దేశభక్తి ..గేయం. 28.01. 2020
చరణం ..భారతావని నా తల్లి , భవ్య సద్గుణ కల్పవల్లి
పల్లవి .. ప్రణమిల్లుచు చేతును సంస్తుతులు
కలుగగ నిరతము సద్గతులు ... 1.
వేదభూమిగాప్రసిద్ధి నందిన
పుణ్య సుశీలయె నా మాత .... 2. 11 భారతావని నా తల్లి 11
పవిత్ర మూర్తుల ప్రసవించి
ప్రాణజ్యోతిగ వెలిగిన మాతా ... 3
గంగా యమునల కమ్మని పిలుపున
కలసి పారినది బ్రహ్మాణి ...... 4. 11 భారతావని నా తల్లి 11
త్రివేణి సంగమ తీర్ధంబౌచు
కల్మష హారిగ ఖ్యాతినందెను ... 5.
ఉన్నత లక్ష్యము లున్నత కీర్తుల
హిమవన్నగమే నీవంది ...... 6. 11 భారతావని నా తల్లి 11
దేశ దేశముల శాంతి తత్వమును
బోధింపగ నిను పొమ్మంది ...... 7
అదియే తనకు మోదంబంచు
తెల్లని నవ్వులు నవ్వింది .... 8. 11 భారతావని నా తల్లి 11
దేశాభివృద్ధిలో నా పాత్ర.(11.07.19)
దేశసేవయన్న దేహముప్పొంగును
నేరికైన గాని నిశ్చయముగ
ధర్మపరుడనగుచు ధార్మికజీవికన్
నడచుకొనుటయదియె నాదుపాత్ర.1.
గ్రామసీమలెల్ల ఘనముగానెదుగుటే
క్రాంతి,వృద్ధియనెను గాంధిజీయె
వారి కలలు పండ వైభవంబుగ సాగి
నడచుకొనుట యదియె నాదుపాత్ర.2.
కవితనాయుధముగ కమ్మని సాహితిన్
మనముపులకరింప మహితగతిని
మార్చివేసి జనుల మనుగడ దెల్పుచు
నడచుకొనుట యదియె నాదుపాత్ర.3.
స్వార్థపరత సతము చంపును వృద్ధిని
దేశప్రగతికదియ నాశనమ్ము
త్యాగబుద్ధి కలుగు తత్వంబు నెలకొల్పి
నడచుకొనుట యదియె నాదుపాత్ర.4.
దేశవృద్ధి కొఱకు ధీరత్వమున్నట్టి
యువత శక్తి యుక్తు లవసరంబు
అట్టిస్ఫూర్తి బెంచి యంతరంగములందు
నడచుకొనుట యదియె నాదుపాత్ర.5.
పొదుపుచేయుచున్న పూర్ణఫలముగల్గు
అందుముఖ్యమౌను నర్ధమెపుడు
సర్వ గౌరవాలు సంపదందెయనుచు
నడచుకొనుటయదియె నాదుపాత్ర.6.
దేశభక్తి యొకటె దివ్యంపువృద్ధిని
కలుగజేయు ననిన కల్లగాదు
యువతమనమనందు నుత్తేజముంబెంచి
నడచుకొనుప యదయె నాదుపాత్ర.7.
చరణం ..భారతావని నా తల్లి , భవ్య సద్గుణ కల్పవల్లి
పల్లవి .. ప్రణమిల్లుచు చేతును సంస్తుతులు
కలుగగ నిరతము సద్గతులు ... 1.
వేదభూమిగాప్రసిద్ధి నందిన
పుణ్య సుశీలయె నా మాత .... 2. 11 భారతావని నా తల్లి 11
పవిత్ర మూర్తుల ప్రసవించి
ప్రాణజ్యోతిగ వెలిగిన మాతా ... 3
గంగా యమునల కమ్మని పిలుపున
కలసి పారినది బ్రహ్మాణి ...... 4. 11 భారతావని నా తల్లి 11
త్రివేణి సంగమ తీర్ధంబౌచు
కల్మష హారిగ ఖ్యాతినందెను ... 5.
ఉన్నత లక్ష్యము లున్నత కీర్తుల
హిమవన్నగమే నీవంది ...... 6. 11 భారతావని నా తల్లి 11
దేశ దేశముల శాంతి తత్వమును
బోధింపగ నిను పొమ్మంది ...... 7
అదియే తనకు మోదంబంచు
తెల్లని నవ్వులు నవ్వింది .... 8. 11 భారతావని నా తల్లి 11
దేశాభివృద్ధిలో నా పాత్ర.(11.07.19)
దేశసేవయన్న దేహముప్పొంగును
నేరికైన గాని నిశ్చయముగ
ధర్మపరుడనగుచు ధార్మికజీవికన్
నడచుకొనుటయదియె నాదుపాత్ర.1.
గ్రామసీమలెల్ల ఘనముగానెదుగుటే
క్రాంతి,వృద్ధియనెను గాంధిజీయె
వారి కలలు పండ వైభవంబుగ సాగి
నడచుకొనుట యదియె నాదుపాత్ర.2.
కవితనాయుధముగ కమ్మని సాహితిన్
మనముపులకరింప మహితగతిని
మార్చివేసి జనుల మనుగడ దెల్పుచు
నడచుకొనుట యదియె నాదుపాత్ర.3.
స్వార్థపరత సతము చంపును వృద్ధిని
దేశప్రగతికదియ నాశనమ్ము
త్యాగబుద్ధి కలుగు తత్వంబు నెలకొల్పి
నడచుకొనుట యదియె నాదుపాత్ర.4.
దేశవృద్ధి కొఱకు ధీరత్వమున్నట్టి
యువత శక్తి యుక్తు లవసరంబు
అట్టిస్ఫూర్తి బెంచి యంతరంగములందు
నడచుకొనుట యదియె నాదుపాత్ర.5.
పొదుపుచేయుచున్న పూర్ణఫలముగల్గు
అందుముఖ్యమౌను నర్ధమెపుడు
సర్వ గౌరవాలు సంపదందెయనుచు
నడచుకొనుటయదియె నాదుపాత్ర.6.
దేశభక్తి యొకటె దివ్యంపువృద్ధిని
కలుగజేయు ననిన కల్లగాదు
యువతమనమనందు నుత్తేజముంబెంచి
నడచుకొనుప యదయె నాదుపాత్ర.7.
మేరా భారత్ మహాన్. జై భారత్. జైజై భారత్.
మదికి కుశాగ్రతత్త్వమును మానితరీతిని సంతరించిన
న్నది ఘనమై మహోన్నత సభాంతర రాజిత దివ్యతేజమౌ
సదమల భావశూన్యుడయి సారవిహీనత మూర్ఖతత్త్వముం
చదివిన జ్ఞాన మంతయును చప్పునబోవునదేమిచిత్రమో.
మదికి కుశాగ్రతత్త్వమును మానితరీతిని సంతరించిన
న్నది ఘనమై మహోన్నత సభాంతర రాజిత దివ్యతేజమౌ
సదమల భావశూన్యుడయి సారవిహీనత మూర్ఖతత్త్వముం
చదివిన జ్ఞాన మంతయును చప్పునబోవునదేమిచిత్రమో.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి