24, ఫిబ్రవరి 2025, సోమవారం

పాంప్లెట్.

                               ఆహ్వానము.

"సూర్యశ్రీరామం"గ్రంథావిష్కరణ సభ.

వేదిక : శ్రీలలితా పరమేశ్వరీ దేవస్ధానం, 1వ ఫ్లోర్. అష్టభుజాదేవి ఆలయం ఎదురు. 

          ఆనంద్ బాగ్. హైదరాబాద్.  

                  ది. 5.03.2025. బుధవారం. సాయంత్రం. గం. 4.లకు. 

ఆవిష్కర్త : 

మాన్యులు, ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం గారు

"అవధానసుధాకర, సభాసంచాలక సార్వభౌమ", దేవీభాగవతమునకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, ప్రతిష్టాత్మక కేంద్రసాహిత్య అకాడమీ "భాషాసమ్మాన్" పురస్కారగ్రహీతలు.

కృతికర్త :

పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

విశ్రాంతాంధ్రోపాథ్యాయులు.

అధ్యక్షులు : 

శ్రీ చింతా రామకృష్ణారావు గారు

సుప్రసిద్ధ కవిపండితులు ,  అష్టావధాని , చిత్రకవితా విశారదులు. 

ముఖ్య అతిథులు :

శ్రీ సురభి శంకర శర్మగారు.

అష్టావధాని, అభినవ భర్తృహరి, తెలుగు విశ్వవిద్యాలయపురస్కార గ్రహీత.

శ్రీ జంధ్యాల వెంకటరామ శాస్త్రి గారు.

ఆర్షసాహితీ రత్న ,మధుర వ్యాఖ్యానభారతి , ఆధ్యాత్మిక సాహితీ సుధాకర.

సూచన . కార్యక్రమానంతరం భోజన సదుపాయం కలదు. 



4, ఫిబ్రవరి 2025, మంగళవారం

అంశము: నేటి తెలుగు భాష స్ధితిగతులు.

 జాతీయస్థాయి ఉగాది పద్యాల కవితల పోటి.

జాతీయ తెలుగు పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న 

శ్రీవిశ్వావసు ఉగాదిపోటీలకు ఆహ్వానం. 

అంశము: నేటి తెలుగు భాష స్ధితిగతులు. 

పంపవలసిన చివరి తేది. మార్చి 30.2025.  

వాట్సప్ నం.6362973252


మాతృభాషపట్ల మమకారభావన

న్దెలుగుపలుకుబడులు తేటపఱచి

అక్షరాక్షరంపుటర్థంబులెఱిగించ

మరచిపోయెనేటి మాతృమూర్తి. 1


తెలుగు బాస నేర్వ తెరువులుకఱవని

"ఇంగిలీసు"మీద నీప్సితంబు

పెంచుకొనిరి నేటి పెరజాతిప్రేమికుల్

అదియె శాపమయ్యె నాంధ్రులకును. 2


తల్లిదండ్రు లెపుడు హల్లొ!హాయని బల్క

వందనంబు లనరు వారిసంతు

ఆవు చేనుమేయ నాత్మజగట్టునా?

సాజమౌను నదియె సారమగును. 3


ప్రభుతకూడ కనగ ప్రథమకారణమయ్యె

తెలుగు భాషకంత విలువనిడదు

"దేశభాషలందు తెలుగు లెస్స"నియెను

"కృష్ణరాయ"విభుడు కేలుమోడ్చి. 4


మీడియాలు కొన్ని మిడిమిడి జ్ఞానులన్

తెలుగు మాటలాడ తీసికొనుచు

రూప మొక్కటె యపురూపమటంచును

భావముంచ తెలుగు భ్రష్టుపట్టె. 5


తెలుగు సంస్కృతాల తేజంబుగ్రహియించి

ఇతరదేశవాసులిచ్ఛనేర్వ

భరతమాతసంతు పనివడి కొందరు

మాతృమూర్తి నెపుడు "మమ్మీ"గ బిల్తురే. 6


తెలుగు సంస్కృతాల తిరమైన ప్రజ్ఞతో

కావ్యనాటకాలు కవులువ్రాయ

శ్రీ వధానులెల్ల చిత్రంపువాణులై

తెలుగు పలుకు చుండు వెలుగుచుండె. 7


ప్రక్కరాష్ట్ర ప్రజల పరికించి చూడుమా

ఆంధ్రరాష్ట్ర జీవి!అసలు నిజము

వారిమాతృభాష వారికే వరమంద్రు

తెల్విదెచ్చుకొనుచు తెలుగు పలుకు. 8.


ఈ పద్యములు కేవలము ఈ పోటీ కి నేను 

స్వయముగా వ్రాసినవేయని

హామీ యిచ్చుచున్నాను. 

నా చిరునామా: 

పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

   "భాషా ప్రవీణ" ఎం.ఏ., తెలుగు.

మధుశ్రీ తిరుమల అపార్ట్ మెంట్. జి.ఎఫ్.4.

విమలాదేవి నగర్. మల్కాజిగిరి.

హైదరాబాదు. 50047.

ఫోన్: 9866675770.

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...