26, ఆగస్టు 2011, శుక్రవారం

కాశి యాత్ర అనుభవాలు.

యాత్ర కు బయలుదేరుటకు ముందు ప్రార్థన.


౧.సీ..శ్రీ రఘు రాము సంసేవనము సతము ,పాపౌఘములనెల్ల పారద్రోలు.
        శ్రీ రమకరుణ చే సిరులెల్ల నిత్యమై ,తనివార శోభిల్లు తరములెల్ల.
        భరతుని సంస్తుతిన్ భవ బంధముల్ బాసి , అహరహమ్బుల  నెల్ల ఆర్తి దొలగు. 
       లక్ష్మను ప్రేమచే లాలిత్య మొందుచు , నిలువెల్ల నెయ్యంబు నిల్చియుండు.

తే.గీ. ఆంజనేయుని సత్కృపన్ హ్లాద  మెపుడు , భక్త జనులకు కలుగంగ పాదు కొల్పి .
      యాత్ర సఫలంబుజేయంగ.నభయ మీయ.ప్రార్ధనంబును నే జేతు ప్రామ్జలిన్ఛి 
.
 యాత్రకి మార్గ దర్శి అయిన నాయుడమ్మ ని గురించి.

౨. తే.గీ .నాయుడమ్మ యనెడు నాయక రత్నమ్ము ,  యాత్ర జేయ నన్ను పాత్రు జేసే  
         వెంక టేశ్వరుండు,విజ్ఞాన  మానిసి,  మాలకొండయార్యు మమత తోడ.

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...