24, అక్టోబర్ 2016, సోమవారం

ఆడబోయిన తీర్థము

                  కోదండ రాముని దర్శనం.ది.22.10.2016.

   ఆడబోయిన తీర్థమెదురొచ్చినట్లు,కోరకనే దేవుడు వరమిచ్చినట్లు.....

  "కంటి మొంటిిమిట్ట కనులార యీనాడు
   రాముకరుణ ఝటితి మేము పొంది
   పొత్తమదియ నేడు పూర్ణత్వమొందకే
   రాముపాదమంటె రమ్యముగను.

   రామనామమనగ రసరమ్య భావంబు
   భద్రమిడును నదియె భావియందు
   జిహ్వత్రుప్పుడుల్ల శ్రీరాము చరితము
   చెప్పి పాడుచుండ సేమమగును.

 ఒంటి మిట్ట యందు నొనరంగ కరుణతో
భక్త జనులగావ ప్రభవమంది
దరినిజేరువారు ధన్యత్వమందగ
రక్షసేయువాడె రామ ప్రభువు.


    పలికించరామచంద్రుడె
    పలికితి నేనార్య చిలుక పలుకులవోలెన్
    వెలలేనిసిరుల నిచ్చును
    కలలోననుమరువకండి కల్యాణవిభున్.


 
ఈ రోజెంతో సుదినము. కడప జిల్లాలోని ఒంటిమిట్ట "కోదండరాముని" దర్శన మహాభాగ్యం లభించినది. నేను శ్రీకారంచుట్టిన "సూర్యశ్రీరామం" ( వాల్మీకి రామాయణమునకు స్వేచ్ఛ ఆంధ్రానువాదమును ఉత్తర రామాయణము 3౦ సర్గలు)శ్రీరామ పాదపద్మములచెంత నుంచి , శ్రీవారి ఆశీస్సులు పొంది, అచటి మహోన్నత సాహితీవేత్త,పండిత వర్యులైన శ్రీమాన్ వీణ రాఘవాచార్యుల వారి పరిచయము,ప్రసంగము, ఆశీస్సులతో పులకితమగుట. వారు ఇచట "వాల్మీకి రామాయణమును తెనిగించిన వాసుదాసు గారు, పోతన గార్ల ప్రస్తావన తీసికొని వచ్చి మీరును అటువంటి మహోన్నత కార్యము చేయుచున్నారు కావున ధన్యులని మనసార దీవించుట, త్వరలోనే మిగిలిన భాగమును పూర్తిజేసి స్వామి వారికి సమర్పించి ఇచట నొక సభ ఏర్పాటు నకు ప్రోత్సహించుట నాకు వరము. వారు కొంత తడవు మనకట్టుబాట్లు, మంచి అలవాట్లను గూర్చి ప్రసంగించిరి. వారి ప్రసంగమును, సుమధుర మనోహర సంఘటనను వీడియో రూపముగా భద్రపరచుట జరిగినది.
        ఈ ప్రయత్నములో నా సహాథ్యాయి, "రామాయణ కథా సారము" పరిశోథక గ్రంథకర్త అయిన శ్రీయుతులు తూములూరు దక్షిణామూర్తి గారు నాకు వాల్మీకి రామాయణ మూల గ్రంథముల నిచ్చి వ్రాయ బ్రోత్సహించుట మరువలేను. నా  సహధర్మచారిణి ఇందిరాదేవి వ్రాతప్రతిని కంప్యూటర్ అను యంత్రములో అక్షర బద్ధము చేయుటలోను, నా సహాథ్యాపకుడు జొన్నలగడ్డ జయరామ శర్మ ,విషయమును నిర్దుష్టము చేయుటలోను నిరంతరము శ్రమించున్నారని వారికి తెలుపగా వారమితానందము పొందిరి.
          "ఆడబోయిన తీర్థమెదురొచ్చినట్లు, కోరకనే దేవుడు వర మొసగినట్లు,తెలవారు జాము కల నిజమైనట్లు, 21వ తేదీన నా సోదరీమణి, చరవాణిలో "రేపు ఒంటిమిట్టకు వెళదాము అన్నయ్యా"
అని పిలవటం నిజంగా అమితానందాన్ని కలిగించింది. మధుర మనోహర అనూహ్య సంఘటన."
       ఈ తీర్థయాత్రలోనే పురాతన దేవాలయాలను కొన్నిటిని దర్శించాము. 21న ఒంటిమిట్ట కోదండ రామస్వామి,నందలూరు సౌమ్యనాథుడు,తాళ్లపాక అన్నమయ్య, అత్తిరాల పరశురామాలయము, దేవుని కడప, దర్గా చూచాము.22న పెన్నా నదీ తటమున ఉన్న, రెండవ కాశీగా ప్రసిద్ధి నందిన పుష్పగిరి నిలయుడైన లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి, సంతాన మల్లికార్జున స్వామిని,పోతులూరి వీరబ్రహ్ర్మేంద్ర స్వామి, మహానందీశుని ఆలయాలు దర్శించుట జరిగినది.
      త్వరలో ఒక్కొక్క క్షేత్ర ప్రాశస్త్యము, చూచిన నా అనుభూతి వ్రాస్తాను.

20, అక్టోబర్ 2016, గురువారం

ఎంత దయో దాసుల పై 21.10.2016

మనము జీవితములో అనుకున్నవి , అనుకోనివి , జరుగుతూ ఉంటాయి, ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు జరిగేవరకు తెలియదు. సూర్య శ్రీరామాయణం పూర్తి అయినతరువాత ఒంటి మిట్ట వెళ్లి స్వామి దర్శనం చేసికొని వ్రాసిన సూర్య శ్రీరామాయణం రాముని పాదాల చెంత ఉంచి తీసికొని వద్దామని అనుకొన్నాను . కాని  నా మీద దయతో ముందే అనుగ్రహించి రప్పించుకొంటున్నాడు స్వామి ఒంటి మిట్టకి. రామా నీకెంత దయో దాసులపై .... 
   ఈరోజు రాత్రికి బయలుదేరి 22.10.2016 న ఉదయం  స్వామిని దర్శించుకొని అచటి అర్చకాచార్యుల సలహాతో నేను 2014 న ప్రారంభించిన సూర్యశ్రీరామం వ్రాత ప్రతి వారికి చూపి దానిని స్వామి పాదాలచెంత కొంత తడవుంచి అచట ఈ సంఘటన వీడియో తీయించుకొని రావాలని సంకల్పం.
      ఒంటిమిట్ట కోదండరాముడు " ఏరా నాయనా! నా కథ తెలుగులో వ్రాస్తున్నావటగా , ఏదీ ఎలా ఉందో నేనే స్వయంగా చూస్తానిలా రారా! , పూర్తి అయిన తరువాత అప్పుడు మరల చూస్తాలే, నీ పాండిత్యమేపాటిదో చూడాలని, నిన్ను ఆశీర్వదించాలని కుతూహలంగా ఉండి ముందు రమ్మన్నానంతే, భయపడకు! " అని పిలిచినట్లున్నది.

ఓ చిట్టితల్లీ !!

                             🚺 ఓ చిట్టి తల్లీ!🚺

                              ఓ చిట్టి తల్లీ!
 1.కవికి భావమె విలువ, సరసుకందమె కలువ,తగదు వైరిగనిలువ......  ఓ చిట్టితల్లీ!
 2. రవిని ప్రాణులు కొలుచు, శశిని తల్లులు పిలచు,కవిని రాజులు తలచు.                            
   3.భువిని జీవులు నిలచు, నెలత ప్రియతము వలచు, సతము ధర్మమె గెలుచు.
 4.నీట ప్రబ్బలి పెరుగు, నీరు పల్లమునెరుగు, నిజము దైవంబెరుగు.
 5.ఉప్పు నీటనుకరుగు, మంచి యోచనమెరుగు, లోకతత్త్వము నెరుగు.
 6.సుధలు గురియునుకలము, భూమి దున్నునుహలము, కష్టపడినను ఫలము.
 7.అమ్మ మనసది వెన్న, మనదు నదియన పెన్న,మనకు దేశమె మిన్న.
 8.కన్న తండ్రిని మించు,ఉన్న ఖ్యాతినిబెంచు,కష్టముల సహియించు
 9.కలుగ నీకును లోటు,ఆడి తప్పగచేటు,నిలువ యుండదుచోటు,
10.వాణి జ్ఞానము నిచ్చు, లక్ష్మి సంపదదెచ్చు,గౌరి సత్యము మెచ్చు.
11.యశము జూచిన తెలుపు,అపయశంబది నలుపు, మమత జగమున గెలుపు.
12.నేల మీదను మొక్క, నింగి లోనను రిక్క, జీవితముతైతక్క.
13. పగలు రేయన రోజు, మనసు పండిన మోజు, ప్రమద హృదిరేరాజు.
14.పాలు కుడుచును లేగ, పైకి ప్రాకును తీగ,చదువు నేర్వుమ వేగ.
15.నదుల పుట్టుక కొండ,వర్షమున నీరెండ,తలచ దైవమె యండ.
16.మంచి చేయగ కరము,దాని బొందుట వరము, అపుడుకీర్తియె స్థిరము.
17.శివుడు జీవికిరాజు,సింగమడవికి రాజు,సోమరె పోతరాజు.
18.విషపు మనుషుల చెంత,మనుట యెంతయొ చింత,వలదు వలదో కాంత.
19.జ్ఞాన శూన్యము శిలలు,తర్కపూర్ణము తలలు,అలుపు లేనివి యలలు.
20.సుకవి పంచును సుథలు,చదివి సతతము కథలు,మదిని వ్యధలు.
21.అమ్మ పెట్టగ వండి, మితము గలిగిన తిండి,రోగమెక్కడిదండి.
22.రానీకుజ్ఞానపథమును తెలుపు,కష్టమునచెయి గలుపు,మదిని ప్రేమను నిలుపు.
23.అమృతభాండము తెలుగు,త్రావ క్షేమము గలుగు,అదియె నీకగు వెలుగు.
24.ఆదికవినన్నయ్య, సూత్రకవి చిన్నయ్య,దైవమన కన్నయ్య.
25.మనసు తేటగనుంచు,మమత సమతలు పెంచు,మధుర ప్రేమనె పంచు.
26.కుంభకర్ణుని భ్రాత,రావణునితలరాత,మార్చ వచ్చెను సీత.
27.జీవితంబున తెరవు,చూపుచుండును గురువు,దాన బెరుగును పరువు.
28.వర్ణములేబదారు,అచ్చులుగనపదారు.పరుషముల్ సరియారు.
29.కనవిసర్గలు మూడు,హల్లులు ముప్పదేడు, వ్యాకరణముంజూడు.
30.భాషలోనను సంధి,చెప్పకుమ విసంధి, మంచిపేరు సుగంధి.
31.గ్రంథపఠనము మేలు,చేసికొనుమా వీలు,సుఖమగు  జీవితాలు.                 32.గాలిమేడలు కూలు,త్రాగుబోతులె తూలు,సింగ మునకే జూలు.
33. కోపమేశాపంబు,గ్రీష్మమే తాపంబు,నీచమేపాపంబు.
34. చీమ అల్పపు ప్రాణి,తానె కోటకు రాణి,చెల్లదిప్పుడు కాణి.
35. వసుధ పుట్టును చెట్టు,పైకి క్రిందికి మెట్టు, అశ హద్దునబెట్టు.
36. వసువు పుటమును బెట్టు,క్షేత్రములనిలచుట్టు,రాక్షసుల పనిబట్టు.
37.ఇంటి విషయము గుట్టు,మంచిపని తలపెట్టు,దేశమన జైకొట్టు.
38.పాము తోడను చెలిమి, కలిమి తోడను బలిమి, గుండెదరియౌ కొలిమి.
39.నమ్మబోకుమ పరుల,గర్వమందకు సిరుల,నరుకబోకుమ తరుల.
40.మంచి మాటనె చెప్పు, స్త్రీలకందమె కొప్పు,దానగుణమది యొప్పు.
41.వ్రాయగావలె కలము,దున్నుటకునిల హలము,కష్టపడిననె ఫలము.
42.నేల మానవరాజు,నింగినానెలరాజు,స్తుతులకేభట్రాజు.
43.కొమ్మ రెమ్మల పూలు,కదిపినంతనెరాలు,చెలిమికిలజవరాలు.
44.త్రాగు స్వచ్ఛపు నీరు,పారవేయకు నోరు,శాంతమెల్లెడ కోరు.  45.మట్టిదివ్వెల వెలుగు,అంధకారమె మలుగు,శుభము నీకిల కలుగు.
46.పదుగురాడెడు మాట, తాళముండెడు పాట,జగము మెచ్చెడు బాట.
47.దానగుణమది మిన్న,కడప నున్నది పెన్న,అమ్మ మదియే వెన్న.
48.భారతంబున యుక్తి, రామకథలో శక్తి,భాగవతమున భక్తి.
49.డాంబికంబులు వద్దు,హద్దునుండుట ముద్దు,జ్ఞానహీనుడు మొద్దు.
50.సంఘమందలి రీతి,పాటిసేయగ ఖ్యాతి,తప్పబోకుమ నీతి.

విజయ రహస్యం.

                                తుదిపోరు ఫలితం "తెలుగాట". 19.10.2016.

ఈ రోజు తెలుగాట చాల ఉత్కంఠతో సాగింది. వైశాఖ మాసంలో మండుటెండలకు విలవిలలాడుచున్న తరుణంలో వరుణదేవుని కరుణచే  తడిసి ముద్దై పరమానందం కలిగినట్లు మొదటి ఆవృతంలో పూర్ణబిందువుతో దిగాలుగానున్న "లలిత"కు ఒక్కసారే మూడు వెయ్యి గుణాల ప్రశ్నలు , మరి కొన్ని  చిన్న ప్రశ్నలు సరైనవి కావటం వలన మొత్తం గుణాలు 4000.అయినవి. మొదటి నుండే ఆధిక్యంలో నున్న ప్రత్యర్థికి (ఢిల్లీ శ్వరరావు)4100గుణాలు ఉన్నాయి.
      ఇక్కడనుండే పందెపు ఆట ప్రారంభం. లక్ష్మీ దేవి కరుణా కటాక్ష వీక్షణాలు ఎవరి మీద ప్రసరిస్తే వారికే సంపూర్ణ విజయం. చిన్నమ్మ తలుపు తట్టగానే పెద్దమ్మ పారిపోతుంది. చక్కని సమయ స్ఫూర్తితో  ఆలోచనలు రావాలంటే ఆమె చలువ చూపులు, కరుణారస దృష్టి ఉండాల్సిందే. అదే జరిగి పందెంలో "లలిత" 500, గుణాలు, ఢిల్లీ శ్వరరావు గారు 2000గుణాలు పందెం కాయటం జరిగింది. ప్రశ్న " ఈ వాక్యము ఏ ఛందస్సులో ఉన్నది?" ..."శంకరంబాడి సుందరాచారిగారు".(తే.గీ)
అందరికి ఉత్కంఠ...విజయమెవరిదోనని, ఈలోగా వారివారి పాండిత్య ,స్వభావ, సమయస్ఫూర్తుల విశ్లేషణ జరిగాయి.
         మీరు పెట్టిన పందెపు సొమ్ము చూపమన్నారు. ఢిల్లీశ్వరరావుగారు కొంచెం అధిక ఆత్మవిశ్వాసం తో 2000గుణాలు, లలిత ఎందుకొచ్చిన ఇబ్బంది తగ్గి ఉంటే ఎందుకైనా మంచిదని,500, పెట్టారు. మీరు వ్రాసిన సమాధానాలు చూపమన్నారు. నలుగురు తప్పు సమాధానాలు వ్రాశారు. ఇంకేముంది తగ్గి న లలిత 4000-500=3500,గా, ఢిల్లీశ్వరరావు4100-2000=2100గా మిగిలారు. ప్రథమ విజేత లలిత.
         విజయానికి వెనుక విశ్లేషణలను, విశ్లేషించటానికి ఎంతో వివేకం, అనుభవం కావాలి. అది దైవ బలమా, పాండిత్య బలమా, లాభనష్టాల తూనికలో నైపుణ్యమా, మరి ఈ స్థితిలో ఏది పనిచేసిందో....నేనైతే దైవ బలాన్ని నమ్ముతాను. అది ఉంటే సర్వము దాని వెంటే ఉంటాయి.


18, అక్టోబర్ 2016, మంగళవారం

తెలుగాట....జీవన సమరం

                                     జీవన సమరం...తెలుగాట...
ఆట పాటలతో చిన్నతనంలో, ఆటు పోట్లతో మధ్య వయస్సులో, ఆ రెండింటి సమన్వయం కుదరక ఆపోటు ఈపోటుతో వృద్ధాప్యం గడుస్తు నాటక చివరి అంకానికి వచ్చి పాత్ర ముగింపు పలుకుతుంది. ఇదే జీవన సమరం. పుష్కలంగా సిరి సంపదలు ,అనురాగాలు , రాగాలు లభిస్తుంటే సమరం అక్కరలేదు, వాటి మధ్య సమన్వయం కావాలి. నిత్యజీవితావసరాలు కరువై నప్పుడే అసలు సమరం., చూపే త్యాగాలు, సాహసాలు, తెలివి, సమయస్ఫూర్తి అవసరమౌతాయి.
      జన్మ , ఆరాటంతో కూడిన పోరాటం నుండే  ప్రారంభమౌతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ ఆరాట పోరాటాలు ముందు జీవితావసరముల కొరకైతే, తదుపరి విలాసాల కొరకు. ఏది యేమైన పోరాటం లేని గెలుపు లేదు. పోరాడకుండ వచ్చే గెలుపు గెలుపు కాదు. అవసరాల మేరకే పోరాట పటిమ ఉంటుంది. పెరుగుతుంది. మన శరీర అవయవాలలో దేనికి ఎక్కువ శ్రమ ఇస్తామో అదే బాగ ఆరోగ్యంగా వృద్ధిచెందుతుంది.

    ఇక తెలుగాట విషయానికి వస్తే......

    తెలుగు భాషాభివృద్ధికి ఇదొక చక్కని మానసిక వికాసాన్ని, దృఢత్వాన్ని కలిగించే ఆట. ఈ ఆట దాదాపు రెండేళ్ల నుండి సాగుతున్నది. దీనిని సిలికానాంధ్ర, టి.వి.9 సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.    ఈ ఆటలో మీట ఉన్నది. మీట సమయానికి నొక్కటంపై ఆధారపడి ఆట ఉన్నది. ( నిర్వాహకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు) ఆయన ప్రశ్నించిన వెంటనే మీట నొక్కాలి , అప్పుడది కంప్యూటర్ లో నమోదు చేయబడి సభ్యుని పేరు తెలుపుతుంది. వారే సమాధానం చెప్పాలి. మొదటి తిరకాటం, లో ప్రశ్నలకు 100, గుణాలైతే రెండవ తిరకాటంలో 200గా అవుతాయి. చివర పందెం కాచే అంకం. సంపాదించిన గుణాలను పందెంలో పెట్టి తెలివి సమయస్ఫూర్తి నిరూపించుకోవడం. మన పెద్దవాళ్లు మనకు నేర్పింది " న్యాయంగా  సంపాదించు, దానిని సద్వినియోగం చెయ్యి "అని. అది ఈ ఆటలో బాగా పనికి వస్తుంది. ఎంత పందెం కాస్తే అక్కడివారు వారి వద్ద ఉన్న మొత్తం కన్నా మనదే యెక్కువ అవుతుందో అవగాహన కావాలి. అప్పుడే విజయలక్ష్మి మనలను వరిస్తుంది. "ధైర్యే సాహసే లక్ష్మీ" అనే సూక్తి సార్థకం అవుతుంది.
        17.10.2016న జరిగిన ఆట, పందెం పోటీలో  సాహిత్యం, పాండిత్యం కన్నా, సాహసం, తెగింపు, సమయస్ఫూర్తే విజయం సాధించింది.  జయరామశర్శ గారి గుణాలు..4౩00. ప్రత్యర్థి గుణాలు. 2700. (పందెం గెలిస్తే పెట్టిన ధనం రెట్టింపు అవుతుంది.)
     అందరు జయరామశర్శగారిదే విజయమని దృఢంగా నిర్ణయం చుకొన్నారు. అయినా ఆయన స్వభావాన్ని బట్టి, అతి జాగ్రత్త , పొదుపరి కనుక ఎక్కువ పందెం కాయడు అని స్వభావం తెలిసినవారి నిర్ణయం. ప్రత్యర్థికి మరో మార్గం లేదు. విజయమో వీర స్వర్గమో. అందుకే సర్వం పందెంలో ఒడ్డింది.  అందరికీ ఉత్కంఠ.... పందెం ఎవరెంత పెట్టారో సమాధానం తరువాత కాని చెప్పరు. .... అయిపోయింది ....సాహసమే గెలిచింది. పాతాళ భైరవిలో యస్. వి. రంగారావు "సాహసము సేయరా డింభక", "ధైర్యే సాహసే లక్ష్మీ"" అన్నీ ఋజువు చేస్తూ ప్రత్యర్థి గెలిచింది..

          సాహిత్యపు గెలుపు ఒకరిది, సాహసపు గెలుపు మరొకరిది.  తుది గెలుపే లెక్క....

   నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు ఔరా!!!! అనుకున్నారు.

12, అక్టోబర్ 2016, బుధవారం

తెలుగాటది.15 10.1 6 టి.వి. 9. (2)

తెలుగాట  కార్యక్రమమునకువెళ్ళు  సందర్భమున వ్ర్రాసినపద్యాలు.                                 ది.15 10.1 6. వారం వారం  టి.వి. 9. లో
                                       నా పరిచయం   

  నేటి తెలుగాట కెచ్చట 
 పోటీనే లేదు  లేదు భూతలమందున్ 
మాటుగ నాకంబందున 
చోటును గడియించెనేమొ  సూనృత చెపుమా . 1.

ఆటలు సాహిత్యంబున  
మేటిగ మరి వచ్చుచుండ మేదిని మధువై 
ధాటిగ తెనుఁగుం గురియును 
సాటే లేదింక మనకు సౌమ్యానందా                2.

పొన్నెకంటి వంశ పూర్ణ సుధామ్బుధి        
చంద్ర శేఖరాఖ్య సాదు మతికి 
అమృత మూర్తి యైన అనసూయ ముదితకు 
సూర్యనామమున్న సుతుడ నేను.             3. 

ఆనంద నామధేయులు 
తానై సాహిత్య సుధను త్ర్రావుచు నెపుడున్ 
తానానందము నందక 
పానా ర్థులకిచ్చ నిచ్చు పరవశమందన్         4.  


