28, నవంబర్ 2014, శుక్రవారం

తెలుగు పలుకు, ఘనతకు కారణాలు.

 తెలుగు వెలుగులోకి రావాలంటే తెలుగు వచ్చిన ప్రతివారు మౌనం విడనాడాలి . తెలుగుకు వెన్నుదన్నుగా నిలవాలి. తమ వంతు సహాయం చేయాలి .

 తెలుగు పలుకు పలికి దేశాల  వినిపించి 
 తెలుగు పద్య మనుచు తేనె లొలికి 
 తెలుగు వారి ధీర తేజంబు జూపుచు 
 వెలుగు మోయి సతము వేయి నాళ్ళు 

 
మన మాతృభాష గొప్పదనుటకు ౠ. బావగారు(సత్యనారాయణ గారు) పంపిన ఆంగ్లమునకాంధ్రానువాదం.1. క్రీ.శ. 400సం.ల.నుండి తెలుగు ఉన్నట్లు తెలుస్తున్నది. 2. తెలుగు లిపి అంతర్జాతీయ అక్షర మాలా సంఘముచేత 2012లో ఉత్తమ రెండవ లిపిగా ఎన్నుకో బడినది.(కొరియా కు 1వ స్థానం)3. తెలుగు భాషోచ్చారణ వలన 72000నాడులు స్పందిస్తాయని విజ్ఞానశాస్త్రం నిరూపించింది. 4. శ్రీలంకలో ని జిప్సీ అను తెగవారు ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. 5. మయన్మార్ లో తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి.6. ఈభాష ఇటాలియన్ భాష వలె అచ్చులు చివరగా ఉండుటచే భాషాపరిషోధకుడైన "నికోలో డి కాంటి" తెలుగు ను "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అన్నారు. 7. ప్రపంచ మానవజాతి విషయ సేకరణ శాస్త్రవేత్తల జాబితా ప్రకారం దేశ పరిధిలో 3వ దిగా , ప్రపంచ పరిధిలో 15 వదిగా లెక్కించారు. 8. భారతదేశంలో ని నిజాం లోని కాళేశ్వరం, రాయలసీమలో ని శ్రీశైలం, కోస్తాలో ని భీమేశ్వరంలోని మూడు శివలింగముల మధ్య వారు మాట్లాడే భాష కనుక దీనిని త్రిలింగ,తెలుగు, అని పిలువబడుతున్నది..9. తూర్పు దేశ ప్రాంతంలో అజంతంగా మాట్లాడే భాష తెలుగు.10. ఎక్కువ సామెతలు న్న భాష తెలుగు. 11.పూర్వము కూడ తెలుగు,తెనుగు,తెనుంగు అని పిలిచేవారు. 12. రవీంద్రనాధ్ఠాగూర్ కూడ దేశభాషలందు తెలుగు తీయనిదన్నారు. 13. 200 సం.ల క్రితం 400 మంది మారిషస్ కు బానిసలుగా పంపబడితే వారి వారసులలో ఒకరు ఇప్పటి ప్రధాని. 14. 40 సంస్కృత శ్లోకాలు (రామకృష్ణ విలోమకావ్యం) మొదటినుంచి చివరకు రామాయణం, చివరినుండి మొదటికి భారతం ఉంటుంది. ఇలా మరే భాషలో లేదు. 15. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళములోని ఆంధ్రమహా విష్ణువు ను భక్తి శ్రద్ధలతో ధ్యానించి వారి ఆదేశానుసారం "ఆముక్తమాల్యద"ను వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని తెలిపి ఆ భాషను ఆధికారికం చేశారు. 16. తెలుగు భాషలో మాత్రమే ఏకాక్షరి పద్యములున్నవి. .....జై తెలుగు, జైజై తెలుగు భాషాభిమానులారా! నమస్సుమాంజలులు.... పొన్నెకంటి.

19, నవంబర్ 2014, బుధవారం

అవధాన రాజధానీ ,నిషిద్ధాక్షరి, గీతం.

        ది. 2. 11. 14 నుండి 9. 11. 2014 వరకు . అవధాన రాజధానీ 

.           ఈ కార్యక్రమం మహోన్నతంగ  భారత దేశ రాజధాని అయిన డిల్లి మహానగరం లో  ద్వి సహస్రావధాని ,డా . మాడుగుల నాగ ఫణి శర్మ గారి చే నిర్వహించబడింది . పృచ్చకులసంఖ్య 250.  ఉత్తర,దక్షిణ  ప్రాంత సంస్కృత కవులు , పండిత ప్రకాండులు కళాకారులు , రాజకీయ నాయకులు  ఎందరో పాలుపంచుకొన్నారు ఎందరో మహాను భావులు . అందరికి వందనాలు .  . 
   
  దీనిలో ముఖ్యముగా 1. సమస్య . 2. దత్త పది . 3. నిషిద్ధాక్షరి 
4. వర్ణన  5 . అశువు   6. మీమాట ..నా పాట . 7. నృత్య పది . 
8. స్వర పది . 9. చిత్ర పది.అనే  అంశాలు ఉన్నాయి. 

అన్ని అంశాలు మనోహరం గ మనో రంజకం గ సాగినవి. నేను 

నిషిద్ధాక్షరి లో పాలు పంచుకొన్నాను నిషిద్ధాక్షరి అవధాని గారికి  పృచ్చకునకు మధ్యన జరిగే సాహిత్య (తో )రణం.  దీనిని 
పద్య రచన చేయగలిగిన వారు మాత్రమే ఆనందించ గలుగు తారు. 
తదన్యులు ప్రయత్న పూర్వకముగా ఆనందించగలరు . 

   సాధారణం గ అవధాని పద భాండాగారము . పదకొశమును యెదలో నిత్యం మననము చేస్తూఉంటారు  అందువలన  పై చేయి వారిదే నిస్సందేహంగా . ఇందు  పృ చ్చకుని పద, పద్య , భావ పాండిత్యము , కూడా పని చేస్తుంది . దాని వలన అవధాని గారిని కొంత వరకు యిబ్బంది పెట్ట వచ్చు . 

విషయము .     సంగీతము . రొగనిర్మూలన కారిణి . 


 కంద పద్యము .  ( పాద ప్రారంభములో యతి ఉంటుంది కనుక అవధాని గారే ప్రారమ్భిస్తారు. )

కం    (అవధాని గారు ) భో గా () ( నిషేధం) ( ఆవ  ) ( నిషేధం) ( ఆవ ) సం ( నిషేధం ) మీ ( ఆవ)రా (నిషేధం ) గా ( ఆవ) త్రం ( నిషేధం ) నం ( ఆవ)

    (ఆవ) బాగా  న (నిషేధం )ధం ( ఆవ) తె ( నిషేదం  ) జె ( ఆవ) వి ( నిషేధం) ప్ప ( ఆవ) వి (నిషే )రో ( ఆవ )
       గా (నిషేధం ) (ఆవ) సాం  ( ఆవ) యతి స్థానం కనుక వారె ప్రయోగం . ( నిషేధం ) ( ఆవ) ము (నిషే)
       ర ( ఆవ) స్థి (నిషే) ( ఆవ) (నిషే) తి ( ఆవ) గా (నిషే ) యౌ (అవధాని )

కం .భోగాయతమీ గానం , బా గాధం జెప్ప రోధసాంతరదతియౌ

 (ఈ రీతిగా రెండు పాదములు నిషేధ, నిక్షిప్తాలతో సాగినది.  మిగిలిన రెండు పాదములు ఈ విధం గ ఊహించి వ్రాయడమైనది . )

   రాగార్చితంపు దైవము , సాగున్ వైద్యంబు పగిది స్వాస్త్యము  గూర్పన్

అవధాన   రాజధాని బ్రహ్మశ్రీ నాగ ఫణి శర్మగారి చేత విజయవంతమ్ చేయబడినది. నేను నిషిద్ధాక్షరిలో పాల్గొన్నాను . చాలా  చక్కని  పద్యం  వచ్చింది . 

విషయం ..  సంగీతం .  రోగ నిరోధకం . 

కం .  భోగాయతమీ గానం 
        బాగాధం జెప్ప రోధసాంతర దతియౌ . ( ఈ రెండు పాదములు నాగఫణి గారు చెప్పినవి )
        రాగార్చితంపు దైవము , 
        సాగున్ వైద్యంబు పగిది సౌమ్యత గూర్పన్. ( ఈ రెండు పాదాలు నేను ఊహించి వ్రాసినవి )

నాగఫణిశర్మ గారిని అభినందిస్తూ వ్రాసిన గీతమ్.

పల్లవి ..  నలువ రాణి పాదమణి   , నాగఫణి  మీరు  . 
             పలుకులమ్మ పనుపున , నిల దిగిన సౌరు. 

చరణమ్ .రాజధాని నంత రస రమ్యం జీసి  
             కళల సారమెంతెంతో కలగలుపుగ నేసి
             అసమానపుటనురాగం అందరకు పంచి 
             కవి, పండిత, చిత్రకార,గాయకాళి రప్పించి .               
                                      
                                     నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.

ప.         దిల్లి ప్రభుత కవితకున్న ప్రాముఖ్యం దలచి 
            తల్లివోలె తపన తోడ తనవద్దకు పిలచి 
             వినిపించెను వినువీధిని విమల తెలుగు కవిత 
             వ్యాపించును తరతరముల జిలుగు వెలుగు భవిత .
      
                                   నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

చ.        క్రొత్త పుంత  త్రొక్కుట క్రొత్త మీకు కాదు . 
            అవధానము , ధారణంబు  వింతేమి కాదు . 
            కుంచె వెంట కూర్చుపదము కోరుకున్న కూర్మిపధము 
            నృత్త పదము , నృత్య పదము నవ్య పధం మీకు .      
                       
                                నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

ప.       సంస్కృతంబు , రాజ భాష  సవరించిన గళము 
           ప్రకటించును స్వారస్యము మీదు పొన్ను కలము 
           కవిత మీకు బలము , రసము మాకు ఫలము 
           నవ రసాలు చిలుకుటే నవ్య వరము మాకు .

                                నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

                              
     




       





పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...