెళ్లి తీసికొని వచ్చాను. ఆయన ఉబ్బసము తో బాధ పడుతున్నారు . కాని వెళ్లి రావటం లో ఏ యిబ్బంది పడలేదు . 

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

అన్నమయ్య సంకీర్తనల కార్య క్రమం

ది. 26..09. 14. న అన్నమయ్య సంకీర్తనల కార్య క్రమం చాల బాగా జరిగింది . కీర్తనలకు చేసిన వివరణ అందరికి నచ్చింది . 

25, సెప్టెంబర్ 2014, గురువారం

దసరా ది. 26..09 . 14 న కార్యక్రమము .

           శరన్నవ రాత్రి ఉత్సవముల సందర్భముగా .( దసరా) ది. 26..09 . 14 న కార్యక్రమము .

               శ్రీమాన్ మరింగంటి రాఘవాచార్యుల  వారితో ( అష్ట లక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు ) పరిచయం.  (ది. 24. 09. 14 న )

   దేవాలయ ప్రాంగణం లో ది. 26. 09. 14. ఉదయము 8. గం .లకు శ్రీమతి  వి. వి. యస్. కృష్ణ  కుమారి , మరియు  శ్రీమతి  పద్మ లత గారు  అన్నమాచార్యుల వారి కీర్తనలు  పాడుటకు  అనుమతి లభించింది . కృష్ణ కుమారి గారు కీర్తన లకు వ్యాఖ్యానం ఉంటే  బాగుంటుందనే ఆలోచన వచ్చి నన్ను చెప్పమని అడిగారు . నేను

అంగీకరించాను . వారి కీర్తనలకు అనుగుణం గ విషయం వ్రాసుకొన్నాను . ఈ రోజు ఆచార్యుల వారి దగ్గర కొంత అభ్యాసం చేయాలని విషయం వారికీ చూపించాలని అంటే వారి యింటికి వెళ్ళాము . నేను వ్రాసిన దానిలో అన్నమయ్య గారిని గురించి కొంచెం తగ్గించి చెప్పమన్నారు . మిగిలినది అంతా బాగున్నది అని అన్నారు . చాలఆనందం గ ఉన్నది. కార్య క్రమం 
విజయవంతమైతే యింకా ఆనందం . క్రొత్త క్రొత్త అనుభవాలు వస్తున్నాయి . 
అయాచితం గ వచ్చే అవకాశాలే మధురానుభూతులను యిస్తాయి . విలువలను పెంచుతాయి. 

.

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

గురు పూజోత్సవము సందర్భముగా 5.09.2014.

 (గురు పూజోత్సవము సందర్భముగా


శ్లో.  గురుర్ బ్రహ్మ , గురుర్ విష్ణుః , గురుదేవో మహేశ్వరః
       గురుస్సక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః . )

  శ్లో. అజ్ఞాన తిమిరాన్ధస్య జ్ఞానాం జన శాలాకయా
      చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః .

     మాతృ దేవో భవ, పితృ దేవో భవ ,ఆచార్య దేవో భవ, అతిధి దేవో భవ .

     జన్మ నిచ్చిన తల్లి ప్రధమ గురువు . నడక నేర్పిన తండ్రి ద్వితీయ గురువు .నడత నెర్పుతూ , జ్ఞాన భిక్ష పెట్టె వారు త్రి గుణ రూపులైన వారు తృతీయ  గురువులు. భగవత్ స్వరూపులైన  వారు , హిందూ సంప్రదాయానికి ప్రతీకలైన వారు, తురీయ గురువులు .                         ఎందరో మహాను భావులు అందరికి వందనములు .

  అకలంకంబగు నక్షరంబులను , సర్వార్ధ్హార్ధ సిద్ధం బుగాన్ ,
  సుకరం బయ్యెడి రీతిగా  మదికి సంస్తూయాత్మ పాండిత్యమున్,
  సకలంబున్ దయ జూపి నేర్పిన గురుస్స్వాముల్ విచారింప ..నా
  కొకరా యిద్దర ముగ్గురా నలుగురా ఉన్నార లెందెందరో  .

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...