ఆట పాటలతో చిన్నతనంలో, ఆటు పోట్లతో మధ్య వయస్సులో, ఆ రెండింటి సమన్వయం కుదరక ఆపోటు ఈపోటుతో వృద్ధాప్యం గడుస్తు నాటక చివరి అంకానికి వచ్చి పాత్ర ముగింపు పలుకుతుంది. ఇదే జీవన సమరం. పుష్కలంగా సిరి సంపదలు ,అనురాగాలు , రాగాలు లభిస్తుంటే సమరం అక్కరలేదు, వాటి మధ్య సమన్వయం కావాలి. నిత్యజీవితావసరాలు కరువై నప్పుడే అసలు సమరం., చూపే త్యాగాలు, సాహసాలు, తెలివి, సమయస్ఫూర్తి అవసరమౌతాయి.
      జన్మ , ఆరాటంతో కూడిన పోరాటం నుండే  ప్రారంభమౌతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ ఆరాట పోరాటాలు ముందు జీవితావసరముల కొరకైతే, తదుపరి విలాసాల కొరకు. ఏది యేమైన పోరాటం లేని గెలుపు లేదు. పోరాడకుండ వచ్చే గెలుపు గెలుపు కాదు. అవసరాల మేరకే పోరాట పటిమ ఉంటుంది. పెరుగుతుంది. మన శరీర అవయవాలలో దేనికి ఎక్కువ శ్రమ ఇస్తామో అదే బాగ ఆరోగ్యంగా వృద్ధిచెందుతుంది.

    ఇక తెలుగాట విషయానికి వస్తే......

    తెలుగు భాషాభివృద్ధికి ఇదొక చక్కని మానసిక వికాసాన్ని, దృఢత్వాన్ని కలిగించే ఆట. ఈ ఆట దాదాపు రెండేళ్ల నుండి సాగుతున్నది. దీనిని సిలికానాంధ్ర, టి.వి.9 సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.    ఈ ఆటలో మీట ఉన్నది. మీట సమయానికి నొక్కటంపై ఆధారపడి ఆట ఉన్నది. ( నిర్వాహకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు) ఆయన ప్రశ్నించిన వెంటనే మీట నొక్కాలి , అప్పుడది కంప్యూటర్ లో నమోదు చేయబడి సభ్యుని పేరు తెలుపుతుంది. వారే సమాధానం చెప్పాలి. మొదటి తిరకాటం, లో ప్రశ్నలకు 100, గుణాలైతే రెండవ తిరకాటంలో 200గా అవుతాయి. చివర పందెం కాచే అంకం. సంపాదించిన గుణాలను పందెంలో పెట్టి తెలివి సమయస్ఫూర్తి నిరూపించుకోవడం. మన పెద్దవాళ్లు మనకు నేర్పింది " న్యాయంగా  సంపాదించు, దానిని సద్వినియోగం చెయ్యి "అని. అది ఈ ఆటలో బాగా పనికి వస్తుంది. ఎంత పందెం కాస్తే అక్కడివారు వారి వద్ద ఉన్న మొత్తం కన్నా మనదే యెక్కువ అవుతుందో అవగాహన కావాలి. అప్పుడే విజయలక్ష్మి మనలను వరిస్తుంది. "ధైర్యే సాహసే లక్ష్మీ" అనే సూక్తి సార్థకం అవుతుంది.
        17.10.2016న జరిగిన ఆట, పందెం పోటీలో  సాహిత్యం, పాండిత్యం కన్నా, సాహసం, తెగింపు, సమయస్ఫూర్తే విజయం సాధించింది.  జయరామశర్శ గారి గుణాలు..4౩00. ప్రత్యర్థి గుణాలు. 2700. (పందెం గెలిస్తే పెట్టిన ధనం రెట్టింపు అవుతుంది.)
     అందరు జయరామశర్శగారిదే విజయమని దృఢంగా నిర్ణయం చుకొన్నారు. అయినా ఆయన స్వభావాన్ని బట్టి, అతి జాగ్రత్త , పొదుపరి కనుక ఎక్కువ పందెం కాయడు అని స్వభావం తెలిసినవారి నిర్ణయం. ప్రత్యర్థికి మరో మార్గం లేదు. విజయమో వీర స్వర్గమో. అందుకే సర్వం పందెంలో ఒడ్డింది.  అందరికీ ఉత్కంఠ.... పందెం ఎవరెంత పెట్టారో సమాధానం తరువాత కాని చెప్పరు. .... అయిపోయింది ....సాహసమే గెలిచింది. పాతాళ భైరవిలో యస్. వి. రంగారావు "సాహసము సేయరా డింభక", "ధైర్యే సాహసే లక్ష్మీ"" అన్నీ ఋజువు చేస్తూ ప్రత్యర్థి గెలిచింది..

          సాహిత్యపు గెలుపు ఒకరిది, సాహసపు గెలుపు మరొకరిది.  తుది గెలుపే లెక్క....

   నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు ఔరా!!!! అనుకున్నారు.

2, అక్టోబర్ 2016, ఆదివారం

న్యూనాగోల్ సమావేశం.2.10.2016

రఘుప్రసాద్ గారు,జోనల్ కమీషనర్. ముఖ్య అతిథిగా, సింగయ్యగారి అధ్యక్షతన "న్యూనాగోల్ లో సీనియర్ సిటిజన్స్" సమావేశం ది.2.10.2016,న సాయంకాలం 5గం.లకు ఘనంగా జరిగింది. ఆసందర్భంగా ఐదుగురు సీనియర్ సిటిజన్స్ కు సంస్థ తరఫున సన్మానం జరిగింది. రఘుప్రసాద్ గారు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. వారికి సర్వదా కృతజ్ఞతలు.
       ఆ సందర్భంగా సభ్యులకు నేనిలా స్వాగతం పలికాను.

  1. స్వాగతమో వయోగుణ సుసాధిత జ్ఞాన సమృద్దులార! స
      ర్వాగమ ధర్మనిర్మల విరాజిత మానిత ధుర్యులార! మీ
      యాగమనంబుమాకిపుడు హ్లాదముగూర్చును,సంస్థకున్ మహా
      భోగపుహేతువైచనునుపూర్ణమనోజ్ఞత పాదముంచుడీ!
                          సంస్థ స్థాపన.......
 2. రెండువేలపదిన పండిన యోచనన్
     జనవరి నెలలోన జననమందె
     నవ్యసంస్థ యిదియె నాగోలు పేరునన్
     దివ్యశక్తి మతిగ తేజరిల్లె.
 3. స్త్రీలు పురుషులిచట చైతన్యవంతులైకక
      నిలచియుండి తమదు నేర్పుమీర
     సభ్యులైరి కలసి సంస్థ శ్రేయస్సుకై
     వృద్ధి జెందెకీర్తి హృద్యముగను.
            ఈ రోజు ప్రాముఖ్యం.......
 4. ఐక్యరాజ్యసమితి యాధ్వర్యమందున
      విశ్వవృద్ధులకది వేడుకనగ
      జన్మదినమటంచు చాటించె ప్రభుతయె
      అక్టొబరొకటిన మహాద్భుతముగ
 5. ఐదుమంది సభ్యులర్హత గుర్తించి
     వయసులోన దగిన వారిజేర్చి
      గారవంబుసేయు ఘనమైన కార్యమున్
      సలుపుచుంటిమిచట సౌమ్యులార !
             సంస్థ లక్ష్యములు.....
 6. సభ్యులందరిలోన సాంఘిక చేతనన్
                         లాలన గలిగించు లక్ష్యమనగ
     సహకారమందించి సౌమ్యతగురిపింప
                          లాలించురీతులె లక్ష్యమనగ
     పుట్టిన రోజులన్ మోదాన గుర్తించి
                          లఘుగారవంబిడు లక్ష్యమనగ
      ఆటపాటలతోడ నారోగ్యమందించి
                           లౌక్యాన నడిపించు లక్ష్యమనగ
       స్థాపనంబైన చిరకాల సంస్థ మనది
       పెద్దవయసున్న మాన్యులు పేర్మిబొగడ
       నూతనంబైన నాగోలు పూతమవగ
       సద్యశమ్మును నార్జించె సౌమ్యులార!.
 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...