26, మార్చి 2019, మంగళవారం

పద్య కదంబం.

      పద్దెము మానసాంబుధిని భావసమున్నత వీచికాళిచే
      తద్దయు క్రిందుమీదగుచు తన్మయతల్గలిగించ నించుక
      న్నిద్దురరాదు సభ్యులకు నిర్మలకావ్యఝరీవిలాసతన్
      నొద్దిక దేలియాడు తరి యూహల దేలుట సత్యమేకదా.

      ముద్దుగ జానకీసతికి మోహనరూపుడు రామచంద్రుకున్
      పెద్దల సన్నిధిన్నిచట పెండిలి మేళము మ్రోగుచుండగా
      విద్దెలరాణి సత్కృప కవీశ్వరుపల్కుల శబ్దజాలమే
      మద్దెల మ్రోతలై చెలగ మంగళగీతములివ్వెయౌసదా.
              (  ప్రజ పద్యంవారు సభ్యులకు నిద్దురరాదు అన్నప్పుడు)

   
     నాగలి దున్నగ,న్నగరి నడ్వసజీవపు సాధనమ్మునై
     సాగుచునున్నగాని, పులు, సశ్యమునెంతయు జేరవేసిన్
     త్యాగవిహీనులై నరులధర్మముజూపుటనాదుపాపమౌ
     యోగికి సేవజేయుటయె యోగమునీదని నాదుభావమౌ.

     జాతియదొక్కటైన సమజాతకముండదు బ్రహ్మరాతలన్
     గీతలయందుజూచినను క్రిందటిజన్మలె కారణంబులౌ
     మోతలు దెబ్బలే నొసట నాకిటులుండెపురాకృతంబుగన్
     చేతజువైరిచెంతగల శేముషివీవయ నందిసోదరా!
         పూజనీకు, బడితపూజయె నాకయ్యె
         నాదు పూర్వకర్మ నరునిసేవ
         భవుని పాదధూళి పాయకనందుటన్
         వందవందనములు నందివర్య!(ఎద్దు.నందిఎదుట)

    నేలమీదగాని నింగిమీదనుగాని.,
    తొక్కియెక్కుటదియె తోషణంబు
    మాదువర్తనాన మార్పేమిరాదయా
    మూర్ఖవర్తనంబు మాకుహితము!...పొన్నెకంటి.
     ( విమానంలో వ్రేలాడతు ఎక్కుట గురించి)
 

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...