29, మార్చి 2014, శనివారం

మధుమాస మకరందం. ది. 31.03. 2014.

 సాక్షి పత్రిక కొఱకు వ్రాసిన ఉగాది కవిత . 

రాజకీయ విషయాలను అద్ది  కవిత 
వ్రాయాలని ప్రకటితము. 29. 03. 2014. 

నవ రాజకీయ సహజీవనానికి 
నాంది పలికింది మధుమాసం . 
ప్రజలను అణుమాత్రం పట్టించుకోక పోయినా 
రాజకీయ ఉనికిని జూపి, రామ రాజ్యాన్ని స్థాపించే 
సర్వ సమర్ధతలు జయ ఉగాది కల్పిస్తుందని 
ప్రతి ఒక్క (అ ) రాజకీయ నాయకుని దురాశ . 

మధు మాసం లో చిగురాకులు , ఆశా కుసుమాలు ,
పుంస్కోకిలల గాన లహరులు , రాజకీయానికి 
పనికి వచ్చే వస్తు సామగ్రి. 

 పార్టి ఏదైనా , వారిదైన పరమార్ధం . 
పర్వతమంత ఆశ ను చూపించి 
పరమాణు వంత  ప్రయోగాలు చేసి 
కంటికి కానరాని ప్రయోజనాలను 
ప్రజలకు పంచటమే (వి) నాయకుల పరమావధి 

ఉగాది పచ్చడిలో షడ్రుచులుంటాయి , కాని 
(అ ) రాజకీయ నాయకుని పలుకులలో 
ఒక్క మధువే ఉంటుంది . 

విజ్ఞత కల్గిన  ఓటరు మహాశయ పుంస్కోకిలలు 
డబ్బుకు ఓటు , ఉహూ , ఉహూ. అంటూ 
గున్న మావి లాంటి గృహం నుండే రెట్టించి పల్కితే 
ఏ అరాచక శక్తులు విజ్రుంభించి , మన 
వ్యక్తిత్వాన్ని చంపి , సమాజాన్ని సమయించి, ప్రభుతను  కొనసాగించలేవు . 

సగటు మానవ జీవనానికి , మన నవ జీవనానికి 
వసంత లక్ష్మి వంటి నాయకురాలు , 
వసంతుని వంటి రారాజు . కావాలి . 
ప్రతి పల్లె , పట్టణం , పచ్చదనం తో, స్వచ్చ దనం తో ,
మధు మాసం కావాలంటే 
రాజకీయ నాయకులు ,స్వార్ధం అనే నలుపు వదలి ,
పచ్చదనాన్ని ఆశ్రయించాలి . 
నిస్స్వార్ధ రాజకీయ నాయకుల అడుగు జాడలలో నడవాలి. 
ఆనాడే మనకు నిజమైన మధు మాసం ,మధుర మాసం . 

  

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...