మానవజన్మ సార్ధకం అయ్యేది పితృ ఋణము తీర్చుకున్నప్పుడే కదా ?
తే.గీ౧.పితరులెల్లరు ముక్తి సంప్రీతినంద,
పిన్డమర్పింత్రు సత్సుతుల్ ప్రేమ మీర
పిన్డమర్పింత్రు సత్సుతుల్ ప్రేమ మీర
తండ్రి ఋణమును దీర్చుటే ధర్మమనుచు,
గయనుమించిన స్థానంబు గానమనుచు.
గయనుమించిన స్థానంబు గానమనుచు.
తే.గీ౨ ఫల్గుణీతీర ప్రాంతంబు ప్రముఖమయ్యె,
విష్ణుపాదంబు సోకిన విధమువలన
విష్ణుపాదంబు సోకిన విధమువలన
మోక్షమబ్బుముత్తాతలకున్ లక్షణముగ,
ఇంతకన్నను జీవికినేమివలయు ?
ఇంతకన్నను జీవికినేమివలయు ?
తే.గీ.౩.కోర్కెలన్నియు జిహ్వకుకూల్చుకొరకు,
ఒక్కఫలమును, శాకంబు,నొక్కయాకు
ఒక్కఫలమును, శాకంబు,నొక్కయాకు
త్యాగ మొనరింత్రు గయను సద్దార్మికాళి
ఇష్ట పూర్తిగ మనమున స్పష్ట పరచి .
ఇష్ట పూర్తిగ మనమున స్పష్ట పరచి .
తే.గీ౪. జీవితాన్తంబు వాటిని చేరనీక,
నియమ భంగమ్ముకానీక నిష్ట నుండి
సంప్ర దాయంబు పాటింత్రు సాధుజనులు,
వేద విదులైన సచ్చాస్త్ర వేత్త లెపుడు .
నియమ భంగమ్ముకానీక నిష్ట నుండి
సంప్ర దాయంబు పాటింత్రు సాధుజనులు,
వేద విదులైన సచ్చాస్త్ర వేత్త లెపుడు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి